Publish Date:Jul 19, 2022
మనిషి శక్తిసామర్ధ్యాలకు అంతే ఉండదు. ప్రతీవారిలో ఆ శక్తి ఉంటుందని అంటారు. కానీ చాలాతక్కువ మందే దాన్ని గ్రహించుకోగల్లుతారు. ఊహాతీతంగా ఆ శక్తియుక్తులే ఇతరులకు అతీతంగా తయారు చేస్తాయి. ఇది కళాకారుడిని చేయవచ్చు, కుంగ్ ఫూ పైటర్గానూ చేయవచ్చు. రెప్పపాటులో శరవేగంగా శరీరావయవాలను కదిపి ఎదుటివారిని నిశ్చేష్టులను చేయగల అపార సామర్ధ్యం పొందడం బ్రూస్ లీకి మాత్రమే సాధ్యపడింది. అతనికి ముందు, ఆ తర్వాత మరెవ్వరూ లేరన్నది యావత్ ప్రపంచ ఫైటర్లూ, యువతా అంగీకరిస్తున్నారు. బహు శాంతంగా కనిపించే బ్రూస్లీ లో ఇంతటి అత్యంత వేగంతో కూడిన కుంగ్ ఫూ కదలికలు కేవలం భగవత్ కృపతోనే సాధ్యపడిందనే వాదనా ఉంది. ఏమైనప్పటికీ కుంగ్ ఫూ అంటే లీ, లీ అంటే ఎంటర్ ద డ్రాగన్!
లీ అసలు పేరు లి జున్ ప్యాన్. 1940 నవంబర్ 27న శాన్ఫ్రాన్సిస్కోలో జన్మించాడు. అతని తండ్రి ఒపెరా సింగర్ , పార్ట్ టైమ్ యాక్టర్ కావడం తో అతను చిన్న వయస్సులోనే సినిమా రంగానికి పరిచయం అయ్యాడు. చిన్నవాడైన లీ చిన్నతనంలోనే సినిమాల్లో కనిపించడం ప్రారంభించాడు, తరచూ బాల్య నేరస్థుడుగా నటించాడు. యుక్తవయసులో, అతను స్థానిక గ్యాంగ్లతో కలిసి తనను తాను రక్షించుకోవడానికి కుంగ్ ఫూ నేర్చుకోవడం ప్రారంభించాడు. ఆ సమయంలో అతను నృత్య పాఠాలను కూడా ప్రారంభించాడు, ఇది అతని ఫుట్వర్క్, సమతుల్యతను మరింత మెరుగుపరిచింది; 1958లో లీ హాంకాంగ్ చా-చా ఛాంపి యన్ షిప్ గెలుచుకున్నాడు. హాంగ్కాంగ్లో పెరిగిన లీ అతను యుద్ధ కళల నైపుణ్యానికి ప్రసిద్ధి చెందాడు. అతనిలో ఏదో అతీత శక్తి ఉందన్న ప్రచారం కూడా బాగానే ఉండేది. ఊహించని అతివేగవంత కదలికల్లోనే అతనికి తెలీని శక్తి దాగిందనే వాదన పెద్ద చర్చగా ఉంది.
మనిషి తన శక్తిసామర్ధ్యాలను అనుసరించి జీవించడంలోనే అత్యంత ఆనందాన్ని పొందుతాడనేవాడు లీ. అంతర్జాతీయ తత్వవేత్త జిడ్డు కృష్ణమూర్తి పరిచయం అతన్ని ఎంతో మార్చిందన్న వాదనా ఉంది. అతనిలో లోకాన్ని చూసే దృష్టిలో ఎంతో మార్ప వచ్చిందంటారు. అతనిలో సౌమ్యుడు ఉన్నాడు అని చాలామంది గ్రహించారు. కేవలం ఆత్మరక్షణకే యుద్ధకళలను నేర్చకు న్నాడే గాని ఇతరులను ఇబ్బందిపెట్టడానికి కాదని, అతని జీవితాన్ని గమనిస్తే తెలుస్తుందని తోటి నటీ నటులు అంటూండే వారు. గొప్ప వ్యక్తిని, మంచి మిత్రుడిని కోల్పోయానని అంటూంటారు. బ్రూస్ లీ 1973 జులై 20 వ తేదీన హాంగ్కాంగ్లో మృతి చెందాడు. చిత్రమేమంటే అతనికి ప్రపంచఖ్యాతి ఆర్జించిపెట్టిన ఎంటర్ ద డ్రాగన్ సినిమా రిలీజ్ కాకుండానే మృత్యువు తీసికెళ్లిందని బంధువులు, యావత్ ప్రపంచ వీరాభిమానులు ఇప్పటికీ ఎంతో బాధపడుతూంటారు. లీ లాంటి వ్యక్తులు మళ్లీ జన్మిస్తారా అనే ప్రశ్నకు సమాధానం చెప్పడం కష్టమనే అంటున్నారు హాంగ్ కాంగ్ వాసులు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/bruce-leee-39-140124.html
తాడికొండ నియోజకవర్గంలో వైసీపీ తరఫున తాను పోటీ చేయడానికి దారితీసిన పరిస్థితులను గుర్తు చేసుకున్న ఉండవల్లి శ్రీదేవిరాజధాని ప్రాంత సీటును దక్కించుకుని, భారీ మెజారిటీతో విజయం సాధించానని చెప్పారు.
నిజాయితీగా పార్టీ కోసం జెండా పట్టి రోడ్లెక్కిన కార్యకర్త ఒకసారి పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కిన తర్వాత ఏ అగ్రనేత కూడా వారిని కాపాడటానికి రావడం లేదని శ్రీధర్ చెప్పారు. నాయకులు కేవలం ఫోటోలకు ఫొటోలు దిగడానికి, మీడియాలో కనిపించడానికే ప్రాధాన్యత ఇస్తారు తప్ప, లోయర్ లేదా మిడిల్ క్లాస్ కార్యకర్త ఆసుపత్రి బిల్లు ఎంత అయింది? కోర్టు ఖర్చులు ఎలా కడుతున్నాడు? అని మానవత్వంతో ఆలోచించే పరిస్థితుల్లో నేటి నాయకత్వాలు లేవని చెప్పారు.
ఈ నేపథ్యంలో ప్రస్తుత చట్టపరమైన పరిణామాలు, ఉపా చట్టం తీవ్రత, రావణ్కు కోర్టుల్లో ఎదురుకాబోయే సవాళ్లపై మాజీ న్యాయమూర్తి రామకృష్ణ తెలుగువన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో సంచలన విశ్లేషణ చేశారు.
ఆ ఎన్నికలలో జనసురాజ్ పార్టీ ఒక్కటంటే ఒక్క స్థానంలో విజయం సాధించలేదు సరికదా.. ఆ పార్టీ అభ్యర్థులెవరికీ కనీసం డిపాజిట్లు కూడా దక్కలేదు. తెరవెనుక ఉండి ఎందరో దిగ్గజాలను సీఎం గద్దెపై కూర్చోబెట్టిన పీకే.. రాజకీయ వ్యూహాలు తన సొంత పార్టీకి ఇసుమంతైనా ఉపయోగపడలేదు. దీంతో ఇక లాభం లేదనుకుని తానే స్వయంగా ఎన్నికల బరిలో నిలబడి సత్తా చాటాలని నిర్ణయించుకున్నారు.
కోల్కతాలోని కాళీఘాట్లోని మమతా బెనర్జీ అధికారిక నివాసం వద్ద భారీగా పోలీసులు, కేంద్ర బలగాలను మోహరించడం ఈ ఆరోపణలకు బలాన్ని చేకూరుస్తోంది. మమత నివాసానికి వెళ్లే అన్ని ప్రధాన మార్గాలను పోలీసులు తమ అధీనంలోకి తీసుకుని, భారీ పోలీసు వాహనాలతో పూర్తిగా దిగ్బంధించారు.
అనంతపురం జిల్లాకు ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది.
సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం ఉన్న ఆమంచి కృష్ణమోహన్.. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో చీరాల నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగి విజయం సాధించారు. ఈ తరువాత ఆయన తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చారు. అయితే.. 2019 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీని వీడి, వైసీపీ పంచన చేరారు.
తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రజా జీవితంలో అరుదైన మైలురాయిని చేరుకున్నారు.
ఈసీ ఆదేశాల మేరకు
కవిత తన టీఆర్ఎస్ పార్టీ పేరుకు ప్రత్యామ్నాయంగా మూడు పేర్లను ఈసీకి పక్షం రోజుల్లోగా సమర్పించాల్సి ఉంటుంది. నిర్దేశిత గడువులోగా మూడు ప్రత్యామ్నాయ పేర్లను సూచించకుంటే దరఖాస్తున్న మూసేస్తామని హెచ్చరించింది. అంతే కాకుండా టీఆర్ఎస్ పేరును కొనసాగించేందుకు అనుమతి ఉండదని విస్పష్టంగా పేర్కొంది.
ఆ పార్టీ ప్రధాన ఆరోపణ ఏంటంటే.. క్షేత్రస్థాయిలో తెలుగుదేశం పార్టీ అనుకూల సిబ్బందితో అర్హులైన వైసీపీ మద్దతుదారుల ఓట్లను ఉద్దేశపూర్వకంగా తొలగించేందుకు కుట్ర జరుగుతోందని. గతంలో అంటే.. 2014 నుండి 2019 మధ్య కాలంలో కూడా ఇలాగే పెద్ద ఎత్తున దొంగ ఓట్లను చేర్చారని, ఇప్పుడు తమ పార్టీకి అండగా నిలిచే ఓటర్లను లక్ష్యంగా చేసుకుని జాబితా నుండి తొలగిస్తున్నారని వైసీపీ ఆరోపిస్తున్నది.
పైకి వైసీపీతోనూ, జగన్ కోటరీతోనూ విసిగిపోయానని, అందుకే బయటకు వచ్చేశాననీ విజయసాయి చెబుతున్నా.. ఆయన మాటలూ చేతలూ అన్ని జగన్ కు ప్రయోజనం చేకూర్చడానికే అన్నట్లుగా ఉంటాయి. ఉంటున్నాయి.
విశాఖపట్నం పరిపాలన రాజధాని అన్న జగన్ విధానాన్ని ధర్మాన బలంగా ప్రజలలోకి తీసుకువెళ్లడానికి శతధా ప్రయత్నించారు. ఉత్తరాంధ్ర సెంటిమెంట్ను రగిలిస్తూ, గ్రామగ్రామాన సభలు, సమావేశాలు ఏర్పాటు చేసి ప్రచారం చేశారు. అదేమీ ఫలించలేదని 2024 ఎన్నికల ఫలితాలు తేల్చేశాయి.
వైసీపీ కోసం ఎంతగానో పరితపించిన ముద్రగడ.. కాపు రిజర్వేషన్ కోసం, కాపుల కోసం పోరాటం చేసి సంపాదించుకున్న ప్రాముఖ్యతనూ, ప్రతిష్టనూ..జగన్ కోసం ఔను కేవలం జగన్ కోసం వదులుకున్నారు. అటువంటి ముద్రగడ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ వెంటిలేటర్ పై చికిత్స పొందుతుంటే…జగన్ ఆయనను కనీసం పరామర్శించను కూడా పరామర్శించలేదు.