Publish Date:Apr 18, 2024
బీఆర్ఎస్ నుంచి వలసల పర్వం కొనసాగుతోంది. సరిగ్గా సార్వత్రిక ఎన్నికల వేళ ఆ పార్టీకి వరుస షాక్ లు తగులుతున్నాయి. పార్టీ అగ్రనాయకత్వం ఎంతగా ప్రయత్నించినా పార్టీ నుంచి వలసలను ఆపడంలో విఫలమౌతున్నది. తాజాగా ఆ పార్టీ నుంచి మరో మాజీ ఎమ్మెల్యే రాజీనామా చేసి బయటకు వచ్చారు.
ఉప్పల్ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి కారు దిగిపోయారు. లోక్ సభ ఎన్నికలకు పార్టీ టికెట్ విషయంలో అధిష్ఠానం ఏకపక్ష నిర్ణయాలను వ్యతిరేకిస్తూ తానీ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన చెప్పారు. మల్కాజ్ గిరి ఎంపీ టికెట్ ను లక్ష్మారెడ్డికి ఇవ్వడంపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
ఆయనను గెలిపించాలంటూ తాను ప్రజల ముందుకు వెళ్లి ప్రచారం చేయలేనని బేతి సుభాష్ రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు గురువారం (ఏప్రిల్ 18) ఓ లేఖ రాశారు. అవకాశ వాది అయిన లక్ష్మారెడ్డి తరఫున ఎన్నికల ప్రచారం చేయలేనని పేర్కొన్న ఆయన తెలంగాణ ఉద్యమ నేత, బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ కోసం తాను ప్రచారం చేయనున్నట్లు బేతి సుభాష్ రెడ్డి వెల్లడించారు. తన రాజీనామాను, కేసీఆర్ కు రాసిన లేఖను ఆయన సామాజిక మాధ్యమంలో షేర్ చేశారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/brs-uppal-mla-quits-party-39-174075.html
ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశమైన మన భారత దేశాన్ని ఏదో పెద్ద శనిగ్రహం పట్టి పీడిస్తోంది.
అందుకే అంటారు.. ఎన్ని సమస్యలు చుట్టుముట్టినా జీవితం మీద ఆశ వదలకూడదని..! ఈ మాటకి తాజా ఉదాహరణ
ఏపీ హైకోర్టులో జనసేన పార్టీకి పాక్షిక ఊరట మాత్రమే లభించింది. గాజు గ్లాసు గుర్తు స్వతంత్య్ర అభ్యర్థులకు కేటాయించడాన్ని జనసేన పార్టీ సవాల్ చేస్తూ హైకోర్టులో మంగళవారం (ఏప్రిల్ 30) పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.
వైఎస్ రాజశేఖర రెడ్డి రాజకీయ వారసుడిగా ఎపి రాజకీయాల్లో అడుగు పెట్టి ముఖ్యమంత్రి అయిన వైఎస్ జగన్ కు అడ్డూ అదుపు లేకుండా అరాచకపాలన సాగిస్తున్నట్టు విమర్శ ఉంది.
తెలంగాణ రాష్ట్రంలో భానుడు ప్రతాపం చూపిస్తున్నాడు. ఈ ఏడాది రాష్ట్రంలో తొలిసారిగా ఉష్ణోగ్రతలు 46 డిగ్రీలు దాటాయి. రాష్ట్రంలో మంగళవీరం(ఏప్రిల్26) అత్యధికంగా నల్గొండ మాడుగులపల్లిలో 46.2 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. రాష్ట్రంలో సోమవారం (ఏప్రిల్ 29) ఒక్కరోజే వడదెబ్బకు ఎనిమిది మంది చనిపోయారు.
మే 1వ తేదీ, ఉదయం పది గంటలైంది. ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వోద్యోగుల ఫోన్లు మెసేజ్ల సౌండ్తో మార్మోగిపోయాయి.
సరిగ్గా ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ స్థైర్యం, ధైర్యం జావగారిపోయాయా? స్వయానా చెల్లెలు షర్మిల సూటిగా చేస్తున్న విమర్శలు జగన్ నైతిక స్థైర్యాన్ని దెబ్బతీశాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఈ ఏడాది ఆరంభంలో వైఎస్ షర్మిల కాంగ్రెస్ గూటికి చేరి ఆ పార్టీ రాష్ట్రపగ్గాలు చేపట్టడంతోనే జగన్ శిబిరంలో ఆందోళన మొదలైంది.
కోవూరు ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డిపై పోలీసు కేసు నమోదయింది. ఈ విషయాన్ని స్థానిక ఎస్సై వీరేంద్రబాబు తెలిపారు. ఎస్సై చెప్పిన వివరాల ప్రకారం కొత్తూరులో ప్రచారం నిర్వహిస్తున్న సమయంలో... నెల్లూరు పార్లమెంట్ టీడీపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిపై ప్రసన్నకుమార్ రెడ్డి వ్యక్తిగత దూషణలు చేశారు. ఈ నేపథ్యంలో ప్రసన్న కుమార్ రెడ్డి ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారని... ఆయనపై కేసు నమోదు చేయాలని ఎంపీడీవో సాయిలహరి ఫిర్యాదు చేశారు. ఆమె ఫిర్యాదు మేరకు ప్రసన్నకుమార్ రెడ్డిపై కేసు నమోదు చేశారు.
కరోనా టీకా కోవీషీల్డ్ వ్యవహారం ఎలా వుందంటే, కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడిపోయినట్టుగా వుంది.
మాజీ ప్రధాని దేవగౌడ మనవడు ప్రజ్వల్ రేవణ్ణ శృంగార లీలలు, సెక్స్ స్కాండల్ కర్ణాటక రాజకీయాల్లో ప్రకంపనలు రేపుతోంది. అమ్మాయిలకు తెలియకుండా వీడియోలు తీసి, వాటి ఆధారంగా వారిని బెదిరించి ప్రజ్వల్ రేవణ్ణ లొంగదీసుకున్నాడని ఆరోపణలు వస్తున్నాయి
బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్లో చేరిన స్టేషన్ఘన్పూర్, భద్రాచలం ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావులకు తెలంగాణ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. పార్టీ ఫిరాయించిన వారిపై అనర్హత వేటు వేయాలంటూ కుత్బుల్లాపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద దాఖలు చేసిన పిటిషన్ను హైకోర్టు నిన్న విచారించింది.
పెన్షన్లను సకాలంలో అందించాలని ఏపీ ప్రభుత్వానికి కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టమైన ఆదేశాలను జారీ చేసిన సంగతి తెలిసిందే. ఎన్నికల కోడ్ నేపథ్యంలో లబ్ధిదారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పెన్షన్లను అందించాలని ఆదేశించింది. పెన్షన్ల పంపిణీకి సచివాలయ ఉద్యోగులను వాడుకోవాలని తెలిపింది.