అధికారంలో ఉన్నంత కాలం పట్టపగ్గాల్లేకుండా వ్యవహరించిన బీఆర్ఎస్ ఓటమి తరువాత తెలంగాణలో తీవ్రమైన సంక్షోభంలో కూరుకుపోయింది. రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీల నుంచి ఎదుర్కొంటున్న సవాళ్లతో పార్టీ ఉనికే ప్రమాదంలో పడిన పరిస్థితులు నెలకొన్నాయి. పార్టీ ఓటమి తరువాత బీఆర్ఎస్ అధినేత అసెంబ్లీకి కూడా డుమ్మా కొట్టి మరీ ఫామ్ హౌస్ కు పరిమితమయ్యారు. పార్టీ నేతలకు కూడా అందుబాటులోకి రావడం లేదు. అసెంబ్లీ ఎన్నికలలో ఓటమి తరువాత లోక్ సభ ఎన్నికల ప్రచారం కోసం బయటకు వచ్చినప్పటికీ.. ఆ ఎన్నికల్లో పార్టీ జీరో ఫలితాన్ని సాధించడంతో ప్రజలకు పూర్తిగా మొహం చాటేశారు. మరి కొంత కాలం ఆయన ఇదే విధంగా అజ్ణాత వాతం కొనసాగిస్తే.. జనం ఆయనను మరచిపోయే ప్రమాదం ఉందని పార్టీ శ్రేణులే అంటున్నాయి.
కేసీఆర్ ఆబ్సెన్స్ లో పార్టీని ఆయన కుమారుడు బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఏదో విధంగా నడుపుతున్నారు. అయితే ఆయన ఎక్కువగా సామాజిక మాధ్యమంపై ఆధారపడతారు. ఈ నేపథ్యంలో పార్టీ సోషల్ మీడియా వింగ్ పైనే ఆయన ఎక్కువగా ఆధారపడుతున్నారు. క్షేత్రస్థాయిలో పరిస్థితులపై అవగాహన కంటే సోషల్ మీడియాలో వైరల్ అయితేనే లాభం అన్నట్లుగా కేటీఆర్ వ్యవహార శైలి ఉందన్న విమర్శలు పార్టీలోనే ఉన్నాయి.
ఈ నేపథ్యంలోనే సింపతీ గెయినింగ్ ఎత్తుగడలో భాగంగా బీఆర్ఎస్ సోషల్ మీడియా వింగ్ లో త్వరలో అంటే ఇహనో ఇప్పుడో ఓ కీలక నేత అరెస్టునకు రేవంత్ సర్కార్ కుట్ర పన్నిందన్న సమాచారం బాగా వైరల్ అవుతోంది. స్వయంగా కేటీఆర్ కూడా ఇదే విషయాన్ని చెబుతున్నారు. అయితే ఆ అరెస్టు ద్వారా తన ఏడాది పాలనా వైఫల్యాల నుంచి జనం దృష్టి మరల్చాలని రేవంత్ భావిస్తున్నారని కేటీఆర్ పేర్కొన్నారు. అయితే ఈ కీలక అరెస్టు అన్నది ఎంత వ రకూ నిజమో ఎవరికీ తెలియదు కానీ బీఆర్ఎస్ మాత్రం దీనికి విపరీతంగా ప్రచారం ఇస్తోంది. తద్వారా ప్రజల నుంచి సానుభూతిని మద్దతును కూడగట్టుకోవాలని ప్రయత్నిస్తోంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/brs-social-media-predict-key-leader-arrest-39-187855.html
కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చి రెండేళ్లయిన ఎన్నికలు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి ఆరోపించారు.
బీజేపి రాజ్యాంగంలో లౌకిక పదం తొలగిస్తామనడం దారుణమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు
మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత కాకాని గోవర్ధన్ రెడ్డికి మరో ఎదురుదెబ్బ తగిలింది.
ఏది ఏమైతేనేం తెలంగాణలో మద్యం అమ్మకాలు కొత్త రికార్డు సృష్టించాయి. విశేషమేంటంటే.. ఇంతటి చలిలోనూ కూడా బీర్ల అమ్మాకాలు కూడా జోరుగా సాగాయి.
తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికార పగ్గాలు చేపట్టిన తరువాత దేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాల జాబితాలో ఏపీ అగ్రపీఠిన నిలుస్తోంది. 2025-26 ఆర్థిక సంవత్సరం తొలి మేమూడు నెలల్లోనే రాష్ట్ర వృద్ధి10.5 శాతంగా ఉంది.
రీసెంట్ గా తెలంగాణలో తీన్మార్ మల్లన్న తెలంగాణ రాజ్యాధికార పార్టీని ఏర్పాటు చేశారు. అలాగే ఏపీ కేంద్రంగా మరో కొత్త పార్టీ ఆవిర్భవించనున్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది.
బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
భారత్ పర్యటనకు వచ్చినపుడు రష్యా అధ్యక్షుడు పుతిన్ ఇంటర్వ్యూలో కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలిపారు
ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ తెరమీదకు తీసుకువచ్చారు. ఇదే విషయాన్ని చంద్రబాబు దృష్టికీ తీసుకువెళ్లారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని చంద్రబాబు నాయకత్వంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా అమరావతి రాజధాని అన్న చట్టబద్ధత అవసరమని భావించింది. దీంతో ఇదే విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకువెళ్లింది.
ప్రజా సమస్యలపై ఆ పార్టీ ఎలా స్పందిస్తోంది. వాటి పరిష్కారం దిశగా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చేందుకు ఆ పార్టీ చేపడుతున్న కార్యక్రమాలు ఏమిటి? ప్రజల పక్షాన నిలబడేందుకు ఆ పార్టీ నేతలు ముందుకు వస్తున్నారా? వంటివన్నీ జనం గమనిస్తారు.
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవేంకటేశ్వర స్వామి వారికి భక్తులు ఇచ్చిన కానుకలను దొంగిలించడమంటే మహాఘోరం, క్షమించరాని నేరం. తాము శ్రీవారికి భక్తుతో సమర్పించిన కానుకలు చోరీ అవుతున్నాయంటే భక్తుల మనోభావాలు దెబ్బతింటాయి కూడా.
అన్నదమ్ములు, తల్లీ కుతుళ్లు, తోడికోడళ్లు ఒకరిపై ఒకరు పోటీ చేయడానికి సై సంటే సై అంటున్న ఉదంతాలూ ఉన్నాయి.
నల్గొండ జిల్లా చిట్యాల మండలం ఏపూరులో ఒకే వార్డు నుంచి తల్లి, కూతురు నామినేషన్లు వేశారు.
తెలుగు వన్. దక్షిణాదిలో మాత్రమే కాదు యావత్ భారత దేశంలోనే యూట్యూబ్ ప్లాట్ ఫామ్ లో తొలి వీడియో అప్ లోడ్ చేసిన వన్ అండ్ ఓన్లీ డిజిటల్ ప్లాట్ ఫామ్. డిజిటిల్ మీడియా రంగంలో తెలుగు వన్ తన పాతికేళ్ల ప్రస్థానంలో చేయని ప్రయోగముందా? అన్న పేరుంది.