Publish Date:May 17, 2023
బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు త్వరలోనే తమ పార్టీ అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది. అంతకంటే ముందు ఆయన బిఆర్ఎస్ తో పొత్తు పెట్టుకునే వామపక్ష పార్టీలతో సీట్ల సర్దుబాటు చేసుకునే అవకాశం ఉంది. బిఆర్ఎస్ ఎంఎల్ఏ, ఎంఎల్సి, ఎంపీలతో పాటు పార్టీ ఎగ్జిక్యూటివ్ మెంబర్స్, స్టేట్ కార్పోరేషన్ చైర్ పర్సన్స్ తో ముఖ్యమంత్రి సమావేశమయ్యారు. ఈ సమావేశంలో పార్టీ అభ్యర్థులను త్వరలో ప్రకటించే అవకాశం ఉందని విస్పష్టంగా చెప్పారు. కాంగ్రెస్ పార్టీకి బిజెపి ప్రధాన ప్రత్యర్థి అయినప్పటికీ బిజెపికి అభ్యర్థుల కొరత ఉంది. కాంగ్రెస్ పార్టీకి ఆ సమస్య లేదు. ఈ ఎన్నికల్లో బిజెపిని ఓడించే పార్టీలతో కెసీఆర్ ఆపన్న హస్తం అందించే అవకాశం ఉంది. వచ్చే శాసనసభ ఎన్నికల నేపథ్యంలో కెసిఆర్ మూడు నెలల ముందు అంటే సెప్టెంబర్ లో బిఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది.
కర్ణాటక ఎన్నికల ఫలితాలు బిఆర్ఎస్ మీద చూపే ప్రభావం మీద కూడా కెసిఆర్ చర్చించారు.
2018 అసెంబ్లీ ఎన్నికలలో అనుసరించిన వ్యూహాన్నే అమలు చేయాలని కెసీఆర్ చూస్తున్నారు. వాస్తవానికి 2019 ఏప్రిల్, మే లో ఎన్నికలు నిర్వహించాలి. కానీ జరుగలేదు. 2018 సెప్టెంబర్ 6న కెసీఆర్ అసెంబ్లీని రద్దు చేశారు. 2018 డిసెంబర్ లో ఎన్నికల్లో వెళ్లారు కెసిఆర్. ఇది వర్కవుట్ అయ్యింది కాబట్టి అప్పట్లో మొత్తం 119 సీట్లకు గానూ 88 సీట్లతో మళ్లీ అధికారంలో రాగలిగింది బిఆర్ఎస్.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/brs-list--will-be-coming-soon-25-155487.html
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అధికార కూటమి భాగస్వామ్య పక్షాలైన తెలుగుదేశం, జనసేన మధ్య సంబంధాలు పైకి కనిపించేంత సజావుగా లేవనే సంకేతాలు స్పష్టమవుతున్నాయి.
తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారిగా తీవ్ర కలకలం రేగింది
దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా బుధవారం (సెప్టెంబర్ 2) నిర్వహించిన ఒక ర్యక్రమంలో పాల్గొన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. తాము ఏనాడు కూడా పదవుల కోసం సిద్ధాంతాలను తాకట్టు పెట్టలేదంటూ.. వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయాల బాటలో నడిచేందుకు రాజకీయాల్లోకి ప్రవేశించామన్నారు.
ఆమె మాటలను బట్టి పరిశీలకులు కొండా సురేఖ పార్టీకీ, ఎమ్మెల్యే పదవికీ కూడా రాజీనామే చేసే అవకాశాలు కనిపిస్తున్నాయని విశ్లేషిస్తున్నారు. అదే జరిగితే.. ఆమె ప్రాతినిథ్యం వహిస్తున్న వరంగల్ తూర్పు నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమౌతుంది.
నా కూతురికి పెళ్లైంది.. తనకు తాను స్వతంత్రంగా మాట్లాడింది..!
ఉన్నది మాట్లాడితే చర్యలా.. సురేఖ సంచలన వ్యాఖ్యలు..!
బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో సీనియర్ నాయకులు, మాజీ మంత్రులు హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస యాదవ్ కలసి కాంగ్రెస్ 1000 రోజుల విఫల పాలనపై చార్జ్షీట్ విడుదల చేశారు.
మ్మెల్యేగా కేసీఆర్ వ్యవహరిస్తున్న తీరు, అసెంబ్లీకి ఆయన గైర్హాజరుపై రేవంత్ ఓ రేంజ్ లో విమర్శలు గుప్పించారు. అసెంబ్లీకి హాజరుకాకుంటే కేసీఆర్ ఎమ్మెల్యే పదవికి కేసీఆర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఒక ప్రజా ఉద్యమాన్ని చేపట్టాలని రేవంత్ రెడ్డి ప్రజలకు పిలుపు నిచ్చారు. తనను ఎన్నుకున్న నియోజకవర్గ సమస్యలను కేసీఆర్ పట్టించుకోవడం లేదని దుయ్యబట్టారు.
ఆయన పులివెందులపైనే ఎక్కువగా కాన్సట్రేట్ చేయడంతో ఆయనకు పులివెందులలో పట్టు జారుతోందన్న భయం పట్టుకున్నట్లు కనిపిస్తోందని అంటున్నారు. అలాంటి భయమే లేకపోతే.. మాజీ సీఎంగా రాష్ట్రం మొత్తం తిరగాల్సిన ఆయన అది మానేసి సొంత నియోజకవర్గానికే ఎక్కువగా పరిమితం అవ్వరని అంటున్నారు.
ప్రకాశం జిల్లాలో మరీ ముఖ్యంగా ఒంగోలులో గట్టి పట్టు, రాజకీయ పలుకుబడి ఉన్న సీనియర్ నేత అయిన బాలినేనికి, జనసేనలో ఏ మాత్రం ప్రాధాన్యత లభించడంలేదన్న ప్రచారం జోరుగా సాగుతోంది. పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తీసుకుంటున్న నిర్ణయాలు, స్థానిక పరిస్థితులు కూడా ఆ ప్రచారానికి బలం చేకూర్చేవిగానే ఉంటున్నాయి.
భారత రాజకీయాల్లో ఇప్పుడు పార్లమెంట్ సీట్ల పునర్విభజన (డీలిమిటేషన్), మహిళా రిజర్వేషన్ బిల్లుల చుట్టూ తీవ్రమైన ఉత్కంఠ నెలకొంది.
తెలంగాణ రాజకీయాల్లో మరోసారి కాంగ్రెస్ అంతర్గత వ్యవహారాలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.
వైసిపి సీనియర్ నాయకుడు సజ్జల రామకృష్ణారెడ్డి.. రాజ్యసభ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి చొక్కా పట్టుకుని దాడి చేసి కొట్టారని.. ఇదే విషయాన్ని ఇటీవల విజయసాయి ఓ బహిరంగ లేఖ ద్వారా వెల్లడించిన విషయాన్ని కన్ ఫర్మ్ చేశారు.