Publish Date:Feb 14, 2026
తెలంగాణలో బీఆర్ఎస్ పరిస్థితి నానాటికీ తీసికట్టు.. అన్న చందంగా తయారౌతోంది. ఆ పార్టీ పరిస్థితి, పలుకుబడి వేగంగా దిగజారుతున్న స్పష్టమైన సంకేతాలను తాజాగా వెలువడిన మునిసిపల్ ఎన్నికల ఫలితాలు వెల్లడించాయి. తెలంగాణ ఆవిర్భావం తరువాత వరుసగా పదేళ్లు అధికారంలో ఉన్న పార్టీ, రాష్ట్ర వ్యాప్తంగా బలంగా విస్తరించి.. రాష్ట్రంలో ఇక ఈ పార్టీకి తిరుగేలేదా? అన్నట్లుగా నిలిచిన పార్టీ ఇప్పుడు కేవలం ఉమ్మడి మెదక్ జిల్లాకే పరిమితమైన దృశ్యం విస్మయపరుస్తోంది.
ఒకప్పుడు బీఆర్ఎస్ కు కంచుకోట అనుకున్న ప్రాంతాలలో కూడా మునిసిపోల్స్ లో బీఆర్ఎస్ చతికిల పడటం చూస్తుంటే ఆ పార్టీ పరిస్థితి ఎంత దయనీయంగా మారిందో అర్ధం చేసుకోవచ్చు. కరీంనగర్, నిజామాబాద్ వరంగల్ లలో ఆదరణ లేకుండా పోయింది. ఇక దక్షిణ తెలంగాణ విషయానికి వస్తే ఆ పార్టీ ఉనికే ప్రశ్నార్థకంగా మారింది. ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ జిల్లాల్లో బీఆర్ఎస్ ఒకప్పుడు అత్యంత బలంగా ఉండేది. తాజా మున్సిపల్ ఎన్నికల్లో ఇక్కడ బీజేపీ భారీగా పుంజుకోవడం, కాంగ్రెస్ సత్తా చాటడంతో బీఆర్ఎస్ మూడో స్థానానికి పడిపోయింది.
ఇక దక్షిణ తెలంగాణ విషయానికి వస్తే మహబూబ్ నగర్, నల్గొండ, ఖమ్మం జిల్లాలను కాంగ్రెస్ పార్టీ కంచుకోటగా మార్చుకుంది. సూర్యాపేటలో మాజీ మంత్రి జగదీష్ రెడ్డి తమ మున్సిపాలిటీని కాపాడుకోలేకపోవడం ఆ పార్టీ పలుకుబడి ఎంతగా దిగజారిందో తేటతెల్లం చేస్తున్నది. ఇక ఖమ్మంలో బీఆర్ఎస్ పరిస్థితి గురించి ఎంత తక్కువగా చెప్పుకుంటే అంత మంచింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో బీఆర్ఎస్ కేవలం ఒక్క మున్సిపాలిటీ కే పరిమితం కావడం ఆ పార్టీ దుస్థితికి అద్దం పడుతోంది.
బీఆర్ఎస్ కేవలం ఉమ్మడి మెదక్ జిల్లా , హైదరాబాద్ శివారు ప్రాంతాలకే పరిమితమైందా అన్న సందేహాలు సర్వత్రా వ్యక్తం అవుతున్నాయి. మళ్లీ అధికారంలోకి వస్తాం అని గట్టిగా నమ్ముతున్న ఆ పార్టీ క్యాడర్ కు తాజా మునిసిపోల్స్ ఫలితాలు తీవ్ర నిరాశ కలిగించాయి. మెదక్, హైదరాబాద్ శివార్లపై ఆధారపడి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తిరిగి అధికారంలోకి రావడం అసాధ్యమని బీఆర్ఎస్ శ్రేణులే అంటున్నాయి.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/brs-limited-to-thecombined-medak-district-39-214065.html
తాజాగా గుడివాడలో కొడాలి నాని మీడియాతో మాట్లాడుతూ.. యూట్యూబర్ రావణ్ అరెస్ట్ ఉదంతంపై.. తనదైన శైలిలో తనకు మాత్రమే సాధ్యమైన రీతిలో కొత్త రాజకీయ కుట్ర సిద్ధాంతాన్ని తెరపైకి తెచ్చారు.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆలోచనలకు అనుగుణంగా, రాష్ట్రంలో పారిశ్రామిక విప్లవాన్ని తీసుకురావడమే ధ్యేయంగా సాగిన ఈ పర్యటన ఏపీ యువతకు ఉపాధి అవకాశాల వెల్లువను తీసుకురానుంది. స్పీడ్, స్టెబిలిటీ, సర్వీస్ అనే మూడు సూత్రాల 3ఎస్ మోడల్ తో పారదర్శక పాలన అందిస్తామని కొరియా దిగ్గజాలకు లోకేష్ భరోసా ఇచ్చారు.
2020 ఎన్నికల్లో అప్పటి అధికార పార్టీ బీఆర్ఎస్ ఏకంగా 56 స్థానాలను కైవసం చేసుకుని తన ఆధిపత్యాన్ని నిరూపించుకుంది. ఆ తర్వాత అనూహ్యంగా పుంజుకున్న బీజేపీ 48 స్థానాలతో గట్టి పోటీ ఇవ్వగా, ఎంఐఎం 44 స్థానాల్లో విజయం సాధించి పట్టు నిలుపుకుంది. కానీ, నాటి అధికార పీఠం కోసం పోరాడిన కాంగ్రెస్ పార్టీ మాత్రం కేవలం 2 స్థానాలకే పరిమితమైంది.
తొండ ముదిరి ఊసరవెల్లి అయినట్లుగా.. వాగ్వాదం కాస్తా ఘర్షణగా మారింది. పరస్పర దాడులకు దారి తీసింది. రాళ్లు, కర్రలతో ఇరువర్గాలూ పరస్పర దాడులకు తెగబడ్డారు. దీంతో పరిస్థితి తీవ్ర ఉద్రిక్తంగా మారింది.
వైఎస్ఆర్ జయంతిని పురస్కరించుకుని, ఒంగోలులోని వైసీపీ కార్యాలయంలో ఆయనకు నివాళులు అర్పించేందుకు ఏర్పాట్లు చేశారు. వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి నివాళులర్పించే క్రమంలో స్వల్ప తొక్కిసలాట జరిగింది.
గన్నవరం పోలీసులు సమర్పించిన నివేదిక ప్రకారం, ప్రశ్న రావణ్ దేశ సార్వభౌమత్వానికి భంగం కలిగించేలా ప్రవర్తించారనే బలమైన ఆరోపణలు ఉన్నాయి. నిషేధిత మావోయిస్టు పార్టీకి మద్దతుగా, యువతను ఆ మార్గం వైపు ప్రేరేపించేలా ఆయన కంటెంట్ ఉందనేది పోలీసుల ప్రధాన అభియోగం.
ఎమ్మెల్యేగా ఎన్నికైన నాటి నుంచి ఇప్పటివరకు లక్ష్మారెడ్డి గన్మెన్లను వెంట పెట్టుకోకుండా ప్రజల మధ్యకు వస్తున్నారు. ఎన్నికల్లో విజయం సాధించిన అనంతరం ఆయనకు ప్రభుత్వం భద్రతా సిబ్బందిని కేటాయించినప్పటికీ.. తనకు ప్రత్యేక భద్రత అవసరం లేదని చెబుతూ వారిని విధుల్లో కొనసాగనివ్వలేదు.
సీఎం పర్యటన ద్వారా ఈ కేసులోని సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందంటూ డీఎంకే ప్రధాన కార్యదర్శి ఆర్.ఎస్. భారతి సుప్రీంకోర్టులో అత్యవసర పిటిషన్ దాఖలు చేశారు.
రిజిస్ట్రేషన్ ప్రక్రియ మరింత ఆలస్యం కాకుండా ఉండేందుకు, తమకు అనుకూలంగా నిర్ణయం వచ్చేలా చూసేందుకు ఆమె ముందు జాగ్రత్తగా ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించినట్లు పరిశీలకులు భావిస్తున్నారు.
కోలీవుడ్లోని మరికొందరు స్టార్స్ రాజకీయాలలోకి అడుగులు వేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఈ క్రమంలోనే స్టార్ హీరో ధనుష్ కూడా రాజకీయ అరంగేట్రం చేయబోతున్నారు.
రెండుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన ఆయన విలువలతో కూడిన రాజకీయాలకు నిలువెత్తు రూపంగా నిలిచారు. సొంత ఇల్లు కూడా లేకుండా, ఒక పాత స్కూటర్ మినహా ఎలాంటి ఆస్తులు కూడబెట్టకుండా నిరాడంబరంగా జీవించారు.
తాడికొండ నియోజకవర్గంలో వైసీపీ తరఫున తాను పోటీ చేయడానికి దారితీసిన పరిస్థితులను గుర్తు చేసుకున్న ఉండవల్లి శ్రీదేవిరాజధాని ప్రాంత సీటును దక్కించుకుని, భారీ మెజారిటీతో విజయం సాధించానని చెప్పారు.
నిజాయితీగా పార్టీ కోసం జెండా పట్టి రోడ్లెక్కిన కార్యకర్త ఒకసారి పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కిన తర్వాత ఏ అగ్రనేత కూడా వారిని కాపాడటానికి రావడం లేదని శ్రీధర్ చెప్పారు. నాయకులు కేవలం ఫోటోలకు ఫొటోలు దిగడానికి, మీడియాలో కనిపించడానికే ప్రాధాన్యత ఇస్తారు తప్ప, లోయర్ లేదా మిడిల్ క్లాస్ కార్యకర్త ఆసుపత్రి బిల్లు ఎంత అయింది? కోర్టు ఖర్చులు ఎలా కడుతున్నాడు? అని మానవత్వంతో ఆలోచించే పరిస్థితుల్లో నేటి నాయకత్వాలు లేవని చెప్పారు.