Publish Date:May 22, 2023
వడ్డించేవాడు మనవాడు ఉంటే ఆఖరి బంతిలో కూర్చున్నా ఏమి ఇబ్బంది లేదు అన్నట్టు ఉంది బీఆర్ఎస్ వ్యవహారం. ప్రస్తుతమున్న తెలంగాణ భవన్ కు తోడు కోకపేట కార్యాలయం ఓపెన్ అయ్యింది. పేదలు, బడుగు బలహీనవర్గాలు, డబ్బులు కట్టి కొనుగోలు చేసిన భూములను సైతం తిరిగి ఇవ్వని కెసిఆర్ తన పార్టీ కార్యాలయాలకు భూములు ఎక్కడి నుంచి వస్తున్నాయి అని ప్రతిపక్ష నేతలు ప్రశ్నిస్తున్నారు.
బీఆర్ఎస్ పార్టీ విచ్చలవిడిగా దోపిడీ చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్పీ. కోకాపేటలో బీఆర్ఎస్ కి రాష్ట్ర ప్రభుత్వం 11 ఎకరాల భూమిని కేటాయించడం దారుణమన్నారు. రూ.550 కోట్ల విలువైన 11 ఎకరాల భూమిని కేవలం రూ.37 కోట్లకే బీఆర్ఎస్ పార్టీకి కేటాయిస్తూ రాష్ట్ర కేబినెట్ నిర్ణయం తీసుకోవడాన్ని తీవ్రంగా ఖండించారు ఆర్ఎస్పీ. విలువైన హైదరాబాద్ భూములను కెసీఆర్ కొట్టేస్తున్నారని ఆయన బలమైన వాదన.
మంత్రివర్గ నిర్ణయాన్ని కెసీఆర్ మేనల్లుడు, మంత్రి టి హరీష్ రావ్ వెల్లడించారు. మంత్రి ఈ నిర్ణయాన్ని వెల్లడించినప్పుడు ఇతర మంత్రులు హర్షధ్వానాలు చేశారు.
నిరుడు హెచ్ఎండిఏ ఆక్షన్ నిర్వహించింది. ఈ ఆక్షన్ లో ఎకరం 60 కోట్ల రూపాయల బిడ్డింగ్ ప్రాసెస్ గా నిర్ణయించింది. ఈ లెక్కన కోకాపేట భూమి విలువ అక్షరాల రూ 660 కోట్ల రూపాయలు.
కానీ కేసీఆర్ ప్రభుత్వం చెల్లించింది రూ 37 కోట్ల రూపాయలు చెల్లించాలని నిర్ణయం తీసుకుంది. ఇది ఒక రకంగా మోసం, దగా అని ప్రతిపక్షాలు ఘోషిస్తున్నాయి.
ఈ భూమిని కాజేయడానికి బిఆర్ఎస్ తెలివిగా పార్టీ కార్యాలయంతో పాటు వ్యక్తిత్వ వికాస క్లాసులు, నాయకులకు శిక్షణ ఇవ్వడానికి కార్యాలయం కావాలని కోరింది. మే 12వ తేదీన అప్లయ్ చేసింది. వారం రోజులలోపు క్యాబినేట్ ఆమోదించింది. క్యాబినెట్ ఆమోదం తెలపడం, ప్రభుత్వ ఉత్తర్వు జారీ కావడం చకచకా జరిగిపోయింది. ఈ జీవో నెంబర్ ఎంత అనే విషయం తెలంగాణ ప్రజలకు తెలియదు. నాలుగు కోట్ల మంది మా వెనక ఉన్నారు అని చెప్పుకునే బిఆర్ఎస్ పార్టీ ఈ నాలుగు కోట్ల మందికి జీవో నెంబర్ గోప్యంగా ఉంచడంలో ఆంతర్యమేమిటో?
ఒక్క హైదరాబాద్ లోనే కాదు ఇతర జిల్లాల్లో కూడా బిఆర్ఎస్ పార్టీ కార్యాలయాలకు భూములు పంచే జీవో జీవో 2018లో విడుదలైంది. కెసీఆర్ అధ్యక్షతన జరిగిన క్యాబినెట్ సమావేశం నిర్ణయం తీసుకుని హడావిడిగా జీవో జారి చేసింది. ఈ జీవో కూడా గోప్యంగా ఉంచింది ప్రభుత్వం. అన్ని జిల్లా కార్యాలయాలు స్వంత భవనాల్లో కొనసాగుతున్నాయి. హైదరాబాద్ లో ఇప్పటికే బంజారాహిల్స్ బిఆర్ ఎస్ కార్యాలయం ఉన్నప్పటికీ కొత్తగా మరో బిఆర్ఎస్ భవన్ కోకాపేటలో సేకరించడంలో ఆంతర్యం క్లియర్ కట్ గా తెలంగాణ ప్రజలకు అర్థం అయి ఉండాలి. హైదరాబాద్ భూములను కారు చౌకగా కొట్టేయడమేనని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. మరి ఇంత పెద్ద లావాదేవీలు ప్రభుత్వం తెలంగాణా భూములతో చేస్తున్నప్పుడు పారదర్శకత అవసరం లేదా? జీవోను ఎందుకు ఎందుకు రహస్యంగా ఉంచుతుంది ఈ ప్రభుత్వం.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/brs-govt-mis-use-of-power-25-155747.html
తాడికొండ నియోజకవర్గంలో వైసీపీ తరఫున తాను పోటీ చేయడానికి దారితీసిన పరిస్థితులను గుర్తు చేసుకున్న ఉండవల్లి శ్రీదేవిరాజధాని ప్రాంత సీటును దక్కించుకుని, భారీ మెజారిటీతో విజయం సాధించానని చెప్పారు.
నిజాయితీగా పార్టీ కోసం జెండా పట్టి రోడ్లెక్కిన కార్యకర్త ఒకసారి పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కిన తర్వాత ఏ అగ్రనేత కూడా వారిని కాపాడటానికి రావడం లేదని శ్రీధర్ చెప్పారు. నాయకులు కేవలం ఫోటోలకు ఫొటోలు దిగడానికి, మీడియాలో కనిపించడానికే ప్రాధాన్యత ఇస్తారు తప్ప, లోయర్ లేదా మిడిల్ క్లాస్ కార్యకర్త ఆసుపత్రి బిల్లు ఎంత అయింది? కోర్టు ఖర్చులు ఎలా కడుతున్నాడు? అని మానవత్వంతో ఆలోచించే పరిస్థితుల్లో నేటి నాయకత్వాలు లేవని చెప్పారు.
ఈ నేపథ్యంలో ప్రస్తుత చట్టపరమైన పరిణామాలు, ఉపా చట్టం తీవ్రత, రావణ్కు కోర్టుల్లో ఎదురుకాబోయే సవాళ్లపై మాజీ న్యాయమూర్తి రామకృష్ణ తెలుగువన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో సంచలన విశ్లేషణ చేశారు.
ఆ ఎన్నికలలో జనసురాజ్ పార్టీ ఒక్కటంటే ఒక్క స్థానంలో విజయం సాధించలేదు సరికదా.. ఆ పార్టీ అభ్యర్థులెవరికీ కనీసం డిపాజిట్లు కూడా దక్కలేదు. తెరవెనుక ఉండి ఎందరో దిగ్గజాలను సీఎం గద్దెపై కూర్చోబెట్టిన పీకే.. రాజకీయ వ్యూహాలు తన సొంత పార్టీకి ఇసుమంతైనా ఉపయోగపడలేదు. దీంతో ఇక లాభం లేదనుకుని తానే స్వయంగా ఎన్నికల బరిలో నిలబడి సత్తా చాటాలని నిర్ణయించుకున్నారు.
కోల్కతాలోని కాళీఘాట్లోని మమతా బెనర్జీ అధికారిక నివాసం వద్ద భారీగా పోలీసులు, కేంద్ర బలగాలను మోహరించడం ఈ ఆరోపణలకు బలాన్ని చేకూరుస్తోంది. మమత నివాసానికి వెళ్లే అన్ని ప్రధాన మార్గాలను పోలీసులు తమ అధీనంలోకి తీసుకుని, భారీ పోలీసు వాహనాలతో పూర్తిగా దిగ్బంధించారు.
అనంతపురం జిల్లాకు ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది.
సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం ఉన్న ఆమంచి కృష్ణమోహన్.. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో చీరాల నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగి విజయం సాధించారు. ఈ తరువాత ఆయన తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చారు. అయితే.. 2019 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీని వీడి, వైసీపీ పంచన చేరారు.
తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రజా జీవితంలో అరుదైన మైలురాయిని చేరుకున్నారు.
ఈసీ ఆదేశాల మేరకు
కవిత తన టీఆర్ఎస్ పార్టీ పేరుకు ప్రత్యామ్నాయంగా మూడు పేర్లను ఈసీకి పక్షం రోజుల్లోగా సమర్పించాల్సి ఉంటుంది. నిర్దేశిత గడువులోగా మూడు ప్రత్యామ్నాయ పేర్లను సూచించకుంటే దరఖాస్తున్న మూసేస్తామని హెచ్చరించింది. అంతే కాకుండా టీఆర్ఎస్ పేరును కొనసాగించేందుకు అనుమతి ఉండదని విస్పష్టంగా పేర్కొంది.
ఆ పార్టీ ప్రధాన ఆరోపణ ఏంటంటే.. క్షేత్రస్థాయిలో తెలుగుదేశం పార్టీ అనుకూల సిబ్బందితో అర్హులైన వైసీపీ మద్దతుదారుల ఓట్లను ఉద్దేశపూర్వకంగా తొలగించేందుకు కుట్ర జరుగుతోందని. గతంలో అంటే.. 2014 నుండి 2019 మధ్య కాలంలో కూడా ఇలాగే పెద్ద ఎత్తున దొంగ ఓట్లను చేర్చారని, ఇప్పుడు తమ పార్టీకి అండగా నిలిచే ఓటర్లను లక్ష్యంగా చేసుకుని జాబితా నుండి తొలగిస్తున్నారని వైసీపీ ఆరోపిస్తున్నది.
పైకి వైసీపీతోనూ, జగన్ కోటరీతోనూ విసిగిపోయానని, అందుకే బయటకు వచ్చేశాననీ విజయసాయి చెబుతున్నా.. ఆయన మాటలూ చేతలూ అన్ని జగన్ కు ప్రయోజనం చేకూర్చడానికే అన్నట్లుగా ఉంటాయి. ఉంటున్నాయి.
విశాఖపట్నం పరిపాలన రాజధాని అన్న జగన్ విధానాన్ని ధర్మాన బలంగా ప్రజలలోకి తీసుకువెళ్లడానికి శతధా ప్రయత్నించారు. ఉత్తరాంధ్ర సెంటిమెంట్ను రగిలిస్తూ, గ్రామగ్రామాన సభలు, సమావేశాలు ఏర్పాటు చేసి ప్రచారం చేశారు. అదేమీ ఫలించలేదని 2024 ఎన్నికల ఫలితాలు తేల్చేశాయి.
వైసీపీ కోసం ఎంతగానో పరితపించిన ముద్రగడ.. కాపు రిజర్వేషన్ కోసం, కాపుల కోసం పోరాటం చేసి సంపాదించుకున్న ప్రాముఖ్యతనూ, ప్రతిష్టనూ..జగన్ కోసం ఔను కేవలం జగన్ కోసం వదులుకున్నారు. అటువంటి ముద్రగడ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ వెంటిలేటర్ పై చికిత్స పొందుతుంటే…జగన్ ఆయనను కనీసం పరామర్శించను కూడా పరామర్శించలేదు.