అప్పుడు ముందస్తుకు వెళ్లడమే ముంచేసిందా?

Publish Date:Mar 29, 2024

Advertisement

భారత రాష్ట్ర సమితి ప్రస్తుత దుస్థితికి ఆ పార్టీ 2018 ఎన్నికలలో (అప్పుడు పార్టీ పేరు టీఆర్ఎస్) ముందస్తుకు వెళ్లడమే కారణమా? అంటే పరిశీలకులు ఔననే అంటున్నారు. పదేళ్ల కిందట ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర విభజన  జరిగింది. ఆ తరువాత 2014లో తెలంగాణ, విభజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకే సారి సార్వత్రిక ఎన్నికలతో పాటుగానే ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికలలో తెలంగాణలో బీఆర్ఎస్ (అప్పుడు టీఆర్ఎస్) ఏపీలో తెలుగుదేశం అధికారంలోకి వచ్చాయి. అయితే కేసీఆర్ మాత్రం ఐదేళ్ల పదవీ కాలం ముగియడానికి ఆరు నెలల ముందే అంటే 2018 డిసెంబర్ లోనే ముందస్తు ఎన్నికలకు వెళ్లారు. ఆంధ్రప్రదేశ్ లో మాత్రం సార్వత్రిక ఎన్నికలతో పాటుగానే 2019 ఏప్రిల్ లో ఎన్నికలు జరిగాయి.  2018 ఎన్నికలలో విజయం సాధించి కేసీఆర్ వరుసగా రెండో సారి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పదవీ పగ్గాలు చేపట్టారు. అప్పట్లో కేసీఆర్ వ్యూహాత్మకంగా ముందస్తుకు వెళ్లి మెరుగైన ఫలితాలు సాధించగలిగారంటూ ఆయనపై ప్రశంసల వర్షం కురిసింది. అయితే కేసీఆర్ అప్పట్లో ముందస్తుకు వెళ్లడం వల్ల ఈసారి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు సార్వత్రిక లతో పాటుగా కాకుండా ముందుగానే అంటే 2023 డిసెంబర్ లోనే జరిగాయి. 2018లో కేసీఆర్ కు ముందస్తుకు వెళ్లడం కలిసి వచ్చింది. కానీ నాడు కేసీఆర్ తీసుకున్న నిర్ణయం వల్ల 2023 ఎన్నికలలో ప్రతిపక్షానికి పరిమితం కావలసి వచ్చిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. నాడు ముందస్తుకు వెళ్లాలన్న కేసీఆర్ నిర్ణయం వ్యూహాత్మక తప్పిదమని ఇప్పుడు పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. నాడు విపక్షాలను చిత్తు చేసిన వ్యూహంగా ప్రశంసలు గుప్పించిన వారే  నేడు నాటి నిర్ణయం వ్యూహాత్మక  తప్పిదంగా విమర్శలు గుప్పిస్తున్నారు. ఎందుకంటే 2023 ఎన్నికలలో బీఆర్ఎస్ ఓటమి పాలై ప్రతిపక్షానికే పరిమితం అవ్వడమే కాకుండా పార్టీ అధినేత కేసీఆర్ స్వయంగా కామారెడ్డి స్థానం నుంచి పరాజయం పాలయ్యారు. ఈ పరాజయం పార్టీ స్థాయినీ, నైతిక స్థైర్యాన్నీ బాగా దెబ్బతీసిందనడంలో సందేహం లేదు. ఓటమి తరువాత పార్టీ పరిస్థితి రోజు రోజుకూ దిగజారిపోతున్నది. పార్టీ నేతలూ, ఎమ్మెల్యేలూ, ఎంపీలూ కూడా పార్టీని వీడుతున్నారు. గత పదేళ్లుగా ఎవరి సలహాలూ, సూచనలూ పట్టించుకోకుండా ఇష్టారీతిగా వ్యవహరించిన అధినాయకత్వం పట్ల బాహాటంగానే అసంతృప్తిని, ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. అధికారంలో ఉన్న సమయంలో అధినేతకు సన్నిహితులుగా గుర్తింపు పొందిన కేకే, కడియం వంటి వారు కూడా కారు దిగేయడంతో బీఆర్ఎస్ మళ్లీ పుంజుకుంటుందా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మద్యం కుంభకోణం కేసులో కవితను ఈడీ అరెస్టు చేసిన సందర్భంలో తెలంగాణ ప్రజల నుంచి కూడా ఎటువంటి స్పందనా రాకపోవడం చూస్తుంటే ఆ పార్టీ పట్ల ప్రజలలో ఎంత వ్యతిరేకత ఉందో అవగతమైంది. ఈ పరిస్థితి రానున్న లోక్ సభ ఎన్నికలలో పార్టీపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉందని అంటున్నారు. ప్రస్తుతం పార్టీ పరిస్థితి అత్యంత దయనీయంగా ఉండటంతో ఇంకా పార్టీలో ఉన్న నేతలలో కూడా అంతర్మథనం ప్రారంభమైందని చెబుతున్నారు. 2018లో ముందస్తు ఎన్నికలకు వెళ్లి కేసీఆర్ వ్యూహాత్మకంగా దిద్దుకోలేని తప్పిదం చేశారని బాహాటంగానే వ్యాఖ్యలు చేస్తున్నారు. నాటి తప్పిదానికి ఇప్పుడు పార్టీ ఫలితం అనుభవిస్తోందని అంటున్నారు. 

By
en-us Political News

  
ఆంధ్రప్రదేశ్ లో అధికారం చేపట్టబోయేది ఎవరో బీజేపీ తేల్చేసింది. రాష్ట్రంలో తెలుగుదేశం నేతృత్వంలోని కూటమే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని బీజేపీ సీనియర్ నాయకుడు, అంతకు మించి కేంద్ర హోంమంత్రి అమిత్ షా అనుచరుడు అయిన సునీల్ బన్సల్ పేర్కొన్నారు.
జగన్ గులకరాయి దాడిలో గాయపడి రెండు వారాలుగా కంటికి వేసుకున్న బ్యాండ్ ఎయిడ్ ఎట్టకేలకు తీసేశారు. హఠాత్తుగా ఆయన బ్యాండేజీ తీయడానికి ఆయన బాబాయ్ కుమార్తె డాక్టర్ సునీత సెప్టిక్ అవుతుంది జాగ్రత్త అన్నయ్యా అని చేసిన హెచ్చరికే కారణమా? అంటూ నెటిజనులు ట్రోల్ చేస్తున్నారు.
రాష్ట్రంలోని హాట్ సీట్లలో ముందుగా చెప్పుకోవలసింది జనసేన అధినేత పోటీ చేస్తున్న పిఠాపురం నియోజకవర్గం. ఇక్కడ వైసీపీ అభ్యర్థిగా వంగా గీత రంగంలో ఉన్నారు. జనసేనాని ఓటమే లక్ష్యంగా జగన్ ఈ నియోజకవర్గ బాధ్యతలను ఎంపీ మిథున్ రెడ్డి, మంత్రి పెద్దిరెడ్డిలకు అప్పగించారు. ప్రచారం హోరాహోరీగా సాగుతోంది.
శనివారం నాడు మాజీ టీఆర్ఎస్, ప్రస్తుత బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం. ఈ ఉత్సవం సోషల్ మీడియాలో తప్ప మరెక్కడా జరిగిన దాఖలాలు కనిపించడం లేదు.
వచ్చే నాలుగు రోజులు తెలంగాణ నిప్పుల కుంపటిగా మారబోతోందని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరించింది. ముఖ్యంగా రాష్ట్రంలోని తూర్పు, ఉత్తర ప్రాంతాలు నిపుల గుండంగా మారనున్నాయని పేర్కొంది.
 పదేళ్ల తర్వాత తెలంగాణలో అధికారంలో వచ్చిన కాంగ్రెస్ పార్టీ  ప్రభుత్వం  బార్లు, రెస్టారెంట్లలో  అక్రమంగా కార్యకలాపాలు  నిర్వహిస్తున్న వారిపై ఉక్కుపాదం మోపింది.  బిఆర్ఎస్ హాయంలో యదేచ్చగా సంఘ విద్రోహ చర్యలకు పాల్పడుతున్న వారిని ముచ్చెమటలు పట్టిస్తోంది.
విశాఖ ఉత్తర నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీలో వున్న జై భారత్ నేషనల్ పార్టీ (జేబీఎన్‌పీ) అధ్యక్షుడు, సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ వి.వి.లక్ష్మీనారాయణకు
పించన్ల పంపిణీ విషయంలో జగన్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల పట్ల కేంద్ర ఎన్నికల సంఘం అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ మేరకు తగిన మార్గదర్శకాలను సూచించింది
తెలుగు రాష్ట్రాలలో ఎన్నికల వేడి వేసవి ఎండలను మించిపోయింది. నామినేషన్ల దాఖలు ప్రక్రియ పూర్తై పోలింగ్ ఇక రోజుల వ్యవధిలోకి రావడంలో పార్టీలూ, పోటీలో ఉన్న అభ్యర్థులూ తమ ప్రచారాన్ని మరింత హోరెత్తించడానికి సమాయత్తమౌతున్నారు.
తెలంగాణలో అధికారం కోల్పోయిన షాక్ నుంచి ఇప్పటికీ తేరుకోని తండ్రీ కొడుకులు కేసీఆర్, కేటీఆర్ గత కొన్ని రోజులుగా జనంలోకి వచ్చి ఆడుతున్న డ్రామాలు చూస్తూ జనం ఫ్రీ
ఎప్పుడైనా ఎన్నికల వేళకి అధికార పార్టీలో ఒక స్పష్టత ఉంటుంది. అధికారంలో ఉన్న కాలంలో చేసిన అభివృద్ధీ, ప్రజలకు అందించిన సంక్షేమం వివరించి ఓట్లు అడగడానికి వెసులుబాటు ఉంటుంది. అయితే వాస్తవంగా అధికారంలో ఉన్న కాలంలో అభివృద్ధి సంక్షేమాలపై ప్రభుత్వం ప్రజలమెప్పు పొందిందా లేదా అన్నది ఓటర్లు తమ ఓటు ద్వారా తీర్పు ఇస్తారు. అది వేరే సంగతి.
నిజానిజాల సంగతి పక్కన పెడితే ఎన్నికల సమయంలో రాజకీయ నాయకుల ప్రచారాలు కోటలు దాటేస్తాయి. పార్టీలు, నేతలు చెప్పేది ఏది నిజం, ఏది అబద్ధం అన్నది వేరే విషయం. ఎవరి మాటలను జనం విశ్వసిస్తున్నారు. ఎవరి మాటలను నమ్మడం లేదు అన్నది జనం ఓటుతో చెప్పే వరకూ అంటే ఎన్నికల ఫలితాలు వచ్చే వరకూ ఎవరికీ తెలియదు.
వైసీపీకి ఇప్పుడు అన్ని అపశకునాలే కనిపిస్తున్నాయి. ఏదీ కలిసిరావడం లేదు. గత ఎన్నికలలో అన్నీ కలిసివచ్చి అందలం దక్కింది. ఈ సారి అన్నీ ఎదురుతిరిగి అధికారం దూరమయ్యే పరిస్థితి కనిపిస్తోంది. స్వయంగా పార్టీ అధినేత, సీఎం జగన్ రంగంలోకి దిగి బస్సు యాత్ర చేపట్టినా జనంలో స్పందన కనిపించలేదు. చివరాఖరికి సొంత గడ్డ కడపలో కూడా జగన్ పార్టీకి వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.