Publish Date:May 18, 2023
బిఆర్ఎస్ దళిత వోట్ల మీద ఫోకస్ పెట్టినట్లు కనిపిస్తోంది. ఇటీవలె బిఎస్పి ఆధ్వర్యంలో జరిగిన బహిరంగ సభకు యూపీ మాజీ ముఖ్యమంత్రి మాయావతి ముఖ్యఅతిథిగా రావడాన్ని బిఆర్ఎస్ వర్గాలకు నచ్చలేదు. ఎందుకంటే తెలంగాణ రాజధానిలో బిఎస్పి బహింరంగ సభ పెట్టడాన్ని బిఆర్ఎస్ మనసు మీద తీసుకుంది. ఎందుకంటే బిఎస్పి అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ మాజీ ఐపిఎస్ అధికారి. ఉద్యోగానికి రాజీనామా చేసి రాజకీయాల్లో వచ్చిన ధీరుడాయన. తెలంగాణ జిల్లాల్లో ఆయన కలియ తిరుగుతూ కెసిఆర్ మీద దుమ్మెత్తి పోస్తున్నారు. పరుషంగా కూడా మాట్లాడుతున్నారు. ఆర్ఎస్ ప్రవీణ్ దాడిని బిఆర్ఎస్ శ్రేణులు అంత బలంగా తిప్పి కొట్టలేకపోతున్నాయి. ధర్మ సమాజ్ పార్టీ, రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా దళిత పార్టీలే. రానున్న ఎన్నికల నేపథ్యంలో ఈ దళిత పార్టీలు తమ అభ్యర్థులను రంగంలో దించుతున్నాయి. ఒకప్పుడు దళిత సంఘాలుగా ఉన్న ఈ సంఘాలు రాజకీయ పార్టీలుగా అవతరించాయి. దళిత హక్కుల కోసం ఉద్యమాలు చేసిన సంఘాలు రాజకీయ పార్టీలుగా అవతరించి వోటరు తీర్పును ప్రభావితం చేసే స్థాయికి చేరుకున్నాయి.
దళిత బంధు వంటి పథకాన్ని పరిచయం చేసిన బిఆర్ ఎస్ కూడా ఇటీవలె విమర్శల పాలైంది. పార్టీ అధినేత కేసీఆర్ డైరెక్టుగా తన పార్టీ శాసనసభ్యులే కమీషన్లకు కక్కుర్త పడుతున్నారని ఆరోపించారు. ఈ ఆరోపణలు ప్రతి పక్షాలకు అస్త్రం దొరికినట్టయ్యింది. దళిత వర్గానికి చెందిన ఎంఎల్ఏ ప్రస్తుతం తెలంగాణ పిసిసి శాసనసభా పక్ష నేత మల్లు భట్టి విక్రమార్క చేపట్టిన పాదయాత్రకు మంచి రెస్పాన్స్ వస్తోంది. కాంగ్రెస్ పార్టీలో పాపులర్ నేత అతను. ఆయన చేపట్టిన పాదయాత్ర రికార్డుల్లో కెక్కింది కూడా. ప్రస్తుతం అస్తిత్వంలో ఉన్న రాజకీయ పార్టీలకు తోడు కొత్తగా వచ్చిన దళిత పార్టీలు బిఆర్ఎస్ ను ఏ మేరకు దెబ్బతీస్తాయో వేచి చూడాలి.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/brs-con-centration-on-dalith-votes-39-155524.html
2019 ఎన్నికలలో వైసీపీ విజయంలో అప్పటి జగన్ పాదయాత్ర కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. అయితే అప్పట్లో.. జగన్ వాగ్దానాలపై ప్రజలలో నమ్మకం ఉండేది. ప్రజలతో ఆయన మమేకమయ్యేవారు.
రాష్ట్ర విభజన తరువాత తెలంగాణలో తెలుగుదేశం పార్టీ అధికార రేసులో లేకపోయినప్పటికీ.. రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేస్తూనే ఉంది. అందుకే రాష్ట్రంలో రాజకీయ వేడ రగిలిన ప్రతి సందర్భంలోనూ తెలుగుదేశం ప్రస్థావన వస్తూనే ఉంటుంది.
తెలంగాణ రాజకీయాల్లో గత కొన్ని రోజులుగా తీవ్ర దుమారం రేపుతున్న పరిణామాలు ఇప్పుడు అత్యంత ఆసక్తికర మలుపు తిరిగాయి.
తాజాగా ఆమె చేసిన వ్యాఖ్యలు ఆమె చూపు బీఆర్ఎస్ వైపు మళ్లిందా అన్న అనుమానాలకు తావిచ్చింది. కేబినెట్ నుంచి తనకు ఉద్వాసన పలికిన తరువాత మీడియాకు వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్న కొండా సురేఖ.. తాజాగా బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుపై ప్రశంసల వర్షం కురిపించారు.
పిడిక్కీ బియ్యానికీ ఒకే మంత్రం అన్నట్లుగా ఆమె తన బర్త్ రఫ్ కూ తెలుగుదేశం పార్టీకీ ముడి పెట్టారు. సీఎం రేవంత్ రెడ్డిది తెలుగుదేశం రక్తం కనుకనే తనకు కేబినెట్ నుంచి బర్త్ రఫ్ చేశారంటూ మీడియా సమావేశంలో కొండా సురేఖ చేసి కామెంట్స్ రాజకీయవర్గాలలో సంచలనంగా మారాయి.
ఈ ప్రాజెక్టుల నిర్మాణంలో తమ పాత్రే కీలకమని పేర్కొంటూ వైసీపీ క్రెడిట్ వార్ కు తెరతీసింది. సోషల్ మీడియా వేదికగా వైసీపీ వారు పోలవరం ప్రాజెక్టును దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి కలల ప్రాజెక్ట్గా అభివర్ణిస్తూ పోస్టులు షేర్ చేస్తోంది.
కోమటిరెడ్డి కుటుంబానికి నల్గొండ జిల్లాలో గట్టి పట్టు ఉంది. ఈ నేపథ్యంలో తాను కేవలం మంత్రి పదవిని మాత్రమే ఆశించే నాయకుడిని కాననీ.. వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకువెళ్లే నాయకుడిననీ ఆయన అంటున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అధికార కూటమి భాగస్వామ్య పక్షాలైన తెలుగుదేశం, జనసేన మధ్య సంబంధాలు పైకి కనిపించేంత సజావుగా లేవనే సంకేతాలు స్పష్టమవుతున్నాయి.
తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారిగా తీవ్ర కలకలం రేగింది
దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా బుధవారం (సెప్టెంబర్ 2) నిర్వహించిన ఒక ర్యక్రమంలో పాల్గొన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. తాము ఏనాడు కూడా పదవుల కోసం సిద్ధాంతాలను తాకట్టు పెట్టలేదంటూ.. వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయాల బాటలో నడిచేందుకు రాజకీయాల్లోకి ప్రవేశించామన్నారు.
ఆమె మాటలను బట్టి పరిశీలకులు కొండా సురేఖ పార్టీకీ, ఎమ్మెల్యే పదవికీ కూడా రాజీనామే చేసే అవకాశాలు కనిపిస్తున్నాయని విశ్లేషిస్తున్నారు. అదే జరిగితే.. ఆమె ప్రాతినిథ్యం వహిస్తున్న వరంగల్ తూర్పు నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమౌతుంది.
నా కూతురికి పెళ్లైంది.. తనకు తాను స్వతంత్రంగా మాట్లాడింది..!
ఉన్నది మాట్లాడితే చర్యలా.. సురేఖ సంచలన వ్యాఖ్యలు..!