Publish Date:Aug 11, 2023
ఏదో వివాదం తో నిత్యం వార్తల్లో వుండే డైరెక్టర్ రాంగోపాల్ వర్మపై బి ఆర్ ఎస్ కార్యకర్తలకు , కే సి అర్ అభిమానులకు తీవ్ర ఆగ్రహం కలిగింది. ఒకప్పుడు హిట్ సినిమాలు తీసి ట్రెండ్ సెట్ చేసిన వర్మ ఇప్పుడు కేవలం... ఒక పార్టీమీద బురద చల్లేందుకు , యువ నాయకుడి మెప్పు కోసం పనిచేస్తున్నారు. గత ఎఎన్నికల సమయంలో లక్ష్మీస్ ఎన్టీఆర్ , కమ్మ రాజ్యంలో కడప రెడ్లు టైటిల్ తో రెండు సినిమాలు తీశారు. కమ్మ రాజ్యంలో కడప రెడ్లు సినిమా పేరును తరువాత ఆ సినిమా పేరును అమ్మ రాజ్యంలో కడపరెడ్లు అని మార్చి విడుదల చేశారు.
ఈ రెండు సినిమాలే కాకుండా పవన్ కళ్యాణ్ మీద కూడా ఓ సినిమా తీశారు. అది విడుదల కాలేదనుకోండి.. సరే ఈ సినిమాలు తీసి నందుకు వైసీపీ నుండి ముడుపులు తీసుకున్నాడన్న ఆరోపణలు ఎదుర్కొన్న రాంగోపాల్ వర్మ ఇప్పుడు మళ్లీ ఎన్నికల సమయం దగ్గరపడుతుంగా మరో రెండు సినిమాలను అనౌన్స్ చేసాడు.. వాటిలో ఒకటైన వ్యూహం అనే సినిమా షూటింగ్ చేస్తున్నారు.
ఇప్పుడు ఈ షూటింగ్ కు సంబంధించినన వీడియో ఒకటి సోషల్ మీడియా లో దర్శనమిచ్చింది.. ఆ వీడియో లీక్ అయ్యిందా.? లేక పుబ్లిసిటీ కోసం తానే లీక్ చేయించాడో తెలియదు కానీ.. ఈ వీడియో చుసిన దగ్గర నుండి బిఆర్ఎస్ కార్యకర్తలు వర్మ మీద తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు.
ముఖ్యమంత్రి కే సి అర్ ని అవమానించేలా ఆయన పాత్రను ఆర్జీవీ మలిచారని బీఆర్ఎస్ శ్రేణులు ఆరోపిస్తున్నాయి. పొట్టిగా వుండే జగన్ క్యారెక్టర్ ని పొడుగుగా వుండే ఆర్టిస్ట్ తో చేయిస్తూ... మంచి హైట్ తో , బక్కపలచగా వుండే కే సి ఆర్ పాత్రకు పొట్టిగా జోకర్ లా వుండే ఆర్టిస్ట్ ను ఎంచుకోవడంపై మండి పడుతున్నారు.
జగన్ క్యారెక్టర్ ని ఎలివేట్ చేయటానికి మిగతా పాత్రలన్నీ డీగ్రేడ్ చేస్తున్నాడంటూ ఫైరౌతున్నారు. వర్మ సినిమా రిలీజ్ తర్వాత తమ నాయకుడ్ని అవమానించినట్టు ఒక్క సన్నివేశం వున్నా రాంగోపాల్ వర్మ అంతుచూస్తాం అంటూ కేసీఆర్ అభిమానులు వార్నింగ్ ఇస్తున్నారు. కాగా ఈ షూటింగ్ వీడియో, బీఆర్ఎస్ నేతల ఆగ్రహం ఇప్పుటు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/brs-cader-angry-on-rgv-39-159840.html
తాడికొండ నియోజకవర్గంలో వైసీపీ తరఫున తాను పోటీ చేయడానికి దారితీసిన పరిస్థితులను గుర్తు చేసుకున్న ఉండవల్లి శ్రీదేవిరాజధాని ప్రాంత సీటును దక్కించుకుని, భారీ మెజారిటీతో విజయం సాధించానని చెప్పారు.
నిజాయితీగా పార్టీ కోసం జెండా పట్టి రోడ్లెక్కిన కార్యకర్త ఒకసారి పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కిన తర్వాత ఏ అగ్రనేత కూడా వారిని కాపాడటానికి రావడం లేదని శ్రీధర్ చెప్పారు. నాయకులు కేవలం ఫోటోలకు ఫొటోలు దిగడానికి, మీడియాలో కనిపించడానికే ప్రాధాన్యత ఇస్తారు తప్ప, లోయర్ లేదా మిడిల్ క్లాస్ కార్యకర్త ఆసుపత్రి బిల్లు ఎంత అయింది? కోర్టు ఖర్చులు ఎలా కడుతున్నాడు? అని మానవత్వంతో ఆలోచించే పరిస్థితుల్లో నేటి నాయకత్వాలు లేవని చెప్పారు.
ఈ నేపథ్యంలో ప్రస్తుత చట్టపరమైన పరిణామాలు, ఉపా చట్టం తీవ్రత, రావణ్కు కోర్టుల్లో ఎదురుకాబోయే సవాళ్లపై మాజీ న్యాయమూర్తి రామకృష్ణ తెలుగువన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో సంచలన విశ్లేషణ చేశారు.
ఆ ఎన్నికలలో జనసురాజ్ పార్టీ ఒక్కటంటే ఒక్క స్థానంలో విజయం సాధించలేదు సరికదా.. ఆ పార్టీ అభ్యర్థులెవరికీ కనీసం డిపాజిట్లు కూడా దక్కలేదు. తెరవెనుక ఉండి ఎందరో దిగ్గజాలను సీఎం గద్దెపై కూర్చోబెట్టిన పీకే.. రాజకీయ వ్యూహాలు తన సొంత పార్టీకి ఇసుమంతైనా ఉపయోగపడలేదు. దీంతో ఇక లాభం లేదనుకుని తానే స్వయంగా ఎన్నికల బరిలో నిలబడి సత్తా చాటాలని నిర్ణయించుకున్నారు.
కోల్కతాలోని కాళీఘాట్లోని మమతా బెనర్జీ అధికారిక నివాసం వద్ద భారీగా పోలీసులు, కేంద్ర బలగాలను మోహరించడం ఈ ఆరోపణలకు బలాన్ని చేకూరుస్తోంది. మమత నివాసానికి వెళ్లే అన్ని ప్రధాన మార్గాలను పోలీసులు తమ అధీనంలోకి తీసుకుని, భారీ పోలీసు వాహనాలతో పూర్తిగా దిగ్బంధించారు.
అనంతపురం జిల్లాకు ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది.
సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం ఉన్న ఆమంచి కృష్ణమోహన్.. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో చీరాల నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగి విజయం సాధించారు. ఈ తరువాత ఆయన తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చారు. అయితే.. 2019 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీని వీడి, వైసీపీ పంచన చేరారు.
తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రజా జీవితంలో అరుదైన మైలురాయిని చేరుకున్నారు.
ఈసీ ఆదేశాల మేరకు
కవిత తన టీఆర్ఎస్ పార్టీ పేరుకు ప్రత్యామ్నాయంగా మూడు పేర్లను ఈసీకి పక్షం రోజుల్లోగా సమర్పించాల్సి ఉంటుంది. నిర్దేశిత గడువులోగా మూడు ప్రత్యామ్నాయ పేర్లను సూచించకుంటే దరఖాస్తున్న మూసేస్తామని హెచ్చరించింది. అంతే కాకుండా టీఆర్ఎస్ పేరును కొనసాగించేందుకు అనుమతి ఉండదని విస్పష్టంగా పేర్కొంది.
ఆ పార్టీ ప్రధాన ఆరోపణ ఏంటంటే.. క్షేత్రస్థాయిలో తెలుగుదేశం పార్టీ అనుకూల సిబ్బందితో అర్హులైన వైసీపీ మద్దతుదారుల ఓట్లను ఉద్దేశపూర్వకంగా తొలగించేందుకు కుట్ర జరుగుతోందని. గతంలో అంటే.. 2014 నుండి 2019 మధ్య కాలంలో కూడా ఇలాగే పెద్ద ఎత్తున దొంగ ఓట్లను చేర్చారని, ఇప్పుడు తమ పార్టీకి అండగా నిలిచే ఓటర్లను లక్ష్యంగా చేసుకుని జాబితా నుండి తొలగిస్తున్నారని వైసీపీ ఆరోపిస్తున్నది.
పైకి వైసీపీతోనూ, జగన్ కోటరీతోనూ విసిగిపోయానని, అందుకే బయటకు వచ్చేశాననీ విజయసాయి చెబుతున్నా.. ఆయన మాటలూ చేతలూ అన్ని జగన్ కు ప్రయోజనం చేకూర్చడానికే అన్నట్లుగా ఉంటాయి. ఉంటున్నాయి.
విశాఖపట్నం పరిపాలన రాజధాని అన్న జగన్ విధానాన్ని ధర్మాన బలంగా ప్రజలలోకి తీసుకువెళ్లడానికి శతధా ప్రయత్నించారు. ఉత్తరాంధ్ర సెంటిమెంట్ను రగిలిస్తూ, గ్రామగ్రామాన సభలు, సమావేశాలు ఏర్పాటు చేసి ప్రచారం చేశారు. అదేమీ ఫలించలేదని 2024 ఎన్నికల ఫలితాలు తేల్చేశాయి.
వైసీపీ కోసం ఎంతగానో పరితపించిన ముద్రగడ.. కాపు రిజర్వేషన్ కోసం, కాపుల కోసం పోరాటం చేసి సంపాదించుకున్న ప్రాముఖ్యతనూ, ప్రతిష్టనూ..జగన్ కోసం ఔను కేవలం జగన్ కోసం వదులుకున్నారు. అటువంటి ముద్రగడ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ వెంటిలేటర్ పై చికిత్స పొందుతుంటే…జగన్ ఆయనను కనీసం పరామర్శించను కూడా పరామర్శించలేదు.