Publish Date:Jul 15, 2022
గోదారి కన్నెర్రజేసింది. ఉప్పొంగి పొర్లి ప్రవహిస్తోంది. కోనసీమ ఓ గ్రామంలో మాత్రం ఓ అమ్మాయిని పెళ్లికి తరలించడంలో ఆనందోత్సాహంలో వున్నారు. బాజాబజంత్రీలతో పెళ్లింటికి వెళ్లడం ఆనవాయితీ. కానీ ప్రశాంతి అనే అమ్మాయి మాత్రం చక్కగా నవ్వుతూ పడవలో ప్రయాణమైంది.
వర్షాలు ముంచెత్తుతున్న ఈ సమయంలో మరి ముహూర్తాన్ని కాదనుకోలేరుగదా. అంతా సిద్ధమైన తర్వాత ప్రకృతీ సహకరిస్తుందనే ధైర్యం పెళ్లింటా వుంది. ముహూర్తబలం బలమైనది.. ప్రశాంతి చక్కగా పెళ్లి చేసుకోవడానికి పడవ ప్రయాణం చేసింది. పూలతో చూడముచ్చటగా అలంకరించిన కారులో వెళ్లడం కంటే ఇలా వెళ్లడంలో ఆమెకీ ఎంతో సరదాగా వుంది. అయితే ఇది తప్పని పరిస్థితి. భారీ వర్షా లతో జిల్లా అంతా తడిసి ముద్దవుతున్న సమయంలో కాస్తంత తెరిపివ్వగానే ఇలా పెళ్లికూతు బయలు దేరింది. ఇది ఆంధ్రప్రదేశ్ కోనసీమ జిల్లాలో దృశ్యం.
ప్రశాంతి, అశోక్ల పెళ్లి నిజానికి ఈపాటికే జరగాల్సింది. కానీ జిల్లాలో, రాష్ట్రంలో భారీ వర్షాల కారణంగా ముహూర్తం మార్చుకోవలసి వచ్చింది. ఆగస్టులో సాధారణంగా వర్షాలు పడతాయనుకుని జూలైకి తేదీని మార్చుకున్నారు. కానీ ఈ అకాల వర్షం రెండు కుటుంబాలను కాస్తంత ఖంగారుపెట్టింది. ముహూర్తాలు పెట్టుకున్నాం గనుక ఎలాగయినా చేసేద్దామని అంతా పట్టుబట్టారు. అంతకుమించి అందరూ సహాయం చేశారు. జిల్లాలో వర్షం కాస్తంత తెరిపివ్వడంతో ఇలా పడవలోనే అమ్మాయిని తీసికెళుతున్నారు.
అబ్బాయి గ్రామం దగ్గరే కావడంతో ఇలా పడవలో వెళ్లడంలో అదో ఆనందం, సరదా. మామూలుగా అయితే కారులోనో, ప్రత్యేకించి బస్సు ఏర్పాటుచేసుకునో బంధువులందరూ కలిసి వెళ్లేవారు. ఇప్పుడు పడవలో అందరూ తరలివెళుతున్నారు. ఇది ఊహించని ఆనందం. కానీ ఒక్కింత భయమూ వారికి లేకపోలేదు. బోటు షికారు వేరు, ఇలా వెళ్లడం వేరు గదా. మొత్తానికి అంతా శుభంగానే జరిగింది. అందరూ ఈ ప్రయాణం గురించి చెప్పుకుంటారు. పెళ్లి జంట కూడా ఆనక పిల్లలకీ ఈ సంగతి చెప్పి నవ్వుకుంటారేమో.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/bride-ride-in-boat-39-139788.html
అనంతపురం జిల్లాకు ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది.
సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం ఉన్న ఆమంచి కృష్ణమోహన్.. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో చీరాల నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగి విజయం సాధించారు. ఈ తరువాత ఆయన తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చారు. అయితే.. 2019 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీని వీడి, వైసీపీ పంచన చేరారు.
తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రజా జీవితంలో అరుదైన మైలురాయిని చేరుకున్నారు.
ఈసీ ఆదేశాల మేరకు
కవిత తన టీఆర్ఎస్ పార్టీ పేరుకు ప్రత్యామ్నాయంగా మూడు పేర్లను ఈసీకి పక్షం రోజుల్లోగా సమర్పించాల్సి ఉంటుంది. నిర్దేశిత గడువులోగా మూడు ప్రత్యామ్నాయ పేర్లను సూచించకుంటే దరఖాస్తున్న మూసేస్తామని హెచ్చరించింది. అంతే కాకుండా టీఆర్ఎస్ పేరును కొనసాగించేందుకు అనుమతి ఉండదని విస్పష్టంగా పేర్కొంది.
ఆ పార్టీ ప్రధాన ఆరోపణ ఏంటంటే.. క్షేత్రస్థాయిలో తెలుగుదేశం పార్టీ అనుకూల సిబ్బందితో అర్హులైన వైసీపీ మద్దతుదారుల ఓట్లను ఉద్దేశపూర్వకంగా తొలగించేందుకు కుట్ర జరుగుతోందని. గతంలో అంటే.. 2014 నుండి 2019 మధ్య కాలంలో కూడా ఇలాగే పెద్ద ఎత్తున దొంగ ఓట్లను చేర్చారని, ఇప్పుడు తమ పార్టీకి అండగా నిలిచే ఓటర్లను లక్ష్యంగా చేసుకుని జాబితా నుండి తొలగిస్తున్నారని వైసీపీ ఆరోపిస్తున్నది.
పైకి వైసీపీతోనూ, జగన్ కోటరీతోనూ విసిగిపోయానని, అందుకే బయటకు వచ్చేశాననీ విజయసాయి చెబుతున్నా.. ఆయన మాటలూ చేతలూ అన్ని జగన్ కు ప్రయోజనం చేకూర్చడానికే అన్నట్లుగా ఉంటాయి. ఉంటున్నాయి.
విశాఖపట్నం పరిపాలన రాజధాని అన్న జగన్ విధానాన్ని ధర్మాన బలంగా ప్రజలలోకి తీసుకువెళ్లడానికి శతధా ప్రయత్నించారు. ఉత్తరాంధ్ర సెంటిమెంట్ను రగిలిస్తూ, గ్రామగ్రామాన సభలు, సమావేశాలు ఏర్పాటు చేసి ప్రచారం చేశారు. అదేమీ ఫలించలేదని 2024 ఎన్నికల ఫలితాలు తేల్చేశాయి.
వైసీపీ కోసం ఎంతగానో పరితపించిన ముద్రగడ.. కాపు రిజర్వేషన్ కోసం, కాపుల కోసం పోరాటం చేసి సంపాదించుకున్న ప్రాముఖ్యతనూ, ప్రతిష్టనూ..జగన్ కోసం ఔను కేవలం జగన్ కోసం వదులుకున్నారు. అటువంటి ముద్రగడ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ వెంటిలేటర్ పై చికిత్స పొందుతుంటే…జగన్ ఆయనను కనీసం పరామర్శించను కూడా పరామర్శించలేదు.
ఎన్నికల్లో ఘోర పరాజయంతో కేవలం 11 సీట్లకు పరిమితమైన తర్వాత, సరికొత్తగా మావిగన్ రాగం అందుకున్నారని విమర్శించారు.
పైపెచ్చు.. జిల్లాకు చెందిన పలువురు ముఖ్య నాయకులు జగన్ పాల్గొన్న కార్యక్రమాలకు ముఖం చాటేశారు. కొందరైతే తూతూమంతరంగా అలా వచ్చి, ఇలా వెళ్లిపోయారు.
ఆలా కిందపడిపోయిన పోలీసులు ఆ తరువాత కల్వకుంట్ల కవితతో దురుసుగా వ్యవహరించిన తీరు పట్ల సర్వత్రా నిరసన వ్యక్తం అవుతోంది. కవితను పోలీసులు పోలీస్ వాహనంలోకి దురుసుగా నెట్టేయడం సరికాదన్న భావన సర్వత్రా వ్యక్తం అవుతున్నది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయం ఎల్లప్పుడూ అత్యంత ఆసక్తికరమైన సంక్లిష్టమైన మలుపులకు వేదికగా నిలుస్తుంది.
ఉప్పల్లో ఈ రోజు తెలంగాణ ఉద్యమకారులు, మహిళల రక్తం చిందిందని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలు, ఉద్యమకారులపై పోలీసులు విచక్షణారహితంగా లాఠీఛార్జ్ చేశారని ఆరోపించారు.