Publish Date:Jun 29, 2022
కాయకష్టం చేసి వొళ్లు తెలీని నిద్రలోకి జారుకోవడం ఒక లెక్క. హఠాత్తుగా వొంట్లో బాగాలేక ఏ చెట్టు కింద నో కాస్తంత విశ్రమించి అలా నిద్రలోకి జారుకోవడం మరో లెక్క. కానీ వైసీపీ మంత్రి బొత్స సత్యనారాయణది మరో లెక్క! ఒక వంక ప్లీనరీ జరుగుతోంది, ఆయన మాత్రం హాయిగా నిద్రలోకి జారారు. అంటే ఆ ప్లీనరీ ఎంత ఆసక్తిగా సాగుతోందో ఇట్టే అర్ధమైపోతుంది. ఎన్నికల సమయంలో నేతల ప్రసంగాలు ఒకింత బోరు కొడతాయి.
విసుగెత్తి ప్రజలు ఇంటికి వెళ్లవచ్చు. ఏదో అర్జంటు ఫోన్ కాల్ అనీ వెళ్లవచ్చు. కానీ బొత్సగారికి బొత్తిగా ఆ అవకాశమే లేదు. ఎందుకంటే ప్లీనరీలో జనం కంటే మంత్రులు, నాయకులే అధిక సంఖ్యలో వున్నారు. పైగా బొత్స మధ్యలో వెళిపోతే, పోనీ ఓ పది నిమిషాలకైనా అలా తిరిగేసి రావడానికి వెళ్లినా మీడియా వారు ఠక్కున పట్టేసుకుంటారు. ప్లీనరీ అత్యం త ముఖ్యమైన అంశాలు చర్చిస్తారు. వారి అత్యంత మాటెలా వున్నా ఇంత బోర్ కొట్టేట్టు వుందనేది బొత్స వైఖరే చెబుతుంది.
కానీ బొత్స కునుకుకి తాత్పర్య మదేనని నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. ఆయన ఆంధ్రా దేవెగౌడ అనుకోవాలా? పాపం ఆ పెద్దాయన కూడా వీలయినంతవరకూ కలల్లో విహరించడానికే ఇష్టపడతారు. అది జాతీయ స్థాయి సదస్సయినా, అంతర్జాతీయ సదస్సయినా, నిద్రా దేవి మహత్తు అలాంటిది మరి. గట్టిగా మాటలు విన్నపుడు, ఎవరో పిలిచినట్టు విన్నపుడు ఠక్కున లేచి సాలోచనగా చుట్టూ చూసి తానేదో అద్బుత ఆలోచనలో వున్నట్టు నటించడంలో ఇలాంటివారు ఘనాపాటి! ప్లీనరీకి భారీ ప్రచారం చేసుకున్నా చాలాతక్కువ మంది హాజరయి నాయకులను నిరావపరిచారు. ఇదేదో పార్టీ ఆఫీసులోనే కానిచ్చేస్తే బాగుండేదిగా అనుకుంటున్నారు. సాలూరు, బొబ్బిలిలో జరిగిన ఫ్లీనరీలకు మంత్రి బొత్స, ఉప ముఖ్యమంత్రి రాజన్నదొర తో పాటు పలువురు నేతలు హాజరయ్యారు. ఫ్లీనరీ ప్రారం భం నుంచి పలు సందర్భాల్లో కునుకు తీస్తున్న మంత్రి బొత్సను చూసిన నేతలు ఆయనకు నిద్రాభంగం కలగనీయలేదు.
ఇక సాలూరు సభలో అయితే వచ్చిన కార్యకర్తలే తక్కువ. సభ ప్రారంభం కాగానే మూడొంతుల జనం ఇంటి ముఖం పట్టారు. ఎక్కువ శాతం ఖాళీ కుర్చీలకు నేతలు ప్రసంగాలు వినిపించాల్సి వచ్చింది. నాలుగు మండలాల నుంచి ఆశించిన స్థాయిలో కార్యకర్తలు రారనుకున్నారో.. రాలేరనుకున్నారో గానీ.. బొబ్బిలో చిన్న పాటి హాలులో ఫ్లీనరీ జరిపించేసి మమ అనిపించారు. అయితే సాలూరు సభలోనూ మంత్రి బొత్స కునుకు తీశారు. ఏది ఏమైనా ఫ్లీనరీ సమావేశంలో కునుకుతీసి బుక్ అయ్యారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/botsa-sleeps-on-pleanery-dias-39-138705.html
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్పై అనుచిత, అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో అరెస్టయిన ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలకు నాంపల్లి న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది
టీడీపీ కేంద్ర కార్యాలయంలో రెండో రోజు నిర్వహిస్తున్న లీడర్షిప్ కాంక్లేవ్లో పొలిటికల్ కమ్యూనికేషన్ అండ్ పబ్లిక్ ఓరియంటేషన్ అంశంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ మాట్లాడారు.
అసలాయన రాజకీయ పార్టీ ఏర్పాటు ఉద్దేశమేంటో? లక్ష్యమేంటో ఆయనకైనా స్పష్టత ఉందా అనిపించేలా ఆయన మీడియా సమావేశం సాగింది.
ఇటు రాష్ట్రంలోనూ, అటు కేంద్రంలోనూ కూడా తెలుగుదేశం పార్టీ ఎన్డీయేలో కీలకమైన భాగస్వామ్య పక్షంగా ఉన్న నేపథ్యంలో తన పోరాటాలకు ఇండియా కూటమి అండ అవసరమని భావిస్తున్నారని చెబుతున్నారు
తన రాజకీయ విజయానికి మహిళలే ప్రధాన కారణమని ఉద్ఘాటించిన విజయ్, మహిళలకు తగిన గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. మన ఇంట్లోనూ తల్లులు, చెల్లెళ్లు ఉంటారు. మహిళలను ఎవరైనా అవమానిస్తే చట్టం చూస్తూ ఊరుకోదని విజయ్ హెచ్చరించారు.
తెలంగాణ వ్యవహారాల ఇన్ చార్జ్ ఆబ్సెన్స్ లో రేవంత్ తన కేబినెట్ పునర్వ్యవస్థాకరణ విషయంలో మరింత స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే అవకాశాలుంటాయని పరిశీలకులు అంటున్నారు. పార్టీలో, ప్రభుత్వంలో అసంతృప్తికి చెక్ పెట్టి, తన నిర్ణయాలను అమలు చేయడానికి రేవంత్ కు ఇది అనువైన సమయంగా రాజకీయవర్గాలు చెబుతున్నాయి.
2014 నుంచి ఆంధ్రప్రదేశ్ లో రెండు ప్రధాన రాజకీయ పార్టీల మధ్యే అధికారం మారుతూ వస్తోంది. వైపీపీ, తెలుగుదేశం మధ్య ద్విముఖ పోరే నెలకొని ఉంది. ఈ పరిస్థితుల్లో విజయసాయిరెడ్డి కొత్త పార్టీ రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలలో మార్పు తీసుకువచ్చే అవకాశాలు లేకపోలేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
కాషాయం పార్టీ రాష్ట్ర నేతలు కొండా బీజేపీ ఎంట్రీపై ఒక్కొక్కరూ ఒక్కోలా మాట్లాడుతున్నారు. వీటికి తోడు సకుటుంబ సపరివార సమేతంగా అయితేనే కాషాయం కండువా కప్పుకుంటానంటూ కొండా సురేఖ కండీషన్లు పెడుతున్నట్లు వస్తున్న వార్తలు ఆమెకు బీజేపీ ఎంట్రీ కూడా మూసుకుపోయిందా అన్న అనుమానాలకు కలిగిస్తున్నాయి.
కొండా సుశ్మీత మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. తన వ్యాఖ్యలకు తానే బాధ్యురాలిననీ, తన తల్లిపై వేటు వేయడం సరికాదనీ ఆవేదన వ్యక్తం చేశారు. తన వ్యాఖ్యలకు తన తల్లిని శిక్షించడం సరికాదన్నారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో వ్యక్తిగత అభిప్రాయాలకు, స్వతంత్రంగా మాట్లాడే మహిళల గొంతుకకు విలువ లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
పార్టీ అధిష్టానం సీఎఉం మాటకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో, ఆయనకు వ్యతిరేకంగా అసమ్మతి గళం ఎత్తే సీనియర్ నేతలకూ అంతే ప్రాధాన్యత ఇస్తుంది. దీంతో కాంగ్రెస్ సీఎం ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుంది. కాంగ్రెస్ అధికారంలో ఉన్న పార్టీ సీఎంలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఇదేనని చెప్పాలి.
ఒక్క ఆంధ్రప్రదేశ్ అనే కాదు.. దేశంలోని అన్ని రాష్ట్రాలలోనూ సొంత కాళ్లపై నిలబడాలన్నదే బీజేపీ విధానమని విష్ణువర్ధన్ రెడ్డి చెప్పారు. గతంలో ఏపీలో బీజేపీ మద్దతు వల్లే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందనీ, ఈ వాస్తవాన్ని సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ బహిరంగ వేదికలపై స్పష్టంగా చెప్పారని విష్ణువర్ధన్ రెడ్డి గుర్తు చేశారు.
రాయలసీమను హార్టికల్చర్ హబ్గా తీర్చిదిద్దేందుకు, రాష్ట్రంలో ఇరిగేషన్ సదుపాయాలను మెరుగుపరిచేందుకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పకడ్బందీ ప్రణాళికలతో ముందుకు వెళ్తోందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు ఒక్కొక్కటిగా పూర్తవుతుండటంతో, ఇరిగేషన్ రంగంపై మాట్లాడటానికి ప్రతిపక్షానికి ఎలాంటి అవకాశాలు లేకుండా పోయాయని ఆయన కుండబద్దలు కొట్టారు.