పుత్రిక రాజకీయ అరంగేటగ్రం.. గ్రౌండ్ ప్రిపరేషన్ లో బొత్స!
Publish Date:Dec 8, 2025
Advertisement
బొత్స సత్యనారాయణ.. అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నాతనదైన రాజకీయం చేయడంలో ఆరితేరిన వారన్న పేరుంది ఆయనకు. విజయనగరం రాజకీయాల్లో బొత్స ఫ్యామిలీ నుంచి ఇప్పటికే చాలామంది ఉన్నారు. కానీ.. ఇప్పుడు బొత్స పక్కా రాజకీయ వారసత్వం మీద దృష్టి పెట్టారు. ప్రస్తుతం ఎమ్మెల్సీగా, వైసీపీ శాసన మండలి పక్షనేతగా వ్యవహరిస్తున్న బొత్స మారుతున్న రాజకీయ, పరిణామాల దృష్ట్యా ప్రత్యామ్నాయాలవైపు దృష్టి సారిస్తున్నారన్న ప్రచారం సాగుతోంది. ఈ క్రమంలోనే తాను పొలిటికల్ గా యాక్టివ్గా ఉన్నప్పుడే వారసుల్ని రంగంలోకి దింపాలని భావిస్తున్నారని అంటున్నారు. తన కుమార్తె తన కుమార్తె బొత్స అనూష పొలిటికల్ ఎంట్రీకి రంగం సిద్ధం చేస్తున్నట్లు చెబుతున్నారు. బొత్స వారసురాలి పొలిటికల్ ఎంట్రీకి కావాల్సిన గ్రౌండ్ వర్క్ పెద్ద ఎత్తున జరుగుతోందని తెలుస్తోంది. ఇటీవల చీపురుపల్లి నియోజకవర్గ పరిధిలో వైసీపీ కార్యక్రమాల్లో అనూష చురుగ్గా పాల్గొంటున్నారు. ఆమె పొలిటికల్గా యాక్టివ్ అవుతున్నారనడానికి ఇదే సంకేతమని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. వివిధ కార్యక్రమాల పేరిట బొత్స అనూష ప్రజల్లోకి వెళ్తున్న తీరు, అందర్నీ కలుపుకుని పోయేందుకు చూపిస్తున్న చొరవ చూస్తుంటే అతి త్వరలోనే ఆమె రాజకీయ ఎంట్రీకి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడుతుందని పొలిటికల్ సర్కిల్స్ లో వినిపిస్తున్నది. చీపురుపల్లి నియోజకవర్గంలో బొత్స సత్యనారాయణకు ప్రత్యామ్నాయంగా అనూష ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం జరుగుతోందని సొంత కేడరే చెబుతోంది. వృత్తి పరంగా డాక్టర్ అయిన అనూష… ఇటీవల సెగ్మెంట్లో విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఆధ్యాత్మిక, సేవా కార్యక్రమాలు, కేడర్ మీటింగ్స్లో ఉత్సాహంగా పాల్గొంటున్నారు. ధీరా ఫౌండేషన్, సత్య ఎడ్యుకేషన్ సొసైటీల్లో డైరెక్టర్ గావున్న అనూష ప్రజల్లోకి వెళ్ళి వారికి కావల్సిన వైద్య సలహాలను అందిస్తున్నారు. అలాగే గుర్ల, మెరకముడిదాం మండలాల్లో అయితే… స్థానిక నాయకులు ఏ కార్యక్రమం నిర్వహించినా అక్కడికి వెళ్లి తనదైన శైలిలో స్పందిస్తున్నారట. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈ రెండిటిలో ఏదో ఒక మండలం నుంచి జెడ్పీటీసీగా ఆమె పోటీ చేస్తారన్న ప్రచారం జరుగుతోంది. దాని ద్వారా ముందు జడ్పీ ఛైర్పర్సన్తో పొలిటికల్ కెరీర్ మొదలు పెట్టాలనుకుంటున్నారన్న చర్చ జరుగుతోంది. తల్లి ఝాన్సీ తరహాలోనే అనూష కూడా రాజకీయ ఆరంగేట్రం చేస్తారని బొత్స అనుచరగణం చెప్పుకుంటోంది. మరో వైపు ఇటీవలి కాలంలో అనూష పర్యటనల మీద ప్రజల స్పందన గురించి కూడా ఆరా తీశారట బొత్స సత్యనారాయణ. పాజిటివ్ రిపోర్ట్ రావడంతో… ఇప్పుడు కోరుకుంటున్నట్టు రేపు పరిస్థితులన్నీ అనుకూలించి తాను రాజ్యసభకు వెళితే… చీపురుపల్లి నియోజకవర్గ బాధ్యతల్ని అనూష చూసుకునేలా స్కెచ్ రెడీ చేస్తున్నారట. అసెంబ్లీ సాధారణ ఎన్నికలకు ఇంకా చాలా టైం ఉన్నందున అప్పటికి ఎలాగోలా కుమార్తె సెట్ అవుతారన్న ఆలోచనలో ఉన్నారట బొత్స. ఓవరాల్గా ఆ కుటుంబం నుంచి మరో రాజకీయ వారసత్వం ఖాయమైపోయిందంటున్నారు ఎమ్మెల్సీ సన్నిహితులు.
http://www.teluguone.com/news/content/botsa-satyanarayana-daughter-political-entry-39-210713.html




