బొత్స బిగ్ గేమ్‌.. జ‌గ‌న్ అనుమాన‌మే నిజ‌మౌతోందా?

Publish Date:Nov 22, 2024

Advertisement

ఏపీ రాజ‌కీయాల్లో ఆస‌క్తిక‌ర ప‌రిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వైసీపీకి  ఎవ‌రు ఎప్పుడు ఎలా గుడ్ బై చెబుతారో తెలియ‌ని ప‌రిస్థితి. రాత్రికి రాత్రే వైసీపీ నేత‌లు కూట‌మి పార్టీల్లోకి జంప్ అవుతున్నారు. అయితే  తాజాగా వైసీపీ ఎమ్మెల్సీ, శాసనమండలిలో ఆ పార్టీ పక్ష నేత బొత్స స‌త్య‌నారాయ‌ణ కూడా పార్టీ వీడేందుకు సిద్ధ‌మ‌వుతున్నార‌ని ఏపీ రాజ‌కీయాల్లో చ‌ర్చ‌ జ‌రుగుతున్నది.  వైసీపీలో బొత్స కీల‌క హోదాలో ఉన్న‌ప్ప‌టికీ రాబోయే కాలంలో పార్టీ మ‌నుగ‌డ క‌ష్టం అన్న భావనలో ఆయన ఉన్నారని వైసీపీ వర్గీయులే చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో  వైసీపీలోనే కొనసాగుతూ ఇబ్బంది ప‌డ‌టంకం,  ఆ పార్టీకి గుడ్ బై చెప్ప‌డ‌మే మంచిద‌న్న ఆలోచ‌న‌కు బొత్స‌, ఆయ‌న వ‌ర్గీయులు వ‌చ్చిన‌ట్లు వైసీపీలోనే టాక్  న‌డుస్తోంది. అయితే  జ‌గ‌న్ రెడ్డికి ఈ విష‌యం ముందే తెలిసిందని కూడా అంటున్నారు. బొత్స స‌త్య‌నారాయ‌ణ జ‌న‌సేన ముఖ్య‌నేత‌ల‌తో ట‌చ్ లో ఉన్నారనీ, ఇటీవ‌లి కాలంలో ప‌లు సార్లు ప‌వ‌న్ క‌ల్యాణ్ తోనూ ఫోన్లో  సంభాషించారనీ వైసీపీ నిఘావ‌ ర్గాలు జ‌గ‌న్ దృష్టికి తీసుకెళ్లిన‌ట్లు స‌మాచారం. ఈ క్ర‌మంలోనే బొత్స పార్టీ వీడ‌కుండా జ‌గ‌న్ అన్ని ప్ర‌య‌త్నాలు చేస్తున్నారని అంటున్నారు. అయినా, తాజాగా.. బొత్స స‌త్య‌నారాయ‌ణ అసెంబ్లీ ప్రాంగ‌ణంలో డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ తో క‌ర‌చాల‌నం చేసి, ఆలింగ‌నం చేసుకోవ‌టంతో బొత్స నేడో రేపో వైసీపీకి గుడ్ బై చెప్పేయడం ఖాయమని వైసీపీ వర్గాలు అంతర్గత సంభాషణల్లో చర్చించుకుంటున్నారు.  

అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఏపీ ప్ర‌జ‌లు వైసీపీకి క‌నీసం ప్ర‌తిప‌క్ష హోదాకూడా ఇవ్వ‌లేదు. జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డితో పాటు కేవ‌లం 11 మంది మాత్ర‌మే ఎమ్మెల్యేలుగా విజ‌యం సాధించారు. దీంతో అసెంబ్లీకి వెళ్లేందుకు జ‌గ‌న్ భ‌య‌ప‌డుతున్నారు. గ‌తంలో వైసీపీ హ‌యాంలో చంద్ర‌బాబును అసెంబ్లీలో వైసీపీ స‌భ్యులు దారుణంగా అవ‌మానించారు. చంద్ర‌బాబును దూషించిన ప్ర‌తీ సందర్భంలోనూ స‌భ‌లో నే ఉన్న అప్పటి ముఖ్యమంత్రి  జ‌గ‌న్ న‌వ్వుతూ క‌నిపించాడు. ఈ క్ర‌మంలో క‌నీసం ప్ర‌తిప‌క్ష హోదా కూడా లేకుండా స‌భ‌కు వెడితే  తెలుగుదేశం స‌భ్యులు త‌న‌ను అవ‌మానించ‌డం ఖాయ‌మ‌ని భావించి జ‌గ‌న్  అసెంబ్లీకి డుమ్మా కొడుతున్నారు. తనకు తోడుగా తన పార్టీకి చెందిన మిగిలిన ప‌ది మంది ఎమ్మెల్యేలనూ కూడా స‌భ‌కు వెళ్ల‌నీయకుండా అసెంబ్లీ స‌మావేశాల‌ను బాయ్ కాట్ చేస్తున్నట్లు   జ‌గ‌న్ ప్ర‌క‌టించాడు. మ‌రోవైపు శాస‌న మండ‌లిలో వైసీపీకి మెజార్టీ ఉంది. దీంతో శాస‌న మండ‌లికి వైసీపీ స‌భ్యులు హాజ‌ర‌వుతున్నారు. మండ‌లి ప్ర‌తిప‌క్ష నేత‌గా వైసీపీ ఎమ్మెల్సీ బొత్స స‌త్య‌నారాయ‌ణ ఉన్నారు. బొత్స మండ‌లిలో హూందాగా వ్య‌వ‌హ‌రిస్తూ మంత్రుల‌కు ప్ర‌శ్న‌లు సంధిస్తున్నారు. ప‌లు సంద‌ర్భాల్లో మంత్రుల‌కు, బొత్స‌కు మ‌ధ్య మాట‌ల యుద్ధంకూడా జ‌రుగుతోంది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా బొత్స స‌త్య‌నారాయ‌ణ‌ హైలెట్ అవుతున్నారు. ఇలాంటి త‌రుణంలో జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి సొంత ప‌త్రిక‌లో మొద‌టి పేజీలో బొత్స స్పీచ్ ను హైలెట్ చేస్తార‌ని వైసీపీ శ్రేణులేకాక‌.. ప్ర‌తీ ఒక్క‌రూ భావించారు. అలా భావించడం సహజం కూడా.  కానీ, జ‌గ‌న్ సొంత ప‌త్రిక‌లో శాస‌న మండ‌లిలో బొత్స ప్రసంగాన్ని, ఆయ‌న మంత్రుల‌ను ప్ర‌శ్నించిన తీరును మొద‌టి పేజీలో హైలెట్ చేయ‌కుండా లోప‌లి పేజీల్లో ప్ర‌చురిస్తుండటం పట్ల  వైసీపీ శ్రేణుల్లో విస్మయం వ్యక్తం అవుతోంది. ఈ విష‌యంలో  బొత్స కూడా తీవ్ర అసంతృప్తితో ఉన్న‌ట్లు వైసీపీ వ‌ర్గాల నుంచి అందిన విశ్వసనీయ సమాచారం. ఈ క్ర‌మంలో బొత్స స‌త్య‌నారాయ‌ణ అసెంబ్లీ ఆవ‌ర‌ణలో ప‌వ‌న్ క‌ల్యాణ్ కు అభిమావాదం చేయ‌డం, వారిద్ద‌రూ ఆత్మీయంగా ఆలింగ‌నం చేసుకోవ‌టం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. 

వైసీపీ ఘోర ఓట‌మి త‌రువాత బొత్స స‌త్య‌నారాయ‌ణ జ‌న‌సేన పార్టీలోకి వెళ్తున్నార‌ని విస్తృత ప్ర‌చారం జ‌రిగింది. ఆ ప్ర‌చారాన్ని బొత్స కూడా ఖండించ‌ లేదు. అప్ప‌టికే ఆయ‌న త‌మ్ముడు ల‌క్ష్మ‌ణ్ జ‌న‌సేన పార్టీలోకి వెళ్లాడు. అయిన‌ప్ప‌టికీ, బొత్స ఫ్యామిలీలో ఎలాంటి రాజ‌కీయ, ఆర్థిక‌ప‌ర‌మైన విబేధాలు రాలేదు. తమ్ముడు జ‌న‌సేన‌లో ఉంటున్నా బొత్స ఫ్యామిలీ క‌లిసే ఉంటున్నది. బొత్స డైరెక్ష‌న్ లోనే ల‌క్ష్మ‌ణ్ జ‌న‌సేన పార్టీలోకి వెళ్లార‌ని అప్ప‌ట్లో రాజ‌కీయ వ‌ర్గాల్లో విస్తృత ప్ర‌చారం జ‌రిగింది. ఆ త‌రువాత కుటుంబ స‌భ్యులు వైసీపీని వీడి జ‌న‌సేన పార్టీలోకి వెళ్లాల‌ని బొత్స‌పై ఒత్తిడి తెచ్చార‌ని.. జ‌న‌సేన నేత‌లు సైతం ఆయ‌న‌కు ఆహ్వానాలు పంపించిన‌ట్లు కూడా టాక్ న‌డిచింది. సీనియ‌ర్ నేత‌, కాపు సామాజిక‌వ‌ర్గం పెద్ద‌గా భావించే బొత్స స‌త్య‌నారాయ‌ణ లాంటి వారు పార్టీని వీడితే ఇబ్బంది ఎదుర‌వుతుంద‌ని భావించిన జ‌గ‌న్ .. బొత్స‌ను విజ‌య‌న‌గ‌రం స్థానిక సంస్థ‌ల ఎమ్మెల్సీగా బ‌రిలో నిలిపాడు. స్థానికంగా వైసీపీకి బ‌లం ఉండ‌టం, తెలుగుదేశం కూటమి ఆ ఎన్నికకు దూరంగా ఉండటంతో  బొత్స ఎమ్మెల్సీగా ఎన్నిక‌య్యారు. అయితే, అంత‌కు ముందే లేళ్ల అప్పిరెడ్డిని మండ‌లిలో ప్ర‌తిప‌క్ష నేత‌గా జ‌గ‌న్ నియ‌మించారు. అధినేత నిర్ణ‌యంపై అప్పుడు బొత్స స‌త్య‌నారాయ‌ణ అసంతృప్తి వ్య‌క్తం చేయ‌డంతో, అప్పిరెడ్డికి స‌ర్దిచెప్పి బొత్స‌ను మండ‌లిలో ప్ర‌తిప‌క్ష నేత‌గా జ‌గ‌న్ చేశార‌ని వైసీపీ వ‌ర్గీయుల్లో అప్ప‌ట్లో చ‌ర్చ జ‌రిగింది. దీనికితోడు బొత్స‌కు జ‌గ‌న్ ప్రాధాన్య‌త‌నిస్తూ పార్టీ రీజిన‌ల్ కో-ఆర్డినేట‌ర్ బాధ్య‌త‌లు కూడా అప్ప‌గించాడు. త‌ద్వారా బొత్స స‌త్య‌నారాయ‌ణ పార్టీ వీడ‌కుండా జ‌గ‌న్ జాగ్ర‌త్త‌ప‌డుతూ వ‌స్తున్నారు. 

బొత్స స‌త్య‌నారాయ‌ణ‌కు పార్టీలో పెద్ద‌పీట వేసిన‌ప్ప‌టికీ ఆయ‌న పార్టీ వీడతారన్న అనుమానం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిలో ఏదో ఒక‌మూల  ఉంద‌ని వైసీపీ వ‌ర్గాల్లో చ‌ర్చ జ‌రుగుతున్నది. పార్టీలో ఎవ‌రికీ ఇవ్వ‌ని ప్రాధాన్య‌త బొత్స‌కు ఇస్తున్న‌ప్ప‌టికీ ఆయ‌న పార్టీ మారే ఆలోచ‌న‌లో ఉన్నారని తనకు అనుమానంగా ఉంద‌ని పార్టీ ముఖ్య‌నేత‌ల వ‌ద్ద జ‌గ‌న్ పేర్కొన్న‌ట్లు తెలిసింది. తాజాగా జ‌గ‌న్ అనుమానం నిజ‌మౌతందని వైసీపీ వర్గాలలో విస్తృతంగా చర్చ జరుగుతోంది. అసెంబ్లీ ప్రాంగ‌ణంలో బొత్స స‌త్య‌నారాయ‌ణ‌, ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఒకరినొక‌రు ఆలింగ‌నం చేసుకున్నారు. ప‌వ‌న్ అసెంబ్లీ హాల్ లోప‌లి నుంచి బ‌యట‌కు వ‌చ్చే స‌మ‌యంలో అసెంబ్లీ ప్రాంగ‌ణంలో వైసీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి, ఎమ్మెల్సీ బొత్స స‌త్య‌నారాయ‌ణ‌, ఇత‌ర వైసీపీ ఎమ్మెల్సీలు మాట్లాడుకుంటున్నారు. ఈ క్ర‌మంలో ప‌వ‌న్ క‌ల్యాణ్ ను చూసి పెద్దిరెడ్డి, ఇత‌ర వైసీపీ నేత‌లు అక్క‌డి నుంచి ప‌క్క‌కు వెళ్లిపోయారు. బొత్స మాత్రం ప‌వ‌న్ క‌ల్యాణ్ కు ఎదురెళ్లి న‌మ‌స్కారం చేసి పలకరించారు. అక్కడితో ఆగకుండా  పవన్ ను అభినందించి, ఆయనను ఆత్మీయంగా హత్తుకున్నారు. ఇదే ఇప్పుడు జగన్ అనుమానం నిజం చేస్తూ బొత్స వైసీపీకి గుడ్ బై చెప్పేసి జనసేన కండువా కప్పుకుంటారన్న వాదనకు తెరలేపింది.

అయితే ఈ విషయంలో ఇప్పటి వరకూ జగన్ స్పందించలేదు.  ఇప్పటికిప్పుడు ఏమీ మాట్లాడకుండా, ఆ తరువాత నెమ్మది నమ్మదిగా బొత్సకు పార్టీలో ప్రాధాన్యత తగ్గిస్తూ ఆయనకు పొమ్మన లేక పొగపెట్టి ఉక్కిరి బిక్కిరి చేస్తారా అంటూ పొలిటికల్ సర్కిల్స్ లో కూడా చర్చ జరుగుతోంది. అయితే బొత్స త్వరలో ఒక రాజకీయ నిర్ణం తీసుకుంటారనీ, ఆ నిర్ణయంతో జగన్ షాక్ అవ్వడం ఖాయమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

By
en-us Political News

  
దానం నాగేందర్ అధికారికంగా బీఆర్‌ఎస్‌ పార్టీకి రాజీనామా చేయకుండానే కాంగ్రెస్‌ గూటికి చేరారని, అంతేకాకుండా కాంగ్రెస్‌ పార్టీ తరఫున సికింద్రాబాద్‌ లోక్‌సభ స్థానానికి అభ్యర్థిగా  పోటీ చేశారని హైకోర్టు దృష్టికి తెచ్చారు. పార్టీ ఫిరాయింపులకు ఇవి  బలమైన సాక్ష్యాధారాలని వారు పేర్కొన్నారు.
మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తూ ప్రవేశపెట్టిన పథకాలు దేశంలో విప్లవాత్మక మార్పులు తెచ్చాయన్న చంద్రబాబు , భారతదేశాన్ని గ్లోబల్ లీడర్‌గా నిలపడంలో ప్రధాని మోదీ దార్శనికత  కీలకమని చంద్రబాబు అన్నారు.
తాజాగా తృణమూల్ లోని మమతా వర్గం, రితబ్రత వర్గాలకు చెందిన కీలక నాయకులు  ఢిల్లీలో  భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) ఫుల్ బెంచ్ ఎదుట హాజరై తమ వాదనలను బలంగా వినిపించారు. ఇరువర్గాలు కూడా ఈసీఐ విచారణ ముగిసిన తర్వాత తమ వాదనలకే అనుకూలంగా తుది తీర్పు వస్తుందని ధీమా వ్యక్తం చేయడం రాజకీయ వర్గాల్లో ఈ వ్యవహారంపై మరింత  ఆసక్తిని రేకెత్తించింది. 
ఒకనాడు ప్రత్యర్థుల విమర్శల దాడులను చిటికెలో   చిత్తు చేసే నేర్పు ఉన్న నేతగా నిలిచిన హరీష్ రావు.. ఇప్పుడు ఆత్మరక్షణలో పడినట్లు కనిపిస్తున్నదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
ఉపాధ్యాయ పోస్టుల భర్తీ ప్రక్రియలో అవకతవకలు జరిగాయంటూ వైసీపీ ఆరోపణలు గుప్పిస్తోంది. అధికారంలో ఉన్న తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న పద్ధతులను ప్రశ్నిస్తూ, సోషల్ మీడియా,  మీడియా సమావేశాల ద్వారా విమర్శలు గుప్పిస్తోంది. డీఎస్సీ నియామకాల్లో పారదర్శకత లోపించిందని, అభ్యర్థుల మార్కులు  పరిశీలనా ప్రక్రియలో గందరగోళం నెలకొందని ఆరోపిస్తున్నది.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల అసెంబ్లీ వేదికగా మాజీ సీఎం కేసీఆర్ కుటుంబ సభ్యుల భూ ఆక్రమణలంటూ చేసిన సంచలన వ్యాఖ్యలు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్‌పై గులాబీ పార్టీ  మండిపడింది. ప్రభుత్వ వైఫ్యాలను కప్పిపుచ్చుకునేందుకే కాంగ్రెస్ పెద్దలు ఇలాంటి నిరాధార ఆరోపణలు చేస్తున్నారని  ఎదురుదాడికి దిగింది.
మైగ్రేన్ తలనొప్పితో ఆసుపత్రికి వెళ్లిన బెక్కీ జోన్స్‌కు బ్రెయిన్ క్యాన్సర్ ఉందంటూ 11 ఏళ్ల పాటు కీమోథెరపీ ఇచ్చారు. కానీ చివరికి అసలు క్యాన్సరే లేదని తెలిసిన షాకింగ్ వివరాలు ఈ వెబ్ స్టోరీలో చదవండి.
పట్టభద్రుల ఎన్నికలకు ఓటర్ల జాబితా ప్రక్రియ షెడ్యూల్ విడుదల.. !
చాలా మంది 1973 నాటి భూమి పరిమితి చట్టం రద్దయిందని అనుకుంటున్నారు. కానీ అది అమలులోనే వుంది. ఉమ్మడి కుటుంబానికి మెట్ట భూమి 52 ఎకరాలు, కొన్ని ప్రత్యేక సందర్భాల్లో 54 ఎకరాలు ఉండవచ్చు. తరి భూమి (ఏడాదికి రెండు పంటలు పండేది) 27 ఎకరాలు వుండవచ్చు. అంతకంటే ఎక్కువగా ఉంటే దాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాల్సి వుంటుంది.
వారణాసి వేదికగా నెల రోజుల పాటు జరగనున్న  సేవా సంకల్ప అభియాన్ లో  తొలి రోజు గురువారం ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు పాల్గొన్నారు. అలాగే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సహా  పాటు పలువురు అగ్రనేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.  
మోడీకి  జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన వారిలో లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, తెలుగుదేశం అధినేత, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు, మంత్రి నారా లోకేష్ తదితరులు  ఉన్నారు.  ప్రధాని నరేంద్ర మోదీజీకి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆయన మంచి ఆరోగ్యంతో, దీర్ఘాయుష్షుతో ఉండాలని కోరుకుంటున్నానంటూ రాహుల్ గాంధీ తన సందేశంలో పేర్కొన్నారు.
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకు వన్‌సైడ్ విక్టరీ వచ్చేలా పార్టీ శ్రేణులు పనిచేయాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ పిలుపునిచ్చారు.
వైసీపీ నుంచి బయటకు వచ్చి, ఆ పార్టీ ద్వారా వచ్చిన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి రాజకీయ సన్యాసం ప్రకటించిన విజయసాయి, ఇటీవల సొంత పార్టీ అంటూ మళ్లీ క్రియాశీల రాజకీయాలలోకి ప్రవేశించారు. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.