షార్ కు బాంబు బెదరింపు కలకలం

Publish Date:Jun 16, 2025

Advertisement

శ్రీహరికోటలోని భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రం సతీశ్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌ (షార్‌)బాంబు బెదరింపు  కలకలం రేపింది. ఆదివారం (జూన్ 15) రాత్రి  తమిళనాడు కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌కు గుర్తుతె లియని వ్యక్తుల నుంచి  శ్రీహరికోటలోని షార్ ప్రాంగణంలో  ఉగ్రవాదులు బాంబు పాల్పడే అవకాశం ఉందని హెచ్చరించారు.  దీంతో వెంటనే షార్‌లోని భద్రతా అధికారులు, స్థానిక పోలీసు యంత్రాంగం అప్రమత్తమయ్యాయి.

షార్‌ పరిసర ప్రాంతాల్లో భద్రతా బలగాలు ముమ్మరంగా తనిఖీలు ప్రారంభించాయి.  షార్‌లోకి దారితీసే అన్ని మార్గాల్లోనూ, అనుమానిత ప్రదేశాల్లోనూ పెద్ద ఎత్తున గాలింపు చర్యలు చేపట్టారు.  తీరప్రాంత రక్షణ దళాలు కూడా అప్రమత్తమై సముద్ర తీరంలో గస్తీ నిర్వహించాయి. షార్‌లోని అణువణువూ క్షుణ్ణంగా పరిశీలించారు. షార్ లోని ప్రతి మూలా గాలించిన అనంతరం బాంబు కాల్ ఆకతాయిల పనిగా భద్రతా దళాలు నిర్ధారించారు. షార్ ప్రాంగణం మొత్తంలో పేలుడు పదార్ధాలు లేవని నిర్ధారించారు.  దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు  బెదిరింపు కాల్స్ చేసిన వారిని గుర్తించే దిశగా దర్యాప్తు ప్రారంభించారు. 

By
en-us Political News

  
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా అడిగే దమ్మూ, సత్తా జగన్ కు లేదన్నారు. ఇక కేంద్రంలో బీజేపీతో పొత్తుపెట్టుకున్నముఖ్యమంత్రి చంద్రబాబు హోదా మాటే ఎత్తడం లేదని విమర్శించారు.
తెలంగాణలో బలపడాలని చూస్తున్న జనసేనకు ఈ విజయం స్ఫూర్తిగా నిలుస్తుందని అంటున్నారు. తెలంగాణ మునిసిపోల్స్ లో జనసేన 200కు పైగా స్థానాల్లో పోటీ చేసింది.
భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందం, కార్మిక చట్టాలకు వ్యతిరేకంగా విపక్షాల నిరసన తెలిపారు. విపక్ష సభ్యుల నినాదాలతో సభ దద్దరిల్లింది. జెఫ్రీ ఎప్టోన్తో కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి సంబంధాలపై వివరణ కోరుతూ ప్రతిపక్షాలు సభను స్తంభింప చేశారు.
ఈ పురపోరులో బీఆర్ఎస్ పార్టీ ఘోరంగా దెబ్బతింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాలలో కూడా మునిసిపాలిటీలను దక్కించుకోలేక చతికిల పడింది.
వైసీపీ ఐదేళ్ల హయాంలో కనీసం పుస్తకాలు, బ్యాగ్స్ ఇవ్వలేదు. మధ్యాహ్న భోజనం రద్దు చేసి వెళ్లిపోయారు. అటువంటి వైసీపీకి ఇప్పుడు మమ్మల్ని ప్రశ్నించే నైతిక హక్కు లేదంటూ లోకేష్ ఫైర్ అయ్యారు.
ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలపై శాసనమండలిలో ప్రశ్నోత్తరాల సమయంలో అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం జరిగింది. ముందుగా మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి మాట్లాడుతూ.. మండలిలో విపక్ష నేత బొత్స సత్యనారాయణ మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు అన్న కాంటీన్లు మూసివేయబోమని సభలో చెప్పి మాటతప్పారని, ఇప్పుడు వైసీపీ పాలనలో ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలు లేవంటూ నీతులు చెబుతున్నారని ఆక్షేపించారు.
జోగులాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లి మునిసిపాలిటీలో ఫార్వార్డ్ బ్లాక్ జయకేతనం ఎగురవేయడమంటే.. తెలంగాణ జాగృతి గెలిచినట్లే.
మచిలీపట్నం ఇనగుదురుపేట పోలీసులు నమోదు చేసిన కేసును క్వాష్ చేయాలంటూ పేర్ని నాని ఏపీ హైకోర్టును ఆశ్రయించారు.
మధిర పదో వార్డులో తెలుగుదేశం తరఫున పోటీ చేసిన బోడేపూడి రేవతి విజయం సాధించారు. ఆమెకు వార్డులో మొత్తం పోలైన 530 ఓట్లలో 334 ఓట్లు వచ్చాయి.
ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ను హిందూపురం ఎమ్మెల్యే హోదాలో నందమూరి బాలకృష్ణ కలిశారు.
మధ్యాహ్నానికి కార్పొరేషన్, సాయంత్రానికి మునిసిపాలిటీల ఎన్నికల ఫలితాలు పూర్తిగా వెలువడే అవకాశలు ఉన్నాయి.
తెలుగువన్ ఎండీ కంఠంనేని రవిశంకర్ సారథ్యంలో “వాస్తవ వేదిక” 12వ సంచిక గురువారం (ఫిబ్రవరి 12) విడుదలైంది.
పంచాయతీ ఎన్నికలలో స్పష్టమైన ఆధిక్యత సాధించిన అధికార కాంగ్రెస్ పార్టీ ఆ ఉత్సాహంతో మునిసిపోల్స్ కు వెళ్లింది. బుధవారం రాష్ట్రంలో 16 మునిసిపాలిటీలు, ఏడు కార్పొరేషన్లకు ఎన్నికలు జరిగాయి. ఎగ్జిట్స్ పోల్సన్నీ కాంగ్రెస్ కు అనుకూలంగా వచ్చాయి. ఈ నేపథ్యంలో ఇంకెంత మాత్రం జాగు లేకుండా పరిషత్ ఎన్నికలకు రెడీ అయిపోతున్నది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.