Publish Date:Apr 20, 2024
మొన్నటి వరకు యువతరాన్ని పబ్జీ పిచ్చి పట్టి పిడించింది. అంతకు ముందు వున్నంత ఉద్ధృతి లేకపోయినప్పటికీ యువతరంలో ఇప్పటికీ చాలామంది ఆ పిచ్చిలో వున్నారు. ఇప్పుడు అలాంటి ప్రాణాంతకమైన మాయదారి ఆట అమెరికాలో స్టూడెంట్స్ చనిపోవడానికి కారణం అవుతోంది. ఆ ఆట పేరు బ్లూ వేల్ ఛాలెంజ్ (Blue Whale Challange). ఈ గేమ్ పిచ్చిలో పడిన చాలామంది యువతీ యువకులు గతంలో చనిపోయారు. ఈ మధ్యకాలంలో ఈ గేమ్ వల్ల మరణాలు పెరుగుతున్నాయి. ముఖ్యంగా అమెరికాలోని భారత సంతతికి చెందిన యువకులు వరుసగా ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా ముసాచుసెట్స్ యూనివర్సటీకి చెందిన ఒక విద్యార్థి మరణించారు. ఈ మరణానికి కారణం బ్లూ వేల్ ఛాలెంజ్ ఆట అని పోలీసులు భావిస్తున్నారు. రెండు నిమిషాలపాటు ఊపిరి బిగపట్టడం వల్ల ఆ విద్యార్థి మరణించాడని పోలీసులు చెబుతున్నారు. బ్లూ వేల్ ఛాలెంజ్ గేమ్లో ఊపిరి బిగపట్టే టాస్క్ వుంటుందని పోలీసులు తెలిసారు.
మొదట రష్యాలో ప్రారంభమైన ఈ ఆన్లైన్ గేమ్ క్రమంగా ఆ ఆట ఆడేవాళ్ళను ఆత్మహత్య చేసుకునేలా ప్రేరేపిస్తుంది. ఈ గేమ్ వల్ల జరుగుతున్న అనర్థాలను గ్రహించిన అనేక దేశాలు ఈ ఆటకు సంబంధించిన నెట్వర్క్.లు తమ దేశంలో కనిపించకుండా జాగ్రత్తపడ్డాయి. ఈ గేమ్లో వుండే క్యూరేటర్ ఆడేవారికి రకరకాల ప్రమాదకరమైన టాస్క్.లు ఇస్తుంటాడు. అర్ధరాత్రి నిద్ర లేవడం, భయంకరమైన దృశ్యాలను చూడటం, ఎత్తయిన టవర్ల అంచున నిలబడటం, గాయాలు చేసుకోవడం, ఊపిరి బిగబట్టడం లాంటి టాస్క్.లు ఇస్తాడు. ఈ టాస్క్.లు చేసేటప్పుడు ఆడే వ్యక్తి ఆత్మహత్య చేసుకోవడం లేదా ప్రమాదానికి గురై చనిపోవడం జరుగుతోంది.
ఒక్కసారి ఈ గేమ్లోకి ఎంటరైతే బయటపడటం చాలా కష్టం. మానసికంగా తప్పుదోవ పట్టించి, ఒక్కోసారి బెదిరించి టాస్క్.లను పూర్తి చేసేలా ప్రేరేపిస్తారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/blue-whale-challange-39-174227.html
యథారాజా తథా ప్రజా అన్నది నానుడి. కానీ వైసీపీ విషయంలో మాత్రం యథా అధినేత, తథా ఆ పార్టీ నాయకులు అని మార్చుకోవాల్సి ఉంటుంది. ఎన్నికల వేళ వైసీపీ అరాచకాలు రోజు రోజుకూ పెచ్చరిల్లుతున్నాయి.
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో 2016లో ఆత్మహత్య చేసుకున్నవిద్యార్థి రోహిత్ వేముల దళితుడు కాదని,
మరో పది రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల నేపథ్యంలో సంపన్న అభ్యర్థి ఎవరు అన్నది చర్చనీయాంశమైంది.
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు
రాజకీయాల్లో విమర్శలు, ప్రతివిమర్శలు.. అవమానాలు, అభినందనలు సర్వసాధారణమే. నాకు వాళ్లు గౌరవం ఇవ్వలేదు.. నన్ను వాళ్లు విమర్శించారంటూ.. వ్యక్తిగతంగా కక్ష పెంచుకుంటే సదరు నేతకు రాజకీయ భవిష్యత్తుతో పాటు.. మానసిక ప్రశాంతత కూడా దూరమవుతుంది. అదే పరిస్థితి ప్రస్తుతం మాజీ మంత్రి, కాపు ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభంకు ఎదురవుతోంది.
మీరేదో పనిలో వుంటారు.. లేదా ట్రావెల్ చేస్తూ వుంటారు... లేదా కుటుంబ సభ్యులతో సరదాగా గడుపుతూ వుంటారు.
కోవిషీల్డ్ తో గుండె జబ్బులు, మెదడు సంబంధిత వ్యాధులు వస్తాయని ఆస్ట్రాజెనికా అంగీకరించిన రెండు రోజుల వ్యవధిలోనే కోవిన్ సర్టిఫికేట్లపై ప్రధాని నరేంద్ర మోడీ ఫోటో అదృశ్యమైంది. వ్యాక్సిన్ పై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోన్న ఈ సమయంలో ఆ సర్టిఫికెట్లపై ప్రధాని ఫోటో మాయమవ్వడం అనేక అనుమానాలకు కారణం అవుతోంది.
police filed murder attempt case on perni kittu, perin kittu, murder attempt case, ap politics
తెలంగాణలో లోక్ సభ ఎన్నికలలో అందరి దృష్టీ విశేషంగా ఆకర్షిస్తున్న స్థానం ఏదైనా ఉందీ అంటే అది ఖమ్మం లోక్ సభ నియోజకవర్గం మాత్రమే. అధికార కాంగ్రెస్ పార్టీకి ఈ నియోజకవర్గంలో విజయం నల్లేరు మీద బండి నడకే అని మొదటి నుంచీ అంతా భావిస్తూ ఉన్నారు. అయితే అభ్యర్థి ఎంపికలో జరిగిన జాప్యం కారణంగా చేజేతులా కాంగ్రెస్ ఖమ్మంలో అవకాశాలను చే జార్చుకుంటోందా అన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి.
పార్లమెంట్ ఎన్నికలలో తెలంగాణలో బీఆర్ఎస్ సాధించే స్కోరు జీరో అనే విషయంలో అందరికీ క్లారిటీ వుంది. బీఆర్ఎస్ నాయకులకు
బిఆర్ఎస్ ఎంఎల్సి దండె విఠల్ ఎన్నిక చెల్లదని హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ఆదిలాబాద్ స్థానిక సంస్థల నియోజవర్గం నుంచి బిఆర్ఎస్ అభ్యర్థిగా 2022లో దండె విఠల్ ఎన్నికయ్యారు.
ఏపీలో బీజేపీ రెండు పడవల మీద ప్రయాణం సాగిస్తోందా? పేరుకు పొత్తు తెలుగుదేశం, జనసేనతో.. మద్దతు మాత్రం అధికార వైసీపీకే అన్నట్లుగా ఆ పార్టీ తీరు ఉందా? అంటే పరిశీలకులు ఔననే అంటున్నారు. సార్వత్రిక ఎన్నికలలో భాగంగా దేశంలో ఇప్పటికే రెండు దశల పోలింగ్ పూర్తయ్యింది. రెండు దశల పోలింగ్ సరళిని పరిశీలించిన రాజకీయ నిపుణులు ఉత్తరాదిలో, ఈశాన్య రాష్ట్రాలలో బీజేపీ భారీగా నష్టపోవడం ఖాయమని గంటాపథంగా చెబుతున్నారు.