జెండా జనసేన.. అజెండా వైసీపీ.. బాలినేని రంగు బయటపడిందా?

Publish Date:Aug 12, 2026

Advertisement

కూటమి పార్టీల మధ్య.. మరీ ముఖ్యంగా తెలుగుదేశం, జనసేన మధ్య ఐక్యతకు విఘాతం కలిగేలా ఒంగోలు కేంద్రంగా చోటు చేసుకున్న పరిణామం రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది. కూటమిలో భాగస్వామ్య పక్షాలైన తెలుగుదేశం, జనసేన ఒంగోలు నేతల మధ్య నెలకొన్న విభేదాలు రోడ్డున పడి మీడియా సమావేశంలో పరస్పరం విమర్శలు, ఇరోపణలూ చేసుకునే వరకూ వెళ్లింది. ఈ విషయంలో  ఇరు పార్టీల అగ్రనాయకత్వం జోక్యం చేసుకుని ఇరువురు నేతలకూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇవ్వడంతో పరిస్థితి కొంత వరకూ సద్దుమణిగినట్లు కనిపిస్తున్నా.. అసలు పరిస్థితి ఇంత వరకూ రావడానికి కారణం ఎవరన్న దానిపై పొలిటికల్ సర్కిల్స్ లో చర్చకు మాత్రం ఫుల్ స్టాప్ పడలేదు.  

ముఖ్యంగా మాజీ మంత్రి జనసేన నాయకుడు బాలినేని తీరు పట్ల ఇటు తెలుగుదేశంలోనూ, అటు జనసేనలోనూ ఆగ్రహం వ్యక్తం అవుతోంది. 2024 ఎన్నికల తరువాత బాలినేని శ్రనివాసరెడ్డి.. వైసీపీకి గుడ్ బై చెప్పి జనసేన గూటికి చేరారు. ఆ ఎన్నికలలో ఒంగోలు ఎమ్మెల్యేగా దామచర్ల జనార్దన్ రావు ఎన్నికయ్యారు. బాలినేని శ్రీనివాసరెడ్డి జగన్ కు బంధువు కావడం, 2024 ఎన్నికలలో తనకు ప్రత్యర్థి కావడంతో అప్పట్లోనే దామచర్ల జనసేనలోకి బాలినేని ఎంట్రీని వ్యతిరేకించారు. అయితే పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు, జనసేనాని, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ లు నచ్చచెప్పడంతో.. అంగీకరించి సర్దుకు పోయారు. 

అయితే తాజాగా బాలినేని జనార్దర్ రెడ్డి    ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్ రావు అండదండలతోనే భూ, ఇసుక, రేషన్ మాఫియాలు విచ్చలవిడిగా నడుస్తున్నాయంటూ ఆరోపణలు గుప్పించారు.   జనసేన   మద్దతు, ఓట్లతోనే దామచర్ల గెలిచారంటూ వ్యాఖ్యలు చేశారు. అక్కడితో ఆగకుండా.. దమ్ముంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి స్వతంత్రంగా పోటీ చేయాలని సవాల్ విసిరారు.  

ఈ ఆరోపణలపై ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్ రావు కూడా ఘాటుగా రియాక్టయ్యారు. బాలినేని శ్రీనివాసరెడ్డి  ఫస్ట్రేషన్‌తో నిరాధార ఆరోపణలు చేస్తున్నారని దుయ్యబట్టారు.   గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో బాలినేని, ఆయన కుమారుడు కలిసి సిండికేట్ మద్యం వ్యాపారాలు నడుపుతూ కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. గత ప్రభుత్వంలో తనపై, తన అనుచరులపై ఏకంగా 79 కేసులు పెట్టి తీవ్రంగా వేధించారని గుర్తుచేశారు. తనను రాజకీయంగా ఎదిరించే ధైర్యం లేక,  బాలినేని ఇటువంటి డ్రామాలు ఆడుతున్నారని దుయ్యబట్టారు. 2024 సార్వత్రిక అసెంబ్లీ ఎన్నికల్లో ఒంగోలు ప్రజలు దామచర్ల జనార్ధన్ రావును  34వేల026 ఓట్ల భారీ మెజార్టీతో గెలిపించిన సంగతిని గుర్తు చేశారు.  మైనింగ్ సహా అన్ని అంశాలపై తాను బహిరంగ చర్చకు సిద్ధమని సవాల్ చేశారు. అవన్నీ పక్కన పెడితే.. ఇప్పుడు కూటమి నాయకులలో బాలినేని శ్రీనివాసరెడ్డి తీరు పట్ల హాట్ హాట్ చర్చ జరుగుతోంది. బాలినేని విమర్శలు, సవాళ్లు చూస్తుంటే.. పేరుకు ఆయన జనసేన జండా పట్టుకున్న అజెండా మాత్రం వైసీపీయే అన్నట్లుగా ఉందంటున్నారు. కూటమి పార్టీల మధ్య వివాదాలు సృష్టించడం ద్వారా వైసీపీకి రాజకీయంగా లబ్ధి చేకూర్చే వ్యూహంతో బాలినేని వ్యవహరిస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి.   

Balineni versus Damacharla, Prakasham, Politics, Janasena Janda, YCP, Ajenda, TeluguOne 

By
en-us Political News

  
నా కూతురికి పెళ్లైంది.. తనకు తాను స్వతంత్రంగా మాట్లాడింది..!
ఉన్నది మాట్లాడితే చర్యలా.. సురేఖ సంచలన వ్యాఖ్యలు..!
 బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్‌లో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో సీనియర్ నాయకులు, మాజీ మంత్రులు హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస యాదవ్ కలసి కాంగ్రెస్ 1000 రోజుల విఫల పాలనపై  చార్జ్‌షీట్‌  విడుదల చేశారు.
మ్మెల్యేగా కేసీఆర్ వ్యవహరిస్తున్న తీరు, అసెంబ్లీకి ఆయన గైర్హాజరుపై రేవంత్ ఓ రేంజ్ లో విమర్శలు గుప్పించారు. అసెంబ్లీకి హాజరుకాకుంటే కేసీఆర్  ఎమ్మెల్యే పదవికి కేసీఆర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఒక ప్రజా ఉద్యమాన్ని చేపట్టాలని రేవంత్ రెడ్డి ప్రజలకు పిలుపు నిచ్చారు.  తనను ఎన్నుకున్న నియోజకవర్గ సమస్యలను కేసీఆర్ పట్టించుకోవడం లేదని దుయ్యబట్టారు.
ఆయన పులివెందులపైనే ఎక్కువగా కాన్సట్రేట్ చేయడంతో ఆయనకు పులివెందులలో పట్టు జారుతోందన్న భయం పట్టుకున్నట్లు కనిపిస్తోందని అంటున్నారు. అలాంటి భయమే లేకపోతే..  మాజీ సీఎంగా రాష్ట్రం మొత్తం తిరగాల్సిన ఆయన అది మానేసి  సొంత నియోజకవర్గానికే  ఎక్కువగా పరిమితం అవ్వరని అంటున్నారు.  
ప్రకాశం జిల్లాలో మరీ ముఖ్యంగా ఒంగోలులో  గట్టి పట్టు, రాజకీయ పలుకుబడి ఉన్న సీనియర్ నేత అయిన  బాలినేనికి, జనసేనలో ఏ మాత్రం ప్రాధాన్యత లభించడంలేదన్న ప్రచారం జోరుగా సాగుతోంది.  పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తీసుకుంటున్న  నిర్ణయాలు, స్థానిక పరిస్థితులు కూడా ఆ ప్రచారానికి బలం చేకూర్చేవిగానే ఉంటున్నాయి. 
భారత రాజకీయాల్లో ఇప్పుడు పార్లమెంట్ సీట్ల పునర్విభజన (డీలిమిటేషన్), మహిళా రిజర్వేషన్ బిల్లుల చుట్టూ తీవ్రమైన ఉత్కంఠ నెలకొంది.
తెలంగాణ రాజకీయాల్లో మరోసారి కాంగ్రెస్ అంతర్గత వ్యవహారాలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.
వైసిపి సీనియర్ నాయకుడు సజ్జల రామకృష్ణారెడ్డి.. రాజ్యసభ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి చొక్కా పట్టుకుని దాడి చేసి కొట్టారని.. ఇదే విషయాన్ని ఇటీవల విజయసాయి ఓ బహిరంగ లేఖ ద్వారా వెల్లడించిన విషయాన్ని కన్ ఫర్మ్ చేశారు.
ఇండియా కూటమి తరఫున రాహుల్ గాంధీనే ప్రధానమంత్రి అభ్యర్థి అని కుండబద్దలు కొట్టారు. ఆ విషయాన్నే తమిళనాడు కాంగ్రెస్ శాసనసభాపక్ష  నాయకురాలు తారాహై కత్‌బర్ట్  మరింత క్లారిటీ ఇస్తూ.. విజయ్ ప్రధాని అవుతారంటూ కొందరు ప్రచారం చేయడం కేవలం టీవీకే శ్రేణుల ఉత్సాహం వల్ల జరుగుతున్న ప్రచారమే తప్ప, అది ఆ పార్టీ అధికారిక వైఖరి కాదన్నారు.
రాజకీయ క్షేత్రంలో ముందస్తు ఊహాగానాలు, భవిష్యత్ ఎన్నికల అంచనాలు ఎప్పుడూ ఆసక్తికరంగానే సాగుతుంటాయి. ఈ నేపథ్యంలో సపోజ్ ఫర్ సపోజ్  ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే పరిస్థితి ఎలా ఉంటుందన్న చర్చ జోరందుకుంది. రానున్న  రాజకీయ సమీకరణాలపై   చర్చోపచర్చలు మొదలయ్యాయి.
కొండా సురేఖపై వేటు తప్పదనీ, ఆమెకు క్యాబినెట్ నుంచి ఉద్వాసన తప్పదన్న ప్రచారం జోరుగా సాధింది. ఒక దశలో రేవంత్ కేబినెట్ లోకి సురేఖ స్థానంలో మరో ఫైర్ బ్రాండ్ నాయకురాలు విజయశాంతిని తీసుకోనున్నట్లు కూడా వార్తలు వినిపించాయి. 
 ప్రభుత్వ మద్దతుతో జరిగే ఏకగ్రీవ ఎన్నికలు ఉంటాయన్న ఆయన రాజకీయ పార్టీ కోణంలో ఏకగ్రీవాలు ఉండకూడదని జగన్ అన్నారంటూ బొత్స  వివరణపై వైసీపీ నేతలు పెదవి విరుస్తున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.