వెలిసిపోయిన కమలం!

Publish Date:Oct 27, 2022

Advertisement

పిల్లలు బాగా చదువుతామని తండ్రికి హామీ యిస్తారు, తప్పకుండా గెలపించాలని అభ్యర్ధులు తమ తమప్రాంతంలోని ఓటర్ల నుంచి హామీ తీసుకుంటారు, కానీ కేసులు లేకుండా చేస్తామని హామీ యివ్వడం మాత్రం బీజేపీవారివల్లే అయింది. ఇది కనీ వినీ ఎరుగని హామీ. టీఆర్ ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు విషయంలో ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి  ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు ఎఫ్ ఐ ఆర్ నమోదు చేశారు. ఎఫ్ ఐ ఆర్ లో అంశాలను చూస్తే ఆశ్చర్యం కలగకమానదు.  తమ పార్టీలో చేరండి అన్ని తామే చూసుకుంటామన్న ధీమా వ్యక్తం చేయడం. అందులోనూ వారికి ఎలాంటి క్రిమినల్ నేపథ్యం ఉన్నా తామే చూసుకుంటామనడం. ఇంతకంటే దారుణమైన హామీ ఎవరూ ఇవ్వరు.  అంటే తమ పార్టీ బలపడేందుకు, తమ విజయానికి ఎలాంటి వారినయినా గట్టి పట్టున్నవారని తెలిస్తే లాగేసుకోవడానికి ఇంతటి హామీలను ఇచ్చి అక్కున చేర్చుకోవాలనుకోవడం బీజేపీవారి గొప్ప ఆలోచన. 

ఈమధ్యవరకూ మా పార్టీలో చేరండి మీకు ఏదో ఒక మేలు చేస్తామన్న ధీమా ఇచ్చేవారు. అంటే సామాన్యంగా అనుకు నేది.. ప్రభుత్వ కార్యాలయాల్లో తమవారికి ఉద్యోగాలో, ఏదో  ఒక పథకంలో భాగ స్వామి చేయడమో లేదా ఫ్రాజెక్టు కాంట్రాక్టులు లాంటివే.. కానీ రోజులు మారిపోయాయి. అంతే కోట్ల వ్యవ హారమే. అంతా డబ్బు మయం. కోట్లలో వస్తువుల్ని, భవనాల్ని కొన్నట్టు ఎమ్మెల్యేలను కొనేయడం అనేది కేవలం కమలనాథుల బుర్రలోంచి వచ్చిన గొప్ప ఆలోచన. చిత్రమేమంటే ఇది భయానకమనో, ప్రజలు తమ రహస్యం తెలుసుకుంటే, బండారం బయటపడితే పోయేది తమ పరువేనన్న ఆలోచన, భయం లేకుండా ధైర్యంగా రహస్యంగా వ్యవహారం నడిపేయాలనే చూశారు. కానీ కథ అడ్డం తిరిగింది. ఇపుడు ఎఫ్ ఐ ఆర్ లో పేర్కొన్న అంశాల్నీ భీజేపీ వారి నీతి నిజాయితీని నాలుగు రోడ్ల జంక్షన్లో పెట్టేసిం ది.  నిన్న మొన్నటి వరకూ టీఆర్ ఎస్ పరువు తీయడానికి ఒంటకాలి మీద లేచిన కమలనాథు లంతా సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. 

తన వ్యూహం తననే ముంచిందనేది బీజేపీవారే రుజువు చేయడం పెద్ద  సినిమా కంటే అతి పెద్ద చిత్రమే చూపింది.  ఎరవేయడం నలుగురిని లాక్కనేందుకు వ్యూహ రచన చేసామని జబ్బలు చరుచు కోవడం, మునుగోడు ఉప ఎన్నిక ముందే టీ ఆర్ ఎస్ కొంపముంచేసేమని ఏసీ గదుల్లో కూచుని హాస్య మాడుకోవడం, గట్టిగా నవ్వుకోవడం అంతా ఆ గదులకే పరిమితమై అసలు రంగు బయటపడింది. కాషాయం బాగా వెలిసిపోయి హేమా హేమీ నాయకుల బుర్ర తక్కువ తనం ఆసేతు హిమాచలమూ తెలిసిపోయింది.  ఇక తమ పరువును తామే కాపాడుకోవాల్సిన పెద్ద పనిలో పడాల్సిన అగత్యం ఏర్పడిం ది. అధికారంలోకి రావడానికి వేసే వలలు టీ ఆర్ ఎస్ వ్యూహంతో ముక్కలయ్యాయి. చేపలు అను కున్నవారు చేపలు కాదని తమకు భవిష్యత్ అగమ్యగోచరం చేయగల టీ ఆర్ ఎస్ వీరాభిమాను లేనని తేటతెల్లమయింది.  ఇపుడు తెలంగాణా అంతా తమదే నని రొమ్ము విరుచుకు ప్రచారం చేసుకుంటున్న కిషన్ రెడ్డి, బండి సంజయ్ వంటివారు కేంద్రంలోని వారి మహా నేతలకు మొహం ఎలా చూపగలరో మరి. వ్యూహానికి, అమలుకి మధ్య చాలా తేడా ఉంటుంది. అందునా టీ ఆర్ ఎస్ వీరాభిమానులను అంత సులువుగా చేపల్లా లాగేసుకునే ఆలోచన బీజేపీ వారికి పెద్ద బూమరాంగ్ అయింది.  ఇక తెలంగాణ  బీజేపీ మహానేతలు దేశ  తెలంగాణా ప్రజలకు, తమని నమ్ముకుని జండా పట్టుకు తిరుగుతున్నవారికీ సమాధానం చెప్పుకోవాలి. 

By
en-us Political News

  
రాఘవ్ చద్దా, ఆమ్ ఆద్మీ పార్టీ మధ్య తలెత్తిన అంతర్గత విభేదాలు ఇప్పుడు బహిరంగ యుద్ధంగా మారాయి.
న్ని ఎన్నికలలో విచిత్రాలు జరగవు. ప్రతిసారీ ఒకటే జరిగితే, దాన్ని విచిత్రం అనరు కదా? ఎన్నికలు జరిగి నిండా రెండేళ్లు కాకముందే నెల్లూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీకి ఓటి పలుకు వినపడుతున్నది. కొందరు ప్రముఖులు పక్కదారులు చూస్తున్నారని, పక్క పార్టీతో బేరసారాలు జరుపుతున్నారని కూడా వినపడుతున్నది.
అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో.. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి తన పంథాను మార్చుకోలేదనేది స్పష్టమవుతోంది. ఐదేళ్ల పాలనలో మూడు రాజధానుల మంత్రం జపించిన జగన్.. ఇప్పుడు మచిలీపట్నం-విజయవాడ-గుంటూరును కలిపి ఒక మెగా సిటీగా మార్చాలనే సరికొత్త ప్రతిపాదనను ముందుకు తెచ్చారు.
మూడు రాజధానుల అంశం గత ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయానికి ప్రధాన కారణాలలో ఒకటి అన్న విషయాన్ని విస్మరించి.. మళ్ళీ అదే తరహా ప్రత్యామ్నాయ వాదనలు వినిపించడం పట్ల రాజకీయవర్గాలలో విస్మయం వ్యక్తమౌతోంది. పార్టీ కేడర్ సైతం మావిగన్ ఏంటి అదేదో పంటకు పట్టే తెగుల్లా ఉందని నెత్తీ నోరూ బాదుకుంటోంది.
ఆ రోజు సభలో ఓ మంత్రి తనపై చెయ్యి చేసుకున్నారని పేర్కొన్నారు. మరో మంత్రి ఏకవచనంతో తిట్టిపోశారు, కులం పేరుతో దూషిస్తూ తన పుట్టుకను నిందించారన్నారు. శాసనమండలిలో తన సిబ్బందినీ దగ్గరికి రాకుండా వైసీపీ సభ్యులు అడ్డుపడ్డారని, తన చుట్టూ చేరి బెదిరింపులు, ప్రలోభాలతో రకరకాలుగా ఇబ్బంది పెట్టారన్నారు.
ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాలకు 5 కోట్ల మంది ప్రజల తరఫున కృతజ్ణతలు తెలిపారు. దేశం మొత్తానిది ఒక దారైతే... తమదో దారి అన్నట్లు వైసీపీ వ్యవహరించిందని దుయ్యబట్టారు. రాష్ట్రం, దేశం నాశనమైనా పర్వాలేదు.. మాకు స్వార్థ రాజకీయమే ముఖ్యమన్నట్లుగా వైసీపీ వ్యవహరించిందని విమర్శించారు.
ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో డ్రగ్స్ సంస్కృతి ఒక పెను సవాలుగా మారింది. ఇటీవలి కాలంలో రాజకీయ నాయకులు, ప్రముఖుల పేర్లు డ్రగ్స్ కేసుల్లో వినిపిస్తుండటం సమాజంలో తీవ్రసంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. వాస్తవ వేదిక చర్చలో డోలేంద్ర ప్రసాద్, కంఠంనేని రవిశంకర్ లు ఇది కేవలం శాంతిభద్రతల సమస్య మాత్రమే కాదనీ, సమాజ భవిష్యత్తుకు పెనుముప్పుగా పరిణమించిన ఒక సామాజిక రుగ్మత అని పేర్కొన్నారు.
ప్రస్తుతం ఎన్నికల ప్రచారంలో విజయ్ రాష్ట్రంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఈ క్రమంలోనే జననాయగన్‌ సినీమా విడుదలపై నెలకొన్న అనిశ్చితిని ఆయన ప్రజల ముందు ఉంచారు. అలాగే.. కరూర్ ప్రాంతంలో చోటుచేసుకున్న విషాద ఘటనను ప్రస్తావిస్తూ.. అది యాధృచ్ఛికంగా జరిగింది కాదని, దాని వెనుక కూడా లోతైన కుట్ర దాగి ఉందన్న అనుమానాలున్నాయన్నారు.
నిజానికి తాను రాజ‌కీయ స‌న్యాసం చేసిన‌ట్టు చెబుతూనే ఉన్నా.. ఇప్ప‌టికీ ఆయ‌న‌ త‌న టీం ద్వారా అకౌంట్ స‌ర్వీసెస్ అందిస్తూనే ఉన్నారు. ఆపై జ‌గ‌న్ కి లోపాయికారిగా సహకరించేందుకే ఈ రాజీనామా డ్రామాల‌ని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. బేసిగ్గా విజ‌య‌సాయిరెడ్డి కామెంట్ చేయాల్సింది ఏదైనా ఉందంటే.. ఇటీవ‌ల జ‌గ‌న్ అర్ధంప‌ర్దం లేకుండా చేసిన మావిగ‌న్ అనే ప్ర‌తిపాద‌న‌ మీదే. కానీ రేణుక చౌద‌రి స‌భ‌లో లేవ‌నెత్తిన క‌మ్మ‌రావ‌తిని ప‌ట్టుకుని.. పోస్టులు పెట్ట‌డం స‌రికాద‌ంటున్నారు.
రాజ్యసభలో అమరావతి చట్టబద్ధత బిల్లుకు కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ, టీఎంసీ, ఆప్, బీజేడీ, ఆర్జేడీ, బీఆర్ఎస్, జేడీ(యూ), శివసేన మద్దతు ఇచ్చాయి. రాజ్యసభలో అమరావతి చట్టబద్ధతపై జరిగిన చర్చలో 11 పార్టీలు పాల్గొన్నాయి.
గురువారం సాయంత్రం రాష్ట్ర వ్యాప్తంగా సంబరాలు జరుపుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు పిలుపునిచ్చారు. ఇక 2015లో దేశంలోని వివిధ పుణ్యక్షేత్రాల నుంచి తెచ్చిన పవిత్ర జలాలు, మట్టిని ఉంచిన ఉద్దండరాయునిపాలెంలో పర్యటించి, రాజధాని సంకల్పంలో పాల్గొన్నారు.
కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ ఈ బిల్లును రాజ్యసభలో సభలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఏపీ రాజధాని విషయంలో ఉన్న చట్టపరమైన అస్పష్టతను తొలగించేందుకు ఈ సవరణ అత్యవసరమని పేర్కొన్నారు. బిల్లుపై జరిగిన చర్చ అనంతరం, సభాపతి సి.పి. రాధాకృష్ణన్ క్లాజ్ వారీగా ఓటింగ్‌ నిర్వహించగా సభ్యులు అనుకూలంగా ఓటు వేశారు. దీంతో అమరావతిని రాజధానిగా ఖరారు చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయానికి రాజ్యసభ ఆమోదం లభించింది.
. తాము అమరావతిని వ్యతిరేకించడం లేదనీ, అయితే రాజధాని పేరుతో సాగుతున్న పరిణామాలు, ఆర్థిక భారాలనే ప్రశ్నిస్తున్నామన్నారు. రైతుల నుంచి భూములు సేకరించి ఇన్నాళ్లు గడుస్తున్నా ఆశించిన స్థాయిలో అభివృద్ధి జరగలేదని ఆయన విమర్శించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.