Publish Date:Aug 24, 2022
బీజేపీ ఎంత ప్రయత్నించినా, ఎన్ని గిమ్మిక్కులు చేసినా మునుగోడులో గెలిచే పరిస్థితి లేదని తాజా సర్వే తేల్చేసింది. గెలవడం అటుంచి ఆ పార్టీ మూడో స్థానంతోనే సరిపెట్టుకోవలసి ఉంటుందని కూడా పేర్కొంది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా అనంతరం మునుగోడులో ఉప ఎన్నిక అనివార్యమైన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ కంచుకోటలాంటి మునుగోడులో జెండా పాతాలని బీజేపీ విశ్వ ప్రయత్నం చేస్తున్నది. కోమటిరెడ్డిరాజగోపాల్ రెడ్డితో పాటు ఇంకా పలువురు కాంగ్రెస్ నుంచి కమలం గూటికి చేరుతారని ఆ పార్టీ ఆశించింది. కానీ అది జరగలేదు. పైపెచ్చు కాంగ్రెస్ బలం మునుగోడులో రాజగోపాలరెడ్డి రాజీనామా తరువాత కూడా తగ్గలేదని పరిశీలకులు అంటున్నారు. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ మునుగోడు పరిస్థితిపై ఒక రహస్య సర్వే చేయించినట్లు సమాచారం. తెలంగాణ కాంగ్రెస్ నేతలతో సంబంధం లేకుండా అధిష్ఠానమే ఈ సర్వే చేయించిందని కాంగ్రెస్ వర్గాలే చెబుతున్నాయి. ఆ సర్వే ఫలితాన్ని ఇటీవల ప్రియాంకా గాంధీతో తెలంగాణ కాంగ్రెస్ నేతలు సమావేశమైన సందర్భంగా వెల్లడించినట్లు చెబుతున్నారు. ఆ సర్వే ప్రకారం మునుగోడులో బీజేపీ చేస్తున్న హడావుడి అంతా పైపై ఆర్భాటమేనని తేలిపోయిందని చెబుతున్నారు. అయితే అంత మాత్రాన కాంగ్రెస్ ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యే పరిస్థితి కూడా లేదని సర్వే తేల్చిందని అంటున్నారు. ఆ సర్వే ప్రకారం మునుగోడులో బీజేపీ మూడో స్థానంతోనే సరిపెట్టుకోవలసి వచ్చినా కాంగ్రెస్ కు కలిసి వచ్చేదేం లేదనీ, ఆ పార్టీ రెండో స్థానానికి పరిమితమౌతుందని సర్వే ఫలితం వెల్లడించిందని పార్టీ శ్రేణులే అంటున్నాయి.
మునుగోడులో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఆ స్థానంలో అధికార టీఆర్ఎస్ విజయం సాధిస్తుందన్నది కాంగ్రెస్ నిర్వహించిన సర్వేలో వెల్లడైనట్లు తెలిసింది. అయితే టీఆర్ఎస్- కాంగ్రెస్ ల మధ్య తేడా చాలా స్వల్పమని, కొంచం గట్టిగా ప్రయత్నిస్తే కాంగ్రెస్ ఈ సీటు నిలబెట్టుకునే అవకాశం ఉందనీ, సర్వే ఫలితాన్ని విశ్లేషించిన కాంగ్రెస్ నేతలు అంటున్నారు. బీసీలు అత్యధికంగా ఉన్న మునుగోడు నియోజకవర్గంలో కాంగ్రెస్ కనుక బీసీ అభ్యర్థిని నిలబెడితే ఆ తేడాను సునాయాసంగా అధిగమించవచ్చని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నట్లు చెబుతున్నారు. ఇక వామపక్షాలు టీఆర్ఎస్ కు మద్దతు పలకడం ఆ పార్టీకి కలిసి వచ్చిందని అంటున్నారు.
వామపక్షాలకు మునుగోడులో దాదాపు 15వేల ఓట్లు ఉన్నాయని, అయితే నేతలు టీఆర్ఎస్ కు మద్దతు ప్రకటించినంత మాత్రాన ఆ ఓటు గంపగుత్తగా టీఆర్ఎస్ కే పడుతుందన్న నమ్మకం లేదనీ కూడా కాంగ్రెస్ శ్రేణులు అంచనా వేస్తున్నాయి. కనీసంలో కనీసం ఎనిమిది వేల ఓట్ల వరకూ కాంగ్రెస్ కు వచ్చే అవకాశాలున్నాయని పార్టీ నేతలు అంచనా వేస్తున్నారు. మునుగోడులో బీజేపీకి క్యాడర్ లేకపోవడం, రాజగోపాలరెడ్డి రాజీనామా చేసి కమలం గూటికి చేరినా.. ఆయన వెంట కాంగ్రెస్ క్యాడర్ వెళ్లకపోవడం కాంగ్రెస్ కు కలిసొచ్చే అంశంగా పార్టీ నాయకులు భావిస్తున్నారు.
మొత్తం మీద కాంగ్రెస్ సర్వేలోనే మునుగోడులో టీఆర్ఎస్ కే విజయావకాశాలు ఉన్నాయని తేలింది. అయితే రెండు పార్టీల మధ్యా తేడా అతి స్వల్పంగా ఉండటంతో సమష్టిగా కృషి చేస్తే సానుకూల ఫలితం ఉండే అవకాశం ఉందని ఆశిస్తున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/bjp-will-be-limited-to-third-place-in-munugodu-says-congress-survey-39-142542.html
వచ్చినది పోగాకు రైతుల కష్టాలు విని, వారికి అండగా ఉన్నానని సంఘీభావం తెలపడం. అయితే ఈ పర్యటనలో జనగ్ రైతులను కలవడం, వారి కనీస హామీ ధర డిమాండ్ల కోసం పోరాడటం కంటే, బల ప్రదర్శనకే ప్రాధాన్యత ఇచ్చారు. ఇక తన ప్రసంగం కూడా పరమ రొట్టకొట్టుడు పద్ధతిలో సాగింది.
2024 అసెంబ్లీ ఎన్నికలలో ఆముదాలవలస నియోజకవర్గం నుంచి ఓటమి పాలైనప్పటి నుంచీ తమ్మినేని రాజకీయంగా ఒకింత ఇన్ యాక్టివ్ గానే ఉంటూ వస్తున్నారు. వైసీపీ అధినేత జగన్ కూడా తమ్మినేనిని ఆముదాలవలస నియోజకవర్గ బాధ్యతల నుంచి తప్పించి శ్రీకాకుళం పార్లమెంట్ పరిశీలక బాధ్యతలను అప్పగించారు. ఈ నిర్ణయం తమ్మినేనిలో తీవ్ర అసంతృప్తికి కారణమైందని ఆయన అనుచరులు చెబుతున్నారు.
వైఎస్ జగన్ ఆదేశిస్తే ఏమైనా చేస్తానంటూ సంచలన ప్రకటనలు చేస్తూ నిత్యం వార్తల్లో నిలిచారు. అలాగే బోరుగడ్డ అనిల్ తన నోటి దురుసు, అనుచిత వ్యాఖ్యల కారణంగా తొమ్మిది నెలలపాటు జైలు జీవితం కూడా గడపాల్సి వచ్చింది.
తంజావూరు వేదికగా కావేరీ జలాల వివాదంపై మాట్లాడుతున్న సమయంలో ఉదయనిధి స్టాలిన్ సీఎం విజయ్, నటి త్రిషను ఉద్దేశించి పరోక్షంగా చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపిన సంగతి తెలిసిందే. తమ అధినేత విజయ్ను అవమానించారంటూ టీవీకే శ్రేణులు తంజావూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడమే కాకుండా, జాతీయ మహిళా కమిషన్కు కూడా ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు అందిన వెంటనే చెన్నైలోని ఉదయనిధి నివాసానికి వెళ్లిన పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు.
రాష్ట్రం వెనుకబాటుతనం నుంచి బయటపడాలంటే.. క్షేత్రస్థాయిలో ఉద్యోగాల కల్పనకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. దశాబ్దాలుగా బీహార్ యువత ఉపాధి కోసం ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లాల్సిన దుస్థితి నెలకొందనీ, ఇటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం సంక్షేమ పథకాలు, రాజకీయ పొత్తులతో కాలక్షేపం చేస్తే రాష్ట్ర భవిష్యత్ అంధకారం అవుతుందన్నారు.
రాష్ట్రం ఎదుర్కొంటున్న ఆర్థిక సవాళ్లు, నిధుల కొరత నడుమ ఈ బడ్జెట్ను రూపకల్పన చేయడం ప్రభుత్వానికి సవాలుగా మారింది. ఒకవైపు ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడం, మరొకవైపు అభివృద్ధి లక్ష్యాలను సమర్థవంతంగా సాధించడం మధ్య సమతుల్యత పాటించాల్సి ఉంది. పరిమితమైన ఆర్థిక వనరులను దృష్టిలో ఉంచుకుని, ఏ రంగాలకు ఎంత మేరకు నిధుల కేటాయింపులు చేయనున్నారనేది రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది.
దేశంలో ఇటీవల వెలువడిన ఉప ఎన్నికల ఫలితాలు భారత రాజకీయ యవనికపై కొత్త సమీకరణాలకు నాంది పలుకుతున్నాయి.
వైసీపీలో నెలకొన్న నిస్తేజాన్నీ, నిరుత్సాహాన్నీ ఆసరాగా చేసుకుని, ఆ పార్టీకి పట్టు ఉన్న ప్రాంతాలలో కూడా తెలుగుదేశం కూటమి పాగా వేస్తోంది. ప్రధానంగా వైసీపీకి కంచుకోటగా భావించే రాయలసీమలో వైసీపీ బలాన్ని ఛేదిస్తూ, అభివృద్ధి మంత్రంతో క్షేత్రస్థాయిలో బలం పెంచుకుంటోంది.
తెలంగాణలో అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు ఇకపై టీ-ఫైబర్ ద్వారానే ఇంటర్నెట్ సేవలు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ఈ ఫలితాలు మోదీ బ్రాండ్ ను మసకబార్చాయి. మోడీ ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకతకు నిదర్శనంగా నిలిచాయి. ఈ ఫలితాలు కేవలం ఉప ఎన్నికలో తగిలిన ఎదురుదెబ్బగా కంటే బీజేపీపై ప్రజా వ్యతిరేకత పెచ్చరిల్లుతుందన్న భావననే ఎక్కువగా ఆవిష్కరించాయి.
అమెరికాలోని బోస్టన్ విశ్వవిద్యాలయంలో అభిజీత్ విద్య ఎలా అభ్యసించాడనే అంశంపై విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ సూరత్కు చెందిన ఆర్టీఐ కార్యకర్త అమిత్ తివారీ కేంద్ర ఎన్నికల సంఘం, పన్నుల శాఖతో పాటు మహారాష్ట్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. అలాగే.. సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ సమకూర్చిన 1 కోటి రూపాయ నిధులపై అనుమానాలు వ్యక్తం చేశారు.
ఎటువంటి ఆధారాలు లేకుండా, కేవలం రాజకీయ లబ్ధి కోసమే ఇటువంటి అసత్య, అవమానకర, ద్వంద్వార్థ వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ పోలీసులు కేసు నమోదు చేశారు. సామాజిక మాధ్యమాల్లో సైతం ఈ వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమయ్యాయి. ముఖ్యంగా సినిమా, రాజకీయ రంగాల నుంచి ఉదయనిధి శైలిపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి.
నీళ్లు ఎక్కడికి చేరినా చేరకపోయినా.. అక్కడికి మాత్రం తప్పకుండా చేరాలంటూ వ్యాఖ్యానించారు. ఆ వెంటనే తాను మాట్లాడింది కావేరీ జలాల గురించేనని చెప్పినా, ఉదయనిథి స్టాలిన్ వ్యాఖ్యలు నటి త్రిషను ఉద్దేశించి చేసినవేనంటూ విమర్శలు వెల్లువెత్తాయి.