Publish Date:May 16, 2023
ఒకే ఒక్క ఫలితం దేశ రాజకీయ ముఖచిత్రాన్ని మార్చేస్తోందా? బీజేపీ వ్యతిరేక శక్తులన్నీ ఏకతాటిపైకి వచ్చేందుకు కర్నాటక ఫలితం దోహదం చేసిందా? మరీ ముఖ్యంగా ఏ మాత్రం స్టేక్ లేని ఏపీలో నిన్న మొన్నటి వరకూ అంతా మేమే, అన్నీ మేమే అన్నట్లుగా వ్యవహరించిన బీజేపీ ఇప్పుడు అంతా మీరే, అన్నీ మీరే అన్నట్లుగా తెలుగుదేశంవైపు జాలి చూపులు చూస్తోందా? అంటే పరిశీలకులు ఔననే అంటున్నారు.
కేంద్రంలో అధికారంలో ఉన్నామన్న ధీమాతో.. దర్యాప్తు సంస్థలు చేతిలో ఉన్నాయన్న ధైర్యంతో తెలుగుదేశం పార్టీని అన్ని విధాలుగా ఇరుకున పెట్టేందుకు విశ్వయత్నం చేసిన బీజేపీ ఇప్పుడు త్వమేవ శరణం నాస్తి అన్నట్లుగా కాపాడాలంటూ బేల మాటలు మాట్లాడుతోందా? అంటే ఔననే అంటున్నారు పరిశీలకులు. నిన్న మొన్నటి వరకూ తెలంగాణలో అధికారం ఖాయం.. ఏపీలో మేం సహకరిస్తేనే తెలుగుదేశం పార్టీకి అధికారం అన్న ధోరణితో వ్యవహరించిన బీజేపీ ఇప్పుడు తెలంగాణలో అధికారం చేజిక్కించుకోవాలంటే తెలుగుదేశం సహకారం అనివార్యం అన్న పరిస్థితిలో పడింది. అలాగే కేంద్రంలో మోడీ నాయకత్వంలో ముచ్చటగా మూడో సారి ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే.. దక్షిణాది నుంచి కొన్ని పార్లమెంటు స్థానాలు తప్పని సరిగా గెలుచుకోవాల్సిన అవసరం ఉందని గుర్తించింది.
అందుకే ఏపీలో తెలుగుదేశంతో పొత్తు కోసం తహతహలాడుతోంది. నిన్న మొన్నటి వరకూ తెలంగాణలో ఎవరి మద్దతు అవసరం లేదు..ఒంటరిగానే వంద స్థానాల్లో గెలుస్తామంటూ విర్రవీగిన బీజేపీ.. ఇప్పుడు తెలంగాణలో అధికారం దక్కాలంటే.. ఆ రాష్ట్రంలో బలంగా ఉన్న తెలుగుదేశం పార్టీ మద్దతు అవసరం అని భావిస్తోంది. తెలంగాణలో సహకారం అందిస్తే.. ఏపీలో అండగా ఉంటామని నేరుగా కాకపోయినా ప్రతిపాదనలు పంపుతోంది. అయితే ఏపీలో తెలుగుదేశం పార్టీకి బీజేపీ మద్దతు అవసరమా? అన్న ప్రశ్నకు మాత్రం ఆ పార్టీ నేతల వద్ద సమాధానం లేకుండా పోయింది.
ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలోనూ బీజేపీకి తెలుగుదేశం మద్దతు, ఆసరా అవసరమని ఆ పార్టీ హైకమాండ్ గుర్తించింది. అందుకే నేరుగా కాకపోయినా పరోక్షంగానైనా తెలుగుదేశంతో పొత్తు విషయాన్ని సీరియస్ గా పరిశీలిస్తున్నామంటూ ఫీలర్స్ పంపుతోంది. సార్వత్రిక ఎన్నికల ముందు కర్నాటక లో తగిలిన ఎదురు దెబ్బ బీజేపీ ఆత్మ విశ్వాసాన్ని గట్టిగానే దెబ్బతీసిందని పరిశీలకులు అంచనా వేస్తున్నారు.
అంతే కాకుండా.. వరుస పరాజయాలతో డీలా పడిన కాంగ్రెస్ కు కర్నాటక విజయం ఒక జీవన్ టోన్ టానిక్ లా పని చేస్తోందని అంటున్నారు. బీజేపీయేతర పార్టీలన్నీ కాంగ్రెస్ నాయకత్వంలో ఐక్యంగా వచ్చే ఎన్నికలలో పోటీ చేయాలన్న దిశగా అడుగులు వేస్తున్నాయి. దేశంలోని ప్రాంతీయ పార్టీలను కబలించడమే ధ్యేయంగా గత ఎనిమిదేళ్లుగా సాగిన బీజేపీ మనుగడ ఇప్పుడు ఆ ప్రాంతీయ పార్టీల దయాదాక్షిణ్యాలపై ఆధారపడిన పరిస్థితి వచ్చింది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/bjp-weakness-exposed-after-karnataka-defeat-39-155382.html
రాయలసీమను హార్టికల్చర్ హబ్గా తీర్చిదిద్దేందుకు, రాష్ట్రంలో ఇరిగేషన్ సదుపాయాలను మెరుగుపరిచేందుకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పకడ్బందీ ప్రణాళికలతో ముందుకు వెళ్తోందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు ఒక్కొక్కటిగా పూర్తవుతుండటంతో, ఇరిగేషన్ రంగంపై మాట్లాడటానికి ప్రతిపక్షానికి ఎలాంటి అవకాశాలు లేకుండా పోయాయని ఆయన కుండబద్దలు కొట్టారు.
జలయజ్ణం పేరుతో వైఎస్ చేసింది ధనయజ్ణమని విక్రమ్ పూల అన్నారు. ప్రాజెక్టుల అంచనా వ్యయం పెరగడం, ప్రాంతీయ సమతుల్యత లోపించడం, హెడ్ వర్క్స్ కంటే ముందుగా కాలువల తవ్వకం వంటి వాటికే వైఎస్ జలయజ్ణం పరిమితమైందని విక్రమ్ పూల వివరించారు.
కాంగ్రెస్ హైకమాండ్ మీనాక్షీ నటరాజన్ పై వేటు వేయాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు. రాహుల్ గాంధీ నేతృత్వంలోని జాతీయ నాయకత్వం రాష్ట్రంలో కాంగ్రెస్ వ్వవహారాలను చక్కదిద్దేందుకు భూపేష్ బగెల్ సమర్ధంగా పని చేయగలరని భావించి ఆ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.
తాను పూర్తిగా రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాననీ, వచ్చే ఎన్నికలలో పోటీ చేయననీ ఆయన చేసిన ప్రకటన పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. తెలుగుదేశం ఆవిర్భావం నుంచీ కూడా ప్రజా ప్రతినిథిగా, పొలిటికల్ లీడర్ గా సేవలందించిన అయ్యన్న పాత్రుడు హఠాత్తుగా రాజకీయాలకు రిటైర్మెంట్ అంటూ చేసిన ప్రకటన రాజకీయవర్గాలలో సంచలనం సృష్టించింది.
2019 ఎన్నికలలో వైసీపీ విజయంలో అప్పటి జగన్ పాదయాత్ర కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. అయితే అప్పట్లో.. జగన్ వాగ్దానాలపై ప్రజలలో నమ్మకం ఉండేది. ప్రజలతో ఆయన మమేకమయ్యేవారు.
రాష్ట్ర విభజన తరువాత తెలంగాణలో తెలుగుదేశం పార్టీ అధికార రేసులో లేకపోయినప్పటికీ.. రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేస్తూనే ఉంది. అందుకే రాష్ట్రంలో రాజకీయ వేడ రగిలిన ప్రతి సందర్భంలోనూ తెలుగుదేశం ప్రస్థావన వస్తూనే ఉంటుంది.
తెలంగాణ రాజకీయాల్లో గత కొన్ని రోజులుగా తీవ్ర దుమారం రేపుతున్న పరిణామాలు ఇప్పుడు అత్యంత ఆసక్తికర మలుపు తిరిగాయి.
తాజాగా ఆమె చేసిన వ్యాఖ్యలు ఆమె చూపు బీఆర్ఎస్ వైపు మళ్లిందా అన్న అనుమానాలకు తావిచ్చింది. కేబినెట్ నుంచి తనకు ఉద్వాసన పలికిన తరువాత మీడియాకు వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్న కొండా సురేఖ.. తాజాగా బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుపై ప్రశంసల వర్షం కురిపించారు.
పిడిక్కీ బియ్యానికీ ఒకే మంత్రం అన్నట్లుగా ఆమె తన బర్త్ రఫ్ కూ తెలుగుదేశం పార్టీకీ ముడి పెట్టారు. సీఎం రేవంత్ రెడ్డిది తెలుగుదేశం రక్తం కనుకనే తనకు కేబినెట్ నుంచి బర్త్ రఫ్ చేశారంటూ మీడియా సమావేశంలో కొండా సురేఖ చేసి కామెంట్స్ రాజకీయవర్గాలలో సంచలనంగా మారాయి.
ఈ ప్రాజెక్టుల నిర్మాణంలో తమ పాత్రే కీలకమని పేర్కొంటూ వైసీపీ క్రెడిట్ వార్ కు తెరతీసింది. సోషల్ మీడియా వేదికగా వైసీపీ వారు పోలవరం ప్రాజెక్టును దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి కలల ప్రాజెక్ట్గా అభివర్ణిస్తూ పోస్టులు షేర్ చేస్తోంది.
కోమటిరెడ్డి కుటుంబానికి నల్గొండ జిల్లాలో గట్టి పట్టు ఉంది. ఈ నేపథ్యంలో తాను కేవలం మంత్రి పదవిని మాత్రమే ఆశించే నాయకుడిని కాననీ.. వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకువెళ్లే నాయకుడిననీ ఆయన అంటున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అధికార కూటమి భాగస్వామ్య పక్షాలైన తెలుగుదేశం, జనసేన మధ్య సంబంధాలు పైకి కనిపించేంత సజావుగా లేవనే సంకేతాలు స్పష్టమవుతున్నాయి.
తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారిగా తీవ్ర కలకలం రేగింది