ఏపీ నుంచి రాజ్యసభకు అన్నామలై.. బీజేపీ తమిళ రాజకీయం

Publish Date:Apr 23, 2025

Advertisement

ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీకి కేటాయించబోయే రాజ్యసభ స్థానం నుంచి.. పార్లమెంటులో అడుగుపెట్టబోయే అదృష్టవంతుడెవరో దాదాపుగా తేలిపోయిందంటున్నారు. వైసీపీ మాజీ నేత విజయసాయి రెడ్డి రాజీనా మాతో ఖాళీ అయిన ఎంపీ సీటుని.. బీజేపీకి వదిలేయాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారన్న ప్రచా రం జరుగుతోంది. దాంతో ఆ లక్కీ ఛాన్స్ ఎవరికి దక్కుతుందని అంతా ఉత్కంఠగా ఎదురు చూస్తున్న తరుణంలో అనూహ్యంగా తమిళనాడు బీజేపీ నేత అన్నామలై పేరు తెరమీదకు వచ్చింది. దీంతో మొత్తం లెక్కే మారిపోయిందంటున్నారు.

తాజాగా ఏపీలో మరో ఉప ఎన్నికకు నోటిఫికేషన్ రిలీజైంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక.. వైసీపీకి చెందిన రాజ్యసభ సభ్యులు వరుసగా రాజీనామాలు చేస్తున్నారు. ఇప్పటికే.. మోపిదేవి వెంకటరమణ, బీదమస్తాన్ రావు, ఆర్.కృష్ణయ్య వైసీపీతో పాటు తమ రాజ్యసభ సభ్యత్వానికి కూడా రాజీనామా చేశారు. దాంతో.. ఖాళీ అయిన 3 స్థానాల్లో టీడీపీ నుంచి బీద మస్తాన్ రావుకు మళ్లీ చాన్స్ ఇచ్చారు. మోపిదేవి స్థానాన్ని సానా సతీశ్‌తో భర్తీ చేయగా, ఆర్.కృష్ణయ్యను బీజేపీ తరఫున రాజ్యసభకు పంపారు. ఇప్పుడు.. విజయసాయిరెడ్డి రాజీనామాతో మరో ఉప ఎన్నిక అనివార్యమైంది. అయితే.. ఈ స్థానాన్ని బీజేపీకి కేటాయించారన్న ప్రచారంతో.. ఏపీ నుంచి ఎవరిని రాజ్యసభకు ఎంపిక చేస్తారనే దానిపై జోరుగా చర్చ నడుస్తోంది.

ఇటు ఏపీ బీజేపీలోనూ రాజ్యసభ స్థానానికి ఎంపికయ్యే అదృష్టవంతుడు ఎవరనే దానిపై హాట్ డిబేట్ మొదలైంది. రాజ్యసభలో అడుగుపెట్టేందుకు.. ఏపీ బీజేపీ నేతలు పలువురు తహతహలాడుతున్నారట. ముఖ్యంగా.. మాజీ ఎమ్మెల్సీ మాధవ్‌తో పాటు రాజ్యసభ మాజీ  ఎంపీ జీవీఎల్ నరసింహరావు లాంటి వారితో పాటు కొందరి పేర్లు వినపడుతున్నాయ్. కానీ.. అధిష్టానం ఆలోచన మాత్రం మరోలా ఉందనే వార్తలు వినిపిస్తున్నాయ్. ఏపీ నుంచి ఖాళీ అవుతున్న రాజ్యసభ స్థానాన్ని.. ఇతర రాష్ట్రాలకు చెందిన నేతలకు అవకాశం ఇవ్వాలని కాషాయ పెద్దలు భావిస్తున్నారంట.

త్వరలోనే కేంద్ర మంత్రివర్గ విస్తరణ ఉండే అవకాశం ఉందనే సంకేతాలను దృష్టిలో పెట్టుకొని.. ఈ రాజ్యసభ స్థానానికి అభ్యర్థిని ఖరారు చేస్తారనే చర్చ నడుస్తోంది. కేంద్ర కేబినెట్‌లో చేరే ఇతర రాష్ట్రాల నాయకులను ఏపీ నుంచి రాజ్యసభకు పంపే అవకాశాలున్నాయని ఢిల్లీ నుంచి సిగ్నల్స్ అందుతు న్నాయట. 2014-19 మధ్యలో.. టీడీపీ, బీజేపీ మధ్య పొత్తు ఉన్నప్పుడు.. కేంద్రమంత్రి సురేశ్ ప్రభుకు ఏపీ నుంచి చాన్స్ ఇచ్చారు. ఇప్పుడు,  తమిళనాడు బీజేపీ మాజీ అధ్యక్షుడు అన్నామలై పేరు బలంగా వినిపిస్తోంది. 

వచ్చే ఏడాది తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని.. అన్నామలైని ఏపీ నుంచి రాజ్యసభకు పంపే చాన్స్ ఉందట. అన్నామలైని పెద్దల సభకు పంపి.. కేంద్ర మంత్రి వర్గంలోకి తీసుకుంటే, అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ- అన్నాడీఎంకే కూటమి బలం పెరుగు తుందనేది బీజేపీ నేతల అంచనా. అధ్యక్ష పదవి పూర్తయ్యాక అన్నామలైకి ఎంపీగా అవకాశం ఇస్తామని అధిష్టానం హామీ కూడా ఇచ్చిందంట.  2024 లోక్‌సభ ఎన్నికల్లో, నారా లోకేశ్ కూడా కోయంబత్తూరులో అన్నామలై తరఫున ప్రచారం చేశారు. ఆ క్రమంలో విజయసాయిరెడ్డి రాజీనామాతో ఖాళీ అయిన స్థానంలో.. ఆంధ్రా నుంచి అన్నామలై రాజ్యసభకు వెళ్లే అవకాశాలు ఉన్నాయంటు న్నారు. 

మరోవైపు, బీజేపీలో సీనియర్ మహిళా నేత, కేంద్ర మాజీ మంత్రి స్మృతి ఇరానీ పేరు కూడా వినిపి స్తోందనే ప్రచారం సాగుతోంది. గత ఎన్నికల్లో ఆమె.. అమేథీలో రాహుల్ గాంధీపై పోటీ చేసి ఓడి పోయారు. స్మృతీ ఇరానీ లాంటి మహిళా నేతలను కేంద్ర కేబినెట్‌లోకి తీసుకుంటే.. పార్లమెంట్‌లో బీజేపీకి బలమైన వాయిస్ ఉంటుందనే ఆలోచన కూడా అధిష్టానం చేస్తోందట. దాంతో.. వీళ్లిద్దరిలో ఎవరో ఒకరు.. ఏపీ నుంచి రాజ్యసభ ఎంపీగా వెళతారని.. రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది.

By
en-us Political News

  
మేడారంలో తెలంగాణ మంత్రివర్గం సమావేశం కానుంది. ఈ నెల 28 నుంచి మేడారం జాతర ప్రారంభం కానున్న నేపథ్యంలో మేడారం వేదికగా కేబినెట్ సమావేశం నిర్వహించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది.
పండగైనా, పబ్బమైనా చంద్రబాబుకు ప్రజా సమస్యల పరిష్కారంపైనే దృష్టి ఉంటుందన్న సంగతి తెలిసిందే. అలాగే ప్రగతి అడుగులు నెమ్మదించకూడదన్న పట్టుదలా ఉంది.
జగన్ హయాంలో సకల శాఖల మంత్రిగా వెలుగు వెలిగిన సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సచివాలయాల నిర్మాణాలను పోలుస్తూ ప్రజలను తప్పుదోవపట్టించే ప్రయత్నం జరుగుతోందన్నారు. రెండింటినీ పోల్చి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిద్దామని చూస్తున్న వారిది అవగాహనా రాహిత్యమని చెప్పారు.
పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ లో జనసేన, తెలుగుదేశం, బీజేపీ కూటమి అధికారంలో ఉంది. ఇక జాతీయ స్థాయిలో కూడా ఎన్డీయే కూటమిలో తెలుగుదేశం, జనసేన భాగస్వామ్య పార్టీలు. ఈ నేపథ్యంలో తెలంగాణలో జనసేనతో తమ పార్టీ పొత్తు ఉండదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ప్రకటించడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయాలని నిర్ణయించింది.
2026 లో రాజ్యసభ నుంచి ఈ ఏడాదిలో ఏకంగా 73 మంది రిటైర్డ్ కానున్నారు.
అమరావతి విషయంలో జగన్ దృక్ఫథంలో ఇసుమంతైనా మార్పు లేదు. ప్రపంచ స్థాయి రాజధాని నిర్మాణం జరిగితే చంద్రబాబు పేరు చిరస్థాయిగా చరిత్రలో నిలిచిపోతుందన్న దుగ్ధతోనే ఆయన అమరావతిపై ఇప్పటికీ కుట్రలు చేస్తున్నారన్నది రాజకీయవర్గాల టాక్.
పశ్చిమబెంగాల్ అసెంబ్లీకి ఈ ఏడాది ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బీజేపీ ప్రత్యర్థులను అణచివేయడానికి ఈడీ వంటి దర్యాప్తు సంస్థలను ఆయుధాలుగా ప్రయోగిస్తోందని ధ్వజమెత్తారు.
జగన్ ఇలా నేర ప్రవృత్తి ఉన్న వారిని ప్రోత్సహించడం, వారికి మద్దతుగా నిలవడం ఇదే తొలిసారి కాదు. గ‌తంలో ఓ యువ‌కుడు ర‌ప్పా ర‌ప్పా అంటూ ఫ్లెక్సీలు క‌ట్టి త‌న ర్యాలీలో పాల్గొన్న‌పుడే జ‌గ‌న్ వారించాల్సింది. కానీ అలా చేయ‌లేదు స‌రిక‌దా? ర‌ప్పా ర‌ప్పా అంటూ గంగ‌మ్మ జ‌త‌ర‌లో పొట్టేలు న‌రికిన‌ట్టు న‌రుకుతామ‌న‌డంలో త‌ప్పేంట‌ని మీడియానే ఎదురు ప్ర‌శ్నించారు. దీంతో వైసీపీయులు బ‌రితెగించేశారు. ఆయ‌న‌కేం ఎన్ని కేసులున్నా వాయిదాల మీద వాయిదాలు కోరుతూ బెయిలు మీద బ‌య‌ట తిరగగలరు. ఆ స్థాయి ఇన్ ఫ్లుయెన్స్, ఆర్థిక దన్ను ఆయనకు ఉంది.
ఇక్కడే కవిత రాజకీయ అడుగులు బీఆర్ఎస్ ఉనికిని ప్రశ్నార్ధకం చేసేలా ఉన్నాయన్న విశ్లేషణలు వెలువడుతున్నాయి. ఎందుకంటే.. ఆమె ఇటీవల ఏర్పాటు చేసిన కమిటీల లక్ష్యమేంటంటే.. తెలంగాణ ఆవిర్భావం తరువాత పదేళ్ల పాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాల అధ్యయనం.
పోలవరం-నల్లమల సాగర్ ప్రాజెక్టుపై తెలంగాణ అభ్యంతరాలు, రాయలసీమ ఎత్తిపోతల పథకంపై జరుగుతున్న వివాదాలను ప్రస్తావించారు. కొందరు వివాదాలు సృష్టించడమే లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు.
ఇరు రాష్ట్రాల మధ్యా జలవివాదాలు ఉండకూడదన్న లక్ష్యంతోనే నాడు కాంగ్రెస్ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రానికి పచ్చ జెండా ఊపిందన్న రేవంత్ రెడ్డి, రాజకీయాలకు అతీతంగా నీటి వివాదాలను ఇరు రాష్ట్రాలూ పరిష్కరించుకోవాలన్నారు.
వాస్తవాలకు ఎలాంటి ముసుగులూ తగిలించకుండా ఉన్నది ఉన్నట్లు, కుండబద్దలు కొట్టినట్లుగా సమాజం తీరు తెన్నులను, రాజకీయ నాయకుల మధ్య నెక్సస్ ను, అధికారులు బాధ్యతారాహిత్యం, జవాబుదారీతనం లేని తనాన్ని కళ్లకు కట్టిన వాస్తవ ‘వేదిక’ తెలుగువన్ యూట్యూబ్ చానెల్ లో గురువారం ప్రసారమైంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.