బీజేపీది వ్యూహమా? సెల్ఫ్ గోలా?

Publish Date:Jul 5, 2023

Advertisement

చదవేస్తే ఉన్న మతి పోయిందన్నట్లుంది తెలుగురాష్ట్రాలలో పార్టీ ప్రక్షాళన పేరుతో బీజేపీ హైకమాండ్ చేసిన మార్పుల వ్యవహారం. రెండు రాష్ట్రాలలోనూ కూడా బీజేపీ హైకమాండ్ కు రహస్య మిత్రులున్నారు. ఆ విషయాన్ని పార్టీ రాష్ట్ర నాయకులకు కూడా తెలియనీయకుండా హైకమాండ్ జాగ్రత్త పడింది. తీరా ఎన్నికల సమయం వచ్చేసరికి పార్టీ అధిష్ఠానం ఆ రాహస్య మిత్రుల కోసం పార్టీ రాష్ట్ర నాయకత్వాన్ని బలి చేసింది. పార్టీ పరువును గంగలో కలిపేయడానికీ సిద్ధ పడింది. తెలుగురాష్ట్రాలలో పార్టీ భవిష్యత్ ను వదిలేసుకుంది. ఆ రహస్య మిత్రుల విషయం అందరికీ తెలిసిన బహిరంగ రహస్యమే అయినా బీజేపీ అధిష్ఠానం మాత్రం కళ్లు మూసుకుని పిల్లి పాలు తాగినట్లు వ్యవహరించింది. వ్యవహరిస్తోంది.అదేదో బ్రహ్మరహస్యం అన్నట్లుగా బిల్డప్ ఇచ్చింది.

 ఇంతకీ బీజేపీకి ఉన్న ఆ రహస్య మిత్రులు ఎవరంటే తెలంగాణలో బీఆర్ఎస్, ఏపీలో జగన్ నాయకత్వంలోని వైసీపీ అని పరిశీలకులు చెబుతున్నారు. సామాన్య జనం కూడా అదే నమ్ముతున్నారు. 

ముందుగా తెలంగాణ విషయం తీసుకుంటే.. బీఆర్ఎస్ ను గద్దె దింపడమే లక్ష్యంగా కమలం పార్టీ కోసం సర్వం ఒడ్డి పోరాడిన బండి వంటి నేతలకు హైకమాండ్ దిమ్మదిరిగేలా షాక్ ఇచ్చింది. పండుగాడు కొడితే దిమ్మదిరిగి మైండ్ బ్లాక్ అయిపోవాల్సిందే అన్నట్లుగా రాష్ట్రంలో బీజేపీ నాయకత్వం ఇక తేరుకోలేనంతగా దెబ్బకొట్టింద. స్వయంగా అధిష్ఠానమే కాళ్ల కింద భూమిని లాగేస్తే.. అందుకోబోతున్న అధికార అందలాన్ని అందకుండా చేస్తే.. ఇక  రాష్ట్రంలో బీజేపీ బలపడేదెలా?  బీజేపీ కోసం అరెస్టులకు, లాఠీ దెబ్బలకు, కేసులకు వెరవకుండా పని చేసిన రాష్ట్ర నాయకులు జనాలకు ముఖం చూపేదెలా అని పార్టీ శ్రేణులే అవేదన వ్యక్తం చేస్తున్నాయి.   బీజేపీ రాష్ట్ర నాయకుడు  బండి సంజయ్  విషయమే తీసుకుంటే.. బండి సంజయ్ పార్టీ రాష్ట్ర బాధ్యతలు చేపట్టిన తరువాతే తెలంగాణలో బీజేపీ పుంజుకుంది. కేసీఆర్ ప్రభుత్వాన్ని, ఆయన కుటుంబ పాలనను, కుటుంబ సభ్యుల అవినీతినీ ప్రతి వేదిక మీదా ఎండగడుతూ.. బీఆర్ఎస్ సర్కార్ కు పక్కలో బల్లెంగా మారారు. ఇప్పుడు ఆ బాధ్యతలను కేంద్ర మంతి కిషన్ రెడ్డికి అప్పగించింది బీజేపీ హైకమాండ్. దీంతో బీఆర్ఎస్ పార్టీకి   ఫస్ట్ టార్గెట్ గా మారిన బండి సంజయ్ ను ఏ రక్షణా లేకుండా పార్టీ హైకమాండ్ బీఆర్ఎస్ కు ఎరవేసిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా బండి సంజయ్ దూకుడు కారణంగానే తెలంగాణలో బీజేపీ బీఆర్ఎస్ కు దీటుగా ఎదిగింది.  పార్టీకి అధికారంలోకి రాగలమన్న విశ్వాసాన్ని ఇచ్చింది. అయితే బీజేపీ అధిష్ఠానం అనూహ్యంగా తెలంగాణలో బీజేపీ కూర్చున్న కొమ్మనే నరికేసింది.  ఇందుకు జాతీయ స్థాయిలో విపక్షాల ఐక్యతన దెబ్బతీయడానికి బీఆర్ఎస్‌తో రహస్య రాజకీయ అవగాహనే కారణమని పార్టీ శ్రేణులే బాహాటంగా వ్యాఖ్యానిస్తున్నాయి. కేసీఆర్ ఒత్తిడి కారణంగానే బండి సంజయ్ ను పార్టీ అధ్యక్ష బాధ్యతల నుంచి బీజేపీ అధిష్ఠానం తప్పించిందని అంటున్నారు.  

ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే.. అసలు ఇంత కాలం ఆ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా సోము వీర్రాజును కొనసాగించడమే వింత అనుకుంటే.. హఠాత్తుగా ఆయనను తప్పించి ఆ బాధ్యతలను పురంధేశ్వరికి అప్పగించడం మరో వింతగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. బీజేపీ అగ్ర నేతలు ఏపీ పర్యటనలకు వచ్చినప్పుడు జగన్ సర్కాన్ ను విమర్శలతో ఎండగట్టడం, హస్తినకు వెళ్లగానే సైలెంట్ అయిపోతుండటం ఇటీవలి కాలంలో చూస్తూనే ఉన్నాం.  రాష్ట్ర పార్టీ  మొత్తం సోము వీర్రాజును వ్యతిరేకిస్తున్నా చర్య తీసుకోకుండా ఇంత కాలం నిమ్మకు నీరెత్తినట్లు బీజేపీ అగ్రనాయకత్వం వ్యవహరించడానికి సోము తీరు ఏపీలో పార్టీకి నష్టం చేసినా అధికారంలో ఉన్న జగన్ కు ప్రయోజనం చేకూర్చేదిగా ఉండటమే కారణమని ఏపీలో ఇంత కాలం విస్తృతంగా చర్చ జరుగుతూ వచ్చింది.  ఇక ఇప్పుడు ఉరుము లేని పిడుగులా ఏపీ బీజేపీ అధ్యక్ష పదవిని  ఎన్టీఆర్ కుమార్తె పురందేశ్వరికి అప్పగిం అప్పగించడం ద్వారా వచ్చే ఎన్నికలలో తెలుగుదేశంతో పొత్తుకు అవకాశాలు లేవన్న సందేశాన్ని బీజేపీ హైకమాండ్ ఇచ్చిందా అన్న అనుమానాలు రాజకీయ సర్కిల్స్ లో వ్యక్తమౌతున్నాయి.  సోము వీర్రాజును తప్పించడం ద్వారా వైసీపీకి బీజేపీ అనుకూలమన్న  ముద్రను తుడిచేసుకోవడం, అదే సమయంలో  జగన్ కు మేలు చేకూర్చే విధంగా పొత్తుకు అవకాశం లేకుండా చేయడం బీజేపీ అగ్రనాయకత్వం వ్యూహంగా చెబుతున్నారు.  మొత్తం మీద దక్షిణాదిపై ఆశలు వదిలేసుకున్న బీజేపీ.. జాతీయ స్థాయిలో  ప్రయోజనాల కోసం తెలుగురాష్ట్రాలలో పార్టీని బలి చేయడానికి రెడీ అయ్యిందని అంటున్నారు. 

By
en-us Political News

  
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల అసెంబ్లీ వేదికగా మాజీ సీఎం కేసీఆర్ కుటుంబ సభ్యుల భూ ఆక్రమణలంటూ చేసిన సంచలన వ్యాఖ్యలు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్‌పై గులాబీ పార్టీ  మండిపడింది. ప్రభుత్వ వైఫ్యాలను కప్పిపుచ్చుకునేందుకే కాంగ్రెస్ పెద్దలు ఇలాంటి నిరాధార ఆరోపణలు చేస్తున్నారని  ఎదురుదాడికి దిగింది.
మైగ్రేన్ తలనొప్పితో ఆసుపత్రికి వెళ్లిన బెక్కీ జోన్స్‌కు బ్రెయిన్ క్యాన్సర్ ఉందంటూ 11 ఏళ్ల పాటు కీమోథెరపీ ఇచ్చారు. కానీ చివరికి అసలు క్యాన్సరే లేదని తెలిసిన షాకింగ్ వివరాలు ఈ వెబ్ స్టోరీలో చదవండి.
పట్టభద్రుల ఎన్నికలకు ఓటర్ల జాబితా ప్రక్రియ షెడ్యూల్ విడుదల.. !
చాలా మంది 1973 నాటి భూమి పరిమితి చట్టం రద్దయిందని అనుకుంటున్నారు. కానీ అది అమలులోనే వుంది. ఉమ్మడి కుటుంబానికి మెట్ట భూమి 52 ఎకరాలు, కొన్ని ప్రత్యేక సందర్భాల్లో 54 ఎకరాలు ఉండవచ్చు. తరి భూమి (ఏడాదికి రెండు పంటలు పండేది) 27 ఎకరాలు వుండవచ్చు. అంతకంటే ఎక్కువగా ఉంటే దాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాల్సి వుంటుంది.
వారణాసి వేదికగా నెల రోజుల పాటు జరగనున్న  సేవా సంకల్ప అభియాన్ లో  తొలి రోజు గురువారం ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు పాల్గొన్నారు. అలాగే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సహా  పాటు పలువురు అగ్రనేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.  
మోడీకి  జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన వారిలో లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, తెలుగుదేశం అధినేత, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు, మంత్రి నారా లోకేష్ తదితరులు  ఉన్నారు.  ప్రధాని నరేంద్ర మోదీజీకి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆయన మంచి ఆరోగ్యంతో, దీర్ఘాయుష్షుతో ఉండాలని కోరుకుంటున్నానంటూ రాహుల్ గాంధీ తన సందేశంలో పేర్కొన్నారు.
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకు వన్‌సైడ్ విక్టరీ వచ్చేలా పార్టీ శ్రేణులు పనిచేయాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ పిలుపునిచ్చారు.
వైసీపీ నుంచి బయటకు వచ్చి, ఆ పార్టీ ద్వారా వచ్చిన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి రాజకీయ సన్యాసం ప్రకటించిన విజయసాయి, ఇటీవల సొంత పార్టీ అంటూ మళ్లీ క్రియాశీల రాజకీయాలలోకి ప్రవేశించారు. 
బినెట్ నుంచి ఉద్వాసనకు గురైన కొండా సురేఖకు కేబినెట్ హోదాతో కీలక పదవిని అప్పగించే అవకాశాలున్నాయన్న ప్రచారం జరుగుతోంది.  ఈ విషయమై కొండా సురేఖకు పార్టీ హైకమాండ్ నుంచి స్పష్టమైన హామీ లభించినట్లు చెబుతున్నారు.
బీసీలపై కపట ప్రేమ ఎందుకు? కేసీఆర్‌ను నిలదీసిన పీసీసీ చీఫ్..!
మాజీ మంత్రి కొండా సురేఖకు మద్దతుగా అభిమానులు, కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో వరంగల్‌కు తరలివచ్చారు.
తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారిన కొండా సురేఖ ఉదంతంలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
G.D. Naidu, known as the “Edison of India,” was an Indian inventor, industrialist and pioneer of innovation. This article explores his remarkable life, curiosity, self-learning, experimentation and practical approach to technology, and the lessons his journey offers to Millennials, Gen Z and Gen Alpha.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.