Publish Date:Apr 22, 2024
అనూహ్యంగా హైదరాబాద్ లోక్ సభ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థిగా తెరమీదకు వచ్చిన మాధవీలత కు పార్టీ హైకమాండ్ ఇంకా బీఫామ్ ఇవ్వలేదు. దీంతో ఎంత అనూహ్యంగా తెరమీదకు వచ్చారో.. అంతే అనూహ్యంగా తెరమరుగు కానున్నారా? అన్న సందేహాలు బీజేపీ వర్గాలలోనే వ్యక్తం అవుతున్నాయి. రాష్ట్రంలోని 17 లోక్ సభ నియోజకవర్గాలకూ అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ వారిలో నలుగురికి తప్ప మిగిలిన వారందరికీ బీఫారంలు అందజేసింది.
పెద్దపల్లి నుంచి గోమాస శ్రీనివాస్, మహబూబాబాద్ నుంచి సీతారాం నాయక్, నల్గొండ నుంచి సైదిరెడ్డి, హైదరాబాద్ నుంచి మాధవీలతలకు పార్టీ బీఫారంలు నిలిపివేసింది. వీరిలో గోమాస శ్రీనివాస్, సైదిరెడ్డిను మారుస్తారని గత కొంత కాలంగా ప్రచారం జరుగుతోంది. పెద్దపల్లి ఎంపీ నేతకాని వెంకటేష్ బీజేపీలో చేరి ఆ పార్టీ తరపున పోటీ చేసే అవకాశం ఉందని అంటున్నారు. ఇక సైదిరెడ్డి విషయంలో బీజేపీ నేతల్లోనే తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతున్న నేపథ్యంలో ఆయన స్థానొంలో తేరా చిన్నపరెడ్డిని ఖరారు చేసే అవకాశాలున్నాయని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. అలాగే సీతారాం నాయక్ విషయంలో కూడా పార్టీ హైకమాండ్ అసంతృప్తితో ఉంది. ఆయన ప్రచారం కూడా చేయడం లేదని అంటున్నారు.
అయితే మాధవీలతకు బీఫారం నిలిపివేయడం పట్లే బీజేపీ వర్గాల్లో సైతం విస్మయం వ్యక్తం అవుతోంది. పార్టీ సభ్యత్వం కూడా లేని మాధవీలతను బీజేపీ హైదరాబాద్ అభ్యర్థిగా ప్రకటించిన అధిష్ఠానం.. ఆమె బీజేపీ గూటికి చేరి, జోరుగా కూడా ప్రచారం ప్రరంభించేసిన అనంతరం ఇలా బీఫారం నిలిపివేయడానికి కారణమేమిటన్న చర్చ విస్తృతంగా జరుగుతోంది.
అయతే మాధవీలత భర్తకు చెందిన ఓ ఆసుపత్రిపై కరోనా సమయంలో వచ్చిన ఆరోపణల కారణంగానే మాధవీలతకు బీజేపీ హైకమాండ్ బీఫారం నిలిపివేసిందన్న చర్చ జరుగుతోంది. అయితే ఆ ఆసుపత్రిపై కరోనా సమయంలో వచ్చిన ఆరోపణలు ఇప్పుడు కొత్తగా బీజేపీ అధిష్ఠానం దృష్టికి వచ్చిందా అని మాధవీలత మద్దతు దారులు నిలదీస్తున్నారు. మొత్తం మీద ప్రచారంలో దూసుకుపోతు... హైదరాబాద్ నియోజకవర్గంలో గెలుపు అవకాశాలను మెరుగుపరుచుకుంటున్న మాధవీలతకు హైకమాండ్ బీఫారం నిలిపివేయడంతో బీజేపీ క్యాడర్ లో అయోమయం నెలకొంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/bjp-stop-bform-to-madhavilatha-39-174303.html
యథారాజా తథా ప్రజా అన్నది నానుడి. కానీ వైసీపీ విషయంలో మాత్రం యథా అధినేత, తథా ఆ పార్టీ నాయకులు అని మార్చుకోవాల్సి ఉంటుంది. ఎన్నికల వేళ వైసీపీ అరాచకాలు రోజు రోజుకూ పెచ్చరిల్లుతున్నాయి.
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో 2016లో ఆత్మహత్య చేసుకున్నవిద్యార్థి రోహిత్ వేముల దళితుడు కాదని,
మరో పది రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల నేపథ్యంలో సంపన్న అభ్యర్థి ఎవరు అన్నది చర్చనీయాంశమైంది.
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు
రాజకీయాల్లో విమర్శలు, ప్రతివిమర్శలు.. అవమానాలు, అభినందనలు సర్వసాధారణమే. నాకు వాళ్లు గౌరవం ఇవ్వలేదు.. నన్ను వాళ్లు విమర్శించారంటూ.. వ్యక్తిగతంగా కక్ష పెంచుకుంటే సదరు నేతకు రాజకీయ భవిష్యత్తుతో పాటు.. మానసిక ప్రశాంతత కూడా దూరమవుతుంది. అదే పరిస్థితి ప్రస్తుతం మాజీ మంత్రి, కాపు ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభంకు ఎదురవుతోంది.
మీరేదో పనిలో వుంటారు.. లేదా ట్రావెల్ చేస్తూ వుంటారు... లేదా కుటుంబ సభ్యులతో సరదాగా గడుపుతూ వుంటారు.
కోవిషీల్డ్ తో గుండె జబ్బులు, మెదడు సంబంధిత వ్యాధులు వస్తాయని ఆస్ట్రాజెనికా అంగీకరించిన రెండు రోజుల వ్యవధిలోనే కోవిన్ సర్టిఫికేట్లపై ప్రధాని నరేంద్ర మోడీ ఫోటో అదృశ్యమైంది. వ్యాక్సిన్ పై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోన్న ఈ సమయంలో ఆ సర్టిఫికెట్లపై ప్రధాని ఫోటో మాయమవ్వడం అనేక అనుమానాలకు కారణం అవుతోంది.
police filed murder attempt case on perni kittu, perin kittu, murder attempt case, ap politics
తెలంగాణలో లోక్ సభ ఎన్నికలలో అందరి దృష్టీ విశేషంగా ఆకర్షిస్తున్న స్థానం ఏదైనా ఉందీ అంటే అది ఖమ్మం లోక్ సభ నియోజకవర్గం మాత్రమే. అధికార కాంగ్రెస్ పార్టీకి ఈ నియోజకవర్గంలో విజయం నల్లేరు మీద బండి నడకే అని మొదటి నుంచీ అంతా భావిస్తూ ఉన్నారు. అయితే అభ్యర్థి ఎంపికలో జరిగిన జాప్యం కారణంగా చేజేతులా కాంగ్రెస్ ఖమ్మంలో అవకాశాలను చే జార్చుకుంటోందా అన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి.
పార్లమెంట్ ఎన్నికలలో తెలంగాణలో బీఆర్ఎస్ సాధించే స్కోరు జీరో అనే విషయంలో అందరికీ క్లారిటీ వుంది. బీఆర్ఎస్ నాయకులకు
బిఆర్ఎస్ ఎంఎల్సి దండె విఠల్ ఎన్నిక చెల్లదని హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ఆదిలాబాద్ స్థానిక సంస్థల నియోజవర్గం నుంచి బిఆర్ఎస్ అభ్యర్థిగా 2022లో దండె విఠల్ ఎన్నికయ్యారు.
ఏపీలో బీజేపీ రెండు పడవల మీద ప్రయాణం సాగిస్తోందా? పేరుకు పొత్తు తెలుగుదేశం, జనసేనతో.. మద్దతు మాత్రం అధికార వైసీపీకే అన్నట్లుగా ఆ పార్టీ తీరు ఉందా? అంటే పరిశీలకులు ఔననే అంటున్నారు. సార్వత్రిక ఎన్నికలలో భాగంగా దేశంలో ఇప్పటికే రెండు దశల పోలింగ్ పూర్తయ్యింది. రెండు దశల పోలింగ్ సరళిని పరిశీలించిన రాజకీయ నిపుణులు ఉత్తరాదిలో, ఈశాన్య రాష్ట్రాలలో బీజేపీ భారీగా నష్టపోవడం ఖాయమని గంటాపథంగా చెబుతున్నారు.