బీజేపీ అమ్ములపొదిలో రామబాణం

Publish Date:Feb 18, 2021

Advertisement

దేశమంతా కాషాయ జెండా ఎగరేయడమే బీజేపీ ఎజెండా. ఇప్పటికే ఉత్తరాది రాష్ట్రాల్లో బీజేపీ తిరుగులేని పట్టు సాధించింది. దక్షిణాదిపై ఎప్పటి నుంచో గురి పెట్టింది. అయితే.. కర్ణాటక మినహా సదరన్ స్టేట్స్ అంత ఈజీగా కాషాయ పరం కావటం లేదు. ప్రాంతీయ పార్టీలు బలంగా ఉండటమే ఇందుకు కారణం. అందుకే, జాతీయ పార్టీల కూటమిల ఆధిపత్యం ఉన్న కేరళపై కన్నేసింది కమలదళం. అందుకు, కేరళపై బీజేపీ వదల బోతున్న రామబాణం మెట్రో మ్యాన్ శ్రీధరన్.

దేశవ్యాప్తంగా కామ్రేడ్ల ప్రభ కనుమరుగవుతోంది. బెంగాల్, త్రిపురలో ఎర్రదండు తోక ముడిచింది. ఒక్క కేరళలోనే సీపీఐ(ఎమ్) అధికారంలో ఉంది. అక్కడ కమ్యూనిష్టులను గద్దె దింపితే.. ఇక ఇండియా మ్యాప్ నుంచి వామపక్ష అధికారాన్ని తొలగించినట్టే. అయితే.. అది అంత ఈజీగా జరిగే పని కాదని బీజేపీకీ తెలుసు. కేరళలో ఆ పార్టీ ఖాతా తెరవడమే కష్టంగా మారింది. ఢిల్లీలో రైతుల ఆందోళనతో మోదీ గ్రాఫ్ దారుణంగా పడిపోతోంది. డీజిల్, పెట్రోల్ ధర సెంచరీ వైపు పరుగులు పెడుతుండటం, సామాన్యుడిపై గ్యాస్ గుదిబండగా మారిన ప్రస్తుత పరిస్థితుల్లో కేరళలో మళ్లీ ఎల్.డి.ఎఫ్ అధికారంలోకి వస్తుందని విశ్లేషకులు అంటున్నారు. పంజాబ్ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టినట్టే.. త్వరలో జరగబోవు కేరళ అసెంబ్లీ ఎలక్షన్స్ లో వామపక్షాలకు లేదంటే కాంగ్రెస్.. ఆ ఇద్దరిలో ఒకరికి అధికారం దక్కుతుందని తేల్చి చెబుతున్నారు. పరిస్థితులు ఇంత వ్యతిరేకంగా ఉన్నా.. కమలనాథులు కేరళపై ఏమాత్రం ఆశ వదులుకోవడం లేదు.

కేరళలో కమ్యూనిస్టుల పాలనను అంతం చేసేందుకు బీజేపీ రామబాణం సిద్ధం చేస్తోంది.  ఢిల్లీ మెట్రో రూపకర్త, మెట్రో మ్యాన్ గా పేరున్న కేరళకు చెందిన శ్రీధరన్ ను బీజేపీలో చేర్చుకునేలా సన్నాహాలు చేస్తోంది. శ్రీధరన్ తమ పార్టీలో చేరుతున్నారంటూ కేరళ రాష్ట్ర బీజేపీ ప్రకటించింది.  ఈ నెల 21న కేరళలో బీజేపీ ‘విజయ యాత్ర’ నిర్వహించనుందని. ఆ సందర్భంగా శ్రీధరన్ బీజేపీలో చేరుతారని కేరళ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు సురేంద్రన్ ప్రకటించారు. కేరళలో బీజేపీ అధికారంలోకి వస్తేనే న్యాయం జరుగుతుందని, బీజేపీ ఒప్పుకుంటే తాను ఎన్నికల బరిలోకి దిగడానికి సిద్ధంగానే ఉన్నానని శ్రీధరన్ గతంలోనే ప్రకటించారు. ఆయనొస్తే.. పార్టీ ఇమేజ్ మరింత పెరుగుతుందని.. విద్యావంతులు అధికంగా ఉండే కేరళలో శ్రీధరన్ కు చాలా క్రేజ్ ఉంటుందని అంచనా వేస్తోంది. అయితే.. ఎలాంటి రాజకీయ, పాలనా అనుభవం లేని శ్రీధరన్ ఇమేజ్ బీజేపీకి ఏమేరకు కలిసొస్తుందో చూడాలి. 

 

By
en-us Political News

  
ఖమ్మంలో బీఆర్‌ఎస్‌కు భారీ షాక్ తగిలింది.
పైరసీ, కాపీ రైట్ ఉల్లంఘనలు, అక్రమ ప్రసారాలు, ఆర్థిక లావాదేవీలకు సంబంధించి పలు అంశాలు విచారణలో వెలుగు చూసిన నేపథ్యంలో ఐబోమ్మ రవికి బెయిలు మంజూరు చేయవద్దంటూ పోలీసులు కోర్టుకు తెలిపారు.
ఈ విమానాశ్రయం కోసం పార్లమెంటులో తాను పలుమార్లు గట్టిగా గళమెత్తానని చెప్పుకున్నారు. ఇప్పుడూ విమానాశ్రయం దాదాపుగా పూర్తై.. త్వరలో ఆపరేషన్స్ ప్రారంభం కావడానికి రెడీ అవుతుండటం తనకు చాలా సంతోషంగా ఉందన్నారు. అంతే తప్ప ఈ విమానాశ్రయం విషయంలో జరుగుతున్న రాజకీయ రచ్చ గురించి ఒక్కటంటే ఒక్క మాట మాట్లాడలేదు. అలాగే ఈ విమానాశ్రయానికి రెండో సారి శంకుస్థాపన చేసిన జగన్ ఊసెత్తలేదు.
తెలంగాణలో మరో కొత్త పార్టీ రాబోతోంది.
ఇబ్రహీంపట్నం కాంగ్రెస్ ఎమ్మెల్యే మల్‌ రెడ్డి రంగారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఎలాగైనా అధికారాన్ని నిలబెట్టుకోవాలని అధికార డీఎంకే, బీజేపీతో పొత్తు ఉపయోగించుకుని రాష్ట్రంలో అధికారపగ్గాలు చేజిక్కించుకోవాలని ప్రతిపక్ష అన్నాడీఎంకే వ్యూహాలు రచిస్తున్నాయి. ఇక రాజకీయ పార్టీ స్థాపించి సినీ రంగం నుంచి రాజకీయరంగంలోకి దూకిన హీరో విజయ్ తన టివీకే పార్టీ తరఫున ఒంటరిగా ఎన్నికల రణరంగంలోకి దిగనున్నారు.
రండవాణేలోని కల్మాడీ హౌస్‌లో ఆయన భౌతికకాయాన్ని ప్రజల సందర్శనార్థం ఉంచుతారు. ఆ తరువాత సాయంత్రం మూడున్నర గంటలకు పుణెలోని వైకుంఠ శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
ఫోన్ ట్యాపింగ్ ఎక్విపిమెంట్ కొనుగోలుకు అవసరమైన డబ్బును సమకూర్చింది నవీన్ రావే అని సిట్ విచారణలో తేలింది. అంతే కాకుండా, పాల్ రవి కుమార్ ద్వారా ట్యాపింగ్ ఎక్విపిమెంట్‌ను సమకూర్చినట్లు సిట్ నిర్ధారణకు వచ్చింది. పోన్ ట్యాపింగ్ కు ఒక ప్రైవేటు వ్యవహారంగా కాకుండా అది వ్యవస్థీకృతంగా పని చేసిందని నవీన్ రావు విచారణలో బయటపడినట్లు తెలుస్తోంది.
ఈ కేసుకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ ను సుప్రీం ధర్మాసనం డిస్మిస్ చేసింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్ రావును విచారించేందుకు అనుమతి ఇవ్వాలంటూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా వాదనలు వినిపించారు.
రద్దు చేసిన కమిటీల స్థానంలో నెల రోజుల పాటు ఉండేలా అడ్ హాక్ కమిటీలను నియమిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కమిటీలు రాష్ట్ర వ్యాప్తంగా క్షేత్రస్థాయిలో పర్యటించి అందజేసే నివేదిక ఆధారంగా కొత్త కమిటీలను ప్రకటించనున్నట్లు పేర్కొన్నారు.
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత మరోసారి హరీష్ రావుపై హాట్ కామెంట్స్ చేశారు.
కొత్త సంవత్సరం చేతినిండా, నోటి నిండా పని పెట్టనుంది. ఎందుకంటే ఈ ఏడాది పలు రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలోనే జాతీయ, ప్రాంతీయ రాజకీయ పార్టీలన్నీతమతమ వ్యూహాలు, ఎత్తుగడలకు పని చెప్పనున్నాయి. పెద్ద రాష్ట్రాలుగా ఉన్న పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ రాష్ట్రాల అసెంబ్లీలకు 2026 తొలి అర్ధ భాగంలోనే ఎన్నికలు జరగనున్నాయి.
అందె శ్రీ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించాలని తమ ప్రభుత్వం నిర్ణయించిందనీ, ఇందుకోసం చట్టపరమైన మద్దతు అవసరమని చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో 1994పబ్లిక్ సర్వీస్ కమిషన్ చట్టంలోని నిబంధనలు సవరించాల్సి ఉందని తెలిపారు. అందె శ్రీ కుమారుడికి ఉద్యోగ అవకాశం కల్పించడం కోసం చేసిన సవరణ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టామన్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.