ఆంధ్రప్రదేశ్ రాజధానిపై భారతీయ జనతా పార్టీలో కన్ఫ్యూజన్ కంటిన్యూ అవుతోంది. రాజధాని రాష్ట్ర పరిధిలోని అంశమని కేంద్రం చెబుతుండగా.. రాష్ట్ర నేతలు మాత్రం ఎవరి కోణంలో వారు రోజుకోలా మాట్లాడుతూ అయోమయం స్పష్టిస్తున్నారు. పార్టీ చీఫ్ సోము వీర్రాజు తన ప్రకటనలతో రాజధానిపై మరింత గందరగోళపరుస్తున్నారు.
కన్నా లక్ష్మినారాయణ చీఫ్ గా ఉన్నప్పుడు కమలంపార్టీలో కేపిటల్ పై ఫుల్ క్లారిటీ ఉండేది. అమరావతి రైతుల ఉద్యమానికి కన్నా మద్దతు కూడా ఇచ్చారు. పాలనా వికేంద్రకరణకు వ్యతిరేకంగా, జగన్ సర్కార్ నిర్ణయాన్ని తప్పుపడుతూ వరుసగా ప్రకటనలు చేసారు. సోమ్ము వీర్రాజుకు పార్టీ పగ్గాలు వచ్చాకే కన్ఫ్యూజన్ పెరుగుతోంది. అమరావతిలో ఒకలా. విశాఖలో మరోలా.. రాయలసీమలో ఇంకోలా మాట్లాడుతుండటంతో రాజధానిపై సోము వీర్రాజు స్టాండ్ ఏంటన్నది ఎవరికి అర్ధం కావడం లేదు.
తాజాగా విశాఖ పర్యటనలో రాజధానిపై మరో సంచలన వ్యాఖ్య చేశారు సోము వీర్రాజు. తాము 2024లో అధికారంలోకి వస్తే 9 వేల ఎకరాల్లో రాజధాని కట్టి చూపిస్తామన్నారు. రాజధాని విషయంలో టీడీపీ, వైసీపీ ప్రభుత్వాలు తప్పులే చేస్తున్నాయన్నారు. అమరావతిలో రైతులకు 64 వేల ప్లాట్లు ఇచ్చేస్తామని తెలిపారు. అయితే రాజధాని ఎక్కడన్నది మాత్రం ఆయన క్లారిటీ ఇవ్వలేదు. దీంతో సోము వీర్రాజు చెప్పిన 9 వేల ఎకరాల రాజధాని ఎక్కడన్న దానిపై మళ్లీ చర్చలు మొదలయ్యాయి. విశాఖలో మాట్లాడారు కాబట్టి విశాఖలోనే అయి ఉంటుందని కొందరు అభిప్రాయపడుతుండగా.. రాజధాని కోసం ఇప్పటికే భూములు సేకరించిన అమరావతి గురించే సోము చెప్పారని మరికొందరు చెబుతున్నారు.
ఏపీ బీజేపీ చీఫ్ గా నియమించిన కొన్ని రోజులకే ఓ ఛానెల్ ఇంటర్వ్యూలో రాజధాని అంశంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు సోము వీర్రాజు. 13 జిల్లాలున్న రాష్ట్రానికి 13 రాజధానులు ఉంటే తప్పేంటన్నారు. అయితే సోము పార్టీ పగ్గాలు తీసుకుంటున్న కార్యక్రమంలోనే ఆయనకు షాకిచ్చారు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్. రాష్ట్రానికి ఒక్క రాజధానే ఉండటమే మంచిదన్నారు. దేశంలో ఏ రాష్ట్రానికి మూడు రాజధానులు లేవన్నారు మాధవ్. దేశంలో పెద్ద రాష్ట్రమైన యూపీలో.. ఒక్క రాజధాని ఉన్న సరైన పాలన జరగడం లేదా అని రాంమాధవ్ ప్రశ్నించారు. కన్నా పార్టీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు కూడా రాజధానిపై సోము వీర్రాజు అయోమయంగానే మాట్లాడేవారు. అమరావతి రైతులకు న్యాయం జరగాలంటూనే చంద్రబాబు పాలనపై విమర్శలు చేసేవారు. రాజధాని విషయంలో కేంద్రానికి సంబంధం లేదంటూనే..పాలనా వికేంద్రీకరణతో ప్రజలకు మంచి జరుగుతుందనేవారు సోము వీర్రాజు.
కేంద్ర సర్కార్ వైఖరి, బీజేపీ జాతీయ నేతల అభిప్రాయాలు, రాష్ట్ర నేతల తీరు భిన్నంగా ఉండటంతో రాజధానిపై కమలనాధులకు స్పష్టత లేనట్లు కనిపిస్తోంది. అమరావతికి మద్దతుగా కన్నా మాట్లాడుతున్నా హైకమాండ్ వారించ లేదు. రాంమాధవ్ కూడా మూడు రాజధానులను వ్యతిరేకించారు. దీంతో అమరావతి వైపే బీజేపీ హైకమాండ్ అని భావించారు. ఇప్పుడు సోము వీర్రాజు మాత్రం మరోలా మాట్లాడుతున్నారు. అధిష్టానం ఆదేశాలు లేకుండా ఆయన ముందుకు వెళ్లరని చెబుతున్నారు. దీంతో ఏపీ రాజధాని విషయంలో బీజేపీ డబుల్ రోల్ పోషిస్తుందనే అనుమానాలు ప్రజల్లో వస్తున్నాయి. టీడీపీ కూడా ఇదే ఆరోపిస్తోంది. ఇప్పటికైనా బీజేపీ స్పష్టమైన వైఖరి చెబితే బాగుంటుందనే డిమాండ్లు ప్రజల నుంచి వస్తున్నాయి.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/bjp-president-somu-veerraju-sensational-comments-on-ap-capital-25-103849.html
తెలుగువన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఏబీ వెంకటేశ్వరరావు తమిళనాడులో ఇటీవల జరిగిన రాజకీయ పరిణామాలను.. ముఖ్యంగా విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ సాధించిన విజయాలను ఏబీ వెంకటేశ్వరరావు ఆసక్తికరంగా విశ్లేషించారు. ఎవరూ ఊహించని మార్పులు రాజకీయాల్లో సంభవిస్తాయని, ప్రజలు మార్పును కోరుకున్నప్పుడు అసాధ్యం సుసాధ్యం అవుతుందని అన్నారు.
టీవీకే నేత ఆదవ అర్జునకు, వీసీకే అధినేత తిరుమావళవన్ స్వయంగా మద్దతు లేఖను అందజేశారు. ఈ కీలక పరిణామంతో అసెంబ్లీలో టీవీకే కూటమి సంఖ్యా బలం ఇప్పుడు 118కి చేరింది.
అధికారులు సచివాలయంలోని ఏసీ గదులలో కూర్చుని పని చేసే విధానానికి స్వస్థి చెప్పారు. అమరావతిలో జరిగిన కలెక్టర్ల సదస్సులో ప్రసంగిస్తూ.. పౌరుల ఫిర్యాదులను నేరుగా క్షేత్రస్థాయిలో పరిష్కరించడానికి అధికారులు తమ కార్యాలయాలను విడిచిపెట్టి ప్రజల వద్దకు వెళ్లాలని ఆదేశించారు.
సువేందు అధికారి రాజకీయ నేపథ్యాన్ని పరిశీలిస్తే.. కాంగ్రెస్ సంప్రదాయ కుటుంబం నుంచి వచ్చిన సువేందు, రాజకీయ ఓనమాలు అక్కడే నేర్చుకున్నారు. ఆయన తాత కెనరామ్ అధికారి స్వాతంత్ర్య సమరయోధుడు కాగా, తండ్రి శిశిర్ అధికారి కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతగా రాణించారు. సువేందు అధికారి మమతా బెనర్జీ స్థాపించిన తృణమూల్ కాంగ్రెస్లో చేరి ఆ పార్టీలో కీలక నేతగా ఎదిగారు.
కరీంనగర్ లోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ పై జరిగిన దాడిని నిరసిస్తూ బీఆర్ఎస్ నాయకత్వం బంద్ పిలుపునిచ్చిన నేపథ్యంలో . శనివారం ( మే 9) ఉదయం నుండే నగరంలోని ప్రధాన కూడళ్లలో పోలీసులు భారీగా మోహరించారు. ఎమ్మెల్యే గంగుల కమలాకర్ నిరసనలో పాల్గొనకుండా పోలీసులు ఆయన ఇంటి వద్ద బారికేడ్లు ఏర్పాటు చేసి బయటకు రాకుండా అడ్డుకున్నారు. దీనిపై బీఆర్ఎస్ కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రభుత్వానికి, పోలీసులకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
ముఖ్యంగా పార్టీలో అభిషేక్ బెనర్జీ పెత్తనం పెరగడం వల్లే సువేందు అధికారి వంటి బలమైన నేతలు టీఎంసీని వీడారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. క్షేత్రస్థాయిలో పట్టున్న నాయకులను కాదని, కార్పొరేట్ తరహా రాజకీయాలకు అభిషేక్ బెనర్జీ ప్రాధాన్యత ఇవ్వడం తృణమూల్కు ప్రతికూలంగా మారిందంటున్నారు.
ఆంధ్రోళ్లను తిట్టి ఓట్లు దండుకున్న బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో ప్రాజెక్టుల పేరుతో దోపిడీకి పాల్పడిందని సంచలన వ్యాఖ్యలు చేశారు.
ప్రస్తుత ఎన్నికల ఫలితాలు కేరళలో పెను మార్పులకు నాంది పలికాయి. యూడీఎఫ్ స్పష్టమైన మెజారిటీ సాధించడంతో.. కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు మొదలయ్యాయి. ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి అభ్యర్థి ఎంపికపై కసరత్తు జరుగుతోంది. కేసీ వేణుగోపాల్ అనుభవం, రాహుల్ గాంధీతో ఉన్న సాన్నిహిత్యం ఆయనకు ప్రధాన బలంగా మారాయి.
టీవీకే అధినేత విజయ్కు కాంగ్రెస్ మద్దతు తెలపడంపై ఆగ్రహంగా ఉన్న డీఎంకే.. కాంగ్రెస్కు కటీఫ్ చెప్పేసింది. మారిన రాజకీయ పరిస్థితుల దృష్ట్యా, లోక్సభలో తమ పార్టీ సభ్యులకు కాంగ్రెస్ ఎంపీలతో కాకుండా విడిగా సీటింగ్ కేటాయించాలని డీఎంకే ఎంపీ కనిమొళి స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారు.
తాజా సమాచారం ప్రకారం.. విజయ్ తన పార్టీకి ఉన్న బలానికి తోడుగా మరో మూడు పార్టీల మద్దతును కూడగట్టుకున్నారు. ఆ పార్టీల మద్దతుతో అధికారం చేపట్టడానికి అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 118ని ఆయన సాధించారు.
తమిళనాడులో ఇటీవల జరిగిన ఎన్నికల తర్వాత, విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమవ్వగా.. మెజారిటీ నిరూపణ విషయంలో రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ కచ్చితమైన నిబంధనలు పాటించాలని పట్టుబడుతున్నారు. విజయ్ కు తన పార్టీ ఎమ్మెల్యేలు 107 మందికి అదనంగా కాంగ్రెస్ నుంచి గెలిచిన ఐదుగురు ఎమ్మెల్యేల మద్దతు కూడా ఉంది.
పదవి నుంచి తొలగించిన అనంతరం ఎస్వీఎస్ఎన్ వర్మ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. పార్టీ తీసుకున్న ఈ నిర్ణయం తనకు ముందే తెలుసని, నాయకత్వం నుంచి సమాచారం అందిందని చెప్పారు. అయితే పార్టీ కోసం ఎన్నో ఏళ్లుగా కష్టపడి.. క్షేత్రస్థాయిలో కేడర్ను కాపాడుకుంటూ వచ్చిన తనకు ఈ పరిణామం మనస్తాపానికి గురిచేసిందన్న ఆవేదన కూడా వ్యక్తం చేశారు.
బాబు కూటమిని ఎందుకంత విలువైనదిగా భావిస్తున్నారంటే.. కారణం వైసీపీ. ఆ పార్టీ కూటమి ఎప్పుడెప్పుడు చీలిపోతుందాని కాచుకుని కూర్చుని ఉంది. ఏ అవకాశం వచ్చినా వారు వదిలిపెట్టినట్టే కనిపించదు. మొన్న కోట వినుత ఘటన, నిన్న అరవ శ్రీధర్ వ్యవహారం, ఇవాళ వర్మ ఇష్యూ.. ఇలా సమయం దొరికినపుడల్లా ఆయా అంశాలను బాగా హైలెట్ చేసి.. కూటమిలో ఏదో ఒక చిచ్చు రాజేయాలని చూస్తోంది వైసీపీ అధినాయకత్వం.