విపక్షాల తీరుకు నిరసనగా దేశవ్యాప్త నిరసనలక బీజేపీ కార్యాచారణ

Publish Date:Apr 18, 2026

Advertisement

లోక్‌సభలో మహిళా రిజర్వేషన్ బిల్లు వీగిపోవడంపై బీజేపీ మండిపడుతోంది. దేశంలోని సగం జనాభా ప్రయోజనాలను విపక్షాలు కాలరాశాయని ఫైర్ అవుతోంది.  దీనికి నిరసనగా దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టాలని  నిర్ణయించింది. చారిత్రాత్మకమైన ఈ బిల్లును అడ్డుకోవడం ద్వారా ప్రతిపక్షాలు తమ మహిళా వ్యతిరేక ధోరణిని బయటపెట్టుకున్నాయని విమర్శిస్తోంది.పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో భాగంగా లోక్‌సభలో ప్రవేశపెట్టిన 131వ రాజ్యాంగ సవరణ బిల్లుకు తగినంత మెజారిటీ లభించకపోవడంతో అది వీగిపోయిన సంగతి తెలిసిందే. రాజ్యాంగ సవరణకు అవసరమైన మూడింట రెండు వంతుల మెజారిటీ సాధించడంలో ప్రభుత్వం విఫలమైంది. ఓటింగ్‌లో పాల్గొన్న 528 మంది సభ్యులలో 298 మంది బిల్లుకు అనుకూలంగా ఓటు వేయగా, 230 మంది వ్యతిరేకించారు. బిల్లు ఆమోదం పొందాలంటే కనీసం 352 ఓట్లు అవసరం.

  ఈ పరిణామంపై స్పందించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా, విపక్షాల తీరును తీవ్రంగా తప్పుబట్టారు. మహిళలకు చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలనే ప్రభుత్వ సంకల్పాన్ని కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, సమాజ్ వాదీ పార్టీ వంటి పార్టీలు అడ్డుకున్నాయన్నారు. నారీ శక్తిని గౌరవించని విపక్షాలకు ప్రజలు తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. ఈ ఓటమి కేవలం ప్రభుత్వానిది కాదని, దేశంలోని కోట్లాది మంది మహిళల ఆకాంక్షలకు తగిలిన దెబ్బగా బీజేపీ అభివర్ణించింది.

రాజ్యాంగ సవరణ బిల్లుతో  ముడిపడి ఉన్న డీలిమిటేషన్ బిల్లు, కేంద్రపాలిత ప్రాంతాల సవరణ బిల్లులను కూడా ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. మహిళా రిజర్వేషన్ల అమలుకు పునర్విభజన ప్రక్రియ కీలకమని ప్రభుత్వం వాదించినప్పటికీ..  దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యం తగ్గుతుందనే ఆందోళనతో విపక్షాలు దీనిని తీవ్రంగా వ్యతిరేకించాయి. ముఖ్యంగా 2011 జనాభా లెక్కల ఆధారంగా నియోజకవర్గాల సంఖ్యను పెంచడం ద్వారా దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందని ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సహా పలువురు నేతలు వాదించారు.  

మహిళల హక్కులను అడ్డుకున్న విపక్షాల అసలు రంగును బయటపెడతామని బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్  హెచ్చరించారు. గ్రామం నుంచి నగరం వరకు నిరసనలుతెలియజేయాలని బీజేపీ కార్యకర్తలకు ఆయన పిలుపునిచ్చారు.  ఇప్పటికే ఎన్‌డీఏ భాగస్వామ్య పక్షాలతో సమావేశమైన బీజేపీ నేతలు.. రానున్న రోజుల్లో చేపట్టబోయే ఆందోళన కార్యక్రమాలపై  కార్యాచరణ  రూపొందించారు. పార్లమెంట్ ఆవరణలో కూడా ఎన్‌డీఏ మహిళా ఎంపీలు ప్లకార్డులతో నిరసన చేపట్టారు.  విపక్షాల మహిళా వ్యతిరేక ముఖం బయటపడిందంటూ నినాదాలు చేశారు.

మహిళా రిజర్వేషన్ల విషయంలో గత కొన్ని దశాబ్దాలుగా ఉన్న ప్రతిష్టంభనను తొలగించేందుకు మోదీ ప్రభుత్వం చేసిన ప్రయత్నాన్ని విపక్షాలు  రాజకీయ ప్రయోజనాల కోసం అడ్డుకున్నాయని  విమర్శించారు.  ఒకవైపు ప్రభుత్వం తన ప్రయత్నాన్ని సమర్థించుకుంటుండగా, మరోవైపు విపక్షాలు డీలిమిటేషన్ సాకుతో బీజేపీ రాజకీయ ప్రయోజనాలను పొందేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపిస్తున్నాయి.

ఈ నేపథ్యంలో బీజేపీ పిలుపునిచ్చిన దేశవ్యాప్త నిరసనలు ఏ మేరకు ప్రభావం చూపుతాయో  చూడాలి.ఈ బిల్లు వీగిపోవడం వల్ల 2029 ఎన్నికల్లో మహిళా రిజర్వేషన్ల అమలుపై సందిగ్ధత నెలకొంది. నియోజకవర్గాల పునర్విభజన లేకుండా మహిళలకు రిజర్వేషన్లు కల్పించడం సాధ్యం కాదని ప్రభుత్వం చెబుతోంది. ఈ రాజకీయ ప్రతిష్టంభన మధ్య మహిళా హక్కుల అంశం ఇప్పుడు వీధి పోరాటంగా మారనుంది.

By
en-us Political News

  
గడిచిన దశాబ్ద కాలంలో కేంద్రంలో తిరుగులేని శక్తిగా ఎదిగిన బీజేపీ, ప్రస్తుతం కొన్ని సవాళ్లను ఎదుర్కొంటోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
జగన్ పర్యటనలలో జరిగిన పలు సంఘటనలకు సంబంధించిన వీడియో ఆధారాలను వంగలపూడి అనిత ఈ సందర్భంగా ప్రదర్శించారు. సాధారణంగా ఎవరైనా పరామర్శకు వెళ్తే బాధితులను ఓదార్చడం, వారికి అండగా నిలవడం ఆనవాయితీ అనీ, కానీ జగన్ మాత్రం నిజమైన బాధితులను వదిలేసి నిందితులను పరామర్శించడానికి వెడుతున్నారనీ మండిపడ్డారు.
యూపీలో భారీ వర్షాలు, శాంతిభద్రతల పరిస్థితి, కోర్టు ఆదేశాలు కారణంగా చూపుతూ కాయస్థ పాఠశాల ట్రస్ట్ అనుమతిని ఉపసంహరించుకుంది. అయితే ఈ వివరణ సంతృప్తికరంగా లేదని కాంగ్రెస్ చెబుతోంది. అధికార యంత్రాంగం, బీజేపీ ప్రభుత్వ ఒత్తిడి కారణంగానే రాహుల్ సభకు అనుమతి ఇవ్వడం లేదని ఆరోపిస్తోంది.
కనీసం తనతో సంప్రదించకుండా ఏకపక్షంగా అంబటి రాంబాబు పాదయాత్ర ప్రకటన చేయడంపై జగన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతో గత్యంతరం లేక అంబటి పాదయాత్ర విరమించుకున్నారని పార్టీ వర్గాల సమాచారం.
వైసీపీకి కోర్టులు, న్యాయమూర్తులు, చట్టం, న్యాయం వంటి విషయాలలో పెద్దగా పట్టింపు లేదని గతంలో పలుమార్లు రుజువైంది. అలాగే ఇప్పుడు కూడా కోర్టు తీర్పులు కోర్టువే, మా దారి మాదే అన్న చందంగా విజయవాడ వేదికగా వైసీపీ విద్యార్థి, యువజన విభాగాలు రాష్ట్రవ్యాప్తంగా నిరసనలకు దిగాయి. 
ఇప్పటి వరకూ  గ్రామ పంచాయతీ స్థాయిలో సర్పంచులను మాత్రమే ప్రజలు నేరుగా ప్రత్యక్ష ఓటింగ్ ద్వారా ఎన్నుకుంటున్నారు. అయితే, మండల స్థాయిలో ఎంపీపీలు, జిల్లా స్థాయిలో జడ్పీ ఛైర్మన్లతో పాటు మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ఛైర్మన్లు, మేయర్ల ఎంపిక పరోక్ష పద్ధతిలోనే జరుగుతోంది.
నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్‌డీఏ ప్రభుత్వం త్వరలోనే విమానాల్లో ఉపయోగించే ఏవియేషన్ టర్బైన్ ఇంధనం (ఏటీఎఫ్)లో కూడా ఇథనాల్‌ను మిశ్రమం చేయడానికి సన్నాహాలు చేస్తోందంటూ ఆయన బాంబు పేల్చారు.
రాహుల్ గాంధీ నీట్ లీకేజీ వ్యవహారం కేవలం కేంద్ర విద్యాశాఖ వైఫల్యం మాత్రమే కాదంటున్నారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా విద్యార్థుల పోరాటానికి లభించిన తొలి విజయమేనంటూ, ఢిల్లీలో గత నెల 20న శాంతియుతంగా నిరసన తెలుపుతున్న విద్యార్థులపై జరిగిన పోలీసుల లాఠీఛార్జ్, పెల్లెట్ తుపాకుల వినియోగానికి నేరుగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.
గత కొన్ని నెలలుగా ఇరాన్, ఒమన్ మధ్య ఉన్నత స్థాయి సంప్రదింపుల ఫలితంగా కొత్త రూట్ ప్రతిపాదనపై ఓ ఒప్పందం కుదిరింది. సాంకేతిక, చట్ట, భద్రతా కోణాల్లో సమగ్ర సమీక్షలు జరిపిన అనంతరం, ఈ కొత్త రూట్ కు సంబంధించి ఇరు దేశాలు ఓ అవగాహనకు వచ్చాయి.
వచ్చినది పోగాకు రైతుల కష్టాలు విని, వారికి అండగా ఉన్నానని సంఘీభావం తెలపడం. అయితే ఈ పర్యటనలో జనగ్   రైతులను కలవడం, వారి కనీస హామీ ధర డిమాండ్ల కోసం పోరాడటం కంటే, బల ప్రదర్శనకే ప్రాధాన్యత ఇచ్చారు. ఇక తన ప్రసంగం కూడా పరమ రొట్టకొట్టుడు పద్ధతిలో సాగింది.
2024 అసెంబ్లీ ఎన్నికలలో ఆముదాలవలస నియోజకవర్గం నుంచి ఓటమి పాలైనప్పటి నుంచీ తమ్మినేని రాజకీయంగా ఒకింత ఇన్ యాక్టివ్ గానే ఉంటూ వస్తున్నారు. వైసీపీ అధినేత జగన్ కూడా తమ్మినేనిని ఆముదాలవలస నియోజకవర్గ బాధ్యతల నుంచి తప్పించి శ్రీకాకుళం పార్లమెంట్ పరిశీలక బాధ్యతలను అప్పగించారు. ఈ నిర్ణయం తమ్మినేనిలో తీవ్ర అసంతృప్తికి కారణమైందని ఆయన అనుచరులు చెబుతున్నారు.
వైఎస్ జగన్ ఆదేశిస్తే ఏమైనా చేస్తానంటూ సంచలన ప్రకటనలు చేస్తూ నిత్యం వార్తల్లో నిలిచారు. అలాగే బోరుగడ్డ అనిల్ తన నోటి దురుసు, అనుచిత వ్యాఖ్యల కారణంగా తొమ్మిది నెలలపాటు జైలు జీవితం కూడా గడపాల్సి వచ్చింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.