జగన్ ఎమ్మెల్యేలు, ఎంపీలకు బీజేపీలో నో ఎంట్రీ!

Publish Date:Jun 10, 2024

Advertisement

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలలో జగన్ పార్టీ ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. రాష్ట్రంలోని 175 అసెంబ్లీ స్థానాలకు గాను కేవలం 11 స్థానాలలోనే వైసీపీ విజయం సాధించింది. అలాగే పాతిక లోక్ సభ స్థానాలకు గాను కేవలం నాలుగంటే నాలుగు చోట్ల మాత్రమే విజయం సాధించింది. ఇప్పుడు వైసీపీ నుంచి విజయం సాధించిన ఎమ్మెల్యేలు, ఎంపీలూ పార్టీ నుంచి దూకేయడానికి దారులు వెతుక్కుంటున్నారు. 

అధికారంలో ఉండగా తాము చేసిన తప్పిదాలు, అక్రమాలకు ఫలితం అనుభవించాల్సి ఉంటుందన్న భయంతో వణికి పోతున్నారు. కేసుల నుంచి తప్పించుకోవడానికి బీజేపీని శరణు జొచ్చాలన్న భావనలో ఉన్నారు. ఇప్పటికే కడప లోక్ సభ స్ధానం నుంచి విజయం సాధించిన వైఎస్ అవినాష్ రెడ్డి ఆ దిశగా అడుగులు వేస్తున్నట్లు రాజకీయవర్గాలలో విస్తృతంగా చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో జమ్మలమడుగు నుంచి బీజేపీ అభ్యర్థిగా విజయం సాధించిన ఆదినారాయణ రెడ్డి అటువంటి పప్పులుడకవని కుండబద్దలు కొట్టేశారు. 

వైసీపీ నుంచి గెలుపొందిన కొద్ది మంది ఎమ్మెల్యేలు, ఎంపీలూ బీజేపీలోకి మారిపోదామని ప్రయత్నాలు చేస్తున్నారనీ, ప్రణాళికలు రచ్చిస్తున్నారనీ అయితే ఆ పప్పేలేమీ ఉడకవనీ, వైసీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలను ఎట్టి పరిస్థితుల్లోనూ బీజేపీలోకి తీసుకోబోమనీ కుండబద్దలు కొట్టేశారు. బీజేపీ అగ్రనాయకత్వం ఇందుకు అంగీకరించే ప్రశక్తే లేదని అన్నారు. ఎందుకంటే అటువంటి నేతలను పార్టీలో చేర్చుకోవడం చంద్రబాబుకు ఆగ్రహం తెప్పింస్తుందనీ, అది బీజేపీకి నష్టం అని వ్యాఖ్యానించారు.   కేంద్రంలోని బీజేపీ సర్కార్ పూర్తిగా తెలుగుదేశం ఎంపీల మద్దతుపై ఆధారపడి ఉందని గుర్తు చేశారు. 

ఆదినారాయణరెడ్డి సోమవారం అమరావతిలో పర్యటించి, అక్కడ జరుగుతున్న పనులను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. జగన్ ఘోర పరాజయానికి అమరావతి రైతుల చారిత్రాత్మక పోరాటం ఒక ప్రధాన కారణమని చెప్పారు. అమరావతి రైతులు జగన్ కు సరైన గుణపాఠం చెప్పారన్నారు. అతి త్వరలో జగన్ పార్టీ కనుమరుగైపోవడం ఖాయమని జోస్యం చెప్పారు.  

By
en-us Political News

  
ప్రజాస్వామ్య విలువలతో కూడిన పాలనకు, సంకీర్ణ ప్రభుత్వాన్ని ఎలాంటి అరమరికలూ లేకుండా మిత్రధర్మాన్ని తప్పకుండా నడపిన వాజ్ పేయి స్ఫూర్తిగా ముందుకు సాగాలన్న సంకేతాన్ని ఈ విగ్రహావిష్కరణ ద్వారా చంద్రబాబు ఇచ్చారని అంటున్నారు.
బెంగ‌ళూరు టు ఢిల్లీ అన్నట్లుగా ప్ర‌త్యేక ఎపిసోడ్లు న‌డిచాయి. రాహుల్ గాంధీ డీకేకి స్పెష‌ల్ మెసేజీలు పెట్టారు. క‌ట్ చేస్తే ఏదో అనుకుంటే ఏమీ కాలేదు అన్నట్లుగా క‌ర్ణాట‌క‌లో సీఎం మార్పు జరగలేదు. కన్ఫ్యూజన్ కంటిన్యూ అవుతోంది.
2022 నవంబర్ లో అప్పటి వైసీపీ సర్కార్ రోడ్డు విస్తరణ పేరుతో మంగళగిరి నియోజకవర్గ పరిధిలోని ఇప్పటం అనే కుగ్రామంలో ఇళ్ల ను కూల్చివేసింది. ఆ సమయంలో పవన్ కల్యాణ్ ఇప్పటం గ్రామంలో పర్యటించి బాధితులకు అండగా నిలిచారు. అధికారంలోకి వచ్చిన తరువాత మళ్లీ గ్రామాన్ని సందర్శిస్తానని అప్పట్లో మాట ఇచ్చారు.
పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థను ఇంత కాలం వ్యతిరేకిస్తూ వచ్చిన లొంగిపోయిన మావోయిస్టు నేతలు ఇప్పుడు అదే వ్యవస్థ ద్వారా సమాజంలో మార్పు తీసుకురావాలని భావిస్తున్నారు. ఇందుకు తాజాగా మావోయిస్టు మాజీ అగ్రనేత మల్లోజుల ఇక ఆయుధాలు చేపట్టబోమంటూ చేసిన ప్రకటనే సాక్ష్యంగా నిలుస్తోంది.
దానం విషయంలో మాత్రం ఆయన అధికారికంగా కాంగ్రెస్ కండువా కప్పుకోవడం, ఆ పార్టీ తరఫున ఎంపీగా పోటీలోకి దిగడంతో.. ఇవే కోర్టులో , అలాగే స్పీకర్ ఎదుట తిరుగులేని ఆధారాలుగా నిలిచాయి. ఈ నేపథ్యంలో దానంపై అనర్హత వేటు పడటం ఖాయమన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది.
మొత్తం మీద ఆ కేసులో కీలక మలుపునకు ఈ పెన్ డ్రైవ్ ఆధారం అయ్యే అవకాశాలే మెండుగా ఉన్నాయని దర్యాప్తు అధికారులు అంటున్నారు. ఈ కేసును త్వరితగతిన దర్యాప్తు చేసి నివేదికను కోర్టుకు సమర్పించాలన్న ఉద్దేశంతో హైదరాబాద్ సిపి సజ్జనార్ ఆధ్వర్యంలో 9 మంది అధికారులతో కలిసి ప్రత్యేక సిట్ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.
పార్టీ పగ్గాలు చేపట్టడానికీ, ప్రధాని మంత్రి పదవిని అధిష్టించడానికి కాంగ్రెస్ లో సమర్థత ఉన్న నేత తన సతీమణి ప్రియాంక వధేరా గాంధీ మాత్రమేనంటూ రాబర్ట్ వధేరా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
ఈ కార్యక్రమానికి ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హాజరయ్యారు. అలాగే వైఎస్ కుటుంబీకులంతా హాజరయ్యారు. అయితే ఈ వేడుకలకు వైఎస్ తనయ వైఎస్ షర్మిల మాత్రం హాజరు కాలేదు.
తెలుగు రాష్ట్రాల్లోనూ పొలిటికల్ పార్టీలకు ఫండ్స్ బాగానే గిట్టుబాటయ్యాయి. అయితే.. ఏపీలో పవర్‌లో ఉన్న టీడీపీ, జనసేన కంటే వైసీపీ కలెక్షన్లే ఎక్కువగా ఉండడం హాట్‌టాపిక్‌గా మారింది.
అంబటి ఏమన్నారంటే.. 2024 ఫలితాలను అర్ధం చేసుకోవడంలో తెలుగుదేశం కూటమి పార్టీలు విఫలమయ్యాయట. చంద్రబాబు మోసపూరిత వాగ్దానాల కారణంగానే కూటమి ఆ ఎన్నికలలో అధికారంలోకి వచ్చిందట.. ఇప్పుడు ఈ ఏడాదిన్న కాలంలో జనానికి తత్వం బోధపడి.. జగన్ పాలన మళ్లీ రావాలని కోరుకుంటున్నారట. అంబటి భాష్యం విన్న వైసీపీయులే ఆశ్చర్యపోతున్నారు.
ఆదివారం తన 53వ పుట్టిన రోజు జరుపుకున్న జగన్ కు చంద్రబాబు, నారా లోకేష్, వైఎస్ షర్మిల తదితరులు సామాజిక మాధ్యమం ద్వారా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఇందుకు ప్రతిగా జగన్ కూడా ఒక్క మంత్రి లోకేష్ కు తప్ప మిగిలిన వారందరికీ ధన్యవాదాలు చెబుతూ రిప్లై ఇచ్చారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ పాలనలో బీఆర్ఎస్ నాయకుల పరిస్థితి దయనీయంగా మారిందన్న ఆయన గత పదేళ్ల అధికార గర్వంతో విర్రవీగిన నేతల కండలు ఇప్పుడు కరిగిపోయాయని ఎద్దేవా చేశారు.
రాజకీయ ప్రత్యర్థులే కాదు.. ప్రభుత్వ విధానాలు సరిగా లేవన్న సామాన్యులపై కూడా జగన్ పాలనలో దాడులు జరిగాయి. ఇక అవినీతి, అక్రమాలు, దౌర్జన్యాలూ సరే సరి. సరే జనం విషయం గుర్తించి 2019లో తాము కట్టబెట్టిన అధికారాన్ని 2024 ఎన్నికలలో లాగేసుకుని అభివృద్ధికి బ్రాండ్ అంబాసిడర్ అంటూ చంద్రబాబుకు అప్పగించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.