Publish Date:Feb 12, 2025
ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణంపై ఇప్పుడు జాతీయ స్థాయిలో చర్చ జరుగుతోంది. దేశాన్ని కుదిపేసిన ఢిల్లీ మద్యం కుంభకోణం కంటే ఏపీలో జరిగిన మద్యం కుంభకోణం పది రెట్లు పెద్దదని బీజేపీ సీనియర్ నాయకుడు, అనకాపల్లి పార్లమెంట్ సభ్యుడు సీఎం రమేష్ లోక్ సభ సాక్షిగా చెప్పారు. ఆంధ్రప్రదేద్ లో మద్యం కుంభకోణం అంశాన్ని ఆయన మంగళవారం (ఫిబ్రవరి 11) లోక్సభలో జీరో అవర్లో లేవనెత్తారు. ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న ఐదేళ్ల కాలంలో నగదు లావాదే వీలతోనే సాగిన మద్యం అమ్మకాలలో లక్ష కోట్ల రూపాయల స్కాం జరిగిందని సీఎం రమేష్ ఆరోపించారు. అసలు మద్యం విక్రయాలన్నీ నగదుతోనే జరిగాయనీ, ఏదీ డిజిటల్ ఫార్మాట్లో లేదని సీఎం రమేష్ లోక్ సభలో చెప్పారు. జగన్ అధికారపగ్గాలు చేపట్టిన తరువాత రాష్ట్రంలో మద్యం విధానాన్ని మార్చారనీ, అప్పటి వరకూ ప్రైవేటు షాపుల ద్వారా జరిగే మద్యం విక్రయాలను జగన్ తన హయాంలో ప్రభుత్వ దుకాణాలకు మార్చేశారనీ వివరించారు. అయితే పని చేసే ఉద్యోగులు మాత్రం కాంట్రాక్టు కార్మికులని చెప్పిన ఆయన ఆంధ్రప్రదేశ్ లో జరిగిన మద్యం కుంభకోణంతో పోలిస్తే ఢిల్లీ మద్యం కుంభకోణం చాలా చిన్నదన్నారు.
ఈ కుంభకోణంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే శ్వేత పత్రం విడుదల చేసింది. ఈ కుంభకోణంలో సూత్రధారులు, పాత్రధారులను ఎవరినీ వదిలేది లేదని స్పష్టం చేసింది. అవసరమైతే సీబీఐ, ఈడీలకు ఈ కేసు అప్పగిస్తామనీ చెప్పింది. ఇప్పుడు తాజాగా సీఎం రమేష్ ఆంధ్ర ప్రదేశ్ మద్యం కుంభకోణంపై కేంద్రం పూర్తి స్థాయి విచారణ జరపాలని లోక్ సభ వేదికగా డిమాండ్ చేశారు. దీంతో ఇప్పటి వరకూ ఆంధ్రప్రదేశ్ కే పరిమితమైన ఈ అంశం ఇప్పుడు జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారింది.
ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలో జరిగిన మద్యం కుంభకోణంపై దర్యాప్తునకు సిట్ వేసిన సంగతి తెలిసిందే. క్రితం విజయవాడ సీపీ రాజశేఖర్ బాబు నేతృత్వంలో సిట్ ఏర్పాటైన సిట్ లోఎక్సైజ్ శాఖ అధికారులను కూడా ఏపీ సర్కార్ చేర్చింది. ఇప్పుడు బీజేపీ ఎంపీ సీఎం రమేష్ బాబు ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణంపై కేంద్రం పూర్తిస్థాయిలో విచారణ జరపాలని లోక్ సభ సాక్షిగా డిమాండ్ చేయడంతో జాతీయ స్థాయిలో ఏపీ మద్యం కుంభకోణం హైలైట్ అయ్యింది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/bjp-mp-cmramesh-demand-center-inquire-on-andhrapradesh-liquor-scam-39-192743.html
చంద్రబాబు అక్రమ అరెస్ట్ మూడేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ప్రతి ఒక్కరూ తమ ఇళ్ల వద్ద, పార్టీ కార్యాలయాల్లో యాభై మూడు దీపాలను వెలిగించాలని కోరారు.
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్పై అనుచిత, అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో అరెస్టయిన ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలకు నాంపల్లి న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది
టీడీపీ కేంద్ర కార్యాలయంలో రెండో రోజు నిర్వహిస్తున్న లీడర్షిప్ కాంక్లేవ్లో పొలిటికల్ కమ్యూనికేషన్ అండ్ పబ్లిక్ ఓరియంటేషన్ అంశంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ మాట్లాడారు.
అసలాయన రాజకీయ పార్టీ ఏర్పాటు ఉద్దేశమేంటో? లక్ష్యమేంటో ఆయనకైనా స్పష్టత ఉందా అనిపించేలా ఆయన మీడియా సమావేశం సాగింది.
ఇటు రాష్ట్రంలోనూ, అటు కేంద్రంలోనూ కూడా తెలుగుదేశం పార్టీ ఎన్డీయేలో కీలకమైన భాగస్వామ్య పక్షంగా ఉన్న నేపథ్యంలో తన పోరాటాలకు ఇండియా కూటమి అండ అవసరమని భావిస్తున్నారని చెబుతున్నారు
తన రాజకీయ విజయానికి మహిళలే ప్రధాన కారణమని ఉద్ఘాటించిన విజయ్, మహిళలకు తగిన గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. మన ఇంట్లోనూ తల్లులు, చెల్లెళ్లు ఉంటారు. మహిళలను ఎవరైనా అవమానిస్తే చట్టం చూస్తూ ఊరుకోదని విజయ్ హెచ్చరించారు.
తెలంగాణ వ్యవహారాల ఇన్ చార్జ్ ఆబ్సెన్స్ లో రేవంత్ తన కేబినెట్ పునర్వ్యవస్థాకరణ విషయంలో మరింత స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే అవకాశాలుంటాయని పరిశీలకులు అంటున్నారు. పార్టీలో, ప్రభుత్వంలో అసంతృప్తికి చెక్ పెట్టి, తన నిర్ణయాలను అమలు చేయడానికి రేవంత్ కు ఇది అనువైన సమయంగా రాజకీయవర్గాలు చెబుతున్నాయి.
2014 నుంచి ఆంధ్రప్రదేశ్ లో రెండు ప్రధాన రాజకీయ పార్టీల మధ్యే అధికారం మారుతూ వస్తోంది. వైపీపీ, తెలుగుదేశం మధ్య ద్విముఖ పోరే నెలకొని ఉంది. ఈ పరిస్థితుల్లో విజయసాయిరెడ్డి కొత్త పార్టీ రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలలో మార్పు తీసుకువచ్చే అవకాశాలు లేకపోలేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
కాషాయం పార్టీ రాష్ట్ర నేతలు కొండా బీజేపీ ఎంట్రీపై ఒక్కొక్కరూ ఒక్కోలా మాట్లాడుతున్నారు. వీటికి తోడు సకుటుంబ సపరివార సమేతంగా అయితేనే కాషాయం కండువా కప్పుకుంటానంటూ కొండా సురేఖ కండీషన్లు పెడుతున్నట్లు వస్తున్న వార్తలు ఆమెకు బీజేపీ ఎంట్రీ కూడా మూసుకుపోయిందా అన్న అనుమానాలకు కలిగిస్తున్నాయి.
కొండా సుశ్మీత మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. తన వ్యాఖ్యలకు తానే బాధ్యురాలిననీ, తన తల్లిపై వేటు వేయడం సరికాదనీ ఆవేదన వ్యక్తం చేశారు. తన వ్యాఖ్యలకు తన తల్లిని శిక్షించడం సరికాదన్నారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో వ్యక్తిగత అభిప్రాయాలకు, స్వతంత్రంగా మాట్లాడే మహిళల గొంతుకకు విలువ లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
పార్టీ అధిష్టానం సీఎఉం మాటకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో, ఆయనకు వ్యతిరేకంగా అసమ్మతి గళం ఎత్తే సీనియర్ నేతలకూ అంతే ప్రాధాన్యత ఇస్తుంది. దీంతో కాంగ్రెస్ సీఎం ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుంది. కాంగ్రెస్ అధికారంలో ఉన్న పార్టీ సీఎంలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఇదేనని చెప్పాలి.
ఒక్క ఆంధ్రప్రదేశ్ అనే కాదు.. దేశంలోని అన్ని రాష్ట్రాలలోనూ సొంత కాళ్లపై నిలబడాలన్నదే బీజేపీ విధానమని విష్ణువర్ధన్ రెడ్డి చెప్పారు. గతంలో ఏపీలో బీజేపీ మద్దతు వల్లే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందనీ, ఈ వాస్తవాన్ని సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ బహిరంగ వేదికలపై స్పష్టంగా చెప్పారని విష్ణువర్ధన్ రెడ్డి గుర్తు చేశారు.