Publish Date:Oct 10, 2025
కామారెడ్డి నుంచి గెలిచిన బీజేపీ ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డికి చిప్పు చెడిపోయిందేమో తెలీదుగానీ, ఓసీలకు కూడా రిజర్వేషన్ కావాలంటున్నారాయన. ఇప్పటికే బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై బీజేపీ మీదున్న అపవాదు అంతా ఇంతా కాదు. ఇప్పటికే ధర్మపురి అరవింద్ వంటి వారు తాజాగా చేసిన కామెంట్లు బీజేపీ మీద యాంటీ బీసీ ముద్ర వేస్తున్నాయి. అది చాలదన్నట్లు బీజేపీ ఎమ్మెల్యే వెంకటరమణ తాజా వ్యాఖ్యలు మొదటికే మోసం తెచ్చేలా ఉన్నాయంటున్నారు పరిశీలకులు.
రిజర్వేషన్ల వ్యవహారంపై బీజేపీ కావాలని ఆడిస్తున్న డ్రామాగా ఇప్పటికే పలు అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. బీఆర్ఎస్.. బీసీలకు వ్యతిరేకంగా యాభై శాతం క్యాప్ చట్టం తేగా.. తెలంగాణ అసెంబ్లీలో ఆమోదం పొందిన బిల్లులకు గవర్నర్ ఆమోదముద్ర వేయకపోవడం వెనుక బీజేపీ హస్తం ఉందన్న అనుమానాలు ఉన్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ఢిల్లీకి వెళ్లి అక్కడ నిరసన వ్యక్తం చేసినా కూడా కేంద్రం స్పందన శూన్యం. ఈ మొత్తం వ్యవహారంలో కేంద్రంలోని బీజేపీయే అడ్డు పుల్ల వేస్తోందన్న అనుమానాలు సర్వత్రా వ్యక్తం అవుతున్నాయి. ఆ అనుమానాలకు తెలంగాణ బీజేపీ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలు మరింత బలం చేకూరుస్తున్నాయి. కామారెడ్డి ఎమ్మెల్యే అయితే ఓసీలకు కూడా రిజర్వేషన్లు కావాలంటూ చేసిన వ్యాఖ్యలతో అనుమానాలు కాదు.. వాస్తవమే అనిపిస్తోందని అంటున్నారు.
మొన్నటికి మొన్న కామారెడ్డికి వరద వచ్చినపుడు తాను ఇంటింటికీ వెళ్లి.. చాకిరీ చేయలేను కదా? అంటూ వ్యంగ్య వ్యాఖ్యానం చేసిన వెంకటరమణారెడ్డి.. మరోమారు తన వితండ వాదన వెలుగులోకి తేవడంతో.. ఈసారి ఎన్నికల్లో ఆ 8 సీట్లు కూడా ఊడిపోయేలా ఉన్నాయన్న హెచ్చరికలు అందుతున్నాయ్.
ఓబీసీలకు పదిశాతం రిజర్వేషన్లు ఇస్తే తామేమీ అడ్డుకోలేదని అంటారు వీహెచ్ వంటివారు. ఎందుకంటే వారిలో కూడా పేదలుంటారు కాబట్టి, తాము ఆటంకపరచలేదన్న కామెంట్ చేశారు వీహెచ్. 56 శాతం గా ఉన్న బీసీల ప్రయోజనాలను అడ్డుకునే విధంగా హైకోర్టు స్టే ఇవ్వడం వెనకున్న శక్తులు త్వరలోనే బయట పడతాయని అంటున్నారు కాంగ్రెస్ నాయకులు, ఇతర బీసీ సంఘాల వారు.
ఇప్పటికే బీజేపీ మీదున్న నిందలు చాలవన్నట్టు వెంకటరమణారెడ్డి వంటి వారు బీజేపీని మరింత ఇరకాటంలో పడేస్తున్నారనీ.. ఇది విపరీత అర్ధాలకు దారి తీసి పార్టీని మరోమారు పుట్టి ముంచినా ఆశ్చర్యం లేదంటున్నారు కొందరు కాషాయ పార్టీ లీడర్లు. అనువుగాని చోట అధికులమనరాదన్న సామెతలు గుర్తు చేస్తున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/bjp-mla-demands-reservations-for-ocs-also-39-207655.html
అనంతపురం జిల్లాకు ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది.
సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం ఉన్న ఆమంచి కృష్ణమోహన్.. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో చీరాల నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగి విజయం సాధించారు. ఈ తరువాత ఆయన తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చారు. అయితే.. 2019 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీని వీడి, వైసీపీ పంచన చేరారు.
తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రజా జీవితంలో అరుదైన మైలురాయిని చేరుకున్నారు.
ఈసీ ఆదేశాల మేరకు
కవిత తన టీఆర్ఎస్ పార్టీ పేరుకు ప్రత్యామ్నాయంగా మూడు పేర్లను ఈసీకి పక్షం రోజుల్లోగా సమర్పించాల్సి ఉంటుంది. నిర్దేశిత గడువులోగా మూడు ప్రత్యామ్నాయ పేర్లను సూచించకుంటే దరఖాస్తున్న మూసేస్తామని హెచ్చరించింది. అంతే కాకుండా టీఆర్ఎస్ పేరును కొనసాగించేందుకు అనుమతి ఉండదని విస్పష్టంగా పేర్కొంది.
ఆ పార్టీ ప్రధాన ఆరోపణ ఏంటంటే.. క్షేత్రస్థాయిలో తెలుగుదేశం పార్టీ అనుకూల సిబ్బందితో అర్హులైన వైసీపీ మద్దతుదారుల ఓట్లను ఉద్దేశపూర్వకంగా తొలగించేందుకు కుట్ర జరుగుతోందని. గతంలో అంటే.. 2014 నుండి 2019 మధ్య కాలంలో కూడా ఇలాగే పెద్ద ఎత్తున దొంగ ఓట్లను చేర్చారని, ఇప్పుడు తమ పార్టీకి అండగా నిలిచే ఓటర్లను లక్ష్యంగా చేసుకుని జాబితా నుండి తొలగిస్తున్నారని వైసీపీ ఆరోపిస్తున్నది.
పైకి వైసీపీతోనూ, జగన్ కోటరీతోనూ విసిగిపోయానని, అందుకే బయటకు వచ్చేశాననీ విజయసాయి చెబుతున్నా.. ఆయన మాటలూ చేతలూ అన్ని జగన్ కు ప్రయోజనం చేకూర్చడానికే అన్నట్లుగా ఉంటాయి. ఉంటున్నాయి.
విశాఖపట్నం పరిపాలన రాజధాని అన్న జగన్ విధానాన్ని ధర్మాన బలంగా ప్రజలలోకి తీసుకువెళ్లడానికి శతధా ప్రయత్నించారు. ఉత్తరాంధ్ర సెంటిమెంట్ను రగిలిస్తూ, గ్రామగ్రామాన సభలు, సమావేశాలు ఏర్పాటు చేసి ప్రచారం చేశారు. అదేమీ ఫలించలేదని 2024 ఎన్నికల ఫలితాలు తేల్చేశాయి.
వైసీపీ కోసం ఎంతగానో పరితపించిన ముద్రగడ.. కాపు రిజర్వేషన్ కోసం, కాపుల కోసం పోరాటం చేసి సంపాదించుకున్న ప్రాముఖ్యతనూ, ప్రతిష్టనూ..జగన్ కోసం ఔను కేవలం జగన్ కోసం వదులుకున్నారు. అటువంటి ముద్రగడ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ వెంటిలేటర్ పై చికిత్స పొందుతుంటే…జగన్ ఆయనను కనీసం పరామర్శించను కూడా పరామర్శించలేదు.
ఎన్నికల్లో ఘోర పరాజయంతో కేవలం 11 సీట్లకు పరిమితమైన తర్వాత, సరికొత్తగా మావిగన్ రాగం అందుకున్నారని విమర్శించారు.
పైపెచ్చు.. జిల్లాకు చెందిన పలువురు ముఖ్య నాయకులు జగన్ పాల్గొన్న కార్యక్రమాలకు ముఖం చాటేశారు. కొందరైతే తూతూమంతరంగా అలా వచ్చి, ఇలా వెళ్లిపోయారు.
ఆలా కిందపడిపోయిన పోలీసులు ఆ తరువాత కల్వకుంట్ల కవితతో దురుసుగా వ్యవహరించిన తీరు పట్ల సర్వత్రా నిరసన వ్యక్తం అవుతోంది. కవితను పోలీసులు పోలీస్ వాహనంలోకి దురుసుగా నెట్టేయడం సరికాదన్న భావన సర్వత్రా వ్యక్తం అవుతున్నది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయం ఎల్లప్పుడూ అత్యంత ఆసక్తికరమైన సంక్లిష్టమైన మలుపులకు వేదికగా నిలుస్తుంది.
ఉప్పల్లో ఈ రోజు తెలంగాణ ఉద్యమకారులు, మహిళల రక్తం చిందిందని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలు, ఉద్యమకారులపై పోలీసులు విచక్షణారహితంగా లాఠీఛార్జ్ చేశారని ఆరోపించారు.