బీజేపీ మెగా ఫ్యామిలీ జ‌పం.. పెద్ద స్కెచ్చే!

Publish Date:Jan 16, 2025

Advertisement

కేంద్రంలో వ‌రుగా మూడు సార్లు అధికారంలోకి వ‌చ్చిన భార‌తీయ జ‌న‌తా పార్టీకి ద‌క్షిణాది రాష్ట్రాలు మాత్రం ఝ‌ల‌క్ ఇస్తున్నాయి. త‌మిళ‌నాడు,  కర్నాటక, కేర‌ళల‌తోపాటు తెలుగు రాష్ట్రాల్లో బీజేపీకి అధికారం అంద‌ని ద్రాక్ష‌గానే మిగిలిపోతోంది.  గ‌త ఎన్నిక‌ల్లో ఏపీలో టీడీపీ, జ‌న‌సేన పార్టీల‌తో క‌లిసి పోటీచేసిన బీజేపీ త‌న ఉనికిని కాపాడుకోగలిగింది. ఇక తెలంగాణ‌లో ఒంటిరిగానే పోరాటం సాగిస్తున్న ఆ పార్టీకి అధికారం మాత్రం అందని ద్రాక్షలాగే మిగిలిపోయింది. తెలంగగాణలో గ‌త‌ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో  జ‌నసేన పార్టీతో క‌లిసి పోటీ చేసిన బీజేపీ ఎనిమిది నియోజ‌క‌వ‌ర్గాల్లో  విజయం సాధించగలిగింది. ఇక పార్ల‌మెంట్ ఎన్నిక‌ల్లో  బీజేపీ  17 నియోజ‌క‌వ‌ర్గాల్లో పోటీ చేసిఎనిమిది నియోజ‌క‌వ‌ర్గాల్లో విజయం సాధించింది. అయితే అధికారం మాత్రం ఆ పార్టీకి అందని ద్రాక్షగానే మిగిలింది. ఎలాగైనా వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో తెలంగాణలో అధికారమే లక్ష్యంగా బీజేపీ అదిష్టానం ఇప్ప‌టి నుంచే పావులు క‌దుపుతోంది. ఎలాగైనా తెలంగాణ‌లో అధికార పగ్గాలు అందుకోవాలన్న పట్టుదలతో ఆ పార్టీ అడుగులు వేస్తోంది. అందివ‌చ్చిన ప్ర‌తీ అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకుంటూ బీజేపీ రోజురోజు బ‌లోపేతం అవుతోంది. అయితే, బీజేపీని క్షేత్ర‌స్థాయిలో బ‌లోపేతం చేసుకుంటూ వెళ్లినా వ‌చ్చే ఎన్నిక‌ల్లో అధికారంలోకి రావాలంటే బ‌ల‌మైన ప్ర‌జా మ‌ద్ద‌తు క‌లిగిన కుటుంబం తోడు పార్టీకి ఉండాల‌ని బీజేపీ అధిష్టానం భావిస్తున్నది.


ఏపీలో తెలుగుదేశం, జ‌న‌సేన‌, బీజేపీ కూట‌మి అధికారంలో  ఉంది. అయితే, వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఇదే ఫార్ములాను తెలంగాణ‌లోనూ అప్ల‌య్ చేయాల‌ని బీజేపీ అధిష్టానం తొలుత భావించింది. కానీ, తెలంగాణ‌లో తెలుగు దేశం పార్టీకి బ‌ల‌మైన క్యాడ‌ర్ ఉంది. ఆ పార్టీని న‌డిపించే నాయ‌కుడు లేక‌పోయినా గ్రామ‌గ్రామాన టీడీపీకి భారీగానే ఓటు బ్యాంక్ ఉంది. ఈ కార‌ణంగా ఆ పార్టీతో క‌లిసి ఎన్నిక‌ల‌కు వెళితే బీజేపీకి పెద్దగా ప్రయోజనం ఉండదనీ, ఏపీలో మాదిరిగా ఉనికి చాటుకోవడానికే తెలుగుదేశంతో పొత్తు తెలంగాణలో ఉపయోగపడుతుందని బీజేపీ పెద్ద‌లు అంచ‌నా వేస్తున్నారు. దీనికితోడు ఏపీలో ముఖ్య‌మంత్రిగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన త‌రువాత చంద్ర‌బాబు నాయుడు తెలంగాణ‌లో  తెలుగుదేశం పార్టీ  బ‌లోపేతంపై దృష్టి పెట్టారు. దీంతో వివిధ కారణాలతో తెలుగుదేవం పార్టీని వీడిన తెలంగాణ నేతలలో  చాలా మంది సొంత‌ గూటికి అంటే తెలుగుదేశం పార్టీలోకి చేరేందుకు ఆసక్తి చూపుతున్నారు.   ఈ క్ర‌మంలో వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఒంట‌రిగానే పోటీచేయాల‌ని అధినేత చంద్ర‌బాబుపై పార్టీ క్యాడ‌ర్ ఒత్తిడి పెరుగుతోంది.  ఇప్పటికే తెలంగాణలో త్వరలో జరగనున్నన పంచయతీ ఎన్ని కలలో సత్తా చాటేందుకు తెలుగుదేశం సమాయత్తమౌతోంది.

ఇలాంటి ప‌రిస్థితుల్లో బీజేపీ అధిష్టానం క‌నుస‌న్న‌ల్లో న‌డుచుకునే, ప్ర‌జాబ‌లం క‌లిగిన కుటుంబం మ‌ద్ద‌తు పార్టీకి అవ‌స‌ర‌మ‌ని ఆ పార్టీ అగ్రనాయకత్వం భావిస్తోంది. ఈ వ్యూహంలో భాగంగానే మెగా ఫ్యామిలీ అండ‌కోసం బీజేపీ పెద్ద‌లు ప్ర‌య‌త్నాలు ప్రారంభించారు. ఇప్ప‌టికే ఏపీలో ప‌వ‌ర్ స్టార్‌, జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ బీజేపీకి అన్నివిధాలుగా అండ‌గా ఉంటున్నారు. బీజేపీ కేంద్ర పార్టీ సైతం ప‌వ‌న్ ను సొంత పార్టీ నేత‌గానే ప‌రిగ‌ణిస్తున్నది. ఇదే క్ర‌మంలో మెగా ఫ్యామిలీకి పెద్ద‌గా ఉన్న మెగాస్టార్ చిరంజీవిని బీజేపీ మ‌నిషిగా ప్ర‌జ‌ల్లో ముద్ర‌ వేసేందుకు ఆ పార్టీ పెద్ద‌లు ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. ఆ మేర‌కు ఇప్ప‌టికే స‌ఫ‌లం అయ్యార‌ని చెప్పొచ్చు.

చిరంజీవికి ఏపీతోపాటు తెలంగాణ‌లోనూ భారీగానే అభిమానులున్నారు. వృద్ధుల నుంచి ప్ర‌స్తుతం యువ‌కుల వ‌ర‌కు మెగా ఫ్యామిలీకి మూడు త‌రాల‌కు చెందిన అభిమానులు ఉన్నారు. మెగా ఫ్యామిలీలో చిరంజీవి, రాంచ‌ర‌ణ్‌తోపాటు దాదాపు అర‌డ‌జ‌న్ మంది హీరోలుగా కొన‌సాగుతున్నారు. వీరంద‌రికీ ఫ్యాన్ ఫాలోయింగ్ భారీగానే ఉంది. ఈ క్ర‌మంలో మెగా ఫ్యామిలీ అండ‌తో వ‌చ్చే ఎన్నిక‌ల‌కు వెళితే అధికార పీఠాన్ని ద‌క్కించుకోవ‌చ్చ‌ని బీజేపీ పెద్ద‌లు బ‌లంగా న‌మ్ముతున్నారు. అయితే, ఈ ప్లాన్ ఇప్ప‌టికిప్పుడు అమ‌లు చేస్తున్న‌ది కాద‌ని పరిశీలకులు అంటున్నారు. గ‌త ఎన్నిక‌ల ముందు నుంచే మెగా ఫ్యామిలీకి బీజేపీ పెద్ద‌లు ప్రాధాన్య‌త‌నిస్తూనే వ‌స్తున్నారు. గ‌త ఎన్నిక‌ల్లో ఈ వ్యూహాన్ని స‌మ‌ర్ధ‌వంతంగా అమ‌లు చేయ‌లేక‌పోయిన బీజేపీ అధిష్టానం.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో మాత్రం ప‌క్కాగా అమ‌లు చేసి అనుకున్న ల‌క్ష్యాన్ని సాధించాల‌న్న పట్టుదలతో ఉంది. ఏపీలో వైసీపీ అధికారంలో ఉన్న స‌మ‌యంలో బీజేపీ నిర్వ‌హించిన కార్య‌క్ర‌మాల్లో మెగాస్టార్ చిరంజీవికి ప్రాధాన్య‌త‌నిస్తూ వ‌చ్చారు. గ‌త ఎన్నిక‌ల‌కు ముందు అమిత్ షా, ప్ర‌ధాని న‌రేంద్రమోదీతో ప‌లు ద‌ఫాలుగా చిరంజీవి, ఆయ‌న కుమారుడు రాంచ‌ర‌ణ్ భేటీ అయ్యారు. ముఖ్యంగా ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం ప్ర‌మాణస్వీకారోత్స‌వ స‌మ‌యంలో  ప్రధాని మోడీ చిరంజీవి, ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ను హ‌త్తుకొని అభినందించినతీరు మెగా కుటుంబం బీజేపీకి మ‌ద్ద‌తు దారు అన్న ముద్రను ప్రజల్లో వేసింది.   దానిని కాపాడుకుని తెలంగాణలో 2028లో జరిగే అసెంబ్లీ ఎన్నికల నాటికి మరింత బలంగా మెగా ఫ్యామిలీ అండ పొందాలని ప్రయత్నిస్తున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

By
en-us Political News

  
తనను పార్టీ నుంచి బయటకు గెంటేసిన బీఆర్ఎస్ కు చుక్కలు చూపిస్తానని హెచ్చరించారు. బీఆర్ఎస్ హయాంలో అవినీతి జరిగిందని ఇప్పటికే బాహాటంగా విమర్శలు గుప్పిస్తూ వచ్చిన కల్వకుంట్ల కవిత ఈ సారి కేటీఆర్ రాజకీయాలను ఎండగట్టారు. తన సోదరుడు కేటీఆర్ కంటే పార్టీ కోసం తానే ఎక్కువగా కష్టపడ్డాన విస్పష్టంగా తేల్చేశారు.
శివాజీ చేసిన వివాదాస్పద కామెంట్లపై నాగబాబు కౌంటర్ ఒకింత ఘాటుగా ఉంది. అందులో సందేహం లేదు. అయితే మామూలుగా అయితే నాగబాబు కౌంటర్ వివాదాస్పదం అయ్యే అవకాశం లేదు. కానీ శివాజీ వ్యాఖ్యలపై మెగా ఫ్యాన్స్ ఒకింత సానుకూలత వ్యక్తం చేయడంతో నాగబాబును వివాదంలోకి లాగారు. సోషల్ మీడియా వేదికగా నాగబాబుపై ఓ రేంజ్ లో ఫైర్ అవుతున్నారు.
ఇక కుటుంబ వారసత్వం రేహాన్ వాద్రాకు అప్పగించడానికి రాహుల్ రెడీ అయిపోయారనడానికి సూచనగా.. రేహాన్ వాద్రా పేరు చివర గాంధీని కూడా ఇటీవలే అధికారికంగా చెర్చారు. ఔను రేహాన్ ఇంటి పేరును వాద్రా గాంధీగా ప్రికాంక వాద్రా అధికారికంగా మార్పించారు.
ఆలయ ప్రాంగణంలో గానీ, మీడియా ముందు గానీ రాజకీయ వ్యాఖ్యలు చేసే వారిపై, వాటిని ప్రచారం చేసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్న హెచ్చరికలు సైతం జారీ చేసింది. తిరుమలగిరిపై కేవలం “గోవింద నామస్మరణ” మాత్రమే ఉండాలన్నది టీటీడీ భావన.
అసెంబ్లీ, మండలిలో పార్టీ గళాన్ని బలంగా వినిపించేందుకు సీనియర్ నేతలకు బీఆర్ఎస్ శాసనసభాపక్ష ఉప నేతలుగా బాధ్యతలు అప్పగించారు. ఈ నియామకాల ద్వారా అటు అసెంబ్లీలో, ఇటు మండలిలో అధికార పక్షాన్ని దీటుగా ఎదుర్కోవాలని దిశానిర్దేశం చేసినట్లయింది. అయితే అలా నియమించిన ఉప నేతలలో మాజీ మంత్రి, బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారకరామారావు పేరు లేదు.
అసెంబ్లీలో బీఆర్ఎస్ శాసనసభాపక్ష ఉప నేతలను నియామస్తూ బీఆర్‌ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు
ఈ నేపథ్యంలోనే పంచాయతీ ఎన్నికల్లో లభించిన విజయానికి కొనసాగింపు సాధ్యమైనంత త్వరగా మునిసిపోల్స్ నిర్వహించేయాలని రేవంత్ సర్కార్ యోచిస్తోంది.
ఇటీవ‌ల జ‌గ‌న్ పుట్టిన రోజు సందర్భంగా పొటేళ్ల‌ను బ‌లిచ్చి ఆయ‌న‌ ఫోటోల‌కు ఆ ర‌క్తాన్ని త‌ర్ప‌ణం చేశారు వైసీపీ అభిమానులు. అంతేనా హింసాత్మ‌క కామెంట్లను ఫ్లెక్సీల‌పై పోస్ట్ చేసి.. వీరంగం ఆడారు.
అధికారం అండ చూసుకుని మంచి, చెడు, ఉచ్ఛం, నీచం అన్న తేడా లేకుండా దాడులు, దౌర్జన్యాలు, అవినీతి, అక్రమాలు, కబ్జాలతో చెలరేగిపోయారు. అటువంటి నేతలంతా వైసీపీ అధికారం కోల్పోయిన తరువాత నాటి తప్పిదాలకు మూల్యం చెల్లించాల్సిన పరిస్థితిని ఎదుర్కొంటున్నారు.
అధికారం కోల్పోయిన తరువాత ఇద్దరి వ్యవహార తీరు దాదాపు ఒకేలా ఉంటోంది. క్రియాశీల రాజకీయాలకు దూరంగా, ఇంకా స్పష్టంగా చెప్పాలంటే.. పార్ట్ టైమ్ పొలిటీషియన్లుగానే వ్యవహరిస్తూ వచ్చారు. ఇరువురూ కూడా పరాజయం తరువాత అసెంబ్లీకి డుమ్మా కొడుతూనే వచ్చారు. అలా అసెంబ్లీకి గైర్హాజర్ కావడానికి ఎవరి కారణాలు వారు చెప్పుకున్నా ఫలితం మాత్రం సభకు ఆబ్సెంట్ కావడమే.
తెలంగాణ అసెంబ్లీలో బీఆర్ఎస్ హయాంలో అంటే పదేళ్ల పాటు తెలంగాణ అసెంబ్లీ ప్రభుత్వ సమావేశం అన్నట్లుగా మారిపోయింది. విపక్ష సభ్యులకు మైక్ అన్నది అందని ద్రాక్షగా మారిపోయిన పరిస్థితి. అయితే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరిన తరువాత సభా నిర్వహణలో స్పష్టమైన మార్పు కానవచ్చింది. సభాసంప్రదాయాలకు, విలువలకు రేవంత్ సర్కార్ పెద్ద పీట వేసింది. అర్ధవంతమైన చర్చలు జరిగేందుకు అనుకూలమైన వాతావరణం ఏర్పడింది.
ఓట్ల కోసం చేసిన ప్ర‌జాధ‌నం ఖ‌ర్చు తోపాటు.. చేసింది చెప్పుకోడానికి అద‌న‌పు ఖ‌ర్చు కూడా భారీ ఎత్తున‌ జ‌రిగేది. ఇంతా చేసి తాను చేసింది చెప్పుకోలేక పోయానంటూ జగన్ ఆవేదన చెందడమేంటని నెటిజనులు తెగ శోధించారు.
సుదీర్ఘ విరామం తరువాత విపక్ష నేత హోదాలో కేసీఆర్ ఈ సమావేశాలకు హాజరయ్యారు. సభ ప్రారంభానికి ముందే ఆయన సభలో తనకు కేటాయించిన సీటులో కూర్చున్నారు. ఆ తరువాత అసెంబ్లీలోకి ప్రవేశించిన రేవంత్ రెడ్డి నేరుగా కేసీఆర్ స్థానం వద్దకు వెళ్లి ఆయనను ఆప్యాయంగా పలుకరించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.