బీజేపీ మెగా ఫ్యామిలీ జ‌పం.. పెద్ద స్కెచ్చే!

Publish Date:Jan 16, 2025

Advertisement

కేంద్రంలో వ‌రుగా మూడు సార్లు అధికారంలోకి వ‌చ్చిన భార‌తీయ జ‌న‌తా పార్టీకి ద‌క్షిణాది రాష్ట్రాలు మాత్రం ఝ‌ల‌క్ ఇస్తున్నాయి. త‌మిళ‌నాడు,  కర్నాటక, కేర‌ళల‌తోపాటు తెలుగు రాష్ట్రాల్లో బీజేపీకి అధికారం అంద‌ని ద్రాక్ష‌గానే మిగిలిపోతోంది.  గ‌త ఎన్నిక‌ల్లో ఏపీలో టీడీపీ, జ‌న‌సేన పార్టీల‌తో క‌లిసి పోటీచేసిన బీజేపీ త‌న ఉనికిని కాపాడుకోగలిగింది. ఇక తెలంగాణ‌లో ఒంటిరిగానే పోరాటం సాగిస్తున్న ఆ పార్టీకి అధికారం మాత్రం అందని ద్రాక్షలాగే మిగిలిపోయింది. తెలంగగాణలో గ‌త‌ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో  జ‌నసేన పార్టీతో క‌లిసి పోటీ చేసిన బీజేపీ ఎనిమిది నియోజ‌క‌వ‌ర్గాల్లో  విజయం సాధించగలిగింది. ఇక పార్ల‌మెంట్ ఎన్నిక‌ల్లో  బీజేపీ  17 నియోజ‌క‌వ‌ర్గాల్లో పోటీ చేసిఎనిమిది నియోజ‌క‌వ‌ర్గాల్లో విజయం సాధించింది. అయితే అధికారం మాత్రం ఆ పార్టీకి అందని ద్రాక్షగానే మిగిలింది. ఎలాగైనా వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో తెలంగాణలో అధికారమే లక్ష్యంగా బీజేపీ అదిష్టానం ఇప్ప‌టి నుంచే పావులు క‌దుపుతోంది. ఎలాగైనా తెలంగాణ‌లో అధికార పగ్గాలు అందుకోవాలన్న పట్టుదలతో ఆ పార్టీ అడుగులు వేస్తోంది. అందివ‌చ్చిన ప్ర‌తీ అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకుంటూ బీజేపీ రోజురోజు బ‌లోపేతం అవుతోంది. అయితే, బీజేపీని క్షేత్ర‌స్థాయిలో బ‌లోపేతం చేసుకుంటూ వెళ్లినా వ‌చ్చే ఎన్నిక‌ల్లో అధికారంలోకి రావాలంటే బ‌ల‌మైన ప్ర‌జా మ‌ద్ద‌తు క‌లిగిన కుటుంబం తోడు పార్టీకి ఉండాల‌ని బీజేపీ అధిష్టానం భావిస్తున్నది.


ఏపీలో తెలుగుదేశం, జ‌న‌సేన‌, బీజేపీ కూట‌మి అధికారంలో  ఉంది. అయితే, వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఇదే ఫార్ములాను తెలంగాణ‌లోనూ అప్ల‌య్ చేయాల‌ని బీజేపీ అధిష్టానం తొలుత భావించింది. కానీ, తెలంగాణ‌లో తెలుగు దేశం పార్టీకి బ‌ల‌మైన క్యాడ‌ర్ ఉంది. ఆ పార్టీని న‌డిపించే నాయ‌కుడు లేక‌పోయినా గ్రామ‌గ్రామాన టీడీపీకి భారీగానే ఓటు బ్యాంక్ ఉంది. ఈ కార‌ణంగా ఆ పార్టీతో క‌లిసి ఎన్నిక‌ల‌కు వెళితే బీజేపీకి పెద్దగా ప్రయోజనం ఉండదనీ, ఏపీలో మాదిరిగా ఉనికి చాటుకోవడానికే తెలుగుదేశంతో పొత్తు తెలంగాణలో ఉపయోగపడుతుందని బీజేపీ పెద్ద‌లు అంచ‌నా వేస్తున్నారు. దీనికితోడు ఏపీలో ముఖ్య‌మంత్రిగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన త‌రువాత చంద్ర‌బాబు నాయుడు తెలంగాణ‌లో  తెలుగుదేశం పార్టీ  బ‌లోపేతంపై దృష్టి పెట్టారు. దీంతో వివిధ కారణాలతో తెలుగుదేవం పార్టీని వీడిన తెలంగాణ నేతలలో  చాలా మంది సొంత‌ గూటికి అంటే తెలుగుదేశం పార్టీలోకి చేరేందుకు ఆసక్తి చూపుతున్నారు.   ఈ క్ర‌మంలో వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఒంట‌రిగానే పోటీచేయాల‌ని అధినేత చంద్ర‌బాబుపై పార్టీ క్యాడ‌ర్ ఒత్తిడి పెరుగుతోంది.  ఇప్పటికే తెలంగాణలో త్వరలో జరగనున్నన పంచయతీ ఎన్ని కలలో సత్తా చాటేందుకు తెలుగుదేశం సమాయత్తమౌతోంది.

ఇలాంటి ప‌రిస్థితుల్లో బీజేపీ అధిష్టానం క‌నుస‌న్న‌ల్లో న‌డుచుకునే, ప్ర‌జాబ‌లం క‌లిగిన కుటుంబం మ‌ద్ద‌తు పార్టీకి అవ‌స‌ర‌మ‌ని ఆ పార్టీ అగ్రనాయకత్వం భావిస్తోంది. ఈ వ్యూహంలో భాగంగానే మెగా ఫ్యామిలీ అండ‌కోసం బీజేపీ పెద్ద‌లు ప్ర‌య‌త్నాలు ప్రారంభించారు. ఇప్ప‌టికే ఏపీలో ప‌వ‌ర్ స్టార్‌, జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ బీజేపీకి అన్నివిధాలుగా అండ‌గా ఉంటున్నారు. బీజేపీ కేంద్ర పార్టీ సైతం ప‌వ‌న్ ను సొంత పార్టీ నేత‌గానే ప‌రిగ‌ణిస్తున్నది. ఇదే క్ర‌మంలో మెగా ఫ్యామిలీకి పెద్ద‌గా ఉన్న మెగాస్టార్ చిరంజీవిని బీజేపీ మ‌నిషిగా ప్ర‌జ‌ల్లో ముద్ర‌ వేసేందుకు ఆ పార్టీ పెద్ద‌లు ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. ఆ మేర‌కు ఇప్ప‌టికే స‌ఫ‌లం అయ్యార‌ని చెప్పొచ్చు.

చిరంజీవికి ఏపీతోపాటు తెలంగాణ‌లోనూ భారీగానే అభిమానులున్నారు. వృద్ధుల నుంచి ప్ర‌స్తుతం యువ‌కుల వ‌ర‌కు మెగా ఫ్యామిలీకి మూడు త‌రాల‌కు చెందిన అభిమానులు ఉన్నారు. మెగా ఫ్యామిలీలో చిరంజీవి, రాంచ‌ర‌ణ్‌తోపాటు దాదాపు అర‌డ‌జ‌న్ మంది హీరోలుగా కొన‌సాగుతున్నారు. వీరంద‌రికీ ఫ్యాన్ ఫాలోయింగ్ భారీగానే ఉంది. ఈ క్ర‌మంలో మెగా ఫ్యామిలీ అండ‌తో వ‌చ్చే ఎన్నిక‌ల‌కు వెళితే అధికార పీఠాన్ని ద‌క్కించుకోవ‌చ్చ‌ని బీజేపీ పెద్ద‌లు బ‌లంగా న‌మ్ముతున్నారు. అయితే, ఈ ప్లాన్ ఇప్ప‌టికిప్పుడు అమ‌లు చేస్తున్న‌ది కాద‌ని పరిశీలకులు అంటున్నారు. గ‌త ఎన్నిక‌ల ముందు నుంచే మెగా ఫ్యామిలీకి బీజేపీ పెద్ద‌లు ప్రాధాన్య‌త‌నిస్తూనే వ‌స్తున్నారు. గ‌త ఎన్నిక‌ల్లో ఈ వ్యూహాన్ని స‌మ‌ర్ధ‌వంతంగా అమ‌లు చేయ‌లేక‌పోయిన బీజేపీ అధిష్టానం.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో మాత్రం ప‌క్కాగా అమ‌లు చేసి అనుకున్న ల‌క్ష్యాన్ని సాధించాల‌న్న పట్టుదలతో ఉంది. ఏపీలో వైసీపీ అధికారంలో ఉన్న స‌మ‌యంలో బీజేపీ నిర్వ‌హించిన కార్య‌క్ర‌మాల్లో మెగాస్టార్ చిరంజీవికి ప్రాధాన్య‌త‌నిస్తూ వ‌చ్చారు. గ‌త ఎన్నిక‌ల‌కు ముందు అమిత్ షా, ప్ర‌ధాని న‌రేంద్రమోదీతో ప‌లు ద‌ఫాలుగా చిరంజీవి, ఆయ‌న కుమారుడు రాంచ‌ర‌ణ్ భేటీ అయ్యారు. ముఖ్యంగా ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం ప్ర‌మాణస్వీకారోత్స‌వ స‌మ‌యంలో  ప్రధాని మోడీ చిరంజీవి, ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ను హ‌త్తుకొని అభినందించినతీరు మెగా కుటుంబం బీజేపీకి మ‌ద్ద‌తు దారు అన్న ముద్రను ప్రజల్లో వేసింది.   దానిని కాపాడుకుని తెలంగాణలో 2028లో జరిగే అసెంబ్లీ ఎన్నికల నాటికి మరింత బలంగా మెగా ఫ్యామిలీ అండ పొందాలని ప్రయత్నిస్తున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

By
en-us Political News

  
కల్వకుంట్ల తారకరామారావు జన్మదినం జులై 24 ఈ సందర్భాన్ని పురస్కరించుకుని తెలంగాణ ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ కేటీఆర్ కు పాతిక కిలోల సన్నబియ్యాన్ని కానుకగా పంపారు. అదీ తాను స్వయంగా ఆ బర్త్ డే గిఫ్ట్ ను అందించకుండా, ర్యాపిడో బైక్ బుక్ చేసి.. ఆ కానుకను తెలంగాణ భవన్ కు కేటీఆర్ కు పంపించారు.
వాస్తవానికి ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకునే కేబినెట్ భేటీకి డిప్యూటీ సీఎం హాజరు కాకపోవడానికి రాజకీయ కారణాలున్నాయా అన్న అనుమానాలకు ఆస్కారం లేని పరిస్ధితి ఉంది. ఎందుకంటే.. ఇటీవలే ముంబై లోని కోకిలా బెన్ అంబానీ ఆస్పత్రిలో పవన్ కల్యాణ్ భుజానికి శస్త్ర చికిత్స జరిగింది. ఆయనకుపూర్త విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించడం వల్లనే కేబినెట్ భేటీకి రాలేదని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.
మత్స్యకారుల నాయకుడిగా, మాజీ మంత్రిగా గుర్తింపు పొందిన సీదిరి అప్పలరాజు ఇటీవల వార్తల్లో నిలిచారు.
జగన్ సొంత కుంపటి పెట్టుకున్న నాటి నుంచీ వెన్నంటి ఉన్న విజయసాయిరెడ్డి, సమీప బంధువు అయిన బాలినేని లకు పార్టీలో దక్కిన మర్యాద తెలిసిందే. ఇప్పుడు తాజాగా నిన్న మొన్నటి వరకూ జగన్ కు అత్యంత సన్నిహితుడిగా, నమ్మిన బంటుగా ఉన్న మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డికి ఇప్పుడు కనీసం తాడేపల్లి ప్యాలెస్ గేటు వద్ద ఎంట్రీ కూడా దొరకడం లేదు.
ఇటీవల నిరుద్యోగ యువతను ఉద్దేశించి సుప్రీంకోర్టు చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు నిరసనగా, సామాజిక మాధ్యమాల్లో రాజుకున్న ఆగ్రహం ఇప్పుడు దేశ రాజధాని జంతర్ మంతర్ వద్ద విశ్వరూపంతో నిలిచింది. ప్రశ్నించే హక్కును కోల్పోయిన తరానికి ప్రాతినిధ్యం వహిస్తూ కాక్రోచ్ జనతా పార్టీ రూపంలో విద్యార్థులు, యువత ఉద్యమిస్తున్నారు.
ఏపీలో కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేని వైసీపీ ఈ అంశాన్ని రాజకీయ లబ్ధి కోసం వాడుకోవడానికి విశ్వ ప్రయత్నం చేస్తోంది. జాతీయ స్థాయి నీట్ లీకేజీ వ్యవహారంలోకి ఏపీ మెగా డీఎస్సీ పరీక్షల అంశాన్ని జోడించి లబ్ధి పొందేందుకు ప్రయత్నాలు చేస్తున్నది. రాష్ట్రంలో ఇటీవల నిర్వహించిన డీఎస్సీ పరీక్షల్లో అనేక అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ వైసిపి నాయకత్వం విమర్శిస్తూ, నీట్ తో పాటు డీఎస్సీ అక్రమాలపై కూడా విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తోంది.
దేశవ్యాప్తంగా నీట్ పరీక్షల నిర్వహణ, ప్రశ్నాపత్రాల లీకేజీ ఆరోపణలు తీవ్ర స్థాయిలో దుమారం రేపుతున్నాయి.
రాజకీయం గురించి కాదు. పార్టీ గురించి కాదు.ఒక నాయకుడి గురించి కూడా కాదు....ఒక తరం గురించి. విజృంభించిన లాఠీల్లో రక్తం చిందించిన ఈ తరం గురించి.
గతంలో అంటే వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు, దూషణలతో చెలరేగిన వల్లభనేని వంశీ తాజా లేఖలో మాత్రం చంద్రబాబుకు గౌరవం ఇస్తూ అయ్యా చంద్రబాబుగారూ అని మర్యాదగా సంభోధించారు. అంతే కాకుండా చంద్రబాబు చొరవను, రైతుల పట్ల ఆయనకు ఉన్న అక్కరనూ ప్రశంసలతో ముంచెత్తారు.
అధికారాన్ని అడ్డుపెట్టుకుని నిబంధనలకు తిలోదకాలిచ్చి.. ఇష్టారాజ్యంగా వ్యవహరించిన వైసీపీ ఇప్పుడు కేసుల చిక్కుల్లో నిండా ఇరుక్కుంది. అధికారంలో ఉండగా చట్టాలకు మనం అతీతులం అన్నట్లుగా వ్యవహరించిన వైసీపీ నేతలకు ఒక్కరొక్కరుగా పోలీసు కేసులను, సీఐడీ విచారణలను ఎదుర్కొంటూ, అరెస్టులు, బెయిళ్లు అంటూ న్యాయస్థానాల చుట్టూ తిరగాల్సి పరిస్థితిలో ఉన్నారు.
ఆయన రాజీనామాకు యువత పట్టుబడుతోంది. అయితే ప్రధాని నరేంద్ర మోడీ మాత్రం ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలన్న యువత డిమాండ్ ను పట్టించుకోవడం లేదు. నీట్ పై తొలి సారిగా స్పందించి, సోషల్ మీడియా వేదికగా న్యాయం చేస్తాననీ, లీకేజీ బాధ్యులను కఠినంగా శిక్షిస్తామనీ, అందుకోసం ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేస్తామనీ చెప్పిన మోడీ.. ధర్మేంద్ర ప్రధాన్ రాజీమానా చేయాలన్న యువత డిమాండ్ ను ఇసుమంతైనా పరిగణనలోకి తీసుకోలేదు.
గత ప్రభుత్వ హయాంలో ముంబైకి చెందిన నటిని, ఆమె కుటుంబ సభ్యులను అక్రమంగా అరెస్టు చేసి ఆంధ్రప్రదేశ్‌కు తీసుకురావడంపై విచారణ వేగం పుంజుకుందన్న ఆయన.. గతంలో ఎన్నికల కోడ్ అమలులోకి రావడానికి సరిగ్గా రెండు నెలల ముందు ముంబైలో ఉన్న కాదంబరి జత్వానీని, ఆమె తల్లిదండ్రులను ఏపీ పోలీసులు అరెస్ట్ చేసి.. ఫోర్జరీ భూలావాదేవీల కేసు సాకుగా చూపి దాదాపు 40 రోజుల పాటు జైలులో ఉంచారన్నారు.
గత ఎన్నికల్లో మంగళగిరి స్థానం నుంచి నారా లోకేష్ సాధించిన చారిత్రాత్మక విజయం ఆయనకు రాజకీయంగా పెద్ద మైలేజీని ఇచ్చింది. గతంలో ఓటమిని చవిచూసిన చోటే ఐదేళ్ల పాటు నిరంతరం ప్రజల్లో ఉంటూ, సమగ్ర ప్రచారంతో విజయం సాధించడం ఆయన రాజకీయ ప్రస్థానంలో ఒక కీలక మలుపుగా మారింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.