రెండో విడతలోనూ బీజేపీకి మైనస్సే?

Publish Date:May 1, 2024

Advertisement

మూడో సారి అధికారం తథ్యం అన్న ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతున్న బీజేపీకి సార్వత్రిక ఎన్నికల తొలి రెండు విడతల్లో షాక్ తగిలిందా? అంటే పరిశీలకులు ఔననే అంటున్నారు. తొలి విడతలో ఎన్నో ఆశలు పెట్టుకున్న తమిళనాడు రాష్ట్రంలో బీజేపీకి వచ్చే స్థానాల సంఖ్య శూన్యమేనన్న వార్తల నేపథ్యంలో ఆ పార్టీ పూర్తిగా డీలా పడింది. పెట్టని కోటగా బీజేపీ భావిస్తున్న ఉత్తరప్రదేశ్ లో సైతం బీజేపీకి ఆ పార్టీ ఊహిస్తున్న విధంగా సానుకూలత లేదని తొలి విడత పోలింగ్ స్పష్టం చేసిందంటున్నారు. ఇక రెండో విడతలోనూ బీజేపీకి భంగపాటే ఎదురైందని అంటున్నారు. ఏడు విడతల్లో జరిగే సార్వత్రిక ఎన్నికలలో భాగంగా ఇప్పటి వరకూ రెండు విడతల్లో దేశ వ్యాప్తంగా 190 లోక్ సభ స్థానాలకు ఎన్నికలు పూర్తయ్యాయి. అయితే ఈ రెండు విడతల్లోనూ కూడా కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి భాగస్వామ్యపక్షాలకే సానుకూలంగా పోలింగ్ జరిగిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

ఆ కారణంగానే బీజేపీలో అంతర్మథనం మొదలైందని, అందుకే మోడీ పరిధులు మరిచి మరీ దేశంలో విద్వేషాలను రెచ్చగొట్టేలా ప్రసంగాలు చేయడం ఆరంభించారని చెబుతున్నారు.  ఎన్నికల నియమావళిని ఇసుమంతైనా పట్టించుకోకుండా  మతపరమైన పోలరైజేషన్‌ కోసం విద్వేష వ్యాఖ్యలు చేస్తున్నారు. రాజస్థాన్ ఎన్నికల ప్రచారంలో మోడీ చేసిన వ్యాఖ్యలు దేశాన్ని షాక్ కు గురి చేశాయి. మైనారిటీ వ్యతిరేకతను ఈ పదేళ్లుగా ముసుగులో దాచేసిన ఆయన ఒక్కసారిగా ముసుగు తీసేశారు. ఎన్నికల నియమావళికి విరుద్ధంగా ఆయన చేస్తున్న ప్రసంగాల పట్ల ఎన్నికల కమిషన్ స్పందించలేదు.  

ఎన్నికల షెడ్యూల్ ప్రకటించే నాటికీ నేటికీ   దేశ రాజకీయ పరిస్థితుల్లో అనూహ్య మార్పు వచ్చింది. సుప్రీం కోర్టు తీర్పుతో ఎన్నికల బాండ్స్‌ బహిర్గతం అవ్వడంతో ఆ బాండ్ల వల్ల అధిక లబ్ధి పొందిందెవరన్నది ప్రస్ఫుటంగా దేశ ప్రజలందరికీ బ్లాక్ అండ్ వైట్ లో అవగతమైపోయింది. ఆ తరువాత ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ను ఈడీ అరెస్టు చేయడం  దేశ రాజకీయాలలో సంచలనానికి కారణమైంది. ఈ కేసులో ఇంత కాలం ఊరుకుని సరిగ్గా ఎన్నికల ముంగిట కేజ్రీవాల్ ను అరెస్టు చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని సర్వోన్నత న్యాయస్థానం సూటిగా ఈడీని ప్రశ్నించడం.. ఈ అరెస్టు రాజకీయపరమైనదేననే భావన ప్రజలలో కలిగింది.  వేర్వురు పార్టీలలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న నేతలు ఈడీ, సీబీఐ, ఐటీల నుంచి రక్షణ పొందాలంటే బీజేపీలో చేరడమొక్కటే మార్గంగా ఎంచుకుంటున్నారనీ, అటువంటి వారిని దరికి చేర్చుకుని బీజేపీ అవినీతి పరులకు ఆశ్రయ కేంద్రంగా మారిపోయి తద్వారా రాజకీయలబ్ధి పొందుతోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రజజలలో ఆ అసంతృప్తి ఎన్నికలలో ప్రతిఫలిస్తోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అదే సార్వత్రిక ఎన్నికల తొలి రెండు దశలలోనూ ప్రస్ఫుటంగా కనిపించిందని అంటున్నారు. 

ఇక గతంలో ఎన్నడూ లేనంతగా పెచ్చరిల్లిన నిరుద్యోగం కారణంగా యువతలో కూడా పదేళ్ల మోడీ పాలనపై అసహనం కనిపిస్తోందని చెబుతున్నారు.  ఏటా రెండు కోట్ల ఉద్యోగాల సృష్టి అంటూ ఘనంగా ప్రకటనలు గుప్పించిన మోడీ సర్కార్ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలలోని 30 లక్షల ఉద్యోగాలనే భర్తీ చేయకపోవడంపై యువతలో తీవ్ర ఆగ్రహం వ్యక్తం అవుతోంది.   రైతు ఆదాయం రెట్టింపు అంటూ ఊరూవాడా ఏకం చేసేలా ప్రచారం చేసుకున్న మోడీ సర్కార్ వారికి కనీస మద్దతు ధర కల్పించడంలో కూడా విఫలమైంది. తమ సమస్యలపై గళమెత్తిన రైతులపై ఉక్కుపాదం మోపడం ద్వారా రైతాంగం మోడీ సర్కార్ పై  కన్నెర్ర చేసిన పరిస్థితి ఉంది.వెరసి ఈ వర్గాలన్నీ మోడీ సర్కార్ తీరు పట్ల తమ ఆగ్రహాన్ని, అసంతృప్తిని ఎన్నికలలో ఓటు ద్వారా వ్యక్తం చేయాలని నిర్ణయించుకోవడం వల్లనే బీజేపీకి పరిస్థితులు ప్రతికూలంగా మారాయని చెప్పవచ్చు.   

By
en-us Political News

  
రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెరగడం వల్ల ప్రభుత్వ ఆదాయం పెరుగుతుంది. ఆదాయం పెంచుకోవడం కోసం తప్ప ప్రభుత్వాలకు భూముల విలువ పెంచడం వెనుక మరో ఉద్దేశమేమీ కనిపించడం లేదు. 
సింగపూర్ ఎయిర్​లైన్స్​కు చెందిన ఓ విమానం ఆకాశంలో తీవ్రమైన కుదుపునకు లోనవ్వడం వల్ల ఓ వ్యక్తి మరణించారు. మరో 30 మంది ప్రయాణికులకు గాయాలైనట్లు సమాచారం. లండన్​ నుంచి సింగపూర్ వెళ్తున్న  విమానంలో మంగళవారం ఈ ఘటన జరిగినట్లు సింగపూర్ ఎయిర్​లైన్స్ సంస్థ వెల్లడించింది.
నేను చెప్పింది జరగకపోతే జనం నా ముఖం మీద పేడ కొడతారు. అదే, నేను చెప్పింది జరిగితే ఆ పేడ జగన్ ముఖాన పడుతుంది అన్నారు.
ఇరాన్ ప్రెసిడెంట్ ఇబ్రహీం రైసీ హెలికాప్టర్ ప్రమాదంలో దుర్మరణం చెందడం మీద అనేక సందేహాలు ముసురుకుంటున్నాయి.
తెలంగాణా రాష్ట్రంలో ఉన్న 10 విశ్వవిద్యాలయాల వైస్‌ చాన్స్‌లర్ల పదవీకాలం మంగళవారంతో ముగిసింది. అయితే, పారిపాలనా సౌలభ్యం కోసం ఉన్న వారికే ఇంచార్జీలుగా బాధ్యతలు ఆప్పగిస్తారా? లేదా ఐఎఎస్‌లను ఇంచార్జీలుగా నియమిస్తారా? అనే విషయం ఆసక్తికరంగా మారింది.
ఏపీలోని తూర్పు గోదావ‌రి జిల్లా కొవ్వూరు మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత పెండ్యాల వెంక‌ట కృష్ణారావు (కృష్ణ‌బాబు) అనారోగ్యంతో మృతిచెందారు. గ‌త కొంత‌కాలంగా అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్న ఆయ‌న హైద‌రాబాద్‌లో చికిత్స పొందుతూ మంగళవారం తుదిశ్వాస విడిచారు. ఇవాళ తెల్లవారుజామున కృష్ణ‌బాబు చనిపోయినట్లు వైద్యులు, కుటుంబ సభ్యులు ధ్రువీకరించారు. 
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వేసవి సెలవులు కావడంతో గత నాలుగు రోజుల నుంచి భారీ సంఖ్యలో భక్తులు శ్రీవారి ద‌ర్శ‌నం కోసం క్యూక‌డుతున్నారు. స్వామివారిని దర్శించుకునేందుకు కిలో మీటర్ల మేర బారులు తీరుతున్నారు. ఇలా భ‌క్తుల తాకిడి పెర‌గడంతో టీటీడీ తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. వీఐపీ బ్రేక్‌ దర్శన టికెట్ల జారీని తిరిగి ప్రారంభించాల‌ని నిర్ణ‌యించింది. ఈ నిర్ణయంతో భక్తుల రద్దీ ఉన్నాస‌రే.. శ్రీవారిని దర్శించుకునే సమయం తగ్గనుంది.
అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ప్రభుత్వంలో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) సీనియర్ నాయకుడు మనీష్ సిసోడియా ఢిల్లీ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆర్థిక, విద్య, ప్రణాళిక, పట్టణాభివృద్ధి, రెవెన్యూ, సేవలు, స్థానిక సంస్థలు, భూమి & భవనాలు, ఉన్నత విద్య, శిక్షణ & సాంకేతిక విద్య, విజిలెన్స్, సహకార సంఘాలు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మరియు ఇన్ఫర్మేషన్ & పబ్లిసిటీ వంటి అనేక ముఖ్యమైన విభాగాలకు సిసోడియా ఇన్‌ఛార్జ్‌గా ఉన్నారు.
ఈసారి లోకేష్‌కి 60 వేల ఓట్ల మెజారిటీ పక్కా అని తెలుగు తమ్ముళ్ళు ఢంకా బజాయించి చెబుతుంటే, వైసీపీ సానుభూతిపరులు మాత్రం తమ అభ్యర్థి ఆర్కే మీద సానుభూతి వ్యక్తం చేస్తున్నారు.
ఆత్మహత్య సదృశ్యం జగన్ రెడ్డి పరిపాలనాని అంటారు సోషల్ డెమోక్రటిక్ ఫ్రంట్ రాష్ట్ర అధ్యక్షులు మాదిగాని గురునాదం. తిరుపతి, అనంతపురం, మాచర్లలో జరిగిన అల్లర్ల, విధ్వంసం, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ఇళ్లు ధ్వంసం చేసిన ఘటనలో వైసిపి పాత్ర వుంది. వీటన్నింటిపై సిట్ దర్యాప్తు జరుగుతుంది.
కల్వకుంట్ల కవిత పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరగడానికి ఎన్‌ఫోర్స్.మెంట్ డైరెక్టరేట్ అవకాశం కల్పించిది. తద్వారా ఈడీ ద్వారా కవితకి బర్త్ డే గిఫ్ట్ అందించింది.
ఇజ్రాయెల్ శత్రువు ప్రపంచంలో ఏ మూలన ఉన్నా అంతమొందించే శక్తి సామర్థ్యాలు మొసాద్ కు ఉన్నాయన్నది జగమెరిగిన సత్యం! గతంలో ఇజ్రాయెల్ శత్రువులు వివిధ ఘటనల్లో చనిపోయారు. వాళ్లలో ఇరాన్ కు చెందిన అణు పరిశోధకులు కూడా ఉన్నారు. కచ్చితంగా ఫలానా వాళ్లు చంపారనే ఎలాంటి ఆధారాలు లేని రీతిలో వాళ్లు కడతేరిపోయారు. ఈ తరహా ఆపరేషన్లు నిర్వహించడంలో మొసాద్ దిట్ట!
ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారని సీసీఎస్ ఏసీపీ ఉమామహేశ్వరరావుపై ఆరోపణలు రావడంతో యాంటీ కరప్షన్ బ్యూరో (ఏసీబీ) అధికారులు హైదరాబాద్ లో రెయిడ్స్ చేపట్టారు. మంగళవారం ఉదయాన్నే ఆశోక్ నగర్ లోని ఏసీపీ ఉమామహేశ్వరరావు నివాసానికి చేరుకున్న అధికారులు.. ఏసీపీ నివాసంలో సోదాలు చేపట్టారు. హైదరాబాద్ లోని ఏసీపీ స్నేహితులు, బంధువుల ఇళ్లకూ వెళ్లిన అధికారులు మొత్తంగా సిటీలో ఆరుచోట్ల సోదాలు చేస్తున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.