పోలవరం పై బీజేపీ నేత సుజనా స్పందన,పోలవరం ఒక కలగానే మిగలనుందా?

Publish Date:Oct 15, 2019

Advertisement

 

ఏపీ లో నిన్న మొన్నటిదాకా ఉత్కంఠంగా నడచిన అంశం పోలవరం. అసలు పొలవరం ఎప్పటికైనా పూర్తి అవుతుందా లేదా అనే అంశం పై ప్రజలు ఆశలు కూడా వదులుకుంటున్నారు అనడంలొ ఆశ్చర్యం లేదు. ప్రాజెక్టు పర్యటనకు వెళ్లిన రాష్ట్ర బీజేపీ నేతలు ఇప్పుడు కేంద్ర పెద్దల్ని కలిసి రావటమే కాక  పోలవరం వెంటనే పూర్తి చేయాలనే డిమాండ్ ను కేంద్రం ముందు ఉంచారు. కేంద్ర జలశక్తి మంత్రి షెకావత్ ను కలిసిన రాష్ట్ర నేతలు ప్రాజెక్టుపై చర్చించారు. అంతకుముందు పోలవరం పర్యటన ద్వారా తమ దృష్టికి వచ్చిన అంశాలను కేంద్ర మంత్రికి వివరించారు. ఇక్కడి వరకు బాగానే ఉన్నా అసలు పోలవరంపై నిర్దిష్టంగా బీజేపీ డిమాండ్ ఏంటి అన్న విషయం మాత్రం స్పష్టంగా కనిపించటం లేదు. పోలవరం విషయంలో పార్టీ నేతలు ఒక్కొక్కరు ఒక్కో డిమాండ్ చేస్తుండడంతో ఈ వ్యవహారంపై అసలు బీజేపీ ఏం కోరుకుంటోంది అనేది అర్థం కాకుండా తయారైంది. పోలవరంలో అవినీతి జరిగిందని గతం నుంచే బీజేపీ ఆరోపిస్తుంది.

టిడిపి అధికారంలో ఉన్న సమయంలో పార్టీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు వంటి వారు తీవ్ర స్థాయిలో పోలవరంపై ఆరోపణలు చేశారు. ఇక టీడీపీ అధికారం కోల్పోయిన తరువాత కూడా బీజేపీ నేతలు అదే స్వరం వినిపించారు. పార్టీ అధ్యక్షుడు కన్నా కూడా పోలవరం పునరావాసంలో అక్రమాలు జరిగాయని ఒకటికి రెండు సార్లు ఆరోపించారు. అయితే ఈ అంశాల పై ఇప్పటికే కేంద్ర జలశక్తి శాఖ వివరణ ఇచ్చింది. పోలవరం నిర్మాణంలో అక్రమాల అంశాల్ని కేంద్రం పలు సందర్భాల్లో తోసిపుచ్చింది. పార్లమెంట్ లోనూ, బయట పోలవరం నిర్మాణ విషయంలో అవినీతి జరగలేదని స్వయంగా కేంద్ర మంత్రి తేల్చి చెప్పారు. అయినా ఇప్పుడు కేంద్ర పెద్దలను కలిసినా రాష్ట్ర  బీజేపీ నేతలు మళ్లీ అవినీతిపైనే ఫిర్యాదు చేశారు.అదే సమయంలో రివర్స్ టెండర్ల విషయంలో కూడా బీజేపీ ఏమీ చెప్పలేని స్థితిలో ఉంది. ఇప్పటికే రివర్స్ టెండర్ లకు సంబంధించి కేంద్రం అభ్యంతరం చెప్పింది. అయితే రివర్స్ టెండర్ లలో ఎనిమిది వందల కోట్ల ఆదా చేయవచ్చు అన్ని తీరుగా జగన్ సర్కార్ వెల్లడించింది.  బీజేపీలో చేరిన ఎంపీ సుజనా చౌదరి పోలవరం విషయంలో ఇప్పటికే ప్రభుత్వ విధానాలపై తీవ్రంగా తప్పుపడుతున్నారు. గతంలో అవినీతి అంటూ విచారణ చేపడితే ప్రాజెక్టు నిర్మాణంలో జాప్యం జరుగుతుందని ఆయన భావిస్తున్నారు. దీంతో గతాన్ని వదిలేసి ప్రాజెక్టుకు పూర్తిగా ఏం చర్యలు తీసుకోవాలో వాటిపైనే దృష్టి పెట్టాలని ఆయన సూచించారు.

నాటి ప్రభుత్వం పై ఇతర నేతలు చేస్తున్న ఆరోపణలతో సుజనా విభేదిస్తున్నారు. అదిలా ఉంటే ఇప్పటికే కేంద్రం నుంచి పోలవరానికి ఆరు వేల కోట్ల రూపాయల నిధులు విడుదల కావాల్సింది. గత రెండేళ్ల నుంచి మొత్తం పెరుగుతూ వస్తోంది. అయితే డీపీఆర్ 2 కు ఆమోదం వచ్చే వరకు ఈ నిధులు విడుదలయ్యే అవకాశం కనిపించడం లేదు అని స్పష్టమవుతోంది. మొత్తంమీద పోలవరం ప్రాజెక్టు విషయంలో రాష్ట్ర బీజేపీ నేతలు ఒక్కొక్కరు ఒక్కో అభిప్రాయంతో ఉన్నారు అనేది స్పష్టంగా అర్థమవుతోంది. ఇవన్నీ ఇలా ఉంటే రాష్ట్ర బీజేపీ నేతల ఫిర్యాదులు తరువాత అసలు పోలవరానికి సంబంధించి కేంద్ర జల వనరుల శాఖ ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది మరింత ఆసక్తికరంగా మారింది.

By
en-us Political News

  
ఇండియా కూటమి తరఫున రాహుల్ గాంధీనే ప్రధానమంత్రి అభ్యర్థి అని కుండబద్దలు కొట్టారు. ఆ విషయాన్నే తమిళనాడు కాంగ్రెస్ శాసనసభాపక్ష  నాయకురాలు తారాహై కత్‌బర్ట్  మరింత క్లారిటీ ఇస్తూ.. విజయ్ ప్రధాని అవుతారంటూ కొందరు ప్రచారం చేయడం కేవలం టీవీకే శ్రేణుల ఉత్సాహం వల్ల జరుగుతున్న ప్రచారమే తప్ప, అది ఆ పార్టీ అధికారిక వైఖరి కాదన్నారు.
రాజకీయ క్షేత్రంలో ముందస్తు ఊహాగానాలు, భవిష్యత్ ఎన్నికల అంచనాలు ఎప్పుడూ ఆసక్తికరంగానే సాగుతుంటాయి. ఈ నేపథ్యంలో సపోజ్ ఫర్ సపోజ్  ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే పరిస్థితి ఎలా ఉంటుందన్న చర్చ జోరందుకుంది. రానున్న  రాజకీయ సమీకరణాలపై   చర్చోపచర్చలు మొదలయ్యాయి.
కొండా సురేఖపై వేటు తప్పదనీ, ఆమెకు క్యాబినెట్ నుంచి ఉద్వాసన తప్పదన్న ప్రచారం జోరుగా సాధింది. ఒక దశలో రేవంత్ కేబినెట్ లోకి సురేఖ స్థానంలో మరో ఫైర్ బ్రాండ్ నాయకురాలు విజయశాంతిని తీసుకోనున్నట్లు కూడా వార్తలు వినిపించాయి. 
 ప్రభుత్వ మద్దతుతో జరిగే ఏకగ్రీవ ఎన్నికలు ఉంటాయన్న ఆయన రాజకీయ పార్టీ కోణంలో ఏకగ్రీవాలు ఉండకూడదని జగన్ అన్నారంటూ బొత్స  వివరణపై వైసీపీ నేతలు పెదవి విరుస్తున్నారు.
బహదూర్‌పురా నియోజకవర్గ ఎమ్మెల్యే మహ్మద్ ముబీన్‌ను రాజేంద్రనగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌గా ఆల్ ఇండియా మజ్లిస్-ఎ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (AIMIM) నియమించింది.
ఇండియా టుడే-సి ఓటర్ సర్వే అంచనాల ప్రకారం.. మొత్తం 25 లోక్‌సభ స్థానాలు ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి  20 పార్లమెంట్ స్థానాలను దక్కించుకుంటుంది.
 దువ్వాడ కుటుంబ వ్యవహారం రచ్చకెక్కి పార్టీ ప్రతిష్ఠ మసకబారే పరిస్థితి రావడంతో వైసీపీ అధినేత జగన్ తప్పని సరిపరిస్థితుల్లో  దువ్వాడ శ్రీనివాస్ పై సస్పెన్షన్ వేటు వేశారు.   అయితే పేరుకే సస్పెన్షన్ తప్ప ఆయన ఇప్పటికీ వైసీపీ ఎమ్మెల్సీగానే చెలామణి అవుతున్నారు.
తెలుగుదేశం కూటమి సునాయాసంగా 20 స్థానాలను కైవసం చేసుకుంటుంది.   2024 ఎన్నికల ఫలితాలు పునరావృతమౌతాయిని ఇండియా టుడే సర్వే పేర్కొంది.
సొంత పార్టీ శాసనమండలి సభ్యుడిపై  మహిళల పట్ల అసభ్యకర ప్రవర్తన మరియు వేధింపుల ఆరోపణలు వెల్లువెత్తడంతో, ఎమ్మెల్సీ రహమత్ బేగ్‌పై వేటు వేశారు.
మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్  రాజకీయ సన్యాసం స్వీకరించబోతున్నారా? అంటే ఔనన్న సమాధానమే వస్తున్నది.   ప్రత్యర్థులపై విమర్శలతో విరుచుకుపడే అనిల్ కుమార్ యాదవ్, తాజాగా చేసిన వ్యాఖ్యలను బట్టి రాజకీయవర్గాలలో ఆయన పొలిటికల్ రిటైర్మెంట్ ప్రకటించబోతున్నారా అన్న చర్చ జోరందుకుంది.  
రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి కొండా సురేఖకు ఉద్వాసన తప్పదనీ, ఆమె స్థానంలో  కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు, సనీనటి విజయశాంతిని కేబినెట్ లోకి తీసుకునే అవ కాశాలు మెండుగా ఉన్నాయన్న చర్చ జోరుగా సాగుతోంది.
ఖర్గేతో భట్టి భేటీ.. హస్తం పార్టీలో తీవ్ర ఉత్కంఠ..!
నూకరాజు కుటుంబం ఆత్మహత్య వెనుక లవ్ జిహాదీ, మత మార్పిడికి ఒత్తిడి చేసిన సాధిక్ ఖాన్ అనే వ్యక్తికి కూడా వైసీపీతో అనుబంధం సంబంధం ఉందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అందుకు సంబంధించిన ఫొటోలు కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్  అవుతున్నాయి. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.