ముర్ము విజయోత్సవ సభకు తప్పతాగి వచ్చిన కమలం నేత
Publish Date:Jul 27, 2022
Advertisement
క్రమశిక్షణ, సిద్ధాంత నిబద్ధత అంటూ ఘనంగా చెప్పుకునే బీజేపీ అసలు రంగు ఏమిటన్నది గుజరాత్ సాక్షిగా తేటతెల్లమైపోయింది. భారత రాష్ట్రపతిగా గిరి పుత్రిక ముర్మ పదవీ బాధ్యతలు చేపట్టిన సందర్భాన్నిపురస్కరించుకుని గుజరాత్ లోని గిరిజన ప్రాబల్యం అధికంగా ఉండే చోటౌడేపూర్ లో విజయోత్సవ సభ నిర్వహించింది బీజేపీ. భారత ప్రథమ పౌరురాలిగా గిరిపుత్రికను పీఠం ఎక్కించిన క్రెడిట్ ను పూర్తిగా సొంతం చేసుకునే ఉద్దేశంతో దేశ వ్యాప్తంగా బీజేపీ ఆధ్వర్యంలో విజయోత్సవాలు జరుగుతున్నాయి. అందులో భాగంగానే గుజరాత్ లోని చోటౌడ పూర్ లో కూడా బీజేపీ విజయోత్సవ సభ నిర్వహించింది. అంత వరకూ బాగానే ఉంది. ఆ విజయోత్సవ సభకు హాజరైన గుజరాత్ మంత్రి, బీజేపీ నాయకుడు నిమిషా సుతార్ తప్పతాగి హాజరయ్యారు. అలాగే సభకు బీజేపీ జిల్లా అధ్యక్షుడు రష్మాకాంత్ వాసవ కూడా హాజయర్యారు. ఆయన హాజరవ్వడం విశేషం కాదు కానీ.. తప్పతాగి హాజరు కావడమే ఇప్పడు సర్వత్రా విమర్శలు వెల్లువెత్తడానికి కారణమైంది. సభా స్థలికి వచ్చి కారు దిగడమే తూలుతూ వచ్చిన ఆయన సభా వేదికపై కూడా పరిసరాలను గమనించే స్ఫృహ లేని స్థితిలో ఉన్నారు. పక్కను మహిళా మంత్రి ఉన్నారన్న స్ఫృహ కూడా లేనంతగా మత్తులో మునిగిపోయారు. విజయోత్సవ సభ ప్రారంభమైనది మొదలు, ముగిసే వరకూ ఆయన కళ్లు తెరిచింది లేదు. వేదికపై తూగుతూ ఊగుతూనే కూర్చున్నారు. ఇందుకు సంబంధించి వీడియోలు వైరల్ అయ్యాయి. సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతండటంతో గుజరాత్ బీజేపీ ప్రతిష్ట మసక బారింది. దీంతో నష్ట నివారణ చర్యలకు ఉపక్రమించింది. బీజేపీ గుజరాత్ అధ్యక్షుడు రష్మీకాంత్ ను రాజీనామా చేయాల్సిందిగా ఆదేశించింది. దీంతో ఆయన పార్టీ జిల్లా అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. ప్రధాని మోడీ సొంత రాష్ట్రం గుజరాత్ లో బీజేపీ ప్రభుత్వం పాలనలో ఉన్న రాష్ట్రంలో పార్టీ జిల్లా అధ్యక్షుడి నిర్వాకం దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. బీజేపీ సర్కార్ గుజరాత్ లో మద్య నిషేధం అమలు చేస్తున్నామని ఘనంగా చెప్పుకోవడం కాదు.. అది నిజంగా అమలు అవుతోందా అన్న అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. ఈ సంఘటనపై విపక్షాలు విమర్శల బాణాలు సంధిస్తున్నారు. బీజేపీ దంతా పేరు గొప్ప ఊరు దిబ్బ చందమే ననడానికి రష్మీకాంత్ ఉదంతమే నిదర్శనమని అంటున్నారు.
http://www.teluguone.com/news/content/bjp-leader-came-to-murmu-success-meet-in-drunken-stage-39-140622.html





