భారతీయ జనతాపార్టీ రాజకీయాలు అంత త్వరగా అర్ధం కావు. ఒకదాన్ని మరో దానికి సంబంధం లేకున్నా ఏదో విధంగా ముడి పెట్టి రచ్చచేయడం, చర్చలకు వీలు కల్పించడంలో ఆనందిస్తుంటారు కమలనాధులు. తాజాగా మోడీ సర్కార్కు వ్యతిరేకంగా వెల్లువెత్తుతున్న నిరసనలను రాముడిని అవమా నిస్తున్నా రంటూ ఊహించని రాజకీయాలకు కేంద్రహోం మంత్రి అమిత్ షా తెరలేపారు. పైగా కాంగ్రెస్ రాజకీయాలను భ్రష్టుపట్టిస్తోందని విమర్శించారు. షా మాట అందుకుని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాద్ రామభక్తులను అవమానించినందుకు దేశానికి కాంగ్రెస్ క్షమాపణలు కోరాలని అన్నారు.
ప్రతిపక్షం నల్లదుస్తుల్లో నిరసన వ్యక్తం చేయడం అదీ అయోధ్యదివస్ ను దేశ ప్రజలు జరుపుతున్న రోజున ఆ విధంగా కాంగ్రెస్ వ్యవహరించడం రామభక్తులను అవమానించినట్లేనని ఆదిత్యనాధ్ అన్నా రు. అయితే తమ నిరసనకు బిజేపీ ఇలా మతం రంగుపూయడం దారుణమని కాంగ్రెస్ నాయకులు మండి పడుతున్నారు. ప్రధాని మోదీ 2020 ఆగస్టు 5న రామమందిర నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. దానికి కాంగ్రెస్ ప్రస్తుత నిరసనలకు ముడి పెట్టడానికి బీజేపీ ప్రయత్నిస్తోంది.
రామమందిరం, అయోధ్య అంశాల చుట్టూ తిరిగిన రాజకీయాల ఆధారంగానే బీజేపీ ఊహించని విధంగా కేంద్రంలో అధికార పగ్గాలు చేపట్టింది. 1984లో కేవలం రెండు సీట్టు ఉన్న పరిస్థితుల నుంచీ దేశ రాజకీ యాల్లో కీలకపాత్ర వహించే స్థాయికి వేగంగా అభివృద్ధి చెందింది. అంతేగాక వరుసగా రెండో పర్యాయం అధికారంలో కొనసాగుతోంది. రామమందిరం అంశమైతే 1980ల్లో దేశ రాజకీయాలను ఊహించని మలుపు తిప్పింది. దీని ప్రభావంతోనే కేంద్రంలో కాంగ్రెస్ అధికారం కోల్పోయింది. ఈ సమయంలోనే జనతా పార్టీ లో భాగమైన భారతీయ జనసంఘ్ తో కలిసి బీజేపీ అవతరించింది. క్రమేపీ హిందూత్వ అజెండాతో జాతీ య రాజకీయాల్లో బలమైన శక్తిగా ఎదిగింది.
కాంగ్రెసేత పార్టీ వాజ్పేయి ప్రధానిగా ఐదేళ్లు కేంద్రంలో సత్తా చాటింది. కానీ రామ మం దిరం అంశం కాంగ్రెస్కు విజయాన్ని ఆపాదించింది. అలాగే విపక్షాలు ఆ అంశంలో కాస్తంత వెనక డుగూ వేయవలసి వచ్చింది. 19190లో రామమందిరం జోరందుకున్నపుడు, అయోధ్యలో కరసేవకులపై కాల్పులకు ఆదేశించినపుడు సమాజ్వాది పార్టీ నాయకుడు ములాయం సింగ్కు బీజేపీ మౌలానా ములాయం అని కొత్త పేరుతో దాడిచేసింది. 2019లో సుప్రీం కోర్టు రామమందిర నిర్మాణానికి వీలు కల్పిస్తూ తీర్పు నిచ్చింది.
ఇటీవలి యుపి అసెంబ్లీ ఎన్నికల్లో కూడా బీజేపీ రామ మందిరానికి ఓటు వేయండి అన్న నినాదంతోనే ప్రజల్లోకి వెళ్లింది. వందలమంది సాధువులు ప్రచారానికి రంగంలోకి దిగారు. వారిలో మహంత్ రామదాస్, నాగా సాధు ఉఅర్జున్ దాస్, బాబా బ్రజేష్ దాస్ కూడా ఉన్నారు. వారందరి లక్ష్యం ప్రజల్ని ముఖ్యంగా ఓటర్లను బీజేపీవైపు మొగ్గుచూపేలా ఆకట్టుకోవడం. యుసి సీఎం ఆదిత్యనాధ్ దర్శకత్వంలో అదే జరి గింది. జనాన్ని అన్ని ప్రాంతాల నుంచి అయోధ్యకు వచ్చేట్టు వీలు కల్పించడం ఓట్లకు గాలం వేయడం లో భాగంగానే బీజేపీ చేపట్టింది. ఇటీవలి కాలంలో అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆప్ కన్వీనర్ అరవింద్ ఖేజ్రివాల్ ఉత్తరప్రదేశ్, గోవాలలో తీర్ధయాత్రలు ఉచితంగా చేసేందుకు వీలుకల్పి స్తామని హామీ ఇచ్చారు. మహారాష్ట్ర లో శివసేన నాయకుడు ఆదిత్య థాక్రే, ఎంఎన్ ఎస్ నాయకుడు రాజ్ థాక్రే కూడా అయోధ్యలో రామమందిరం దర్శించడానికి సుముఖత వ్యక్తం చేశారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/bjp-in-ram-maya-39-141405.html
కాషాయం పార్టీ రాష్ట్ర నేతలు కొండా బీజేపీ ఎంట్రీపై ఒక్కొక్కరూ ఒక్కోలా మాట్లాడుతున్నారు. వీటికి తోడు సకుటుంబ సపరివార సమేతంగా అయితేనే కాషాయం కండువా కప్పుకుంటానంటూ కొండా సురేఖ కండీషన్లు పెడుతున్నట్లు వస్తున్న వార్తలు ఆమెకు బీజేపీ ఎంట్రీ కూడా మూసుకుపోయిందా అన్న అనుమానాలకు కలిగిస్తున్నాయి.
కొండా సుశ్మీత మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. తన వ్యాఖ్యలకు తానే బాధ్యురాలిననీ, తన తల్లిపై వేటు వేయడం సరికాదనీ ఆవేదన వ్యక్తం చేశారు. తన వ్యాఖ్యలకు తన తల్లిని శిక్షించడం సరికాదన్నారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో వ్యక్తిగత అభిప్రాయాలకు, స్వతంత్రంగా మాట్లాడే మహిళల గొంతుకకు విలువ లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
పార్టీ అధిష్టానం సీఎఉం మాటకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో, ఆయనకు వ్యతిరేకంగా అసమ్మతి గళం ఎత్తే సీనియర్ నేతలకూ అంతే ప్రాధాన్యత ఇస్తుంది. దీంతో కాంగ్రెస్ సీఎం ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుంది. కాంగ్రెస్ అధికారంలో ఉన్న పార్టీ సీఎంలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఇదేనని చెప్పాలి.
ఒక్క ఆంధ్రప్రదేశ్ అనే కాదు.. దేశంలోని అన్ని రాష్ట్రాలలోనూ సొంత కాళ్లపై నిలబడాలన్నదే బీజేపీ విధానమని విష్ణువర్ధన్ రెడ్డి చెప్పారు. గతంలో ఏపీలో బీజేపీ మద్దతు వల్లే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందనీ, ఈ వాస్తవాన్ని సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ బహిరంగ వేదికలపై స్పష్టంగా చెప్పారని విష్ణువర్ధన్ రెడ్డి గుర్తు చేశారు.
రాయలసీమను హార్టికల్చర్ హబ్గా తీర్చిదిద్దేందుకు, రాష్ట్రంలో ఇరిగేషన్ సదుపాయాలను మెరుగుపరిచేందుకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పకడ్బందీ ప్రణాళికలతో ముందుకు వెళ్తోందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు ఒక్కొక్కటిగా పూర్తవుతుండటంతో, ఇరిగేషన్ రంగంపై మాట్లాడటానికి ప్రతిపక్షానికి ఎలాంటి అవకాశాలు లేకుండా పోయాయని ఆయన కుండబద్దలు కొట్టారు.
జలయజ్ణం పేరుతో వైఎస్ చేసింది ధనయజ్ణమని విక్రమ్ పూల అన్నారు. ప్రాజెక్టుల అంచనా వ్యయం పెరగడం, ప్రాంతీయ సమతుల్యత లోపించడం, హెడ్ వర్క్స్ కంటే ముందుగా కాలువల తవ్వకం వంటి వాటికే వైఎస్ జలయజ్ణం పరిమితమైందని విక్రమ్ పూల వివరించారు.
కాంగ్రెస్ హైకమాండ్ మీనాక్షీ నటరాజన్ పై వేటు వేయాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు. రాహుల్ గాంధీ నేతృత్వంలోని జాతీయ నాయకత్వం రాష్ట్రంలో కాంగ్రెస్ వ్వవహారాలను చక్కదిద్దేందుకు భూపేష్ బగెల్ సమర్ధంగా పని చేయగలరని భావించి ఆ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.
తాను పూర్తిగా రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాననీ, వచ్చే ఎన్నికలలో పోటీ చేయననీ ఆయన చేసిన ప్రకటన పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. తెలుగుదేశం ఆవిర్భావం నుంచీ కూడా ప్రజా ప్రతినిథిగా, పొలిటికల్ లీడర్ గా సేవలందించిన అయ్యన్న పాత్రుడు హఠాత్తుగా రాజకీయాలకు రిటైర్మెంట్ అంటూ చేసిన ప్రకటన రాజకీయవర్గాలలో సంచలనం సృష్టించింది.
2019 ఎన్నికలలో వైసీపీ విజయంలో అప్పటి జగన్ పాదయాత్ర కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. అయితే అప్పట్లో.. జగన్ వాగ్దానాలపై ప్రజలలో నమ్మకం ఉండేది. ప్రజలతో ఆయన మమేకమయ్యేవారు.
రాష్ట్ర విభజన తరువాత తెలంగాణలో తెలుగుదేశం పార్టీ అధికార రేసులో లేకపోయినప్పటికీ.. రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేస్తూనే ఉంది. అందుకే రాష్ట్రంలో రాజకీయ వేడ రగిలిన ప్రతి సందర్భంలోనూ తెలుగుదేశం ప్రస్థావన వస్తూనే ఉంటుంది.
తెలంగాణ రాజకీయాల్లో గత కొన్ని రోజులుగా తీవ్ర దుమారం రేపుతున్న పరిణామాలు ఇప్పుడు అత్యంత ఆసక్తికర మలుపు తిరిగాయి.
తాజాగా ఆమె చేసిన వ్యాఖ్యలు ఆమె చూపు బీఆర్ఎస్ వైపు మళ్లిందా అన్న అనుమానాలకు తావిచ్చింది. కేబినెట్ నుంచి తనకు ఉద్వాసన పలికిన తరువాత మీడియాకు వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్న కొండా సురేఖ.. తాజాగా బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుపై ప్రశంసల వర్షం కురిపించారు.
పిడిక్కీ బియ్యానికీ ఒకే మంత్రం అన్నట్లుగా ఆమె తన బర్త్ రఫ్ కూ తెలుగుదేశం పార్టీకీ ముడి పెట్టారు. సీఎం రేవంత్ రెడ్డిది తెలుగుదేశం రక్తం కనుకనే తనకు కేబినెట్ నుంచి బర్త్ రఫ్ చేశారంటూ మీడియా సమావేశంలో కొండా సురేఖ చేసి కామెంట్స్ రాజకీయవర్గాలలో సంచలనంగా మారాయి.