జనసేనానికి చిరు స్పీడ్ బ్రేకర్.. బీజేపీ రూటు మార్చింది!

Publish Date:Jul 5, 2022

Advertisement

ఆంద్రప్రదేశ్ లొ బిజెపి రూట్ మ్యాప్ మారినట్టు కనిపిస్తుంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నడవాల్సిన బిజెపి రూట్లో చిరు స్పీడ్ బ్రేకర్ నిలిచింది.  అసలు బిజెపి ఏపీలో తానే మార్గ సూచి అని ఇంత కాలం చెప్పుకుంటూ వస్తున్న పవన్ కల్యాణ్ కు చిరు రూపంలో కమలం పార్టీ చెక్ పెట్టింది.  చడీ చప్పుడూ లేకుండా మెగా స్టార్ ను తీసుకువచ్చి తెరముందు నిలిపింది.

రాజకీయాల నుంచి తెర మరుగై పోయి వెండి తెరపై వెలుగొందితే చాలని అనుకుంటున్న చిరంజీవిని భీమవరంలో అల్లూరి సభకు ఆహ్వానించి మోడీతో వేదికపై కూర్చో పెట్టడం ద్వారా రాష్ట్రంలో కొత్త రాజకీయ చర్చకు తెరలేచింది. రాష్ట్రంలో బీజేపీ, జనసేన చెట్టా పట్టాలు వేసుకుని నడుస్తున్నాయని అంతా భావిస్తున్న సమయంలో కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన, అందునా ప్రధాని మోడీ హాజరైన కార్యక్రమానికి జనసేనానికి కనీసం ఆహ్వానం కూడా పంపకుండా అవమానించడమే కాకుండా... ఆయన సోదరుడిని ప్రత్యేకంగా ఆహ్వానించి మోడీతో వేదికపై కూర్చోబెట్టి రాచమర్యాదలు చేయడం చూస్తుంటే.. ఇక పవన్ కల్యాణ్..కమలం పార్టీల మధ్య సఖ్యత చెడినట్లేనని పరిశీలకులు సైతం విశ్లేషిస్తున్నారు.  

అదే సమయంలో ఇంత కాలం రహస్య మైత్రిగా సాగుతూ వచ్చిన బీజేపీ, వైసీపీ బంధం ఇకపై బహిరంగమేనని కూడా సూత్రీకరిస్తున్నారు. చిరంజీవిని అల్లూరి విగ్రహావిష్కరణకు ఆహ్వానించి ప్రత్యేక గౌరవం ఇవ్వడానికి స్కెచ్ చాలా కాలం కిందటే మొదలై ఇప్పటికి తెరమీదకు వచ్చిందని విశ్లేషకులు అంటున్నారు.  సినిమా టికెట్ల వ్యవహారంలో ఒక వైపు జనసేనాని సినిమా భీమ్లానాయక్ కు నష్టం వాటిల్లే విధంగా చర్యలు తీసుకుంటూనే.. ఆ సినిమాను మినహాయించి మిగిలిన సినిమాల విడుదల సమయానికి టికెట్ల రేట్ల పెంపునకు అనుమతిచ్చేందుకు జరిపిన చర్చలలో చిరంజీవి పాల్గొన్న సమయంలోనే ఆయనను రాజకీయ రంగ ప్రవేశానికి సిద్ధం చేయడం మొదలైందని పరిశీలకులు అంటున్నారు.

ఇప్పటికి అది ఒక రూపుదాల్చిందనీ, చిరంజీవి కమలం గూటికి చేరడం, ఏపీలో ఆ పార్టీ తరఫున క్రియాశీలంగా పని చేయడం దాదాపు ఖరారైందని చెబుతున్నారు.  మొత్తం మీద ఇంత కాలం బీజేపీ   పవన్ తొ మైండ్ గేమ్ ఆడుతూ వచ్చిందనీ, మిత్ర పక్షం అంటూ జనసేనతో కలిసి నడుస్తున్నట్లు కనిపిస్తూ అధికార వైసీపీకి అన్ని విధాలుగా అండగా నిలిచిందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. ఇక వైసీపీతో మైత్రిని బహిర్గతం చేయడం, జనసేనానికి గుడ్ బై చెప్పడం లాంఛనమే అని అంటున్నారు.

అయితే ఏపీ బీజేపీలోనే చిరంజీవి విషయంలో  అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయని కమలం శ్రేణులు అంటున్నాయి. గతంలో ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసి పదవులు పొంది.. ఆ పదవీ కాలం పూర్తవ్యగానే సినిమాలే నా ప్రపంచం అంటూ వెళ్లిపోయిన చిరంజీవిని దగ్గరకు తీయడం వల్ల బీజేపీ ఇమేజ్ దెబ్బతింటుందని వారు అంటున్నారు. ఏది ఏమైనా జనసేన బీజేపీ మైత్రికి రోజులు దగ్గపడ్డాయన్నది మాత్రం ఖాయమైనట్లేనని రాజకీయ వర్గాలలో చర్చ జరుగుతోంది.
 

By
en-us Political News

  
బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయం సాధించడంలో సువేందు కీ రోల్ పోషించారు. ఆ పార్టీ 206 స్థానాల్లో గెలిచి బెంగాల్‌లో తొలిసారిగా అధికారం చేపట్టబోతోంది. బీజేపీ తరఫున రెండు స్ధానాల నుంచి బరిలోకి దిగిన సువేందు అధికారి.. మరోసారి మమతా బెనర్జీని ఓడించారు. భవానిపూర్‌లో దీదీపై గెలిచిన ఆయన.. తన సొంత నియోజకవర్గమైన నందిగ్రామ్‌లోనూ గెలిచి పట్టు నిలుపుకున్నారు.
ముఖ్యంగా అస్సాం, పశ్చిమబెంగాల్ లో బీజేపీ ఎన్నికల సంఘం సహకారంతో ఫలితాలను చోరీ చేసిందన్నారు.
పశ్చిమబెంగాల్‌లో మూడున్నర దశాబ్దాల ఏళ్ల సీపీఎం పాలనకు బ్రేక్ వేసి 2011లో అధికార పగ్గాలు చేపట్టిన తృణముల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్టీ.. 2026 వరకు వరుస విజయాలతో ముఖ్యమంత్రిగా కొనసాగారు. ఆమె 15 ఏళ్ల ఆధిపత్యానికి ఎన్డీఏ తెర దించింది. మమతా సైతం కాంగ్రెస్‌లో కేంద్రమంత్రిగా, పలు కీలక పదవులు నిర్వహించి, తర్వాత సొంత కుంపటి పెట్టుకున్న నాయకురాలే కావడం గమనార్హం.
ప్రజా సమస్యలపై స్పష్టమైన అజెండాతో ఎన్నికల బరిలోకి దిగిన విజయ్‌ను తమిళ ప్రజలు ఆదరించడం శుభపరిణామమన్నారు.
తన పార్టీ స్థాపించిన నాటి నుండి నేటి వరకు ఆయన సాగించిన ప్రయాణం ఒక అద్భుతమైన రాజకీయ థ్రిల్లర్‌ను తలపిస్తుంది. ఎన్నికల ప్రచార సమయంలో విజయ్ అనేక ఆటంకాలను ఎదుర్కొన్నారు. ప్రత్యర్థి పార్టీల నుండి వచ్చిన తీవ్ర విమర్శలు, అధికార యంత్రాంగం విధించిన ఆంక్షలు ఆయనను ఉక్కిరిబిక్కిరి చేశాయి. వ్యక్తిగత జీవితంపై జరిగిన దుష్ప్రచారం విజయ్ ఇమేజ్‌ను దెబ్బతీస్తుందని అందరూ భావించారు.
తమిళనాడులో టీవీకే పార్టీ విజయాన్నిస్వాగతిస్తూ.. వైసీపీ సోషల్ మీడియా వేదికగా సంబరాలు మొదలు పెట్టింది. విజయ్ సాధించిన ఈ అద్భుత విజయం వెనుక వైసీపీ అధినేత జగన్ సహకారం ఉందంటూ వైసీపీ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా గతంలో ఒక వివాహ వేడుకలో వైఎస్ జగన్, విజయ్ ఇద్దరూ కలిసి దిగిన ఒక ఫోటోను ఇప్పుడు వైసీపీ నెట్టింట వైరల్ చేస్తోంది.
ఈ ఎన్నికల ఫలితాల్లో విజయ్ టవీకే పార్టీ స్పష్టమైన ఆధిక్యత కనబరిచింది. ప్రభుత్వ వ్యతిరేకతతో పాటు, కూటమి పక్షాల మధ్య సరైన సమన్వయం లేకపోవడం కూడా ఈ ఓటమికి ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి.
1982లో తెలుగువారి ఆత్మగౌరవం నినాదంతో తెలుగుదేశం పార్టీని స్థాపించిన ఎన్టీఆర్, కేవలం 9 నెలల కాలంలోనే రాష్ట్రమంతటా పర్యటించి ప్రభంజనం సృష్టించారు. 1983 ఎన్నికల్లో కాంగ్రెస్ వంటి బలమైన పార్టీని మట్టికరిపించి, తొలి ప్రయత్నంలోనే ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించి రికార్డ్ సృష్టించారు.
భారత రాజకీయ యవనికపై భారతీయ జనతా పార్టీ తన ఉనికిని మరింత శక్తివంతం చేస్తోంది.
చారిత్రాత్మక విజయం ఖాయమని తేలడంతో.. విజయం అభిమానుల సంబరాలు మిన్నంటాయి. అయితే.. ఈ నేపథ్యంలో సినీ నటి త్రిష పేరు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది.
ఈ నియోజకవర్గం నుంచిఎన్డీయూ కూటమి అభ్యర్థి మల్లాడి కృష్ణారావు విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థి గొల్లపల్లి అశోక్ పై నాలుగువేల ఐదు వందల ఓట్ల పైచిలుకు మెజారిటీతో గెలుపొందారు.
ఎన్నికల ఫలితాల్లో ఎన్డీయే కూటమి సాధించిన ఘన విజయంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు.
తట్టంచావడి నియోజకవర్గం నుంచి ఆయన భారీ మెజారిటీతో విజయం సాధించారు. ఆయన పోటీ చేసిన మరో స్థానమైన మంగళంలోనూ భారీ ఆధిక్యంలో కొనసాగుతున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.