జై తెలుగుదేశం నినాదం.. కమలదళానికి బలం...!

Publish Date:Nov 5, 2024

Advertisement

ఆంధ్రప్రదేశ్ లో  బీజేపీకి సొంత బలం లేదు. ఆ విషయం ఇప్పటికే ఎన్నోసార్లు సందేహాలకు అతీతంగా రుజువైంది. ఆ పార్టీ తెలుగుదేశం పార్టీతో  కలిసి ఉన్నప్పుడు మాత్రమే ఎమ్మెల్యేలను, ఎంపీలను గెలిపించుకోగలిగింది. జాతీయ పార్టీగా తన బలానికి మించిన సీట్లను కూడా బేరమాడి సాధించుకోగలిగింది. అలా పొత్తు లేకుండా ఎన్నికలకు వెళ్లిన ప్రతి సారీ ఆ పార్టీ స్కోర్ బిగ్ జీరోయే. అందుకే ఇప్పుడు బీజేపీ రాష్ట్రంలో తెలుగుదేశం బలమే తన బలం అనుకుని సర్దుకు పోతున్నట్లు కనిపిస్తోంది. అలవికాని చోట అధికులమనరాదన్న సూక్తిని అక్షరాలా పాటిస్తున్నట్లు కనిపిస్తోంది. తిరుమల తిరుపతి దేవస్థానం పాలక వర్గంలో రాష్ట్రం నుంచి బీజేపీ కోటా కింద ఒకే ఒక్కరినే నియమించినా బీజేపీ నుంచి ఎటువంటి అభ్యంతరాలు వ్యక్తం కాలేదు. సరికదా అదే మహాప్రసాదం అన్నట్లుగా ఆనందంతో తబ్బిబ్బు అవుతోంది. అసలు రాష్ట్రంలో బీజేపీ స్టేక్ కోరుకోవడం లేదు. తెలుగుదేశం మిత్రపక్షంగా సంసారపక్షంగా సర్దుకు పోవడమే మేలని భావిస్తోంది. దక్షిణాదిలో బలపడాలన్న తన ఆకాంక్ష నెరవేరాలంటే, కేంద్రంలో మోడీ సర్కార్ సజావుగా సాగాలంటే.. ఏపీలో వేలు పెట్టకపోవడమే మేలన్న నిర్ణయానికి వచ్చేసింది.  అయితే బీజేపీ ఈ నిర్ణయానికి రావడానికి వెనుక పదేళ్ల కథ, వ్యథ ఉన్నది. 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన తరువాత 2014లో జరిగిన ఎన్నికలలో రాష్ట్రంలో తెలుగుదేశం అధికారంలోకి వచ్చింది. ఆ ఎన్నికలలో తెలుగుదేశం, బీజేపీ కలిసి పోటీ చేయగా, బయట నుంచి జనసేన మద్దతు ఇచ్చింది. ఆ ఎన్నికలలో తెలుగుదేశం, బీజేపీ కూటమి విజయం సాధించి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేశాయి. అలాగే కేంద్రంలో కూడా బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే సర్కార్ లో తెలుగుదేశం చేరింది.  

అయితే  విభజిత ఆంధ్రప్రదేశ్ ను బీజేపీ తన రాజకీయ ప్రయోగశాలగా మార్చుకుంది. ఒక వైపు రాష్ట్ర ప్రభుత్వంలో భాగంగా ఉండి కూడా విపక్ష పార్టీతో చేతులు కలిపింది. రాష్ట్ర విభజనతో తీవ్రంగా నష్టపోయిన రాష్ట్రానికి అన్ని విధాలుగా చేయూత నివ్వాల్సిన కేంద్రం స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం రాష్ట్రాన్ని దగా చేసింది. విభజన హామీలు నెరవేర్చడం అటుంచి.. రాష్ట్ర ప్రగతికి అడుగడుగునా అడ్డుపడుతూ వచ్చింది. అప్పటి  ప్రతిపక్ష  వైసీపీకి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తూ.. 2019 ఎన్నికలలో ఆ పార్టీ అధికారంలోకి రావడానికి తన వంతు దోహదం చేసింది. మోడీ సర్కార్ పేరుకే ఎన్డీయే ప్రభుత్వమైనా.. మిత్రపక్షాలను ఏనాడూ లెక్క చేసిన పాపాన పోలేదు. అన్నిటికీ మించి తన చిరకాల మిత్రుడైన తెలుగుదేశం పార్టీ పట్ల ఒక విధమైన కక్ష సాధింపు ధోరణితో వ్యవహరించింది. 

చిరకాల మిత్రుడని ఎందుకు అనాల్సి వచ్చిందంటే.. వాజ్ పేయి హయాంలో తెలుగుదేశం బీజేపీకి అత్యంత విశ్వాస పాత్రమైన మిత్రపక్షం. ఆ పార్టీ అధినేత, అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అత్యంత విశ్వాసపాత్రుడైన మిత్రుడు. వాజ్ పేయి హయాంలో తెలుగుదేశం, బీజేపీల మధ్య పరస్పర గౌరవం, విశ్వాసం మెండుగా ఉండేవి. మిత్ర ధర్మం పాటించే విషయంలో రెండు పార్టీలూ ఒకదానితో ఒకటి పోటీ పడేవి. అయితే అది వాజ్ పేయి హయాం. మోడీ హయాం వచ్చే సరికి ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయింది.  మోడీ హయాంలో మిత్రపక్షాలను గౌరవం ఇవ్వడం అటుంచి ఏ మాత్రం అవకాశం చిక్కినా వాటిని కబలించడానికి లేదా బలహీన పరచ డానికి వెనుకాడని పరిస్థితి నెలకొంది. 

మరీ ముఖ్యంగా ఒక్క శాతం ఓటు బ్యాంకు కూడా లేని ఆంధ్రప్రదేశ్ లో బలమైన ప్రభుత్వం, దార్శనికత, ప్రజాభిమానం మెండుగా ఉన్న చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండటం బీజేపీకి రుచించలేదు. అందుకే  ఎన్డీయే కూటమి నుంచి తెలుగుదేశం బయటకు వెళ్లే వరకూ నానా రకాలుగా ఇబ్బందులు పెట్టింది. విభజన హామీల మాట అటుంచి రాష్ట్రానికి న్యాయంగా రావలసిన నిధులను కూడా విడుదల చేయకుండా వేధించింది. సరే చివరికి తెలుగుదేశం ఎన్డీయే కూటమి నుంచి బయటకు వచ్చేసింది.  సరే 2019 ఎన్నికలలో రాష్ట్రంలో ఒంటరిగా పోటీ చేసిన బీజేపీ నోటాతో పోటీ పడి ఓట్లు తెచ్చుకుంది.  అయినా  కేంద్రంలో అధికారాన్ని అడ్డుపెట్టుకుని, రాష్ట్రంలో చక్రం తిప్పేందుకు బీజేపీ ఢిల్లీ పెద్దలు రాష్ట్ర నేతలు పావులు కదిపింది. ఆ ఎన్నికలలో తెలుగుదేశం కూడా పరాజయం పాలై విపక్షానికి పరిమితమైంది. ఆర్థిక  కేసులలో నిండా మునిగి ఉన్న వైసీపీ అధినేత జగన్ పార్టీ వైసీపీ విజయం సాధించి అధికార పగ్గాలు అందుకుంది. దీంతో బీజేపీ జగన్ ను గుప్పిట ఉంచుకుని తెలుగుదేశం పార్టీని బలహీన పరచడమే ధ్యేయంగా పావులు కదిపింది.  అందులో  భాగంగానే, బీజేపీ జాతీయ నాయకత్వం  ఓ వంక ముఖ్యమంత్రి జగన్ రెడ్డిని కేసుల నుంచి రక్షిస్తూ మరో వంక వైసేపీ సర్కార్  బుజం మీద తుపాకీ పెట్టి టీడీపీని బలహీనం చేసే కుట్రలు చేసింది. లేదా ఆ కుట్రలకు వత్తాసు పలికింది.  

అయితే 2024 ఎన్నికల నాటికి బీజేపీకి వాస్తవం బోధపడింది. వైసీపీ అరాచక అస్తవ్యస్థ పాలన పట్ల ప్రజాగ్రహాన్ని గ్రహించి తెలుగుదేశంతో జట్టు కట్టింది. ఎన్నికలలో తెలుగుదేశం కూటమి ఘన విజయం సాధించింది. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ప్రజలు ఏకపక్షంగా తెలుగుదేశం కూటమికి పట్టం గట్టారు. దీంతో తత్వం బోధపడిన బీజేపీ రాష్ట్రంలో సొంతంగా బలోపేతం అన్న అంశాన్ని పక్కన పెట్టేసి, తెలుగుదేశం మద్దతుతో కేంద్రంలో అధికారాన్ని పదిలపరుచుకుంటే చాలన్నట్లు వ్యవహరిస్తున్నది. 

By
en-us Political News

  
త్రిష త్వరలోనే సినిమాలకు గుడ్‌బై చెప్పి రాజకీయాల్లోకి రావడం కన్ఫర్మ్ అన్న వాదన బలంగా వినిపిస్తోంది. అయితే ఇందుకు సంబంధించి త్రిష నుంచి ఎటువంటి క్లారిటీ అయితే ఇప్పటి వరకూ రాలేదు. ప్రస్తుతం త్రిష పలు సినిమాలలో నటిస్తున్నారు. వాటిలో మెగా స్టార్ చిరంజీవి నటిస్తున్న విశ్వంభర సినిమా కూడా ఉంది.
మంత్రిగా పదవీ బాధ్యతలు నిర్వర్తిస్తూ కూడా పవన్ కల్యాణ్ సినిమాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారనీ, షూటింగ్ లంటూ అధిక సమయం హైదరాబాద్ లోనే ఉంటున్నారని రోజా అన్నారు. ప్రజా సమస్యలను గాలికొదిలేసి సినిమాలలో యాక్టింగ్ కి పరిమితమైనట్లుగా పవన్ కల్యాణ్ తీరు ఉందని రోజా అన్నారు. కీలకమైన మంత్రివర్గ సమావేశానికి డుమ్మా కొట్టడం సరికాదన్న రోజా దీనిపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
ముఖ్యమంత్రి సిద్ధరామయ్య విధానసౌధలో కేబినెట్ సమావేశం నిర్వహిస్తున్న సమయంలోనే.. పాతిక మంది ఎమ్మెల్యేలు ఓ ప్రైవేట్ హోటల్‌లో ఈ భేటీ జరగడం సంచలనం సృష్టించింది.
తెలుగువన్ వాస్తవ వేదిక 16వ సంచికలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై విస్తృత చర్చ జరిగింది.
జనసేన పార్టీ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు ఈసారి దూరం జరిగింది.
పార్టీ ఫిరాయింపుల కేసులో ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరికి ఊరట
రాష్ట్రంలో బీఆర్ఎస్‌ రెండుసార్లు, కాంగ్రెస్‌ ఒకసారి అధికారంలోకి వచ్చాయనీ, ఆ రెండు ప్రభుత్వాల వైఫల్యాలనూ గమనించిన తెలంగాణ ప్రజలు వచ్చే ఎన్నికల్లో బీజేపీకి అధికారం కట్టబెట్టాలని ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చేశారన్నారు.
జాతీయ పార్టీలకే ప్రయోజనం చేకూరుతుందనీ, రాష్ట్రాల సమస్యలపై పట్టింపే లేని పరిస్థితి ఉత్పన్నమౌతుందని ఆందోళన వ్యక్తం చేశారు. కేవలం ఖర్చు తగ్గుతుందన్న నెపంతో కేంద్రం జమిలి ఎన్నికల నిర్వహణకు మొగ్గు చూపడమంటే.. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమే ఔతుందని పేర్కొన్నారు.
జగన్ హయాంలో లిక్కర్ మాఫియా రాజ్యమేలిందన్న షర్మిల, నాసిరకం మద్యంతో ప్రజల ఆరోగ్యాన్ని గుల్ల చేయడంతో పాటు రాష్ట్ర ఆదాయాన్ని కూడా కొల్లగొట్టారన్నారు. జగన్ హయాంలో కంటైనర్ల కొద్దీ మాదకద్రవ్యాలు రాష్ట్రంలోకి వచ్చాయని ఆరోపించారు.
రాజంపేటలో కూటమి నాయకుల రాజకీయం రాజుకుంది.
వ్యవస్థను కాపాడాల్సిన వారే విద్రోహానికి పాల్పడుతున్నారా? అనే అంశాలపై ప్రముఖ విశ్లేషకుడు అప్పసాని రాజేష్ తెలుగువన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో కూలంకషంగా వివరించారు.
గ్లోబల్ ప్రపంచంలో ఒక చోట రేగే చిచ్చు, ఖండాలు దాటి మన వంటింటి గ్యాస్ ధరను, మన పిల్లల సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలను కూడా ప్రభావితం చేస్తుంది.
టీవ‌ల బొత్సకు బ్రెయిన్ స్ట్రోక్ త‌గిలి తీవ్రంగా ఇబ్బంది ప‌డ్డారు. కోలుకుని ఆయ‌న మండ‌లికి వచ్చారు. అప్పుడు ఆయనకు లోకేష్ సాద‌రంగా ఆహ్వానించిన తీరు పట్ల లోకేష్ పై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది. అదే గతంలో చంద్రబాబు పై జగన్ చేసిన వ్యాఖ్యలపై పార్టీలకు అతీతంగా అందరూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.