జై తెలుగుదేశం నినాదం.. కమలదళానికి బలం...!

Publish Date:Nov 5, 2024

Advertisement

ఆంధ్రప్రదేశ్ లో  బీజేపీకి సొంత బలం లేదు. ఆ విషయం ఇప్పటికే ఎన్నోసార్లు సందేహాలకు అతీతంగా రుజువైంది. ఆ పార్టీ తెలుగుదేశం పార్టీతో  కలిసి ఉన్నప్పుడు మాత్రమే ఎమ్మెల్యేలను, ఎంపీలను గెలిపించుకోగలిగింది. జాతీయ పార్టీగా తన బలానికి మించిన సీట్లను కూడా బేరమాడి సాధించుకోగలిగింది. అలా పొత్తు లేకుండా ఎన్నికలకు వెళ్లిన ప్రతి సారీ ఆ పార్టీ స్కోర్ బిగ్ జీరోయే. అందుకే ఇప్పుడు బీజేపీ రాష్ట్రంలో తెలుగుదేశం బలమే తన బలం అనుకుని సర్దుకు పోతున్నట్లు కనిపిస్తోంది. అలవికాని చోట అధికులమనరాదన్న సూక్తిని అక్షరాలా పాటిస్తున్నట్లు కనిపిస్తోంది. తిరుమల తిరుపతి దేవస్థానం పాలక వర్గంలో రాష్ట్రం నుంచి బీజేపీ కోటా కింద ఒకే ఒక్కరినే నియమించినా బీజేపీ నుంచి ఎటువంటి అభ్యంతరాలు వ్యక్తం కాలేదు. సరికదా అదే మహాప్రసాదం అన్నట్లుగా ఆనందంతో తబ్బిబ్బు అవుతోంది. అసలు రాష్ట్రంలో బీజేపీ స్టేక్ కోరుకోవడం లేదు. తెలుగుదేశం మిత్రపక్షంగా సంసారపక్షంగా సర్దుకు పోవడమే మేలని భావిస్తోంది. దక్షిణాదిలో బలపడాలన్న తన ఆకాంక్ష నెరవేరాలంటే, కేంద్రంలో మోడీ సర్కార్ సజావుగా సాగాలంటే.. ఏపీలో వేలు పెట్టకపోవడమే మేలన్న నిర్ణయానికి వచ్చేసింది.  అయితే బీజేపీ ఈ నిర్ణయానికి రావడానికి వెనుక పదేళ్ల కథ, వ్యథ ఉన్నది. 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన తరువాత 2014లో జరిగిన ఎన్నికలలో రాష్ట్రంలో తెలుగుదేశం అధికారంలోకి వచ్చింది. ఆ ఎన్నికలలో తెలుగుదేశం, బీజేపీ కలిసి పోటీ చేయగా, బయట నుంచి జనసేన మద్దతు ఇచ్చింది. ఆ ఎన్నికలలో తెలుగుదేశం, బీజేపీ కూటమి విజయం సాధించి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేశాయి. అలాగే కేంద్రంలో కూడా బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే సర్కార్ లో తెలుగుదేశం చేరింది.  

అయితే  విభజిత ఆంధ్రప్రదేశ్ ను బీజేపీ తన రాజకీయ ప్రయోగశాలగా మార్చుకుంది. ఒక వైపు రాష్ట్ర ప్రభుత్వంలో భాగంగా ఉండి కూడా విపక్ష పార్టీతో చేతులు కలిపింది. రాష్ట్ర విభజనతో తీవ్రంగా నష్టపోయిన రాష్ట్రానికి అన్ని విధాలుగా చేయూత నివ్వాల్సిన కేంద్రం స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం రాష్ట్రాన్ని దగా చేసింది. విభజన హామీలు నెరవేర్చడం అటుంచి.. రాష్ట్ర ప్రగతికి అడుగడుగునా అడ్డుపడుతూ వచ్చింది. అప్పటి  ప్రతిపక్ష  వైసీపీకి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తూ.. 2019 ఎన్నికలలో ఆ పార్టీ అధికారంలోకి రావడానికి తన వంతు దోహదం చేసింది. మోడీ సర్కార్ పేరుకే ఎన్డీయే ప్రభుత్వమైనా.. మిత్రపక్షాలను ఏనాడూ లెక్క చేసిన పాపాన పోలేదు. అన్నిటికీ మించి తన చిరకాల మిత్రుడైన తెలుగుదేశం పార్టీ పట్ల ఒక విధమైన కక్ష సాధింపు ధోరణితో వ్యవహరించింది. 

చిరకాల మిత్రుడని ఎందుకు అనాల్సి వచ్చిందంటే.. వాజ్ పేయి హయాంలో తెలుగుదేశం బీజేపీకి అత్యంత విశ్వాస పాత్రమైన మిత్రపక్షం. ఆ పార్టీ అధినేత, అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అత్యంత విశ్వాసపాత్రుడైన మిత్రుడు. వాజ్ పేయి హయాంలో తెలుగుదేశం, బీజేపీల మధ్య పరస్పర గౌరవం, విశ్వాసం మెండుగా ఉండేవి. మిత్ర ధర్మం పాటించే విషయంలో రెండు పార్టీలూ ఒకదానితో ఒకటి పోటీ పడేవి. అయితే అది వాజ్ పేయి హయాం. మోడీ హయాం వచ్చే సరికి ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయింది.  మోడీ హయాంలో మిత్రపక్షాలను గౌరవం ఇవ్వడం అటుంచి ఏ మాత్రం అవకాశం చిక్కినా వాటిని కబలించడానికి లేదా బలహీన పరచ డానికి వెనుకాడని పరిస్థితి నెలకొంది. 

మరీ ముఖ్యంగా ఒక్క శాతం ఓటు బ్యాంకు కూడా లేని ఆంధ్రప్రదేశ్ లో బలమైన ప్రభుత్వం, దార్శనికత, ప్రజాభిమానం మెండుగా ఉన్న చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండటం బీజేపీకి రుచించలేదు. అందుకే  ఎన్డీయే కూటమి నుంచి తెలుగుదేశం బయటకు వెళ్లే వరకూ నానా రకాలుగా ఇబ్బందులు పెట్టింది. విభజన హామీల మాట అటుంచి రాష్ట్రానికి న్యాయంగా రావలసిన నిధులను కూడా విడుదల చేయకుండా వేధించింది. సరే చివరికి తెలుగుదేశం ఎన్డీయే కూటమి నుంచి బయటకు వచ్చేసింది.  సరే 2019 ఎన్నికలలో రాష్ట్రంలో ఒంటరిగా పోటీ చేసిన బీజేపీ నోటాతో పోటీ పడి ఓట్లు తెచ్చుకుంది.  అయినా  కేంద్రంలో అధికారాన్ని అడ్డుపెట్టుకుని, రాష్ట్రంలో చక్రం తిప్పేందుకు బీజేపీ ఢిల్లీ పెద్దలు రాష్ట్ర నేతలు పావులు కదిపింది. ఆ ఎన్నికలలో తెలుగుదేశం కూడా పరాజయం పాలై విపక్షానికి పరిమితమైంది. ఆర్థిక  కేసులలో నిండా మునిగి ఉన్న వైసీపీ అధినేత జగన్ పార్టీ వైసీపీ విజయం సాధించి అధికార పగ్గాలు అందుకుంది. దీంతో బీజేపీ జగన్ ను గుప్పిట ఉంచుకుని తెలుగుదేశం పార్టీని బలహీన పరచడమే ధ్యేయంగా పావులు కదిపింది.  అందులో  భాగంగానే, బీజేపీ జాతీయ నాయకత్వం  ఓ వంక ముఖ్యమంత్రి జగన్ రెడ్డిని కేసుల నుంచి రక్షిస్తూ మరో వంక వైసేపీ సర్కార్  బుజం మీద తుపాకీ పెట్టి టీడీపీని బలహీనం చేసే కుట్రలు చేసింది. లేదా ఆ కుట్రలకు వత్తాసు పలికింది.  

అయితే 2024 ఎన్నికల నాటికి బీజేపీకి వాస్తవం బోధపడింది. వైసీపీ అరాచక అస్తవ్యస్థ పాలన పట్ల ప్రజాగ్రహాన్ని గ్రహించి తెలుగుదేశంతో జట్టు కట్టింది. ఎన్నికలలో తెలుగుదేశం కూటమి ఘన విజయం సాధించింది. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ప్రజలు ఏకపక్షంగా తెలుగుదేశం కూటమికి పట్టం గట్టారు. దీంతో తత్వం బోధపడిన బీజేపీ రాష్ట్రంలో సొంతంగా బలోపేతం అన్న అంశాన్ని పక్కన పెట్టేసి, తెలుగుదేశం మద్దతుతో కేంద్రంలో అధికారాన్ని పదిలపరుచుకుంటే చాలన్నట్లు వ్యవహరిస్తున్నది. 

By
en-us Political News

  
దేశవ్యాప్తంగా నీట్ పరీక్షల నిర్వహణ, ప్రశ్నాపత్రాల లీకేజీ ఆరోపణలు తీవ్ర స్థాయిలో దుమారం రేపుతున్నాయి.
రాజకీయం గురించి కాదు. పార్టీ గురించి కాదు.ఒక నాయకుడి గురించి కూడా కాదు....ఒక తరం గురించి. విజృంభించిన లాఠీల్లో రక్తం చిందించిన ఈ తరం గురించి.
గతంలో అంటే వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు, దూషణలతో చెలరేగిన వల్లభనేని వంశీ తాజా లేఖలో మాత్రం చంద్రబాబుకు గౌరవం ఇస్తూ అయ్యా చంద్రబాబుగారూ అని మర్యాదగా సంభోధించారు. అంతే కాకుండా చంద్రబాబు చొరవను, రైతుల పట్ల ఆయనకు ఉన్న అక్కరనూ ప్రశంసలతో ముంచెత్తారు.
అధికారాన్ని అడ్డుపెట్టుకుని నిబంధనలకు తిలోదకాలిచ్చి.. ఇష్టారాజ్యంగా వ్యవహరించిన వైసీపీ ఇప్పుడు కేసుల చిక్కుల్లో నిండా ఇరుక్కుంది. అధికారంలో ఉండగా చట్టాలకు మనం అతీతులం అన్నట్లుగా వ్యవహరించిన వైసీపీ నేతలకు ఒక్కరొక్కరుగా పోలీసు కేసులను, సీఐడీ విచారణలను ఎదుర్కొంటూ, అరెస్టులు, బెయిళ్లు అంటూ న్యాయస్థానాల చుట్టూ తిరగాల్సి పరిస్థితిలో ఉన్నారు.
ఆయన రాజీనామాకు యువత పట్టుబడుతోంది. అయితే ప్రధాని నరేంద్ర మోడీ మాత్రం ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలన్న యువత డిమాండ్ ను పట్టించుకోవడం లేదు. నీట్ పై తొలి సారిగా స్పందించి, సోషల్ మీడియా వేదికగా న్యాయం చేస్తాననీ, లీకేజీ బాధ్యులను కఠినంగా శిక్షిస్తామనీ, అందుకోసం ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేస్తామనీ చెప్పిన మోడీ.. ధర్మేంద్ర ప్రధాన్ రాజీమానా చేయాలన్న యువత డిమాండ్ ను ఇసుమంతైనా పరిగణనలోకి తీసుకోలేదు.
గత ప్రభుత్వ హయాంలో ముంబైకి చెందిన నటిని, ఆమె కుటుంబ సభ్యులను అక్రమంగా అరెస్టు చేసి ఆంధ్రప్రదేశ్‌కు తీసుకురావడంపై విచారణ వేగం పుంజుకుందన్న ఆయన.. గతంలో ఎన్నికల కోడ్ అమలులోకి రావడానికి సరిగ్గా రెండు నెలల ముందు ముంబైలో ఉన్న కాదంబరి జత్వానీని, ఆమె తల్లిదండ్రులను ఏపీ పోలీసులు అరెస్ట్ చేసి.. ఫోర్జరీ భూలావాదేవీల కేసు సాకుగా చూపి దాదాపు 40 రోజుల పాటు జైలులో ఉంచారన్నారు.
గత ఎన్నికల్లో మంగళగిరి స్థానం నుంచి నారా లోకేష్ సాధించిన చారిత్రాత్మక విజయం ఆయనకు రాజకీయంగా పెద్ద మైలేజీని ఇచ్చింది. గతంలో ఓటమిని చవిచూసిన చోటే ఐదేళ్ల పాటు నిరంతరం ప్రజల్లో ఉంటూ, సమగ్ర ప్రచారంతో విజయం సాధించడం ఆయన రాజకీయ ప్రస్థానంలో ఒక కీలక మలుపుగా మారింది.
ఢిల్లీ పోలీసులు రాహుల్ గాంధీ పట్ల దురుసుగా వ్యవహరించి గాయపరచడాన్ని ఖండిచిన ఆయన రక్త గాయమైనా రాహుల్ గాంధీ వెనక్కు తగ్గకుండా పోరాట పటిమ చూపారని కొనియాడిన రేవంత్ రె్డి.. ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే ప్రాథమిక హక్కులపై కేంద్రం ప్రత్యక్ష దాడికి పాల్పడిందని విమర్శించారు.
తోపులాటలో రాహుల్ గాంధీ గాయపడ్డారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ ముక్కు నుంచి రక్తం కారింది. పోలీసులు ఆయనను బలవంతంగా నిలువరిస్తున్న సమయంలో ఆయన ముక్కుకు గాయమై రక్తం కారుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో కనిపించాయి. దీనిపై సర్వ్రతా తీవ్ర ఆగ్రహం వ్యక్తం అవుతోంది.
మద్యం కుంభకోణంలో ఈడీ విచారణ.. ప్రధాన లబ్ధిదారుడికి చేరువ అవుతోందనీ, ఈ నేపథ్యంలోనే జగన్ పేరు ప్రచారంలోకి వచ్చిందని అంటున్నారు. మద్యం కుంభకోణం కేసులో ఈడీ తనకు నోటీసులు పంపే అవకాశం ఉందన్న సమాచారంతోనే మోడీ, అమిత్ షాల అప్పాయింట్ మెంట్ కోసం జగన్ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నట్లు పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
కాపు సామాజికవర్గ నేత, ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు పార్టీ లైన్ ను ఇసుమంతైనా ఖాతరు చేయకుండా కాపు ఐక్యత జెండాను భుజానకెత్తుకోవడం పార్టీలో కలకలం రేపింది. ఒక వైపు వైసీపీ అధినేత జగన్.. అంబటి రాంబాబును పార్టీలో కాపు సామాజికవర్గ ఐకాన్ గా ప్రమోట్ చేస్తుంటే.. తోట త్రిమూర్తులు ముద్రగడ పద్మనాభం సంస్మరణ సభలను వేదిక చేసుకుని పార్టీలతీతంగా కాపు నేతలందరూ ఐక్యం కావాలని పిలుపునివ్వడం పార్టీలో కలకలం రేపింది.
ఎన్డీయేలో కీలక భాగస్వామిగా ఉన్న తెలుగుదేశం పార్టీ అధినేతగా, చంద్రబాబు ఇప్పుడు హస్తిన పర్యటనలో పార్లమెంటులో ఈ బిల్లుల ఆమోదానికి అవసరమైన మెజారిటీ కూడగట్టడం కోసం.. వివిధ పార్టీల నాయకులతో చర్చలు జరిపేందుకు ఆయన హస్తినకేగుతున్నారన్న చర్చ రాజకీయవర్గాలలో జోరుగా సాగుతోంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.