బీజేపీ తేల్చేసింది!.. తెలుసుకోవలసింది తెలుగుదేశం, జనసేనే!

Publish Date:May 23, 2023

Advertisement

ఏపీలో బీజేపీ స్టాండ్ ఏమిటన్నది స్పష్టంగా తేలిపోయింది. ఏవో ఏవేవో రాజకీయ ప్రయోజనాల కోసం వైసీపీ సర్కార్ పై చార్జిషీట్లు అంటూ హడావుడి చేస్తున్నా.. బీజేపీ వాస్తవంగా రాష్ట్రంలో జగన్ సర్కార్ కు మద్దతుగానే ఉండాలన్న కృత నిశ్చయంతో ఉందని తేలిపోయింది.

ఇంకా అమయాకంగా జనసేనాని పవన్ కల్యాణ్ బీజేపీ మా మిత్ర పక్షం.. రాష్ట్రంలో మరో సారి వైసీపీ సర్కార్ అధికారంలోకి రాకుండా ఉండేందుకు బీజేపీని కూడా కలుపుకుపోయేందుకు ప్రయత్నం చేస్తున్నానంటూ కాలం గడిపేయడం వాస్తవాన్ని చూడకుండా కళ్లు మూసుకోవడమే అవుతుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వను అందుకోసం బీజేపీ పెద్దలతో మాట్లాడతాను అని పవన్ ఇప్పటికీ అనడం అమాయకత్వమేనంటున్నారు. బీజేపీకి ఏపీలో  కనీసం ఒక శాతం కూడా ఓటు బ్యాంకు లేదన్నది తెలిసిన విషయమేనని గుర్తు చేస్తున్నారు. కేంద్రంలో అధికారంలో ఉండటం.. ఎన్నికల సమయంలో వ్యవస్థలను మేనేజ్ చేస్తుందన్న భయం, అనుమానంతోనే జనసేన, తెలుగుదేశం పార్టీలు కమలం పార్టీ పట్ల సాఫ్ట్ కార్నర్ తో ఉన్నారని రాజకీయ వర్గాలలో గట్టిగా చర్చ జరుగుతోంది.

కర్నాటక ఫలితాల తరువాతనైనా ఎన్నికల సమయంలో వ్యవస్థలను మేనేజ్ చేయడం అంత సులభం కాదని ఆ పార్టీలు తెలుసుకోవాలని, సొంత బలం, పోల్ మేనేజ్ మెంట్ పై గట్టిగా దృష్టి పెట్టాలని పరిశీలకులు సూచిస్తున్నారు.తాజాగా.. మోడీ సర్కార్ రెవెన్యూ లోటు నిధులు అంటూ ఏపీ కి 10,460. 87 కోట్ల రూపాయలు విడుదల చేశారు. ఇదేమీ ఇప్పటి లోటు కాదు. రాష్ట్ర విభజన సమయంలో ఏర్పడిన లోటు. ఆ లోటును భర్తీ చేయాలని నవ్యాంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రి, తెలుగుదేశం అధినేత అప్పట్లో ఎన్ని ప్రయత్నాలు చేశారో.. ఎన్ని సార్లు హస్తిన పర్యటించారో.. ఎన్ని సార్లు స్వయంగా మోడీని కలిసి విజ్ణప్తి చేశారో లేక్కే లేదు. తరువాత తరువాత మోడీ చంద్రబాబుకు అప్పాయింట్ మెంట్ ఇవ్వకుండా మొహం చాటేశారు. అది వేరే సంగతి.

నిధుల కోసమే, విభజన హామీల అమలు కోసమే అప్పట్లో తెలుగుదేశం ఎన్డీయేతో గొడవ పడింది. బయటకు వచ్చేసింది. అంతేనా అప్పటి ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ వంటి మంత్రులు రక్షణ నిధులను ఇచ్చేయమంటారా అంటూ ఎద్దేవా కూడా చేశారు. అలాంటిది కేంద్రానికి ఇప్పుడు హఠాత్తుగా ఏపీ  మీద కాదు కాదు జగన్ సర్కార్ మీద ఎక్కడ లేని ప్రేమా పుట్టుకొచ్చేసింది. అడగకుండా పెట్టకుండా.. జగన్ ఆర్థిక కష్టాలు తీర్చేయడానికి ఆఘమేఘాల మీద నిధులు విడుదల చేసేసింది. దీంతో ఎన్నికల సంవత్సరంలో జగన్ సర్కార్ కు ఆర్థిక చీకాకులు లేకుండా సహకారం అందించింది. ఇది చాలదన్నట్లూ ఎప్పుడడిగితే అప్పుడు అప్పులు తీసుకోవడానికి పచ్చ జెండా చేతిలో పట్టుకుని రెడీగా నిలుచుంటోంది.

దీంతో ఏపీ విషయంలో బీజేపీ వైఖరి ఏమిటో.. ఆ పార్టీ ఎటువైపు ఉంటుందో, ఎవరికి మద్దతుగా నిలుస్తోందో? నిలుస్తుందో అందరికీ పూర్తిగా అర్ధమైపోయింది. అసలు ఇప్పుడేమిటి? గత నాలుగేళ్లుగా బీజేపీ ఎలాంటి దాపరికం లేకుండా తన వైఖరి ఏమిటో చెబుతూనే వస్తోంది. జనసేనానికే ఇంకా పూర్తిగా అర్ధమైనట్లు కనిపించడం లేదు. అలాగే తెలుగుదేశం కూడా జనసేన అధినేత బీజేపీ అగ్రనాయకత్వాన్ని ఏపీలో వైసీపీకి వ్యతిరేక వైఖరి తీసుకునేల ఒప్పించగలరన్న ఆశ అంటూ ఏమైనా ఉంటే దానిని వదిలేసుకుని ముందుకు నడవాల్సిన అవసరం ఉంది.  

By
en-us Political News

  
ఈ ఇష్యూ మీద రాష్ట్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ ముకేష్ కుమార్ మీనా స్పందించారు. ఇతర సిరా ద్వారా ఓటర్ల వేళ్ళ మీద గుర్తు  వేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
అభ్యర్థుల గెలుపు, ఓటమి అంచనాలు, ఎన్నికల్లో మెజారిటీపై బెట్టింగ్‌ జోరుగా సాగుతోంది. ఈ ఎన్నికలు పూర్తిగా జగన్ గెలుపు - జగన్ ఓటమి పైనే జరుగుతున్నాయని ప్ర‌జ‌ల్లో చర్చ జ‌రుగుతోంది. బెట్టింగ్ యాప్స్ లో కూడా ఇదే అంశం ప్రధానంగా తీసుకోవడం ఆసక్తిగా మారింది. ప్రభుత్వ ఏర్పాటు, వచ్చే సీట్లు, ఆయా అభ్యర్ధుల గెలుపు, వారి మెజారిటీలపై భారీగా బెట్టింగ్ జరుగుతోంది.
ఆడపడుచులందరూ కలసి మూకుమ్మడిగా వెళ్ళి చీరలు పంచిన వైసీపీ నాయకుడి ఇంటిలోకి విసిరేసి ఎంచక్కా వచ్చేశారు. మహిళలను ఆపడానికి ప్రయత్నించిన సదరు వైసీపీ నాయకుడి ముఖం మీద చీరల వర్షం కురిసింది.
పడిపోయింది కెమికల్ బస్తాలే అయితే మేటర్ మామూలుగానే వుండేది. కానీ అందులోంచి బోలెడన్ని ‘కట్టల’ పాములు బయటపడ్డాయి. మొత్తం ఏడు కోట్ల రూపాయల డబ్బు కట్టలు కెమికల్ పొడి బస్తాల మధ్యలో నుంచి బయటపడ్డాయి.
ఎన్నికల విధులు రెండు నిండు ప్రాణాలను బలి తీసుకున్నాయి.
ఆంధ్రప్రదేశ్‌లో సోమవారం (మే13) జరిగే పోలింగ్ కు ఎన్నికల సంఘం ఏర్పాట్లు పూర్తి చేసింది. రాష్ట్రంలో 25 లోక్‌సభ, 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు పోలింగ్ జరుగుతుంది. 4 కోట్ల 14 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల రణంలో అందరి దృష్టీ పిఠాపురంపైనే ఉందంటే అతిశయోక్తి కాదు. ఇక్కడ కూటమి బ లపరిచిన అభ్యర్థిగా జనసేనాని పవన్ కల్యాణ్ పోటీ చేస్తున్నారు. వైసీపీ అభ్యర్థిగా సిట్టింగ్ ఎంపీ వంగా గీత పోటీలో ఉన్నారు.
తమ నాయకుడు తనకు కాకుండా మరొకరికి ప్రాధాన్యం ఇచ్చాడన్న కోపంతో రోడ్డు మీదే గొడవపడి, తిట్టుకున్న సంఘటన గుడివాడ నియోజకవర్గంలో జరిగింది.
తిరుపతి విమానాశ్రయం పక్కనే వున్న 50 ఎకరాల ఏపీఐఐసీ భూమిని మంత్రి అమరనాథ్ రియల్‌ఎస్టేట్ పరం చేశారు.
సినీ రచయిత, బాపట్ల అసెంబ్లీ నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి కోన రఘుపతి బంధువు అయిన కోన వెంకట్ కత్తి రాజేష్ అనే యువకుడి మీద తన అనుచరులతో కలసి దాడి చేశారు. ఆ దాడి కూడా సాక్షాత్తూ పోలీస్ స్టేషన్లోనే కావడం గమనార్హం.
తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తిరుమల శ్రీవారిని సందర్శించుకుని స్వామివారి ఆశీస్సులు అందుకున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, భారతదేశం సర్వతోముఖాభివృద్ధి సాధించాలని కోరుకున్నారు.
Publish Date:May 11, 2024
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఆంధ్ర ప్రదేశ్ లో గత నెల రోజులుగా హోరెత్తించిన మైకులు ఒక్కసారిగా మూగబోయాయి. ఎన్నికల ప్రచారానికి తెర పడింది. మే 11 శనివారం సాయంత్రం 6 గంటలతో ప్రచారపర్వానికి తెరపడింది.హైదరాబాద్‌, తెలంగాణలో స్థిరపడిన ఏపీ ఓటర్లు ఓట్ల పండుగ కోసం ఏపీలోని తమ స్వస్థలాలకు లక్షలాదిగా వస్తున్నారు.
తెలుగు ప్రజలకు, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చంద్రబాబు ఓపెన్ లెటర్ రాశారు
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.