Publish Date:May 23, 2023
ఏపీలో బీజేపీ స్టాండ్ ఏమిటన్నది స్పష్టంగా తేలిపోయింది. ఏవో ఏవేవో రాజకీయ ప్రయోజనాల కోసం వైసీపీ సర్కార్ పై చార్జిషీట్లు అంటూ హడావుడి చేస్తున్నా.. బీజేపీ వాస్తవంగా రాష్ట్రంలో జగన్ సర్కార్ కు మద్దతుగానే ఉండాలన్న కృత నిశ్చయంతో ఉందని తేలిపోయింది.
ఇంకా అమయాకంగా జనసేనాని పవన్ కల్యాణ్ బీజేపీ మా మిత్ర పక్షం.. రాష్ట్రంలో మరో సారి వైసీపీ సర్కార్ అధికారంలోకి రాకుండా ఉండేందుకు బీజేపీని కూడా కలుపుకుపోయేందుకు ప్రయత్నం చేస్తున్నానంటూ కాలం గడిపేయడం వాస్తవాన్ని చూడకుండా కళ్లు మూసుకోవడమే అవుతుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వను అందుకోసం బీజేపీ పెద్దలతో మాట్లాడతాను అని పవన్ ఇప్పటికీ అనడం అమాయకత్వమేనంటున్నారు. బీజేపీకి ఏపీలో కనీసం ఒక శాతం కూడా ఓటు బ్యాంకు లేదన్నది తెలిసిన విషయమేనని గుర్తు చేస్తున్నారు. కేంద్రంలో అధికారంలో ఉండటం.. ఎన్నికల సమయంలో వ్యవస్థలను మేనేజ్ చేస్తుందన్న భయం, అనుమానంతోనే జనసేన, తెలుగుదేశం పార్టీలు కమలం పార్టీ పట్ల సాఫ్ట్ కార్నర్ తో ఉన్నారని రాజకీయ వర్గాలలో గట్టిగా చర్చ జరుగుతోంది.
కర్నాటక ఫలితాల తరువాతనైనా ఎన్నికల సమయంలో వ్యవస్థలను మేనేజ్ చేయడం అంత సులభం కాదని ఆ పార్టీలు తెలుసుకోవాలని, సొంత బలం, పోల్ మేనేజ్ మెంట్ పై గట్టిగా దృష్టి పెట్టాలని పరిశీలకులు సూచిస్తున్నారు.తాజాగా.. మోడీ సర్కార్ రెవెన్యూ లోటు నిధులు అంటూ ఏపీ కి 10,460. 87 కోట్ల రూపాయలు విడుదల చేశారు. ఇదేమీ ఇప్పటి లోటు కాదు. రాష్ట్ర విభజన సమయంలో ఏర్పడిన లోటు. ఆ లోటును భర్తీ చేయాలని నవ్యాంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రి, తెలుగుదేశం అధినేత అప్పట్లో ఎన్ని ప్రయత్నాలు చేశారో.. ఎన్ని సార్లు హస్తిన పర్యటించారో.. ఎన్ని సార్లు స్వయంగా మోడీని కలిసి విజ్ణప్తి చేశారో లేక్కే లేదు. తరువాత తరువాత మోడీ చంద్రబాబుకు అప్పాయింట్ మెంట్ ఇవ్వకుండా మొహం చాటేశారు. అది వేరే సంగతి.
నిధుల కోసమే, విభజన హామీల అమలు కోసమే అప్పట్లో తెలుగుదేశం ఎన్డీయేతో గొడవ పడింది. బయటకు వచ్చేసింది. అంతేనా అప్పటి ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ వంటి మంత్రులు రక్షణ నిధులను ఇచ్చేయమంటారా అంటూ ఎద్దేవా కూడా చేశారు. అలాంటిది కేంద్రానికి ఇప్పుడు హఠాత్తుగా ఏపీ మీద కాదు కాదు జగన్ సర్కార్ మీద ఎక్కడ లేని ప్రేమా పుట్టుకొచ్చేసింది. అడగకుండా పెట్టకుండా.. జగన్ ఆర్థిక కష్టాలు తీర్చేయడానికి ఆఘమేఘాల మీద నిధులు విడుదల చేసేసింది. దీంతో ఎన్నికల సంవత్సరంలో జగన్ సర్కార్ కు ఆర్థిక చీకాకులు లేకుండా సహకారం అందించింది. ఇది చాలదన్నట్లూ ఎప్పుడడిగితే అప్పుడు అప్పులు తీసుకోవడానికి పచ్చ జెండా చేతిలో పట్టుకుని రెడీగా నిలుచుంటోంది.
దీంతో ఏపీ విషయంలో బీజేపీ వైఖరి ఏమిటో.. ఆ పార్టీ ఎటువైపు ఉంటుందో, ఎవరికి మద్దతుగా నిలుస్తోందో? నిలుస్తుందో అందరికీ పూర్తిగా అర్ధమైపోయింది. అసలు ఇప్పుడేమిటి? గత నాలుగేళ్లుగా బీజేపీ ఎలాంటి దాపరికం లేకుండా తన వైఖరి ఏమిటో చెబుతూనే వస్తోంది. జనసేనానికే ఇంకా పూర్తిగా అర్ధమైనట్లు కనిపించడం లేదు. అలాగే తెలుగుదేశం కూడా జనసేన అధినేత బీజేపీ అగ్రనాయకత్వాన్ని ఏపీలో వైసీపీకి వ్యతిరేక వైఖరి తీసుకునేల ఒప్పించగలరన్న ఆశ అంటూ ఏమైనా ఉంటే దానిని వదిలేసుకుని ముందుకు నడవాల్సిన అవసరం ఉంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/bjp-clarified-39-155796.html
టీవీకే అధినేత విజయ్తో భేటీ అనంతరం రాజ్ భవన్ ఒక అధికారిక ప్రెస్ నోట్ విడుదల చేసింది. అసెంబ్లీలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే ఉండాల్సిన సంఖ్యాబలంపై గవర్నర్.. విజయ్కు మార్గనిర్దేశం చేశారు. కేవలం అతిపెద్ద పార్టీగా ఉండటమే కాకుండా, సభలో తగినంత మంది ఎమ్మెల్యేల మద్దతు ఉన్నట్లు ఆధారాలు చూపాలని సూచించారు.
పిఠాపురంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో చంద్రబాబు ఫొటోలేదని ఆరోపిస్తూ.. మాజీ ఎమ్మెల్యే వర్మ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో జనసేన నేత, మాజీ ఎమ్మెల్యే దొరబాబు జోక్యం చేసుకోవడంతో వాగ్వాదం చోటు చేసుకుంది. వర్మ దురుసు వ్యాఖ్యలపై పార్టీలో అంతర్గతంగా చర్చించిన అధిష్టానం.. వర్మ వ్యవహారాన్ని తప్పుబట్టింది. ఇంతలోనే వర్మను ఇంచార్జ్ పదవి నుంచి తొలగించడం చర్చనీయాంశంగా మారింది.
రాష్ట్రంలో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు డీఎంకే ఏ విధంగానూ అడ్డుపడబోదన్నారు. రాష్ట్రంలో మరోసారి ఎన్నికలు రావాలని గానీ, రాజ్యాంగ సంక్షోభం తలెత్తాలనీ కానీ తాము కోరుకోవడం లేదన్నఆయన.. ప్రజాతీర్పునకు అనుగుణంగానే డీఎంకే నడుచుకుంటున్నదన్నారు.
గతంలో విజయ్కు ఉన్న ప్రాణహాని హెచ్చరికలు.. ఆయన పాపులారిటీని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం సాయుధ పోలీసులతో కూడిన భద్రతను ఏర్పాటు చేసింది. అయితే.. తాజాగా నిర్వహించిన భద్రతా సమీక్షలో భాగంగా ఆయనకు ఇకపై అదనపు సెక్యూరిటీ అవసరం లేదని అధికారులు భావించినట్లు తెలుస్తోంది.
తాజా ఎన్నికల ఫలితాల్లో నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (టీవీకే) 108 స్థానాలతో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించిన సంగతి తెలిసిందే. అయితే.. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 118 మంది ఎమ్మెల్యేల మద్దతు ఆ పార్టీకి ఇంకా లభించలేదు. కాంగ్రెస్తో కలిపి విజయ్ బలం ప్రస్తుతం 112కు చేరినప్పటికీ.. మేజిక్ ఫిగర్కు ఇంకా ఆరు అడుగుల దూరంలో ఉంది.
తమిళనాడు రాజకీయాల్లో పెను మార్పులు చోటుచేసుకుంటున్న వేళ
బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయం సాధించడంలో సువేందు కీ రోల్ పోషించారు. ఆ పార్టీ 206 స్థానాల్లో గెలిచి బెంగాల్లో తొలిసారిగా అధికారం చేపట్టబోతోంది. బీజేపీ తరఫున రెండు స్ధానాల నుంచి బరిలోకి దిగిన సువేందు అధికారి.. మరోసారి మమతా బెనర్జీని ఓడించారు. భవానిపూర్లో దీదీపై గెలిచిన ఆయన.. తన సొంత నియోజకవర్గమైన నందిగ్రామ్లోనూ గెలిచి పట్టు నిలుపుకున్నారు.
ముఖ్యంగా అస్సాం, పశ్చిమబెంగాల్ లో బీజేపీ ఎన్నికల సంఘం సహకారంతో ఫలితాలను చోరీ చేసిందన్నారు.
పశ్చిమబెంగాల్లో మూడున్నర దశాబ్దాల ఏళ్ల సీపీఎం పాలనకు బ్రేక్ వేసి 2011లో అధికార పగ్గాలు చేపట్టిన తృణముల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్టీ.. 2026 వరకు వరుస విజయాలతో ముఖ్యమంత్రిగా కొనసాగారు. ఆమె 15 ఏళ్ల ఆధిపత్యానికి ఎన్డీఏ తెర దించింది. మమతా సైతం కాంగ్రెస్లో కేంద్రమంత్రిగా, పలు కీలక పదవులు నిర్వహించి, తర్వాత సొంత కుంపటి పెట్టుకున్న నాయకురాలే కావడం గమనార్హం.
ప్రజా సమస్యలపై స్పష్టమైన అజెండాతో ఎన్నికల బరిలోకి దిగిన విజయ్ను తమిళ ప్రజలు ఆదరించడం శుభపరిణామమన్నారు.
తన పార్టీ స్థాపించిన నాటి నుండి నేటి వరకు ఆయన సాగించిన ప్రయాణం ఒక అద్భుతమైన రాజకీయ థ్రిల్లర్ను తలపిస్తుంది. ఎన్నికల ప్రచార సమయంలో విజయ్ అనేక ఆటంకాలను ఎదుర్కొన్నారు. ప్రత్యర్థి పార్టీల నుండి వచ్చిన తీవ్ర విమర్శలు, అధికార యంత్రాంగం విధించిన ఆంక్షలు ఆయనను ఉక్కిరిబిక్కిరి చేశాయి. వ్యక్తిగత జీవితంపై జరిగిన దుష్ప్రచారం విజయ్ ఇమేజ్ను దెబ్బతీస్తుందని అందరూ భావించారు.
తమిళనాడులో టీవీకే పార్టీ విజయాన్నిస్వాగతిస్తూ.. వైసీపీ సోషల్ మీడియా వేదికగా సంబరాలు మొదలు పెట్టింది. విజయ్ సాధించిన ఈ అద్భుత విజయం వెనుక వైసీపీ అధినేత జగన్ సహకారం ఉందంటూ వైసీపీ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా గతంలో ఒక వివాహ వేడుకలో వైఎస్ జగన్, విజయ్ ఇద్దరూ కలిసి దిగిన ఒక ఫోటోను ఇప్పుడు వైసీపీ నెట్టింట వైరల్ చేస్తోంది.
ఈ ఎన్నికల ఫలితాల్లో విజయ్ టవీకే పార్టీ స్పష్టమైన ఆధిక్యత కనబరిచింది. ప్రభుత్వ వ్యతిరేకతతో పాటు, కూటమి పక్షాల మధ్య సరైన సమన్వయం లేకపోవడం కూడా ఈ ఓటమికి ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి.