Publish Date:Nov 27, 2021
ఇది ఇండియా. ఇక్కడ ఎలాగైనా ఉండొచ్చు. ఎవడిష్టం వాడిది. జనాలు బాగా ముదురు. రూల్స్ గీల్స్ ఏవీ పాటించరు చాలామంది. మనదాకా వచ్చాక చూసుకుందాంలే అనుకుంటారు. అలానే ఓ యువకుడు ట్రాఫిక్ రూల్స్ను అస్సలు పట్టించుకోవడం లేదు. హెల్మెట్ పెట్టుకోడు. బైక్ నెంబర్ ప్లేట్ సరిగ్గా పెట్టడు. సిగ్నల్స్ జంప్ చేస్తుంటాడు. త్రిబుల్ రైడింగ్ సరేసరి. ట్రాఫికోళ్లు తన బండిని ఆపడం లేదనే ధీమాతో ఓవర్ చేస్తుంటాడు.
కానీ, మన ఖాకీలు వాడికంటే ముదురు. అతన్ని ఒక్కసారి కూడా ఆపకపోయినా.. అనేకసార్లు కెమెరా క్లిక్ మనిపించారు. వాడి బండిపై అనేక చలాన్లు ఉన్నాయి. ఫస్ట్ టైమ్ ఓ చలాన్ చూసి అతడు షాక్ అయ్యాడు. ఆ తర్వాత ఇంకో చలాన్. మరోసారి మరో చలాన్. ఇలా చలాన్లు వస్తూనే ఉన్నాయి. ఈ పోలీసోళ్లు మామూలోళ్లు కాదంటూ తెగ తిట్టేసుకుంటున్నాడు. కానీ, ఫైన్లు మాత్రం కట్టట్లేదు.
కట్చేస్తే.. లేటెస్ట్గా అతను బైక్పై వెళుతుంటే.. ట్రాపిక్ పోలీసులు మరోసారి ఫోటో తీశారు. అది చూసిన మనోడు.. కోపం పట్టలేకపోయాడు. నీ.... ఇంకా ఎన్నిసార్లు ఫైన్లు వేస్తారంటూ.. ఆవేశంతో ఊగిపోయాడు. నడిరోడ్డు మీద.. జంక్షన్ మధ్యలో బైక్ ఆపేసి.. బండికి నిప్పు పెట్టాడు.
వాడి చేష్టలకు అక్కడున్న పోలీసులు అవాక్కయ్యారు. వెంటనే వచ్చి.. మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు. స్థానికులు బండిపై నీళ్లు చల్లి మంటలు ఆర్పేశారు. బైక్నే తగలబెట్టేంత కోపం వచ్చిందంటే.. ఖాకీలు అతనికి ఎన్నిసార్లు ఫైన్లు వేశారో ఏమో.. అయినా, రూల్స్ పాటిస్తే.. వాళ్లెందుకు చలాన్లు వేస్తారు చెప్పండి. అలా కోపం తెచ్చుకునే బదులు.. రూల్స్ ఫాలో అయితే సరిపోతుందిగా అంటున్నారు. ఇదంతా ఆదిలాబాద్ పట్టణంలోని ఖానాపూర్లో జరిగింది. బండి తగలబెట్టిన అతని పేరు.. మక్బూల్.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/biker-fires-his-bike-due-to-police-chalans-39-127237.html
తెలుగు రాష్ట్రాలకు గుడ్ న్యూస్. తెలంగాణలో నాలుగు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలియ జేసింది. ద్రోణి ప్రభావంతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. గత కొన్ని రోజులుగా తెలుగు రాష్ట్రాల ప్రజలు ఉక్కపోతకు గురయ్యారు. మండే ఎండలతో సతమతమవుతున్న ప్రజలకు ఉపశమనం లభించనుంది.
ఏపీలో సార్వత్రిక ఎన్నికలకు పోలింగ్ సమయం దగ్గర పడుతున్న కొద్దీ వైసీపీ అధినేత, సీఎం జగన్ మోహన్ రెడ్డిని ఓటమి భయం వెంటాడుతోంది. ఇన్నాళ్లూ తనకు అనుకూలమైన అధికారులతో ప్రతిపక్ష పార్టీల నేతలపై దాడులు చేయించిన జగన్ కు ఈసీ వరుసగా షాకిలిస్తోంది. ఎన్నికల నియమావళిలో భాగంగా అధికార పార్టీకి తొత్తులుగా పనిచేస్తున్న అధికారులపై ఈసీ బదిలీ వేటు వేస్తోంది.
కంగనా రనౌత్.. సినీమాల గురించి తెలిసిన వారెవరికీ ఈ పేరును కొత్తగా పరిచయం చేయనవసరం లేదు. నటిగా ఆమె ఉన్నత శిఖరాలను అధిరోహించింది. హీరోయిన్ గానే కాదు, లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లోనే ఆమె నటన విమర్శలకు ప్రశంసలు సైతం పొందింది.
మరో సార్వత్రిక ఎన్నికలకు కేవలం ఐదు రోజులు మాత్రమే ఉండటంతో ఉద్యో గుల కోసం పోస్టల్ బ్యాలెట్ సౌలభ్యం ఉంది. ఈ నెల 9 వరకు గడువు విధించినట్లు ఎన్నికల కమిషన్ స్పష్టం చేసింది.
ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి (సీఈవో) ముఖేశ్ కుమార్ మీనా ఇవాళ మీడియా సమావేశం నిర్వహించారు.
భారత స్వాతంత్ర్య సంగ్రామ చరిత్రలో మరచిపోలేని తిరుగుబాటు స్వరం మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు. చిన్నవయసులోనే మహోజ్వల శక్తిగా మారి భరతమాత దాస్యశృంఖలాల విముక్తి కోసం పోరాడిన మన్యం వీరుడు. సాయుధ పోరాటం ద్వారానే స్వతంత్ర్యం వస్తుందని నమ్మి, తన ప్రాణాలర్పించిన విప్లవ వీరుడు.
కీలెరిగి వాత పెట్టినట్లుగా చిరంజీవి జగన్ మైండ్ బ్లాక్ అయ్యేలా ఎన్డీయే కూటమి అభ్యర్థులకు మద్దతు ప్రకటిస్తున్నారు. అసలే బలహీనంగా ఉన్న జగన్ కు చిరంజీవి తెలుగుదేశం కూటమికి బాహాటంగా మద్దతు ఇవ్వడం మరింత బలహీనం చేస్తుందనడంలో సందేహం లేదు. ఇప్పటి వరకూ చిరంజీవి ప్రత్యక్షంగా తన రాజకీయ మొగ్గు ఎటువైపు అన్నది ప్రకటించలేదు. కానీ మిత్రులు అంటూ అనకాపల్లి లోక్ సభ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి సీఎం రమేష్, అలాగే జనసేన అభ్యర్థి పంచకర్ల రమేష్ లకు ఓటు వేయండి అంటూ ఆయన ఒక వీడియో సందేహం ద్వారా ప్రజలకు పిలుపు నిచ్చారు.
దేశంలోనే పేరుపొందిన పారిశ్రామిక ప్రాంతం శ్రీ సిటీ ఇక్కడే ఉంది. అక్కడ కూడా సమస్యల కుప్పగా మారిపోయింది. ఎవరూ పట్టించుకునే వారు లేకపోవడంతో, ప్రభుత్వ వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తోంది. మరో వైపు, ఒకప్పటి టీడీపీ కంచుకోటగా వున్న సూళ్లూరుపేటలో సంచలన విజయం సాధించాలని చంద్రబాబు నాయుడు భావిస్తున్నారు.
నేచురల్ స్టార్ నాని జనసేనాని పవన్ కల్యాణ్ కు మద్దతు ప్రకటించారు. ఈ ఎన్నికలలో ఇప్పటి వరకూ సినీ పరిశ్రమ నుంచి ఎవరూ తమ మద్దతు ఫలానా పార్టీకి, ఫలానా అభ్యర్థికి అంటూ బాహాటంగా బయటకు వచ్చిన దాఖలాలు లేవు. థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పృధ్వీరాజ్ జనసేన పార్టీలో చేరి ఆ పార్టీకి విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు.
మళ్ళీ జగన్ అధికారంలోకి రావడం అనేది అసంభవం. అయినప్పటికీ ఇంకా చాలా కొద్దిమంది జగన్ మాయలో వుండే అవకాశం వుంది. వాళ్ళు మళ్ళీ జగన్ అధికారంలోకి వస్తాడేమో
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అందుబాటులోకి వచ్చాక ప్రముఖులను ఇమిటేట్ చేస్తూ వీడియోలు చేయడం సాధారణమైపోయింది.
జగన్ నోట ఓటమి మాట వచ్చేసింది. ఔను ఎన్నికలు స్వేచ్ఛగా, పారదర్శకంగా జరుగుతాయా అన్న అనుమానం కలుగుతోంది. తనను అడ్డుకోవడానికి వాళ్లు సొమ్ములు నిలిపివేస్తున్నారు. అధికారులను ఇష్టారాజ్యంగా మార్చేస్తున్నారు అంటూ జగన్ మాట్లాడారు.
వీళ్ళకి అవసరమైతే కాళ్ళు కూడా పట్టుకుంటారు. కాంగ్రెస్ ప్రభుత్వం వున్నప్పుడు బెయిల్ కోసం జగన్ ఎవరి కాళ్ళ బేరానికి వెళ్ళాడో, గత పదేళ్ళుగా ఎవరి కాళ్ళు పట్టుకుంటున్నాడో అందరికీ తెలిసిందే. కనీసం కోర్టు హియరింగ్కి కూడా హాజరు కాకుండా హాయిగా తిరుగుతున్నాడు.
ఎపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు అడ్డు ఎవరు వచ్చినా వారిని టార్గెట్ చేయడం ఆనవాయితీ. స్వంత బాబాయి వివేకానందరెడ్డి హత్య చేసినట్టు ఇప్పటికే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. స్వంత బాబాయిని హత్య చేయించిన ఘనుడు జగన్ అని చెల్లెలు వైఎస్ షర్మిల విస్తృత ప్రచారం చేస్తున్నారు. ఈ ప్రచారం ఆమెను చిక్కులు తెచ్చి పెట్టింది.