Publish Date:Oct 20, 2022
నితీష్ కుమార్ మళ్లీ కమలం పార్టీకి షేక్ హ్యాండ్ ఇస్తారా? ఆయన పదవీ దాహంతీర్చుకోవడానికి మరోసారి కమలానికి స్నేహహస్తం చాస్తారా? అంటే ప్రముఖ ఎన్నికల వ్యూహ కర్త ప్రశాంత్ కిషోర్ అలియాస్ పీకే ఔననే అంటున్నారు. పీకే గతంలో నితీష్ కుమార్ నేతృత్వంలోని జనతాదళ్(యు)లో కీలక పాత్ర పోషించారు. నితీష్ తో సన్నిహిత సంబంధాలు ఉండేవి. అయితే ఇదంతా 2020కి ముందు.. పీకే జనతాదళ్( యు) నుంచి ఉద్వాసనకు గురికావడానికి ముందు. ఇప్పుడు కాదు.
అటువంటి పీకే తాజాగా నితీష్ కుమార్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. నితీష్ కుమార్ బీజేపీతో టచ్ లో ఉన్నారనీ, కాషాయ శిబిరంతో మరోసారి పొత్తుకు ప్రయత్నిస్తున్నారనీ, ఎన్డీయే గూటికి చేరడానికి ప్రయత్నిస్తున్నారనీ ప్రశాంత్ కిషోర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. లాలూ ప్రసాద్ నేతృత్వంలోని ఆర్జెడితో కలిసి మహాఘట్బంధన్ను తిరిగి అధికారంలోకి తీసుకురావడానికి ఈ ఏడాది ప్రారం భంలో జేడీయూ బిజెపితో సంబంధాలను తెంచుకుని, ఎన్డీయే నుంచి బయటకు వచ్చేసిన సంగతి విదితమే.
అయితే బీహార్లో పాదయాత్రలో ఉన్న ప్రశాంత్ కిషోర్ పిటిఐతో మాట్లాడుతూ, నితీష్ కుమార్ బిజెపికి వ్యతిరేకంగా జాతీయ కూట మిని చురుకుగా నిర్మిస్తున్నారని భావిస్తున్న ప్రజలు ఆయన బీజేపీతో మరోసారి పొత్తుకు తలుపులు తెరిచే ఉంచారని తెలిస్తే ఆశ్చర్య పోతారని, అయితే అది వాస్తవమని పేర్కొన్నారు. నితీష్ కుమార్ జేడీయూ పార్టీ ఎంపీ, రాజ్యసభ డిప్యూటీ చైర్పర్సన్ హరివంశ్ జీ ద్వారా బీజేపీతో నిత్య సంబంధాలు కొనసాగిస్తున్నారని ఆరోపించారు.
జేడీయు బీజేపీతో తెగతెంపులు చేసుకున్నప్పటికీ, రాజ్యసభ పదవికి హరివంశ్ ఇంత వరకూ రాజీనామా చేయకపోవడమే ఇందుకు నిదర్శనమని ఆయన అన్నారు. ఆర్జేడీతో ఇబ్బందులు వస్తే మళ్లీ కమలంతో చేతులు కలిపి అధికారాన్ని నిలబెట్టుకోవడానికి నితీష్ ఒక్క నిముషం కూడా ఆలోచించరనీ, రాజకీయాలలో విలువల కంటే అధికారమే ముఖ్యమని నితీష్ భావిస్తారని ప్రశాంత్ కిషోర్ అన్నారు. కాగా రాజ్యసభ పదవికి తాను రాజీనామా ఎందుకు చేయలేదన్న ప్రశ్నకు సమాధానం ఇచ్చేందుకు హరివంశ్ నిరాకరించారు. కాగా నితీష్ వ్యాఖ్యలను జేడీయూ నిర్ద్వంద్వంగా ఖండించింది. నితీష్ మళ్లీ బీజేపీతో చేతులు కలిపే ప్రశక్తి లేదని జేడీయూ స్పష్టం చేసింది. పీకే వ్యాఖ్యలపై స్పందించిన జేడీయూ అధికార ప్రతినిథి కేసీ త్యాగి
బీహార్ సీఎం నితీష్ కుమార్ తన జీవితంలో బీజేపీతో చేతు కలిపే ప్రశక్తే లేదని బహిరంగంగా ప్రకటించిన సంగతి గుర్తు చేశారు. ఆయన మాటలను తాము పూర్తిగా విశ్వసిస్తున్నామన్నారు. ప్రశాంత్ కిషోర్ గత ఆరు నెలలుగా క్రియాశీల రాజకీయాల్లో ఉన్నారనీ, ఆయనకు ఎటువంటి మద్దతూ లభించకపోవడంతో గందరగోళాన్ని వ్యాప్తి చేసి లబ్ధి పొందే ఉద్దేశంతోనే ఇటువంటి అవాస్తవాలను ప్రచారం చేస్తున్నారని త్యాగి విమర్శించారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/bihar-cm-nitesh-kumar-is-in-touch-with-bjp-says-pk-25-145748.html
దేశంలో ఇటీవల వెలువడిన ఉప ఎన్నికల ఫలితాలు భారత రాజకీయ యవనికపై కొత్త సమీకరణాలకు నాంది పలుకుతున్నాయి.
వైసీపీలో నెలకొన్న నిస్తేజాన్నీ, నిరుత్సాహాన్నీ ఆసరాగా చేసుకుని, ఆ పార్టీకి పట్టు ఉన్న ప్రాంతాలలో కూడా తెలుగుదేశం కూటమి పాగా వేస్తోంది. ప్రధానంగా వైసీపీకి కంచుకోటగా భావించే రాయలసీమలో వైసీపీ బలాన్ని ఛేదిస్తూ, అభివృద్ధి మంత్రంతో క్షేత్రస్థాయిలో బలం పెంచుకుంటోంది.
తెలంగాణలో అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు ఇకపై టీ-ఫైబర్ ద్వారానే ఇంటర్నెట్ సేవలు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ఈ ఫలితాలు మోదీ బ్రాండ్ ను మసకబార్చాయి. మోడీ ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకతకు నిదర్శనంగా నిలిచాయి. ఈ ఫలితాలు కేవలం ఉప ఎన్నికలో తగిలిన ఎదురుదెబ్బగా కంటే బీజేపీపై ప్రజా వ్యతిరేకత పెచ్చరిల్లుతుందన్న భావననే ఎక్కువగా ఆవిష్కరించాయి.
అమెరికాలోని బోస్టన్ విశ్వవిద్యాలయంలో అభిజీత్ విద్య ఎలా అభ్యసించాడనే అంశంపై విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ సూరత్కు చెందిన ఆర్టీఐ కార్యకర్త అమిత్ తివారీ కేంద్ర ఎన్నికల సంఘం, పన్నుల శాఖతో పాటు మహారాష్ట్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. అలాగే.. సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ సమకూర్చిన 1 కోటి రూపాయ నిధులపై అనుమానాలు వ్యక్తం చేశారు.
ఎటువంటి ఆధారాలు లేకుండా, కేవలం రాజకీయ లబ్ధి కోసమే ఇటువంటి అసత్య, అవమానకర, ద్వంద్వార్థ వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ పోలీసులు కేసు నమోదు చేశారు. సామాజిక మాధ్యమాల్లో సైతం ఈ వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమయ్యాయి. ముఖ్యంగా సినిమా, రాజకీయ రంగాల నుంచి ఉదయనిధి శైలిపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి.
నీళ్లు ఎక్కడికి చేరినా చేరకపోయినా.. అక్కడికి మాత్రం తప్పకుండా చేరాలంటూ వ్యాఖ్యానించారు. ఆ వెంటనే తాను మాట్లాడింది కావేరీ జలాల గురించేనని చెప్పినా, ఉదయనిథి స్టాలిన్ వ్యాఖ్యలు నటి త్రిషను ఉద్దేశించి చేసినవేనంటూ విమర్శలు వెల్లువెత్తాయి.
పీకే తన సమీప ప్రత్యర్థి, బీజేపీ అభ్యర్థి నీరజ్ కుమార్ సిన్హాపై 20 వేలకుపైగా ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఈ నియోజకవర్గం నుంచి 1995 నుంచీ వరుసగా బీజేపీయే విజయం సాధిస్తూ వస్తోంది. నవీన్ కిషోర్ ప్రసాద్ సిన్హా వరుసగా నాలుగు సార్లు విజయం సాధించగా, ఆ తరువాత ఇదే నియోజకవర్గం నుంచి ఆయన కుమారుడు, ప్రస్తుతం బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ వరుసగా విజయం సాధిస్తూ వచ్చారు.
పాలనాపరమైన కఠిన నిర్ణయాలే కాకుండా.. రాష్ట్ర ఆర్థిక, సాంకేతిక వృద్ధి కోసం విజయ్ ప్రభుత్వం వెట్రి తమిళగం విజన్ పేరుతో వియయ్ కార్యాచరణ ప్రకటించారు. ఈ విజన్ కింద 50 వేల కోట్ల రాష్ట్ర పెట్టుబడి నిధి ఏర్పాటుకు ప్రతిపాదించడమే కాకుండా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఎలక్ట్రిక్ వాహనాలు, సెమీకండక్టర్ల రంగాలలో ప్రభుత్వం నేరుగా కో ఇన్వెస్టర్ గా భాగస్వామ్యం వహించేలా నిర్ణయించారు.
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం క్రెడిట్ విషయంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేస్తున్నవన్నీ డ్రామాలేనని కేంద్ర మంత్రి పెమ్మసాని విమర్శించారు. 2015లోనే నాటి తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు, అప్పటి కేంద్ర మంత్రిఅశోక్ గజపతిరాజు చొరవతో భోగాపురం ఎయిర్పోర్టుకు రూపకల్పన చేసిందనీ, 2 వేల 200 ఎకరాల భూసేకరణ కూడా పూర్తి చేసిందని స్పష్టం చేశారు.
గత తప్పిదాల కారణంగా వైసీపీ నేతలు ఒకరి వెంట ఒకరు అన్నట్లుగా కేసుల ఉచ్చుల్లో చిక్కుతున్నారు. ఇక తెలుగుదేశం కూటమి ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం పరుగులు పెడుతుండటంతో వైసీపీ నేతలలో నిరాశ నిస్ఫృహలు అలుముకుంటున్నాయి.
భోగాపురం విషయంలో వైసీపీ అధినేత జగన్.. ఒకే సమయంలో క్రెడిట్ చోరీకీ, విమానాశ్రయం సాకారం కావడం పట్ల విమర్శలకు పాల్పడటం అపహాస్యం పాలౌతోంది.
దీంతో ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ డీఎంకే అధినేత, మాజీ ముఖ్యమంత్రి ఎం.కే. స్టాలిన్ ముఖ్యమంత్రి విజయ్ కావేరి వివాదంలో ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారని విమర్శించారు. కావేరి జలాలు తమిళనాడుకు అత్యంత కీలకమనీ, ఇతర రాష్ట్రాల వ్యూహాలను సమర్థవంతంగా ఎదుర్కోవాలంటే ఏకాభిప్రాయ సాధన అవసరమని అన్నారు.