బీహార్ అసెంబ్లీ ఎన్నికలలో మజ్లీస్ మార్క్ రాజకీయాలు షురూ

Publish Date:Oct 7, 2015

Advertisement

 

మరొక ఐదు రోజుల్లో బీహార్ అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ మొదలవుతుంది. కనుక రాజకీయ పార్టీల మధ్య యుద్ధం పతాక స్థాయికి చేరుకొంది. కనుక అన్ని పార్టీలు ప్రజల భావోద్వేగాలతో తెగ ఆడేసుకొంటున్నాయి. ఇంతవరకు హైదరాబాద్ పాత బస్తీకే పరిమితమయిన మజ్లీస్ పార్టీ మొట్ట మొదటిసారిగా బీహార్ లో అడుగు పెడుతోంది. సహజంగానే అది ముస్లిం ప్రజలందరినీ తనవైపు తిప్పుకొనేందుకు ఏమేమీ చేయవచ్చునో అవన్నీ చేస్తోంది. కొన్ని రోజుల క్రితం ఉత్తరప్రదేశ్ లో దాద్రి అనే ప్రాంతంలో ఆవుదూడను చంపి దాని మాంసం తిన్నాడనే అనుమానంతో మొహమ్మద్ ఇఖ్ లఖ్ అనే వ్యక్తిని కొంతమంది కొట్టి చంపారు. అటువంటి సంఘటనలు జరగడం చాలా విచారకరం. ఆ నేరానికి పాల్పడిన వారిని కటినంగా శిక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వానిది, పోలీసులదే. చట్టపరంగా చేపట్టవలసిన చర్యల గురించి ఎవరూ మాట్లాడటం లేదు. కానీ బీహార్ లో అన్ని పార్టీలు దానిని ఒక రాజకీయ అస్త్రంగా మలుచుకొని ఎన్నికలలో లబ్ది పొందేందుకు తెగ ప్రయాసపడుతున్నాయి. బీహార్ లో మొదటిసారి అడుగుపెడుతున్న మజ్లీస్ పార్టీకి అది ఊహించని ఒక గొప్ప ఆయుధంగా అందివచ్చింది.

 

ఉత్తరప్రదేశ్ లో ప్రస్తుతం అధికారంలో ఉన్న సమాజ్ వాదీ పార్టీ బీహార్ ఎన్నికలలో పోటీ చేస్తోంది. దానికి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ తండ్రి ములాయం సింగ్ యాదవ్ అధినేత. ఇంతవరకు ముస్లిం ప్రజలకు తానే శ్రేయోభిలాషి అన్నట్లుగా వ్యవహరిస్తూ తనను తాను ములాయం ఖాన్ అని గొప్పగా చెప్పుకొంటూ ముస్లింల ఓట్లను కొల్లగొడుతున్నారు. కనుక ఆయననే మజ్లీస్ తన ప్రధాన ప్రత్యర్ధిగా భావించడం సహజం. కనుక అందివచ్చిన ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని సమాజ్ వాదీ పార్టీపై ఓవైసీ సోదరులు విమర్శలు గుప్పిస్తున్నారు.

 

మజ్లీస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీ మీడియాతో మాట్లాడుతూ “ఉత్తరప్రదేశ్ లో సమాజ్ వాదీ ప్రభుత్వం ముస్లిం ప్రజలకు రక్షణ కల్పించలేని పరిస్థితిలో ఉంది. పైగా ఆ పార్టీకే చెందిన ఆజం ఖాన్ అనే మంత్రి ఈ సంఘటనపై ఐక్యరాజ్యసమితికి పిర్యాదు చేస్తానని గొప్పగా చెప్పుకోవడం మరీ సిగ్గుచేటు. అంటే ఆయనకి తమ ప్రభుత్వంపైన, కేంద్రప్రభుత్వం మీద నమ్మకం లేదని అర్ధం అవుతోంది. ఈ సమస్య మన దేశ అంతర్గత సమస్య. దేశంలో ముస్లింల పోరాటం రాజకీయ పార్టీలతో, ప్రభుత్వాలతోనే కానీ దేశంతో కాదు. ఈ సమస్య గురించి ఐక్యరాజ్యసమితికి పిర్యాదు చేస్తానని అజాం ఖాన్ చెపుతుంటే ఆ పార్టీకి చెందిన నేతలెవరూ ఖండించడం లేదు. ఆయన మాటలను ములాయం సింగ్ సమర్దిస్తారో లేదో చెపితే బాగుంటుంది. ఒకవేళ మంత్రి మాటలను ఆయన సమర్దిస్తున్నట్లయితే తక్షణమే అధికారంలో నుండి దిగిపోయి, తమ ప్రభుత్వాన్ని రద్దు చేయమని ఆయనే కేంద్రాన్ని కోరాలి. ఉత్తరప్రదేశ్ లో సమాజ్ వాదీ ప్రభుత్వం పూర్తిగా విఫలమయింది. అక్కడ పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి. ప్రజలకు రక్షణ కల్పించలేనప్పుడు తక్షణమే అధికారంలో నుండి దిగిపోవడం మంచిది. కేంద్రప్రభుత్వం అక్కడి ప్రభుత్వాన్ని రద్దు చేసి రాష్ట్రపతి పాలన విధించాలి."

 

"బీహార్ లో ముస్లింల పరిస్థితి కూడా ఏమీ గొప్పగా లేదు. ముఖ్యంగా సీమాంచల్ ప్రాంతంలో పూర్ణియా చాలా వెనుకబడి ఉంది. కానీ అక్కడి ప్రజలకు త్రాగునీరు, విద్యా, వైద్యం, విద్యుత్ వంటి సదుపాయాలు కల్పించడం గురించి మాట్లాడకుండా రాజకీయ పార్టీలన్నీ గోవధపై నిషేధం విదించాలా వద్దా? అని చర్చిస్తున్నాయి. ఆశా భోస్లే కుమారుడు చనిపోగానే ట్వీటర్లో సానుభూతి తెలిపిన ప్రధాని నరేంద్ర మోడీ, మొహమ్మద్ ఇఖ్ లఖ్ కుటుంబానికి సానుభూతి చెప్పడానికి వెనకాడుతున్నారు. ప్రపంచంలో అన్ని సమస్యల గురించి అనర్ఘళంగా మాట్లాడే నరేంద్ర మోడి దాద్రీ సంఘటనపై మాత్రం నోరు విప్పి మాట్లాడటం లేదు,” అని అన్నారు.

 

ఒక మంత్రి అవివేకంతో ప్రజలను ఆకట్టుకోవడానికి ఏదో నోటికి వచ్చినట్లు మాట్లాడితే బోడి గుండుకీ మోకాలుకీ ముడేస్తునట్లు ఆ మాటలను పట్టుకొని బీహార్ ఎన్నికలలో లబ్ది పొందాలని అసదుద్దీన్ ప్రయత్నిస్తున్నారు. తమకేదో గొప్ప దేశభక్తి ఉన్నట్లు మాట్లాడుతున్న ఓవైసీ సోదరులు బీహార్ లో అడుగు పెట్టగానే అక్కడి ముస్లిం ప్రజలను ఆకట్టుకోవడానికి మత విద్వేషాలు రెచ్చగొట్టె విధంగా ప్రసంగాలు చేసారు. అందుకు అక్బరుద్దీన్ ఓవైసీపై పోలీసులు అరెస్ట్ వారెంట్ కూడా జారీ చేసారు.

 

పూర్ణియాలో ముస్లిం ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను గురించి మాట్లాడకుండా రాజకీయ పార్టీలు ప్రజలను ఆకట్టుకొని వారి ఓట్లు పొందేందుకు గోవధ నిషేధం గురించి మాట్లాడుతున్నాయని ఒవైసీ సోదరులు విమర్శిస్తున్నారు. కానీ వారు కూడా భిన్నంగా వ్యవహరిస్తున్నారా? అంటే లేదనే స్పష్టం అవుతోంది. ఆటువంటప్పుడు ఇతరులను నిందించడం దేనికి? బీహార్ ఎన్నికలలో ఉత్తరప్రదేశ్ ప్రస్తావన ఎందుకు చేస్తున్నారు? హైదరాబాద్ లో కూర్చొని బీహార్, ఉత్తరప్రదేశ్ లో ముస్లిం ప్రజల సమస్యల గురించి మాట్లాడుతున్నవారు రేపు ఎన్నికలలో గెలిస్తే మాత్రం అక్కడి ముస్లిం ప్రజలకు మేలు చేస్తారని నమ్మకం ఏమిటి? అని బీహార్ ప్రజలు విజ్ఞతతో ఆలోచించి ఓటు వేయాల్సిన అవసరం ఉంది.

By
en-us Political News

  
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు.
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్ రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది. 80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది. ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది.
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు...
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది...
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో  తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది. 
​సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది...
జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు.
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు...
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి...
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  
నాలుగు రాష్టాలు అస్సాం, పశ్చిమ బెంగాల్ తమిళనాడు,కేరళ, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి శాసన సభలకు  మరో రెండు నెలల్లో ఎన్నికలు జరుగుతాయి. ఇది అందరికీ తెలిసిన విషయం.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.