తెలంగాణ బీజేపీ రేకులు రాలిపోనున్నాయా?

Publish Date:Sep 27, 2023

Advertisement

తెలంగాణ ఎన్నికల ముంగిట కమలం పార్టీకి అన్నీ అపశకునాలే ఎదురౌతున్నాయా? కర్నాటక అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఏం జరిగిందో అలాగే  తెలంగాణలో పరిస్థితులు కూడా ముందుగానే ప్రతికూలతను చూపిస్తున్నాయా అంటే పరిశీలకులు ఔననే అంటున్నారు. కర్నాటక ఎన్నికల సమయంలో బీజేపీలో అసమ్మతి ఒక్కసారిగా భగ్గుమంది.

ఆ పార్టీకి చెందిన కీలక నేతలు కాంగ్రెస్ గూటికి చేరారు. ఔను ఎన్నికల ముంగిట కర్నాటకలో కమలం రేకులు రాలిపోయాయి. సరిగ్గా తెలంగాణ ఎన్నికల ముంగిట కూడా అదే జరగనుందన్న సంకేతాలు బలంగా కనిపిస్తున్నాయి. ఒక్క సారి కర్నాటక ఎన్నికల సమయంలో నామినేషన్ల దాఖలు గడువుకు ఒక్క రోజు ముందు వరకూ నాన్చి నాన్చి మరీ చివరి జాబితాలు బీజేపీ ఇలా ప్రకటించిందో లేదో అలా  పార్టీలో క్రమ శిక్షణ గేట్లు బద్దలైపోయాయి.   టికెట్ ఆశించి భంగపడిన నాయకులు ఒకరివెంట ఒకరు క్యూ కట్టి కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. నిజానికి టికెట్ల విషయంలో నిత్య పంచాయతీగా నిలిచే కాంగ్రెస్ మాత్రం కర్నాటక అసెంబ్లీ ఎన్నికల విషయంలో పంచాయతీలు దాదాపు లేకుండా టికెట్ల కేటాయింపు సజావుగా జరపగలిగింది. అదే సమయంలో క్రమశిక్షణకు మారుపేరుగా చెప్పుకునే బీజేపీలో మాత్రం అసమ్మతి ఆరున్నొక్క రాగంతో బహిర్గతమైంది.  

ఇక ఇప్పుడు తెలంగాణ ఎన్నికల సమయంలో కూడా బీజేపీ కర్నాటక ఎన్నికల సమయంలో ఎదుర్కొన్న పరిస్థితులనే ఎదుర్కొంటున్నది. అయితే ఇక్కడ టికెట్ల కేటాయింపు వరకూ పరిస్థితి రాకుండానే.. పార్టీ అధిష్ఠానం తీరుపై అసమ్మతి, అసంతృప్తి భగ్గుమంటోంది. ఇందుకు ఢిల్లీ మద్యం కుంభకోణం విషయంలో కవిత అరెస్టులో జాప్యం కారణమని చెప్పవచ్చు. హస్తిన మద్యం కుంభకోణంలో కవితపై ఆరోపణలు గుప్పించి, కేసీఆర్ కుటుంబ అవినీతిపై గట్టిగా గళమెత్తిన తెలంగాణ బీజేపీ నేతలకు ఈ విషయంలో అధిష్ఠానం తీరు మింగుడుపడటం లేదు. కవిత కేంద్రంగా హస్తిన మద్యం కుంభకోణంపై విమర్శలు గుప్పించిన  బీజేపీ రాష్ట్ర నాయకులకు ఇప్పుడు పార్టీ అధినాయకత్వం వ్యవహరిస్తున్న తీరు కారణంగా   అస్థిత్వమే ప్రమాదంలో  పడిన పరిస్థితి ఎదురైంది.   

మద్యం కుంభకోణంలో ఢిల్లీ ఉపముఖ్యమంత్రి సహా పలువురు అరెస్టు అయినప్పటికీ.. ఈ కుంభకోణంలో అందరి కంటే ఎక్కువగా లబ్ధి పొందారంటూ బీజేపీ విమర్శలు గుప్పించిన కవిత మాత్రం ఈడీ, సీబీఐ విచారణలను ఎదుర్కొన్నప్పటికీ అరెస్టును మాత్రం తప్పించుకోగలిగారు. ఇందుకు కేంద్రంలోని మోడీ సర్కార్ తీరే కారణమని బీజేపీ రాష్ట్ర నాయకులు పలువురు గట్టిగా నమ్ముతున్నారు. అలాగే రాష్ట్రంలో అధికారమే తరువాయి అన్నట్లుగా హైప్ కు వెళ్లిన బీజేపీ ఆ తరువాత క్రమంగా బలహీనపడి ఇప్పుడు గెలుపు సంగతి తరువాత కనీసం గౌరవప్రదమైన స్థానాలైనా వస్తాయా రావా అన్నట్లుగా చతికిల పడింది. ఇందుకు మద్యం కుంభకోణంలో కవిత అరెస్టు కాకపోవడమే కారణమని బీజేపీ రాష్ట్ర నాయకులు పలువురు బహిరంగంగానే చెబుతున్నారు. అధిష్ఠానం వద్ద కూడా ఇదే విషయాన్ని కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు కూడా. అయినా బీజేపీ అధినాయకత్వం వైఖరిలో ఇసుమంతైనా మార్పు లేకపోవడంతో  బీజేపీలోని పలువురు తెలంగాణ నేతలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. జరుగుతున్న పరిణామాలు బీఆర్ఎస్ బీజేపీ బీ టీమ్ అంటూ కాంగ్రెస్ సహా పలువురు ఆరోపిస్తున్న నేపథ్యంలో పార్టీ అధిష్ఠానం తీరు వాటిని బలపరిచేవిధంగా ఉందన్న అసంతృప్తి నాయకులలో వ్యక్తం అవుతుంది.

కాగా ప్రస్తుతం పార్టీ హై కమాండ్ తీరు పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్న నేతలంతా దాదాపుగా కేసీఆర్ సర్కార్ పై బీజేపీ బలంగా పోరాడుతుందని నమ్మి ఇతర పార్టీల నుంచి వచ్చి చేరిన వారే కావడం, తమ నమ్మకాన్ని బీజేపీ హైకమాండ్ వమ్ము చేసిందని భావిస్తుండటంతో వారంతా కలిసి సమష్టిగా తన అసంతృప్తిని వ్యక్తం చేయడమే కాకుండా వచ్చే ఎన్నికలలో బీఆర్ఎస్ కు   గట్టి పోటీ ఇస్తుందని భావిస్తున్న కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పలువురు బీజేపీ తెలంగాణ నేతలు ఇటీవలి కాలంలో ఒకటికి రెండు సార్లు రహస్యంగా భేటీ అయ్యారు. 

 విజయశాంతి, డీకే అరుణ వంటి వారితో సహా వీరి సంఖ్య పదికి మించే ఉంటుందని పరిశీలకులు చెబుతున్నారు. సరిగ్గా కర్నాటక అసెంబ్లీ ఎన్నికల ముందు కూడా ఆ రాష్ట్రంలో బీజేపీ ఇటువంటి పరిస్థితినే ఎదుర్కొంది. ఇప్పుడు తెలంగాణ ఎన్నికల ముంగిట కూడా అదే పరిస్థితిని రాష్ట్రంలో ఎదుర్కొంటున్నది. వచ్చే నెల మొదటి తేదీన ప్రధాని మోడీ తెలంగాణలో పర్యటించనున్నారు. హైదరాబాద్ లో అధికారిక కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం ఆయన మహబూబ్ నగర్ లో జరిగే పార్టీ బహిరంగ సభలో ప్రసంగిస్తారు. అప్పటి వరకూ వేచి చూసి ఆ తరువాత రాష్ట్రంలోని బీజేపీ అసమ్మతి నేతలు కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  ఇప్పటికే బీజేపీ అసంతృప్త నాయకులతో టీపీసీసీ చీఫ్ రేవంత్ టచ్ లో ఉన్నారని కూడా చెబుతున్నారు. 

By
en-us Political News

  
అధికారం కోల్పోయిన తరువాత ఇద్దరి వ్యవహార తీరు దాదాపు ఒకేలా ఉంటోంది. క్రియాశీల రాజకీయాలకు దూరంగా, ఇంకా స్పష్టంగా చెప్పాలంటే.. పార్ట్ టైమ్ పొలిటీషియన్లుగానే వ్యవహరిస్తూ వచ్చారు. ఇరువురూ కూడా పరాజయం తరువాత అసెంబ్లీకి డుమ్మా కొడుతూనే వచ్చారు. అలా అసెంబ్లీకి గైర్హాజర్ కావడానికి ఎవరి కారణాలు వారు చెప్పుకున్నా ఫలితం మాత్రం సభకు ఆబ్సెంట్ కావడమే.
తెలంగాణ అసెంబ్లీలో బీఆర్ఎస్ హయాంలో అంటే పదేళ్ల పాటు తెలంగాణ అసెంబ్లీ ప్రభుత్వ సమావేశం అన్నట్లుగా మారిపోయింది. విపక్ష సభ్యులకు మైక్ అన్నది అందని ద్రాక్షగా మారిపోయిన పరిస్థితి. అయితే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరిన తరువాత సభా నిర్వహణలో స్పష్టమైన మార్పు కానవచ్చింది. సభాసంప్రదాయాలకు, విలువలకు రేవంత్ సర్కార్ పెద్ద పీట వేసింది. అర్ధవంతమైన చర్చలు జరిగేందుకు అనుకూలమైన వాతావరణం ఏర్పడింది.
ఓట్ల కోసం చేసిన ప్ర‌జాధ‌నం ఖ‌ర్చు తోపాటు.. చేసింది చెప్పుకోడానికి అద‌న‌పు ఖ‌ర్చు కూడా భారీ ఎత్తున‌ జ‌రిగేది. ఇంతా చేసి తాను చేసింది చెప్పుకోలేక పోయానంటూ జగన్ ఆవేదన చెందడమేంటని నెటిజనులు తెగ శోధించారు.
సుదీర్ఘ విరామం తరువాత విపక్ష నేత హోదాలో కేసీఆర్ ఈ సమావేశాలకు హాజరయ్యారు. సభ ప్రారంభానికి ముందే ఆయన సభలో తనకు కేటాయించిన సీటులో కూర్చున్నారు. ఆ తరువాత అసెంబ్లీలోకి ప్రవేశించిన రేవంత్ రెడ్డి నేరుగా కేసీఆర్ స్థానం వద్దకు వెళ్లి ఆయనను ఆప్యాయంగా పలుకరించారు.
కొత్త జిల్లాల ఏర్పాటుకు ఆమోదం లభించే అవకాశాలున్నాయి. అలాగే కొత్త రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుపై కూడా చర్చ జరిపి నిర్ణయం తీసుకునే చాన్స్ ఉంది.
ఒక్కోసినిమాకు వంద కోట్ల రూపాయ‌ల వరకూ పారితోష‌కం తీసుకునే విజయ్ ఆ ఆదాయాన్ని వదులుకుని ప్రజా సేవకే అంకితం కావాలని డిసైడ్ అయ్యారనడానికి ఆయన సినిమాలకు గుడ్ బై చెప్పడమే నిదర్శనం.
2023 అసెంబ్లీ ఎన్నికలలో పార్టీ పరాజయం తరువాత ఆయన ఫామ్ హౌస్ నుంచి బయటకు వచ్చిన సందర్భాలను వేళ్ల పై లెక్కించవచ్చు. ఇక అసెంబ్లీకి అయితే.. కేవలం శాసనసభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేయడానికి మాత్రమే హాజర్యారని చెప్పవచ్చు.
ఇటీవలే చంద్రబాబు తన ఢిల్లీ పర్యటనలో నిర్మలా సీతారామన్ తో భేటీ అయిన సంగతి తెలిసిందే. కేంద్ర బడ్జెట్ ముందు స్వల్ప వ్యవధిలో చంద్రబాబు కేంద్ర విత్త మంత్రితో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.
శాస్త్ర సాంకేతికంగా దేశం అభివృద్ధి చెందడానికి కారణం ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీలేనని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు.
ఉపాధి హామీ పేరు మార్పుపై రేపు గ్రామ గ్రామాన గాంధీ చిత్రపటాలతో కాంగ్రెస్ నిరసన తెలుపుతున్నట్లు ప్రకటించారు
ప్రస్తుతం రేవంత్ కేబినెట్ లో రెండు ఖాళీలు మాత్రమే ఉన్నాయి. అయితే ఆ రెండు బెర్తులకు తీవ్ర పోటీ ఉంది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మల్ రెడ్డి రంగారెడ్డి, ఆది శ్రీనివాస్, బాలూనాయక్ ల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. వీరిలో గత ఏడాది కాలంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మల్ రెడ్డి రంగారెడ్డిలు బహిరంగంగానే తమకు మంత్రిపదవి ఖాయమన్న ప్రకటనలు చేస్తున్నారు. కొండొకచో.. ఎలాంటి దాపరికం లేకుండా తమ అసంతృప్తినీ వ్యక్తం చేస్తున్నారు.
తనను డిప్యూటీ స్పీకర్ పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేయడంపై రఘురామకృష్ణం రాజు మండిపడ్డారు. రాజ్యాంగ పదవిలో ఉన్నందున మౌనంగా ఉన్నానన్న ఆయన.. 11 కేసులున్న వ్యక్తి ముఖ్యమంత్రిగా చేయలేదా? అని ప్రశ్నించారు.
ఇప్పటికే తనను వైసీపీ నుంచి బహిష్కరించారనీ, ఇప్పుడు భౌతికంగా లేకుండా చేయడానికి ప్రయత్నిస్తున్నారంటూ ఆరోపణలు గుప్పించారు.దీన్నంతా ఓ వీడియోగా తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.