గులాబీకి గుచ్చుకున్న ముళ్లు!

Publish Date:Dec 5, 2020

Advertisement

ఓటమి బాధ్యత కేటీఆర్‌దే

 

అతి విశ్వాసమే కొంపముంచిందా?

 

సిట్టింగులకు ఇచ్చి తప్పు చేసిందా?

 

పద్మారావు ఇలాకాలోనే కారు క్లీన్‌స్వీప్

 

చక్రం తిప్పిన ‘డిప్యూటీ’ కొడుకులు

 

తలసాని నియోజకవర్గంలో తప్పిన గురి

 

ముషీరాబాద్, ఎల్బీనగర్‌లో పోయిన పరువు

 

అంచనాలు తల్లకిందులయ్యాయి. కారు జోరు మందగించింది. బీజేపీ దానికి అడుగడుగునా స్పీడు బ్రేకులుగా మారింది. సెంచరీ కొడతామన్న తెరాస నేతల బీరాలు బొక్కాబోర్లా పడ్డాయి. కాకపోతే.. ఏకైక పెద్ద పార్టీ అన్న గౌరవం ఒక్కటే దక్కించుకుంది. కేవలం నాలుగంటే నాలుగే సీట్లున్న బీజేపీ.. ఈసారి టీఆర్‌ఎస్‌కు ఏడు స్థానాలకు దగ్గరగా వచ్చిఆగింది. ఇది అధికార పార్టీకి శరాఘాతం కాదు. వజ్రాఘాతం! తెరాస అతి విశ్వాసానికి ఓ గుణపాఠం. కాంగ్రెస్‌ను పీకపిసికి, టీడీపీని తరిమివేసిన రాజకీయ వ్యూహం వికటించిన ఫలితంగా, బీజేపీ బాహుబలిగా అవతరించింది. ఇది తెరాస నాయకత్వ స్వయంకృతం.  కాంగ్రెస్‌ను బలహీనం చేయాలన్న కేసీఆర్ ఎత్తు.. చివరాఖరకు బీజేపీ రూపంలో... భవిష్యత్తులో తెరాసనే మింగేసే స్థాయికి చేరింది.

 

అత్యంత ఉత్కంఠ భరితంగా జరిగిన గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికల్లో, తెరాస సాంకేతికంగా అతిపెద్ద పార్టీగా అవతరించింది. కానీ నైతికంగా ఓడిపోయింది. గత ఎన్నికల్లో 99 స్థానాలు గెలిచి మీసం మెలేసిన టీఆర్‌ఎస్... ఈసారి బీజేపీ ఇచ్చిన పోటీ కి ఉక్కిరిబిక్కిరయి.. ఊపిరాడక... కేవలం 55 సీట్లకే చతికిలపడాల్సిన దుస్థితి. అంటే  44 స్ధానాలు కోల్పోయిన విషాదం. దీనికి కారణం కచ్చితంగా స్వయంకృతమేనన్నది తెరాస శ్రేణుల వాదన. దాదాపు 46 మంది సిట్టింగ్ కార్పొరేటర్లపై అవినీతి ఆరోపణలున్నా, స్థానిక ఎమ్మెల్యేల ఒత్తిళ్లకు లొంగి తిరిగి వారికే సీట్లిచ్చినందుకు ‘ఫలితం’ అనుభవించాల్సి వచ్చింది.

 

దాదాపు డివిజన్‌కు మూడు కోట్లు ఖర్చు పెట్టి, సర్వశక్తులూ ఒడ్డినా తెరాస.. తనకున్న 44 స్థానాలు నిలబెట్టుకోలేకపోయింది. ఈ ఎన్నికల్లో సర్వం తానయి నిలిచిన మంత్రి కేటీఆర్, ఈ ఫలితాలకు బాధ్యత వహించాల్సి ఉంటుంది. గత విజయానికి ఆయన బాధ్యత ఎంతో.. నేటి ఈ ‘నైతిక పరాజయాని’కీ ఆయనదీ అంతే బాధ్యత. అయితే, ఏకైక అతిపెద్ద పార్టీగా తెరాస అవతరించినా, 38 మంది ఎక్స్ అఫిషియో సభ్యులతోపాటు, మజ్లిస్‌కు వచ్చిన 44 కార్పొరేటర్లు, మరో పదిమంది ఎక్స్ అఫిషియో సభ్యులతో కలసి, తెరాస అభ్యర్ధి మేయర్ కావచ్చు. కానీ నైతికంగా మాత్రం ఆ పార్టీది పరాజయమే. నిజానికి 64 మంది కార్పొరేటర్లు ఉంటేనే తెరాసకు మేయర్ వస్తుంది. ఇప్పుడు ఆ మేజిక్ ఫిగర్‌కు ఆ పార్టీ చేరువ కాలేదు. అయితే మజ్లిస్‌తో చేయి కలిపి, మేయర్-డిప్యూటీ మేయర్లను ఆ పార్టీ చేజిక్కించుకోవచ్చు. కానీ.. రాజధాని నగరంలో ఒక ప్రతిపక్షం, తనకు సమీపంలో రావడం,  అధికార పార్టీకి  కచ్చితంగా ప్రమాదఘంటికనే.

 

గ్రేటర్  ఎన్నికల్లో తెరాస కొన్ని నియోజకవర్గాల్లో అసలు ఖాతానే తెరవకపోవడం అత్యంత విషాదం. సుధీర్‌రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్న ఎల్బీనగర్, ముఠా గోపాల్ ఎమ్మెల్యేగా ఉన్న ముషీరాబాద్‌లో తెరాస అసలు ఖాతానే తెరవకపోవడం అత్యంత విషాదం. ఇక్కడ కమలం వికసించింది. ఇక మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ ప్రాతినిధ్యం వహిస్తున్న సనత్‌నగర్‌లో తెరాస క్లీన్‌స్వీప్ చేస్తుందన్న అంచనాలు తల్లకిందులయ్యాయి. ఎందుకంటే ఆయనకు,  నిత్యం జనంలో అందుబాటులో ఉండే నేతగా పేరుంది. వ్యక్తిగతంగా చాలామందికి సాయం చేసే నాయకుడిగానూ పేరుంది. అయినా ఆ నియోజకవర్గంలో , మూడు డివిజన్లు కమలం ఖాతాలో కలవడం ఆందోళన కలిగించే అంశమే. అభ్యర్ధుల ఎంపికలో జరిగిన పొరపాట్లే దానికి కారణమంటున్నారు.

 

అయితే బేగంపేటలో ఓడిపోయే అభ్యర్ధిని గెలిపించడం  కొంతలో కొంత ఊరట. నిత్యం అందరికీ అందుబాటులో ఉండే తలసాని, తన నియోజకవర్గంలో ఎందుకు క్లీన్‌స్వీప్ చేయలేకపోయారన్న ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. ఇతర నియోజకవర్గాలతో పోలిస్తే, సనత్‌నగర్ నియోజవర్గంలోనే   తెరాస అభ్యర్ధులు ఎక్కువ ఖర్చు పెట్టారు. ఖర్చుకు ఎక్కడా వెనుకాడకుండా ఎన్నికల్లో దూసుకువెళ్లినా, తలసాని నియోజకవర్గంలో 3 సీట్లు బీజేపీకి రావడమే ఆశ్చర్యం.

ఇక మొత్తం తెరాస అభ్యర్ధులే క్లీన్‌స్వీప్ చేసిన ఘనత, డిప్యూటీ స్పీకర్ పద్మారావు ప్రాతినిధ్యం వహిస్తోన్న సికింద్రాబాద్‌కే దక్కుతుంది. ఈ ఎన్నికల్లో పార్టీపరంగా ఆయనే హీరోగా నిలిచారు. నగరమంతా బీజేపీ హవా సాగినా, సికింద్రాబాద్‌లో మాత్రం ఒక్క  సీటు కూడా సాధించ లేకపోయింది. ఈ విషయంలో పద్మారావు అందరికంటే ఒక మెట్టు పైనే ఉన్నారు. ఆయన తన కుమారులను అన్ని డివిజన్లలో మోహరింపచేశారు. వారికే ఇన్చార్జి బాధ్యతలు అప్పగించారు. ఆర్ధిక వనరుల వ్యవహారాన్ని పద్మారావు స్వయంగా చూశారు.

 

నిజానికి సికింద్రాబాద్‌లో తార్నాక, బౌద్ధనగర్, సీతాఫల్‌మండిలో తెరాస తొలి నుంచీ కొంత బలహీనంగా ఉంది. ముఖ్యంగా తార్నాకలో బీజేపీ విజయం ఖాయమని, టీఆర్‌ఎస్ వర్గాలే అంచనా వేశాయి. అయితే అక్కడ పద్మారావు తనయులే క్షేత్రస్థాయిలో రంగంలోకి దిగి, పరిస్థితులను తమకు అనుకూలంగా మార్చుకున్నారు. ముఖ్యంగా ప్రతిష్టాత్మకంగా మారిన బౌద్ధనగర్ డివిజన్‌లో,  తెరాస విజయం వెనుక పద్మారావు తనయుడి కృషి ఎక్కువగా ఉంది. అతనే అక్కడ తెరాస అభ్యర్ధికి రక్షకుడిగా మారారు. ఆరకంగా ఇప్పుడు  నగరంలో క్లీన్‌స్వీప్ చేసిన నేతగా పద్మారావు రికార్డు సృష్టించారు.

 

అయితే... గతంలో 99 సీట్లు సాధించిన తెరాస గురి ఈసారి దారుణంగా తప్పడం, బీజేపీ ఊహించని విధంగా తెరాసకు చేరువకావడమే ఆందోళన కలిగించే అంశం. అదికార పార్టీ 44 సిట్టింగు సీట్లను కోల్పోవడం, ఆషామాషీ వ్యవహారం కాదు. ప్రచారంలో తెరాస అతి విశ్వాసం, సమన్వయలోపం, అభ్యర్ధుల ఎంపికలో లెక్కలేనితనం, ప్రచారంలో బీజేపీ బలం- వ్యూహంపై చిన్నచూపు, కేటీఆర్ మినహా మరో ఇతర నేతలకు భాగస్వామ్యం లేకపోవడం వంటి అంశాలే తెరాస కొంపముంచాయన్నది నిష్ఠుర సత్యం. చివరాఖరకు సీఎం కేసీఆర్ సభ పెట్టినా, కారు జోరందుకోలేకపోయింది.

 

ఇటీవలి వరద సమయంలో కేసీఆర్ ప్రభుత్వం.. నిర్లక్ష్యంగా వ్యవహరించిందన్న ప్రజల ఆగ్రహాన్ని చల్లార్చడంలో తెరాస విఫలమయింది. ప్రభుత్వం తమను అనాధల్లా వదిలేసిందన్న ఆగ్రహాన్ని,  బీజేపీ సద్వినియోగం చేసుకుంది. వరద వచ్చిన ప్రాంతాల్లో టీఆర్‌ఎస్ ఓడిపోవడం బట్టి.. అక్కడి ప్రజల్లో ఆ పార్టీపై ఎంత అసంతృప్తి ఉందో స్పష్టమవుతోంది. ఎన్నికల తర్వాత పదివేల సాయం కొనసాగిస్తామని చెప్పినా, ప్రజలు నమ్మలేదంటే తెరాసపై నమ్మకం సన్నగిల్లుతున్నట్లే లెక్క.

 

ఇక చాలామంది సిట్టింగ్ కార్పొరేటర్లకే మళ్లీ సీట్లివ్వడం కూడా కారు కొంపముంచింది. ఇది తెరాస నాయకత్వ అంచనా లోపానికి పెనుమచ్చ. ఇళ్ల నిర్మాణాలు, స్థానిక పంచాయితీలలో వారు విచ్చలవిడితనంగా అవినీతికి పాల్పడుతున్నారన్న ఆరోపణలున్నా, మళ్లీ వారికే సీట్లివ్వడమే తెరాస పతనానికి ప్రధాన కారణమంటున్నారు. ఏదేమైనా..మళ్లీ నగరంలో పార్టీని పునర్నిర్మించుకోవాలన్న హెచ్చరిక సంకేతాలు, మితిమీరిన ఆత్మవిశ్వాసం పనికిరాదన్న సందేశాన్ని గ్రేటర్ ఎన్నికలు మిగిల్చాయి.

-మార్తి సుబ్రహ్మణ్యం

By
en-us Political News

  
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు.
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్ రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది. 80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది. ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది.
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు...
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది...
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో  తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది. 
​సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది...
జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు.
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు...
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి...
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  
నాలుగు రాష్టాలు అస్సాం, పశ్చిమ బెంగాల్ తమిళనాడు,కేరళ, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి శాసన సభలకు  మరో రెండు నెలల్లో ఎన్నికలు జరుగుతాయి. ఇది అందరికీ తెలిసిన విషయం.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.