Publish Date:Jan 27, 2025
వైసీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్ కు సుప్రీం కోర్టులో భారీ ఊరట లభించింది. జగన్ అక్రమాస్తుల కేసుల విచారణను తెలంగాణ నుంచి ఇతర రాష్ట్రాలకు తరలించాలన్న పిటిషన్ ను తోసి పుచ్చింది. జగన్ బెయిల్ ను రద్దు చేయాలన్న పిటిషన్ పై సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేయడంతో పిటిషనరే స్వయంగా దానిని ఉపసంహరించుకున్నారు. సోమవారం సుప్రీం కోర్టులో జరిగిన ఈ ఉదంతంలో జగన్ కు భారీ ఊరట లభించినట్లైంది. 2019 ఎన్నికల్లో వైసీపీ తరఫున నరసా పురం ఎంపీగా పోటీ చేసి విజయం సాధించిన రఘురామకృష్ణరాజు.. ఆ తర్వాత వైసీపీతో, జగన్ తో విభేదించారు. ఆ క్రమంలో ఆయన రెబల్ ఎంపీగా మారి జగన్ కు కొరకరాని కొయ్యిలా తయారయ్యారు.
ఈ క్రమంలోనే రఘురామ కృష్ణం రాజు జగన్ అరాచకపాలనను అడుగడుగునా ఎండ గడుతూ వచ్చారు. ఈ నేపథ్యంలోనే ఏపీ సీఐడీ జగన్ ను అరెస్టు చేసి కస్టడీలో చిత్రహింసలకు గురి చేసింది. ఆ తరువాత నుంచి మరింత రెబల్ గా మారారు. ఆ క్రమంలోనే జగన్ బెయిల్ ను రద్దు చేయాలని కోరుతూ సిబీఐ కోర్టు, తెలంగాణ హైకోర్టులను ఆశ్రయించారు. రెండు చోట్లా రఘురామ పిటిషన్లకు కోర్టులు తోసి పుచ్చాయి. దీంతో ఆయన సుప్రీం కోర్టును ఆశ్రయించారు. …జగన్ బెయిల్ ను రద్దు చేయడంతో పాటుగా ఆయన కేసుల విచారణను ఇతర రాష్ట్రాలకు బదిలీ చేయాలని కోరుతూ రెండు వేర్వేరు పిటిషన్లను దాఖలు చేశారు. ఆయన పిటిషన్లపై ఇప్పటికే పలుమార్లు విచారించిన కోర్టు తాజాగా సోమవారం (జనవరి 27) జగన్ కేసులను వేరే రాష్ట్రానికి బదలీ చేయాలన్న పిటిషన్ ను డిస్మిస్ చేసింది. ఇక జగన్ బెయిలు రద్దు చేయాలంటూ దాఖలైన పిటిషన్ ను కోర్టు ఆగ్రహం వ్యక్తం చేయడంతో రఘురామ తరఫు న్యాయవాది ఉపసంహరించుకున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/big-relief-to-jagan-in-supreme-25-191903.html
2019 ఎన్నికలలో వైసీపీ విజయంలో అప్పటి జగన్ పాదయాత్ర కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. అయితే అప్పట్లో.. జగన్ వాగ్దానాలపై ప్రజలలో నమ్మకం ఉండేది. ప్రజలతో ఆయన మమేకమయ్యేవారు.
రాష్ట్ర విభజన తరువాత తెలంగాణలో తెలుగుదేశం పార్టీ అధికార రేసులో లేకపోయినప్పటికీ.. రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేస్తూనే ఉంది. అందుకే రాష్ట్రంలో రాజకీయ వేడ రగిలిన ప్రతి సందర్భంలోనూ తెలుగుదేశం ప్రస్థావన వస్తూనే ఉంటుంది.
తెలంగాణ రాజకీయాల్లో గత కొన్ని రోజులుగా తీవ్ర దుమారం రేపుతున్న పరిణామాలు ఇప్పుడు అత్యంత ఆసక్తికర మలుపు తిరిగాయి.
తాజాగా ఆమె చేసిన వ్యాఖ్యలు ఆమె చూపు బీఆర్ఎస్ వైపు మళ్లిందా అన్న అనుమానాలకు తావిచ్చింది. కేబినెట్ నుంచి తనకు ఉద్వాసన పలికిన తరువాత మీడియాకు వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్న కొండా సురేఖ.. తాజాగా బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుపై ప్రశంసల వర్షం కురిపించారు.
పిడిక్కీ బియ్యానికీ ఒకే మంత్రం అన్నట్లుగా ఆమె తన బర్త్ రఫ్ కూ తెలుగుదేశం పార్టీకీ ముడి పెట్టారు. సీఎం రేవంత్ రెడ్డిది తెలుగుదేశం రక్తం కనుకనే తనకు కేబినెట్ నుంచి బర్త్ రఫ్ చేశారంటూ మీడియా సమావేశంలో కొండా సురేఖ చేసి కామెంట్స్ రాజకీయవర్గాలలో సంచలనంగా మారాయి.
ఈ ప్రాజెక్టుల నిర్మాణంలో తమ పాత్రే కీలకమని పేర్కొంటూ వైసీపీ క్రెడిట్ వార్ కు తెరతీసింది. సోషల్ మీడియా వేదికగా వైసీపీ వారు పోలవరం ప్రాజెక్టును దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి కలల ప్రాజెక్ట్గా అభివర్ణిస్తూ పోస్టులు షేర్ చేస్తోంది.
కోమటిరెడ్డి కుటుంబానికి నల్గొండ జిల్లాలో గట్టి పట్టు ఉంది. ఈ నేపథ్యంలో తాను కేవలం మంత్రి పదవిని మాత్రమే ఆశించే నాయకుడిని కాననీ.. వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకువెళ్లే నాయకుడిననీ ఆయన అంటున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అధికార కూటమి భాగస్వామ్య పక్షాలైన తెలుగుదేశం, జనసేన మధ్య సంబంధాలు పైకి కనిపించేంత సజావుగా లేవనే సంకేతాలు స్పష్టమవుతున్నాయి.
తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారిగా తీవ్ర కలకలం రేగింది
దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా బుధవారం (సెప్టెంబర్ 2) నిర్వహించిన ఒక ర్యక్రమంలో పాల్గొన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. తాము ఏనాడు కూడా పదవుల కోసం సిద్ధాంతాలను తాకట్టు పెట్టలేదంటూ.. వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయాల బాటలో నడిచేందుకు రాజకీయాల్లోకి ప్రవేశించామన్నారు.
ఆమె మాటలను బట్టి పరిశీలకులు కొండా సురేఖ పార్టీకీ, ఎమ్మెల్యే పదవికీ కూడా రాజీనామే చేసే అవకాశాలు కనిపిస్తున్నాయని విశ్లేషిస్తున్నారు. అదే జరిగితే.. ఆమె ప్రాతినిథ్యం వహిస్తున్న వరంగల్ తూర్పు నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమౌతుంది.
నా కూతురికి పెళ్లైంది.. తనకు తాను స్వతంత్రంగా మాట్లాడింది..!
ఉన్నది మాట్లాడితే చర్యలా.. సురేఖ సంచలన వ్యాఖ్యలు..!