రాష్ట్ర విభజన నుండి నేర్చుకోవలసిన గుణపాఠం

Publish Date:Mar 10, 2015

Advertisement

 

రాష్ట్ర విభజన వల్ల ఆంద్రప్రదేశ్ రాష్ట్రం ఆర్ధిక ఇబ్బందులలో చిక్కుకొంటే, తెలంగాణా రాష్ట్రం దేశంలో గుజరాత్ తరువాత రెండవ ధనిక రాష్ట్రంగా మారింది. ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం, తెలంగాణా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా దృవీకరించారు. ఆ ఆదాయంలో ప్రధానంగా హైదరాబాద్ మరియు దాని చుట్టుపక్కల నెలకొల్పబడిన వేలాది ఐటి మరియు ఇతర పరిశ్రమలు, వ్యాపార సంస్థల నుండే వస్తోందనే మాట కూడా అంతే యదార్ధం. అందుకే హైదరాబాద్ లేని తెలంగాణా మాకు అక్కరలేదని తెలంగాణావాదులు ఆనాడు పట్టుబట్టి మరీ సాధించుకొన్నారు. అదే వారికి నేడు అక్షయ పాత్రగా మారి ఆదుకొంటోందని చెప్పవచ్చును.

 

రాష్ట్ర విభజన జరిగితే తెలంగాణా రాష్ట్రం ఆర్ధికంగా బలపడుతుందని తాను ఆనాడే చెప్పానని కేసీఆర్ అన్నారు. ఆయన నిజంగా ఆ మాట అని ఉండి ఉంటే అది ఆయన దూరదృష్టికి నిదర్శనమని ఒప్పుకోక తప్పదు. కానీ పదేళ్లుగా తెలంగాణా ఉద్యమాలు ఉదృతంగా సాగుతున్నప్పటికీ రాష్ట్రాన్ని పాలించిన మహామహులయిన ఆంద్ర పాలకులెవరూ కూడా ఏదో ఒకనాడు రాష్ట్రం విడిపోతుందని, అప్పుడు హైదరాబాద్ ని వదులుకొని చేతిలో చిల్లిగవ్వ లేకుండా ఇలా నడిరోడ్డు మీద నిలబడే పరిస్థితి వస్తుందని ఊహించలేకపోవడమే చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. ఒక పక్క రాష్ట్ర విభజన కోసం ఉద్యామాలు జరుగుతుండటం కళ్ళార చూస్తూ కూడా వారు మేల్కొనకపోవడం చాలా ఆశ్చర్యం కలిగిస్తోంది. కనీసం పదేళ్ళ క్రితం నుండయినా ఆంధ్రాలో అన్ని జిల్లాలకు అభివృద్ధిని వికేంద్రీకరించే ప్రయత్నాలు మొదలుపెట్టి ఉండి ఉంటే నేడు ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి ఈ పరిస్థితి దాపురించి ఉండేదికాదు. కానీ పాలకులకి ఆ దూరదృష్టి లేకపోవడం వలన రాష్ట్రంలో మిగిలిన అన్ని జిల్లాలను పూర్తిగా విస్మరించి ఒక్క హైదరాబాద్ నగరాన్నే అభివృద్ధి చేసుకొంటూపోయారు.

 

కనుక ఈ పరిస్థితులకి ఇప్పుడు వారినే నిందించక తప్పదు. కానీ ఇప్పుడు చేతులు కాలాక ఆకులు పట్టుకొని వారిని నిందిస్తూ బాధపడటం కంటే మళ్ళీ అటువంటి ఘోరమయిన తప్పిదం చేయకుండా రాష్ట్రంలో 13 జిల్లాలకు సమానంగా అభివృద్ధిని విస్తరించే ప్రయత్నాలు చేయాలి. ఒకవేళ పాలకులు ఈ విషయాన్ని మళ్ళీ విస్మరించినా సమాజంలో మేధావులు ఈ విషయాన్ని సదా వారికి గుర్తు చేస్తుండటం చాలా అవసరం.

 

అయితే ఈ చేదు అనుభవం నుండి నేర్చుకోవలసిన మరో గుణపాటం కూడా ఉంది. అదేమిటంటే రాష్ట్రంలో కనీసం ఒక్క నగరాన్ని గట్టిగా అభివృద్ధి చేసినా అది యావత్ రాష్ట్రాన్ని ఆదుకొంటుందని తెలంగాణా రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి చూస్తే అర్ధమవుతోంది. బహుశః ఆ ఆలోచనతోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రపంచ స్థాయి రాజధాని నగరాన్ని నిర్మించాలని తహతహలాడుతున్నారు. అది కేవలం రాజధాని నగరంగా మాత్రమే కాకుండా రాష్ట్ర ఆర్ధిక రాజధానిగా తయారుచేయాలని ఆయన చాలాసార్లు చెప్పడం గమనిస్తే ఆయన చాలా దూరదృష్టితో ఆలోచించి ఈ నిర్ణయం తీసుకొన్నట్లు అర్ధమవుతోంది.

 

ఇప్పుడు హైదరాబాద్ నుండి వచ్చే ఆదాయాన్ని తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలో మిగిలిన అన్ని జిల్లాల అభివృద్ధికి ఏవిధంగా కేటాయిస్తున్నారో అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మించిన తరువాత దానిపై వచ్చే ఆదాయాన్ని రాష్ట్రంలో మిగిలిన అన్ని జిల్లాల అభివృద్ధికి కేటాయించినట్లయితే క్రమంగా అభివృద్ధి వికేంద్రీకరణ జరుగుతుంది.

 

కానీ అంతవరకు డబ్బు కోసం కటకటలాడక తప్పదు కనుక ఈలోగా రాష్ట్రానికి భారీగా ఆదాయం సమకూర్చగల ఐటి, పరిశ్రమలు, వ్యాపార సంస్థల స్థాపనకు ప్రభుత్వం చాలా చిత్తశుద్ధితో కృషి చేయవలసి ఉంటుంది. చంద్రబాబు నాయుడి ఆ దిశలో ఇప్పటికే చాలా గట్టిగా కృషి చేస్తున్నారు. ఆయన రాష్ట్రాన్ని ఈ కష్టాల నుండి ఏదో విధంగా ఒడ్డేక్కిస్తారనే అపారమయిన నమ్మకంతోనే రాష్ట్ర ప్రజలు తెదేపాకు అధికారం కట్టబెట్టారు. కనుక ఇటువంటి తీవ్ర వ్యతిరేక పరిస్థితులలో కూడా ఆయన రాష్ట్రాభివృద్ధి చేయవలసిన బాధ్యత వహిస్తున్నారు. కానీ దానర్ధం అన్నీ ముఖ్యమంత్రే చూసుకొంటారనే మంత్రుల, సంబంధిత అధికారుల భావన సరయినది కాదు. వారందరూ అటువంటి భావన నుండి బయటపడి ప్రతీ ఒక్కరు స్వయంగా చొరవ తీసుకోవలసిన అవసరం ఉంది. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనే పెద్దల మాటను సదా గుర్తుంచుకొని ప్రజా ప్రతినిధులు అందరూ కూడా తమ తమ నియోజక వర్గాలను వీలయినంత వేగంగా అభివృద్ధి చేసుకొంటే చాలు. రాష్ట్రం ఒడ్డున పడుతుంది.

By
en-us Political News

  
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు.
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్ రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది. 80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది. ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది.
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు...
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది...
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో  తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది. 
​సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది...
జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు.
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు...
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి...
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  
నాలుగు రాష్టాలు అస్సాం, పశ్చిమ బెంగాల్ తమిళనాడు,కేరళ, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి శాసన సభలకు  మరో రెండు నెలల్లో ఎన్నికలు జరుగుతాయి. ఇది అందరికీ తెలిసిన విషయం.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.