Publish Date:Nov 20, 2024
అగ్రరాజ్యం అమెరికా ఎన్నికల ఫలితం మూడో ప్రపంచ యుద్ధానికి తెరలేపిందా? అమెరికా అధ్యక్ష ఎన్నికలలో ట్రంప్ విజయాన్ని జీర్ణించుకోలేని బైడెన్.. ప్రపంచ యుద్ధానికి తెరలేపే నిర్ణయం తీసుకున్నారా? అంటే ప్రపంచ దేశాల మేధావులు అవుననే అంటున్నారు. బైడెన్ ఓటమి ఉక్రోషంతో తీసుకున్నా, వయస్సు రిత్యా వివేకం, వివేచనా కోల్పోయి తీసుకున్నా.. ఆయన నిర్ణయం ప్రపంచాన్ని మూడో ప్రపంచ యుద్ధం ముంగిట నిలిపింది. ఇంతకీ బైడెన్ ఏం చేశారంటే.. అమెరికా ఇచ్చిన క్షిపణులను ఉక్రెయిన్ రష్యాపై ప్రయోగించడానికి అనుమతి ఇస్తూ నిర్ణయం తీసుకున్నారు. దీంతో పుతిన్... అణ్వాయుధాలను యుద్ధంలో ఉపయోగించడానికి అనుమతి ఇస్తూ ఉత్తర్వ్యులు ఇచ్చేశారు. దీంతో ప్రపంచం అంతటా యుద్ధ మేఘాలు అలుముకున్నాయి. ఉక్రెయిన్ కు ఆయుధాలు సరఫరా చేసే ఏ దేశంపైనైనా దాడులు చేస్తామని పుతిన్ గతంలోనే హెచ్చరించిన సంగతి తెలిసిదే. ఆ సమయంలోనే ఆయన అణు దాడికి కూడా వెనుకాడబోమని విస్ఫష్టంగా చెప్పారు.
ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు బైడెన్ అధికారం నుంచి దిగిపోవడానికి సరిగ్గా రెండు నెలల ముందు తమ దేశం సరఫరా చేసిన క్షిపణులను రష్యాపై ప్రయోగించడానికి ఉక్రెయిన్ కు అనుమతి ఇచ్చేశారు. దీంతో మండిపడిన పుతిన్ అణ్వాయుధాల వినియోగానికి తమ సైన్యానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. వాస్తవానికి ట్రంప్ ఎన్నికలలో గెలవడానికి ప్రధాన కారణం తాను అధికారంలోకి వస్తే రష్యా, ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపేస్తానని ఇచ్చిన హామీయే అని చెప్పడానికి సందేహించాల్సిన అవసరం లేదు. పుతిన్, ట్రంప్ ల మధ్య సత్సంబంధాలు ఉన్నాయి. దీంతో అమెరికన్లు ఆయన అధికార పగ్గాలు చేపడితే రష్యా, ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపగలరని నమ్మారు. అదే సమయంలో ట్రంప్ కు ప్రత్యర్థిగా అమెరికా ఎన్నికలలో పోటీ చేసిన బైడెన్ విధానాల కారణంగానే ఓటమి పాలయ్యారు. బైడెన్ అమెరికా అధ్యక్ష పగ్గాలు చేపట్టిన నాటి నుంచీ ఇజ్రాయెల్ కు మద్దతుగా నిలిచారు. పరోక్షంగా పాలస్తీనా, ఇజ్రాయెల్ మధ్య యుద్ధాన్ని ప్రోత్సహించారు.
ఈ నేపథ్యంలోనే ప్రపంచానికి పెద్దన్నగా తనకు తాను చెప్పుకునే అమెరికా ఉక్రెయిన్ కు తన క్షిపణుల వినియోగానికి అనుమతించడం ద్వారా రష్యాను ఉద్దేశపూర్వకంగా రెచ్చగొట్టిందని ప్రపంచ దేశాలు భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ అధికార పగ్గాలు చేపట్టేంత వరకూ రష్యా, ఉక్రెయిన్ల మధ్య ఉద్రిక్తతలు, పరస్పర దాడులు పెచ్చరిల్లకుండా ఇరు దేశాలు నియంత్రణ పాటించాలని ప్రపంచ దేశాలు కోరుతున్నాయి.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/biden-provoke-putin-39-188698.html
పార్టీ అధిష్టానం సీఎఉం మాటకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో, ఆయనకు వ్యతిరేకంగా అసమ్మతి గళం ఎత్తే సీనియర్ నేతలకూ అంతే ప్రాధాన్యత ఇస్తుంది. దీంతో కాంగ్రెస్ సీఎం ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుంది. కాంగ్రెస్ అధికారంలో ఉన్న పార్టీ సీఎంలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఇదేనని చెప్పాలి.
ఒక్క ఆంధ్రప్రదేశ్ అనే కాదు.. దేశంలోని అన్ని రాష్ట్రాలలోనూ సొంత కాళ్లపై నిలబడాలన్నదే బీజేపీ విధానమని విష్ణువర్ధన్ రెడ్డి చెప్పారు. గతంలో ఏపీలో బీజేపీ మద్దతు వల్లే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందనీ, ఈ వాస్తవాన్ని సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ బహిరంగ వేదికలపై స్పష్టంగా చెప్పారని విష్ణువర్ధన్ రెడ్డి గుర్తు చేశారు.
రాయలసీమను హార్టికల్చర్ హబ్గా తీర్చిదిద్దేందుకు, రాష్ట్రంలో ఇరిగేషన్ సదుపాయాలను మెరుగుపరిచేందుకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పకడ్బందీ ప్రణాళికలతో ముందుకు వెళ్తోందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు ఒక్కొక్కటిగా పూర్తవుతుండటంతో, ఇరిగేషన్ రంగంపై మాట్లాడటానికి ప్రతిపక్షానికి ఎలాంటి అవకాశాలు లేకుండా పోయాయని ఆయన కుండబద్దలు కొట్టారు.
జలయజ్ణం పేరుతో వైఎస్ చేసింది ధనయజ్ణమని విక్రమ్ పూల అన్నారు. ప్రాజెక్టుల అంచనా వ్యయం పెరగడం, ప్రాంతీయ సమతుల్యత లోపించడం, హెడ్ వర్క్స్ కంటే ముందుగా కాలువల తవ్వకం వంటి వాటికే వైఎస్ జలయజ్ణం పరిమితమైందని విక్రమ్ పూల వివరించారు.
కాంగ్రెస్ హైకమాండ్ మీనాక్షీ నటరాజన్ పై వేటు వేయాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు. రాహుల్ గాంధీ నేతృత్వంలోని జాతీయ నాయకత్వం రాష్ట్రంలో కాంగ్రెస్ వ్వవహారాలను చక్కదిద్దేందుకు భూపేష్ బగెల్ సమర్ధంగా పని చేయగలరని భావించి ఆ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.
తాను పూర్తిగా రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాననీ, వచ్చే ఎన్నికలలో పోటీ చేయననీ ఆయన చేసిన ప్రకటన పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. తెలుగుదేశం ఆవిర్భావం నుంచీ కూడా ప్రజా ప్రతినిథిగా, పొలిటికల్ లీడర్ గా సేవలందించిన అయ్యన్న పాత్రుడు హఠాత్తుగా రాజకీయాలకు రిటైర్మెంట్ అంటూ చేసిన ప్రకటన రాజకీయవర్గాలలో సంచలనం సృష్టించింది.
2019 ఎన్నికలలో వైసీపీ విజయంలో అప్పటి జగన్ పాదయాత్ర కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. అయితే అప్పట్లో.. జగన్ వాగ్దానాలపై ప్రజలలో నమ్మకం ఉండేది. ప్రజలతో ఆయన మమేకమయ్యేవారు.
రాష్ట్ర విభజన తరువాత తెలంగాణలో తెలుగుదేశం పార్టీ అధికార రేసులో లేకపోయినప్పటికీ.. రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేస్తూనే ఉంది. అందుకే రాష్ట్రంలో రాజకీయ వేడ రగిలిన ప్రతి సందర్భంలోనూ తెలుగుదేశం ప్రస్థావన వస్తూనే ఉంటుంది.
తెలంగాణ రాజకీయాల్లో గత కొన్ని రోజులుగా తీవ్ర దుమారం రేపుతున్న పరిణామాలు ఇప్పుడు అత్యంత ఆసక్తికర మలుపు తిరిగాయి.
తాజాగా ఆమె చేసిన వ్యాఖ్యలు ఆమె చూపు బీఆర్ఎస్ వైపు మళ్లిందా అన్న అనుమానాలకు తావిచ్చింది. కేబినెట్ నుంచి తనకు ఉద్వాసన పలికిన తరువాత మీడియాకు వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్న కొండా సురేఖ.. తాజాగా బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుపై ప్రశంసల వర్షం కురిపించారు.
పిడిక్కీ బియ్యానికీ ఒకే మంత్రం అన్నట్లుగా ఆమె తన బర్త్ రఫ్ కూ తెలుగుదేశం పార్టీకీ ముడి పెట్టారు. సీఎం రేవంత్ రెడ్డిది తెలుగుదేశం రక్తం కనుకనే తనకు కేబినెట్ నుంచి బర్త్ రఫ్ చేశారంటూ మీడియా సమావేశంలో కొండా సురేఖ చేసి కామెంట్స్ రాజకీయవర్గాలలో సంచలనంగా మారాయి.
ఈ ప్రాజెక్టుల నిర్మాణంలో తమ పాత్రే కీలకమని పేర్కొంటూ వైసీపీ క్రెడిట్ వార్ కు తెరతీసింది. సోషల్ మీడియా వేదికగా వైసీపీ వారు పోలవరం ప్రాజెక్టును దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి కలల ప్రాజెక్ట్గా అభివర్ణిస్తూ పోస్టులు షేర్ చేస్తోంది.
కోమటిరెడ్డి కుటుంబానికి నల్గొండ జిల్లాలో గట్టి పట్టు ఉంది. ఈ నేపథ్యంలో తాను కేవలం మంత్రి పదవిని మాత్రమే ఆశించే నాయకుడిని కాననీ.. వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకువెళ్లే నాయకుడిననీ ఆయన అంటున్నారు.