ప్రజాక్షేత్రంలో భువనేశ్వరి.. బ్రహ్మరథం పడుతున్న జనం

Publish Date:Feb 7, 2024

Advertisement

నారా భువనేశ్వరి నిజం గెలవాలి యాత్రకు జనం బ్రహ్మరథం పడుతున్నారు. తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబునాయుడి సతీమణి, పార్టీ ప్రధాన కార్యదర్శి లోకేష్ తల్లి,  పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు దివంగత ఎన్టీఆర్ కుమార్తె అయిన భువనేశ్వరి ఇంత కాలం ప్రజాక్షేత్రంలో పని చేసింది లేదు. రాజకీయాల్లోకి అడుగుపెట్టింది లేదు.  కుటుంబ వ్యాపారాలను చూసుకుంటూ  ఉన్నారు. అయితే అధికార వైసీపీ కుట్ర, కక్ష పూరిత విధానాలతో  తన భర్త, తెలుగుదేశం అధినేత, మాజీ ముఖ్యమంత్రి అయిన చంద్రబాబునాయుడి అరెస్టుతో ఆమె జనం మధ్యకు వచ్చారు. తన కుటుంబాన్ని కక్షపూరిత విధానాలతో అధికార జగన్ పార్టీ వేధిస్తోందని గళమెత్తారు.  స్కిల్ కేసులో చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేయడాన్ని వ్యతిరేకిస్తూ ఆమె తొలి సారి ప్రజల మధ్యకు వచ్చారు.  

14 ఏళ్లు ముఖ్యమంత్రిగా, దాదాపు అంతే కాలం విపక్ష నేతగా, గత నాలుగు దశాబ్దాలుగా దేశ రాజకీయాలలో   ప్రతి మలుపులోనూ క్రియాశీలంగా వ్యవహరించి , దార్శనికుడిగా దేశ, విదేశాల గుర్తింపు పొందిన నాయకుడు చంద్రబాబును కనీసం నోటీసులు లేకుండా, చార్జిషీట్ లో పేరు లేకుండా అర్ధరాత్రి అరెస్టు చేసిన తీరు పట్ల సర్వత్రా నిరసనలు, ఆగ్రహ జ్వాలలూ వ్యక్తం అయ్యాయి. ఆయన అరెస్టుకు కలత చెంది రాష్ట్రంలో పలువురు అసువులు బాశారు. అటువంటి వారి కుటుంబాలను పరామర్శించేందుకు నారా భువనేశ్వరి  నిజం గెలవాలి పేరుతో యాత్ర చేపట్టిన సంగతి తెలిసిందే. ఇప్పటికే రెండు విడతలుగా నిజం గెలవాలి యాత్ర చేసిన భువనేశ్వరి.. చంద్రబాబు అరెస్టుతో కలత చెంది ప్రాణాలు వదిలిన వారి కుటుంబాలను పరామర్శించారు. ఆర్థిక సమాయం అందజేశారు.  మూడో విడత యాత్రలో భాగంగా నారా భువనేశ్వరి మంగళవారం  మంగళగిరి నియోజకవర్గంలో పర్యటించారు. ఆమెకు నియోజకవర్గంలో ఘనస్వాగతం లభించింది.  భువనమ్మ పరామర్శించే ప్రతి కార్యకర్త కుటుంబం వద్ద పార్టీ శ్రేణులు, కార్యకర్తలు, మహిళలు, యువత పెద్దఎత్తున భువనమ్మకు ఘన స్వాగతం పలికారు. నిజం గెలవాలి….నిజమే గెలవాలి అంటూ పెద్దఎత్తున నినాదాలు చేశారు. మంగళగిరి పట్టణంలో మహిళలు భువనమ్మకు హారతులు పట్టారు. పెనుమాక గ్రామంలో భువనమ్మకు మహిళలు బ్రహ్మరథం పట్టారు. పెనుమాక సెంటర్లోని ఎన్టీఆర్ విగ్రహానికి భువనమ్మ పూలమాల వేసి నివాళులు అర్పించారు. తనకు పెద్దఎత్తున సంఘీభావం తెలిపిన పెనుమాక గ్రామస్తులకు ధన్యవాదాలు తెలిపారు. భువనమ్మ పర్యటన ప్రారంభం నుండి ముగింపు వరకు యువత పెద్దఎత్తున కేరింతలు కొడుతూ భువనమ్మకు తోడుగా  నడిచారు. భువనమ్మ పర్యటించిన 7 గ్రామాలతో పాటు పెదవడ్లపూడి, దుగ్గిరాల, రేవేంద్రపాడు, మంగళగిరి పట్టణం, పెనుమాక గ్రామాల ప్రజలు భువనమ్మకు ఘనస్వాగతం పలికారు. మంగళగిరి నియోజకవర్గంలో పర్యటించిన భువనమ్మ తనకు సంఘీభావం తెలిపేందుకు వచ్చిన పార్టీ కార్యకర్తలు, అభిమానులు, మహిళలు, యువతకు కృతజ్ఞతలు తెలుపుతూ ముందుకు సాగారు. 

అయితే వాస్తవానికి భువనేశ్వరి నిజం గెలవాలి యాత్ర కంటే ముందే ప్రజల ముందుకు వచ్చారు. పార్టీ ముఖ్యులతో చర్చలు జరిపారు. అదెప్పుడంటే..  స్కిల్ కేసులో చంద్రబాబు అరెస్టు ,  ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు అంటూ నారా లోకేష్ ను వేధింపులకు గురి చేస్తుంటే.. ఆ సమయంలో పార్టీని ముందుండి నడిపించేందుకు, ఎన్నికలకు సమాయత్తం చేసేందుకు ఆమె కొంగు బిగించారు.   అరెస్టులు, కేసులు, వేధింపుల కారణంగా అప్పట్లో చంద్రబాబు కానీ, లోకేష్ కానీ ప్రజాక్షేత్రంలోకి వచ్చేందుకు కొంత సమయం పడుతునందన్న ఊహాగానాల నేపథ్యంలో  నారా భువనేశ్వరి ముందుకు దూకారు. పార్టీని ముందుండి నడిపించేందుకు సంసిద్ధు రాలయ్యారు. ఆమెతో పాటు కోడలు అంటే నారా లోకేష్ సతీమణి బ్రాహ్మణి సైతం మీడియా ముందుకు వచ్చి రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులపై అనర్గళంగా ప్రసంగించారు. అలాగే నారా భువనేశ్వరి పార్టీ నేతలతో సమాలోచనలు జరిపారు. చంద్రబాబు అరెస్టుకు వ్యతిరేకంగా ర్యాలీకి సైతం రెడీ అయ్యారు. చంద్రబాబు నిర్బంధంలో ఉన్న సమయంలో రాజమహేంద్రవరం వేదికగా నారా భువనేశ్వరి పార్టీ వ్యవహారాలను పర్యవేక్షించారు. 
 కుటుంబ వ్యాపారం చూసుకోవడం తప్ప   గతంలో ఎన్నడూ రాజకీయాలతో సబంధం లేకుండా ఉన్న భువనేశ్వరి పార్టీ సమావేశాలలో పాల్గొన్నారు. అలాగే చంద్రబాబు అరెస్టును వ్యతిరేకిస్తూ దీక్షలు, ఆందోళనలు చేస్తున్న వారిని కలిసి వారితో మాట్లాడారు. రొటీన్ రాజకీయ ప్రసంగాలకు భిన్నంగా  సూటిగా  తడబాటు, తొట్రుపాటు లేకుండా చంద్రబాబు అరెస్టు ఎంత అక్రమమో, ఎంత అప్రజాస్వామికమో వివరించారు. అదే సమయంలో జగన్ సర్కార్ అకృత్యాలు, అక్రమాలను ధైర్యంగా ఎండగట్టారు. తెలుగుదేశం పార్టీకి నాయకత్వ సమస్య రాదనీ, తాను ఉన్నాననీ పార్టీ శ్రేణులకు భరోసా ఇచ్చారు. మాటలకే పరిమితం కాకుండా  చేతలలో కూడా కూడా పార్టీకి అండదండగా ఉంటామన్న ధైర్యాన్నీ, ధీమాను ఇచ్చారు.   ఇప్పుడు ఏకంగా ప్రజాక్షేత్రంలో పర్యటనలు చేస్తున్నారు. వారితో ముఖాముఖీ మాట్లాడుతున్నారు. సౌమ్యంగానే అయినా సూటిగా జగన్ ప్రభుత్వం అరాచకాలు, అకృత్యాలు, అవినీతి, అక్రమాలను ఎండగడుతున్నారు. 

By
en-us Political News

  
మేడారంలో తెలంగాణ మంత్రివర్గం సమావేశం కానుంది. ఈ నెల 28 నుంచి మేడారం జాతర ప్రారంభం కానున్న నేపథ్యంలో మేడారం వేదికగా కేబినెట్ సమావేశం నిర్వహించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది.
పండగైనా, పబ్బమైనా చంద్రబాబుకు ప్రజా సమస్యల పరిష్కారంపైనే దృష్టి ఉంటుందన్న సంగతి తెలిసిందే. అలాగే ప్రగతి అడుగులు నెమ్మదించకూడదన్న పట్టుదలా ఉంది.
జగన్ హయాంలో సకల శాఖల మంత్రిగా వెలుగు వెలిగిన సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సచివాలయాల నిర్మాణాలను పోలుస్తూ ప్రజలను తప్పుదోవపట్టించే ప్రయత్నం జరుగుతోందన్నారు. రెండింటినీ పోల్చి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిద్దామని చూస్తున్న వారిది అవగాహనా రాహిత్యమని చెప్పారు.
పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ లో జనసేన, తెలుగుదేశం, బీజేపీ కూటమి అధికారంలో ఉంది. ఇక జాతీయ స్థాయిలో కూడా ఎన్డీయే కూటమిలో తెలుగుదేశం, జనసేన భాగస్వామ్య పార్టీలు. ఈ నేపథ్యంలో తెలంగాణలో జనసేనతో తమ పార్టీ పొత్తు ఉండదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ప్రకటించడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయాలని నిర్ణయించింది.
2026 లో రాజ్యసభ నుంచి ఈ ఏడాదిలో ఏకంగా 73 మంది రిటైర్డ్ కానున్నారు.
అమరావతి విషయంలో జగన్ దృక్ఫథంలో ఇసుమంతైనా మార్పు లేదు. ప్రపంచ స్థాయి రాజధాని నిర్మాణం జరిగితే చంద్రబాబు పేరు చిరస్థాయిగా చరిత్రలో నిలిచిపోతుందన్న దుగ్ధతోనే ఆయన అమరావతిపై ఇప్పటికీ కుట్రలు చేస్తున్నారన్నది రాజకీయవర్గాల టాక్.
పశ్చిమబెంగాల్ అసెంబ్లీకి ఈ ఏడాది ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బీజేపీ ప్రత్యర్థులను అణచివేయడానికి ఈడీ వంటి దర్యాప్తు సంస్థలను ఆయుధాలుగా ప్రయోగిస్తోందని ధ్వజమెత్తారు.
జగన్ ఇలా నేర ప్రవృత్తి ఉన్న వారిని ప్రోత్సహించడం, వారికి మద్దతుగా నిలవడం ఇదే తొలిసారి కాదు. గ‌తంలో ఓ యువ‌కుడు ర‌ప్పా ర‌ప్పా అంటూ ఫ్లెక్సీలు క‌ట్టి త‌న ర్యాలీలో పాల్గొన్న‌పుడే జ‌గ‌న్ వారించాల్సింది. కానీ అలా చేయ‌లేదు స‌రిక‌దా? ర‌ప్పా ర‌ప్పా అంటూ గంగ‌మ్మ జ‌త‌ర‌లో పొట్టేలు న‌రికిన‌ట్టు న‌రుకుతామ‌న‌డంలో త‌ప్పేంట‌ని మీడియానే ఎదురు ప్ర‌శ్నించారు. దీంతో వైసీపీయులు బ‌రితెగించేశారు. ఆయ‌న‌కేం ఎన్ని కేసులున్నా వాయిదాల మీద వాయిదాలు కోరుతూ బెయిలు మీద బ‌య‌ట తిరగగలరు. ఆ స్థాయి ఇన్ ఫ్లుయెన్స్, ఆర్థిక దన్ను ఆయనకు ఉంది.
ఇక్కడే కవిత రాజకీయ అడుగులు బీఆర్ఎస్ ఉనికిని ప్రశ్నార్ధకం చేసేలా ఉన్నాయన్న విశ్లేషణలు వెలువడుతున్నాయి. ఎందుకంటే.. ఆమె ఇటీవల ఏర్పాటు చేసిన కమిటీల లక్ష్యమేంటంటే.. తెలంగాణ ఆవిర్భావం తరువాత పదేళ్ల పాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాల అధ్యయనం.
పోలవరం-నల్లమల సాగర్ ప్రాజెక్టుపై తెలంగాణ అభ్యంతరాలు, రాయలసీమ ఎత్తిపోతల పథకంపై జరుగుతున్న వివాదాలను ప్రస్తావించారు. కొందరు వివాదాలు సృష్టించడమే లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు.
ఇరు రాష్ట్రాల మధ్యా జలవివాదాలు ఉండకూడదన్న లక్ష్యంతోనే నాడు కాంగ్రెస్ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రానికి పచ్చ జెండా ఊపిందన్న రేవంత్ రెడ్డి, రాజకీయాలకు అతీతంగా నీటి వివాదాలను ఇరు రాష్ట్రాలూ పరిష్కరించుకోవాలన్నారు.
వాస్తవాలకు ఎలాంటి ముసుగులూ తగిలించకుండా ఉన్నది ఉన్నట్లు, కుండబద్దలు కొట్టినట్లుగా సమాజం తీరు తెన్నులను, రాజకీయ నాయకుల మధ్య నెక్సస్ ను, అధికారులు బాధ్యతారాహిత్యం, జవాబుదారీతనం లేని తనాన్ని కళ్లకు కట్టిన వాస్తవ ‘వేదిక’ తెలుగువన్ యూట్యూబ్ చానెల్ లో గురువారం ప్రసారమైంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.