తిరుపతిలో భూమన ఆధిపత్యం, పలుకుబడి హుష్ కాకీ!

Publish Date:Feb 4, 2025

Advertisement

తిరుపతిలో భూమన కరుణాకర్ రెడ్డి ఆధిపత్యానికి చెక్ పడిందా? ఆయన పలుకుబడి పలుచనయ్యిందా? అంటే పరిశీలకులు ఔననే అంటున్నారు. తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ ఎన్నికలలో ఆయన తన సర్వశక్తులూ ఒడ్డి మరీ వైసీపీ అభ్యర్ధి విజయం కోసం పాటుపడ్డారు. అయితే ఆయన శ్రమంతా బూడిదలో పోసిన పన్నీరు చందంగా మారింది. ఎన్ని ఎత్తులు వేసినా, ఎన్ని వ్యూహాలు పన్నినా ఆయన అనుకున్నది సాధించలేకపోయారు. డిప్యూటీ మేయర్ ఎన్నికలో తెలుగుదేశం అభ్యర్ణి మునికృష్ణ సునాయాస విజయం సాధించారు. మునికృష్ణకు 26 మంది, వైసీపీ అభ్యర్థి భాస్కర్ రెడ్డికి 21 మంది కార్పొరేటర్లు మద్దతు ఇవ్వడంతో భూమనకరుణాకరరెడ్డికి భంగపాటు తప్పలేదు.

తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ గా ఉన్న భూమన కరుణాకర్ రెడ్డి కుమారుడు భూమన అభినయ్ రెడ్డి గత ఎన్నికల ముందు తిరుపతి ఎమ్మెల్యేగా పోటీ చేశారు. అలా పోటీ చేయడం కోసం డిప్యూటీ మేయర్ పదవికి రాజీనామా చేశారు. అయితే విజయం సాధించడంలో విఫలమయ్యారు. అప్పుడు ఆయన రాజీనామా చేయడంతో ఖాళీ అయిన డిప్యూటీ మేయర్ పదవికి ఇప్పుడు ఎన్నిక జరిగింది. ఆ ఎన్నికలలో తన కుమారుడి రాజీనామాతో ఖాళీ అయిన స్థానంలో వైసీపీ అభ్యర్థినే గెలిపించడం కోసం భుమన కరుణాకరరెడ్డి చేసిన ప్రయత్నం విఫలమైంది. 

ఈ ఓటమిని జీర్ణించుకోలేని భూమన కరుణాకర్ రెడ్డి ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడిందనీ, అధికార మదంతో తెలుగుదేశం కార్పొరేటర్లను కిడ్నాప్ చేసి మరీ తమ వైపునకు తిప్పుకుందనీ ఆరోపణలు గుప్పిస్తున్నారు. అదే సమయంలో గతంలో అంటే 2021లో అభినయ్ రెడ్డిని డిప్యూటీ మేయర్ గా గెలిపించుకోవడానిక భూమన కరుణాకరరెడ్డి ఓటర్ల జాబితాలోకి నకిలీ ఓటర్లను చేర్చారనీ, తమిళనాడు నుంచి జనాలను తీసుకువచ్చి ఓట్లు వేయించారని ఆరోపణలు వెల్లువెత్తిన విషయాన్ని ఇక్కడ కన్వీనియెంట్ గా మర్చిపోయారు.

ఈ ఆరోపణల విషయాన్ని పక్కన పెడితే ఈ ఓటమి తిరుపతిలో భూమన కరుణాకరరెడ్డి ఆధిపత్యానికి ఫుల్ స్టాప్ పడిందని చెప్పవచ్చని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. భూమన కరుణాకర్ రెడ్డి తుడా చైర్మన్ గా 2004 నుంచి 2006 వరకూ చేశారు. ఆ తరువాత 2006 నుంచి 2008 వరకూ తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ గా పని చేశారు.  2009లో తిరుపతి నుంచి అసెబ్లీకి పోటీ చేసి చిరంజీవి చేతిలో పరాజయం పాలయ్యారు. అయితే 2012లో చిరంజీవి తిరుపతి ఎమ్మెల్యేగా రాజీనామా చేయడంతో వచ్చిన ఉప ఎన్నికలో పోటీ చేసి భూమన విజయం సాధించారు. ఆ తరువాత 2014 ఎన్నికలలో ఓడిపోయినప్పటికీ 2019 ఎన్నికలలో తిరుపతి నుంచి విజయం సాధించారు. 2023లో మళ్లీ తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ గా జగన్ ఆయనకు అవకాశం ఇచ్చారు. ఇక 2024 ఎన్నికలలో భూమన కరుణాకరరెడ్డి తాను పోటీ నుంచి తప్పుకుని తన కుమారుడు అభినయ్ రెడ్డిని తిరుపతి నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీలోకి దించారు. అయితే ఆ ఎన్నికలో అభినయ్ రెడ్డి పరాజయం పాలయ్యారు. 

అయితే గెలుపు ఓటములతో సంబంధం లేకుండా 2004 నుండి తిరుపతిపై పూర్తి ఆధిపత్యం చెలాయిస్తూ వచ్చిన భూమనకు 2024లో వైసీపీ ఘోర పరాజయంతో ఇబ్బందులు మొదలయ్యాయి. ఇప్పుడు డిప్యూటీ మేయర్ ఎన్నికలలో వైసీపీ అభ్యర్థిని గెలిపించుకోవడంతో విఫలమవ్వడంతో ఆయన ఆధిపత్యం, పలుకుబడి పూర్తిగా దిగజారిపోయినట్లేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.   

By
en-us Political News

  
రాఘవ్ చద్దా, ఆమ్ ఆద్మీ పార్టీ మధ్య తలెత్తిన అంతర్గత విభేదాలు ఇప్పుడు బహిరంగ యుద్ధంగా మారాయి.
న్ని ఎన్నికలలో విచిత్రాలు జరగవు. ప్రతిసారీ ఒకటే జరిగితే, దాన్ని విచిత్రం అనరు కదా? ఎన్నికలు జరిగి నిండా రెండేళ్లు కాకముందే నెల్లూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీకి ఓటి పలుకు వినపడుతున్నది. కొందరు ప్రముఖులు పక్కదారులు చూస్తున్నారని, పక్క పార్టీతో బేరసారాలు జరుపుతున్నారని కూడా వినపడుతున్నది.
అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో.. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి తన పంథాను మార్చుకోలేదనేది స్పష్టమవుతోంది. ఐదేళ్ల పాలనలో మూడు రాజధానుల మంత్రం జపించిన జగన్.. ఇప్పుడు మచిలీపట్నం-విజయవాడ-గుంటూరును కలిపి ఒక మెగా సిటీగా మార్చాలనే సరికొత్త ప్రతిపాదనను ముందుకు తెచ్చారు.
మూడు రాజధానుల అంశం గత ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయానికి ప్రధాన కారణాలలో ఒకటి అన్న విషయాన్ని విస్మరించి.. మళ్ళీ అదే తరహా ప్రత్యామ్నాయ వాదనలు వినిపించడం పట్ల రాజకీయవర్గాలలో విస్మయం వ్యక్తమౌతోంది. పార్టీ కేడర్ సైతం మావిగన్ ఏంటి అదేదో పంటకు పట్టే తెగుల్లా ఉందని నెత్తీ నోరూ బాదుకుంటోంది.
ఆ రోజు సభలో ఓ మంత్రి తనపై చెయ్యి చేసుకున్నారని పేర్కొన్నారు. మరో మంత్రి ఏకవచనంతో తిట్టిపోశారు, కులం పేరుతో దూషిస్తూ తన పుట్టుకను నిందించారన్నారు. శాసనమండలిలో తన సిబ్బందినీ దగ్గరికి రాకుండా వైసీపీ సభ్యులు అడ్డుపడ్డారని, తన చుట్టూ చేరి బెదిరింపులు, ప్రలోభాలతో రకరకాలుగా ఇబ్బంది పెట్టారన్నారు.
ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాలకు 5 కోట్ల మంది ప్రజల తరఫున కృతజ్ణతలు తెలిపారు. దేశం మొత్తానిది ఒక దారైతే... తమదో దారి అన్నట్లు వైసీపీ వ్యవహరించిందని దుయ్యబట్టారు. రాష్ట్రం, దేశం నాశనమైనా పర్వాలేదు.. మాకు స్వార్థ రాజకీయమే ముఖ్యమన్నట్లుగా వైసీపీ వ్యవహరించిందని విమర్శించారు.
ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో డ్రగ్స్ సంస్కృతి ఒక పెను సవాలుగా మారింది. ఇటీవలి కాలంలో రాజకీయ నాయకులు, ప్రముఖుల పేర్లు డ్రగ్స్ కేసుల్లో వినిపిస్తుండటం సమాజంలో తీవ్రసంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. వాస్తవ వేదిక చర్చలో డోలేంద్ర ప్రసాద్, కంఠంనేని రవిశంకర్ లు ఇది కేవలం శాంతిభద్రతల సమస్య మాత్రమే కాదనీ, సమాజ భవిష్యత్తుకు పెనుముప్పుగా పరిణమించిన ఒక సామాజిక రుగ్మత అని పేర్కొన్నారు.
ప్రస్తుతం ఎన్నికల ప్రచారంలో విజయ్ రాష్ట్రంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఈ క్రమంలోనే జననాయగన్‌ సినీమా విడుదలపై నెలకొన్న అనిశ్చితిని ఆయన ప్రజల ముందు ఉంచారు. అలాగే.. కరూర్ ప్రాంతంలో చోటుచేసుకున్న విషాద ఘటనను ప్రస్తావిస్తూ.. అది యాధృచ్ఛికంగా జరిగింది కాదని, దాని వెనుక కూడా లోతైన కుట్ర దాగి ఉందన్న అనుమానాలున్నాయన్నారు.
నిజానికి తాను రాజ‌కీయ స‌న్యాసం చేసిన‌ట్టు చెబుతూనే ఉన్నా.. ఇప్ప‌టికీ ఆయ‌న‌ త‌న టీం ద్వారా అకౌంట్ స‌ర్వీసెస్ అందిస్తూనే ఉన్నారు. ఆపై జ‌గ‌న్ కి లోపాయికారిగా సహకరించేందుకే ఈ రాజీనామా డ్రామాల‌ని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. బేసిగ్గా విజ‌య‌సాయిరెడ్డి కామెంట్ చేయాల్సింది ఏదైనా ఉందంటే.. ఇటీవ‌ల జ‌గ‌న్ అర్ధంప‌ర్దం లేకుండా చేసిన మావిగ‌న్ అనే ప్ర‌తిపాద‌న‌ మీదే. కానీ రేణుక చౌద‌రి స‌భ‌లో లేవ‌నెత్తిన క‌మ్మ‌రావ‌తిని ప‌ట్టుకుని.. పోస్టులు పెట్ట‌డం స‌రికాద‌ంటున్నారు.
రాజ్యసభలో అమరావతి చట్టబద్ధత బిల్లుకు కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ, టీఎంసీ, ఆప్, బీజేడీ, ఆర్జేడీ, బీఆర్ఎస్, జేడీ(యూ), శివసేన మద్దతు ఇచ్చాయి. రాజ్యసభలో అమరావతి చట్టబద్ధతపై జరిగిన చర్చలో 11 పార్టీలు పాల్గొన్నాయి.
గురువారం సాయంత్రం రాష్ట్ర వ్యాప్తంగా సంబరాలు జరుపుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు పిలుపునిచ్చారు. ఇక 2015లో దేశంలోని వివిధ పుణ్యక్షేత్రాల నుంచి తెచ్చిన పవిత్ర జలాలు, మట్టిని ఉంచిన ఉద్దండరాయునిపాలెంలో పర్యటించి, రాజధాని సంకల్పంలో పాల్గొన్నారు.
కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ ఈ బిల్లును రాజ్యసభలో సభలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఏపీ రాజధాని విషయంలో ఉన్న చట్టపరమైన అస్పష్టతను తొలగించేందుకు ఈ సవరణ అత్యవసరమని పేర్కొన్నారు. బిల్లుపై జరిగిన చర్చ అనంతరం, సభాపతి సి.పి. రాధాకృష్ణన్ క్లాజ్ వారీగా ఓటింగ్‌ నిర్వహించగా సభ్యులు అనుకూలంగా ఓటు వేశారు. దీంతో అమరావతిని రాజధానిగా ఖరారు చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయానికి రాజ్యసభ ఆమోదం లభించింది.
. తాము అమరావతిని వ్యతిరేకించడం లేదనీ, అయితే రాజధాని పేరుతో సాగుతున్న పరిణామాలు, ఆర్థిక భారాలనే ప్రశ్నిస్తున్నామన్నారు. రైతుల నుంచి భూములు సేకరించి ఇన్నాళ్లు గడుస్తున్నా ఆశించిన స్థాయిలో అభివృద్ధి జరగలేదని ఆయన విమర్శించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.