తిరుపతిలో భూమన కరుణాకర్ రెడ్డి ఆధిపత్యానికి చెక్ పడిందా? ఆయన పలుకుబడి పలుచనయ్యిందా? అంటే పరిశీలకులు ఔననే అంటున్నారు. తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ ఎన్నికలలో ఆయన తన సర్వశక్తులూ ఒడ్డి మరీ వైసీపీ అభ్యర్ధి విజయం కోసం పాటుపడ్డారు. అయితే ఆయన శ్రమంతా బూడిదలో పోసిన పన్నీరు చందంగా మారింది. ఎన్ని ఎత్తులు వేసినా, ఎన్ని వ్యూహాలు పన్నినా ఆయన అనుకున్నది సాధించలేకపోయారు. డిప్యూటీ మేయర్ ఎన్నికలో తెలుగుదేశం అభ్యర్ణి మునికృష్ణ సునాయాస విజయం సాధించారు. మునికృష్ణకు 26 మంది, వైసీపీ అభ్యర్థి భాస్కర్ రెడ్డికి 21 మంది కార్పొరేటర్లు మద్దతు ఇవ్వడంతో భూమనకరుణాకరరెడ్డికి భంగపాటు తప్పలేదు.
తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ గా ఉన్న భూమన కరుణాకర్ రెడ్డి కుమారుడు భూమన అభినయ్ రెడ్డి గత ఎన్నికల ముందు తిరుపతి ఎమ్మెల్యేగా పోటీ చేశారు. అలా పోటీ చేయడం కోసం డిప్యూటీ మేయర్ పదవికి రాజీనామా చేశారు. అయితే విజయం సాధించడంలో విఫలమయ్యారు. అప్పుడు ఆయన రాజీనామా చేయడంతో ఖాళీ అయిన డిప్యూటీ మేయర్ పదవికి ఇప్పుడు ఎన్నిక జరిగింది. ఆ ఎన్నికలలో తన కుమారుడి రాజీనామాతో ఖాళీ అయిన స్థానంలో వైసీపీ అభ్యర్థినే గెలిపించడం కోసం భుమన కరుణాకరరెడ్డి చేసిన ప్రయత్నం విఫలమైంది.
ఈ ఓటమిని జీర్ణించుకోలేని భూమన కరుణాకర్ రెడ్డి ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడిందనీ, అధికార మదంతో తెలుగుదేశం కార్పొరేటర్లను కిడ్నాప్ చేసి మరీ తమ వైపునకు తిప్పుకుందనీ ఆరోపణలు గుప్పిస్తున్నారు. అదే సమయంలో గతంలో అంటే 2021లో అభినయ్ రెడ్డిని డిప్యూటీ మేయర్ గా గెలిపించుకోవడానిక భూమన కరుణాకరరెడ్డి ఓటర్ల జాబితాలోకి నకిలీ ఓటర్లను చేర్చారనీ, తమిళనాడు నుంచి జనాలను తీసుకువచ్చి ఓట్లు వేయించారని ఆరోపణలు వెల్లువెత్తిన విషయాన్ని ఇక్కడ కన్వీనియెంట్ గా మర్చిపోయారు.
ఈ ఆరోపణల విషయాన్ని పక్కన పెడితే ఈ ఓటమి తిరుపతిలో భూమన కరుణాకరరెడ్డి ఆధిపత్యానికి ఫుల్ స్టాప్ పడిందని చెప్పవచ్చని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. భూమన కరుణాకర్ రెడ్డి తుడా చైర్మన్ గా 2004 నుంచి 2006 వరకూ చేశారు. ఆ తరువాత 2006 నుంచి 2008 వరకూ తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ గా పని చేశారు. 2009లో తిరుపతి నుంచి అసెబ్లీకి పోటీ చేసి చిరంజీవి చేతిలో పరాజయం పాలయ్యారు. అయితే 2012లో చిరంజీవి తిరుపతి ఎమ్మెల్యేగా రాజీనామా చేయడంతో వచ్చిన ఉప ఎన్నికలో పోటీ చేసి భూమన విజయం సాధించారు. ఆ తరువాత 2014 ఎన్నికలలో ఓడిపోయినప్పటికీ 2019 ఎన్నికలలో తిరుపతి నుంచి విజయం సాధించారు. 2023లో మళ్లీ తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ గా జగన్ ఆయనకు అవకాశం ఇచ్చారు. ఇక 2024 ఎన్నికలలో భూమన కరుణాకరరెడ్డి తాను పోటీ నుంచి తప్పుకుని తన కుమారుడు అభినయ్ రెడ్డిని తిరుపతి నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీలోకి దించారు. అయితే ఆ ఎన్నికలో అభినయ్ రెడ్డి పరాజయం పాలయ్యారు.
అయితే గెలుపు ఓటములతో సంబంధం లేకుండా 2004 నుండి తిరుపతిపై పూర్తి ఆధిపత్యం చెలాయిస్తూ వచ్చిన భూమనకు 2024లో వైసీపీ ఘోర పరాజయంతో ఇబ్బందులు మొదలయ్యాయి. ఇప్పుడు డిప్యూటీ మేయర్ ఎన్నికలలో వైసీపీ అభ్యర్థిని గెలిపించుకోవడంతో విఫలమవ్వడంతో ఆయన ఆధిపత్యం, పలుకుబడి పూర్తిగా దిగజారిపోయినట్లేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/bhumana-lost-dominence-in-tirupathi-25-192361.html
దేశంలో ఇటీవల వెలువడిన ఉప ఎన్నికల ఫలితాలు భారత రాజకీయ యవనికపై కొత్త సమీకరణాలకు నాంది పలుకుతున్నాయి.
వైసీపీలో నెలకొన్న నిస్తేజాన్నీ, నిరుత్సాహాన్నీ ఆసరాగా చేసుకుని, ఆ పార్టీకి పట్టు ఉన్న ప్రాంతాలలో కూడా తెలుగుదేశం కూటమి పాగా వేస్తోంది. ప్రధానంగా వైసీపీకి కంచుకోటగా భావించే రాయలసీమలో వైసీపీ బలాన్ని ఛేదిస్తూ, అభివృద్ధి మంత్రంతో క్షేత్రస్థాయిలో బలం పెంచుకుంటోంది.
తెలంగాణలో అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు ఇకపై టీ-ఫైబర్ ద్వారానే ఇంటర్నెట్ సేవలు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ఈ ఫలితాలు మోదీ బ్రాండ్ ను మసకబార్చాయి. మోడీ ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకతకు నిదర్శనంగా నిలిచాయి. ఈ ఫలితాలు కేవలం ఉప ఎన్నికలో తగిలిన ఎదురుదెబ్బగా కంటే బీజేపీపై ప్రజా వ్యతిరేకత పెచ్చరిల్లుతుందన్న భావననే ఎక్కువగా ఆవిష్కరించాయి.
అమెరికాలోని బోస్టన్ విశ్వవిద్యాలయంలో అభిజీత్ విద్య ఎలా అభ్యసించాడనే అంశంపై విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ సూరత్కు చెందిన ఆర్టీఐ కార్యకర్త అమిత్ తివారీ కేంద్ర ఎన్నికల సంఘం, పన్నుల శాఖతో పాటు మహారాష్ట్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. అలాగే.. సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ సమకూర్చిన 1 కోటి రూపాయ నిధులపై అనుమానాలు వ్యక్తం చేశారు.
ఎటువంటి ఆధారాలు లేకుండా, కేవలం రాజకీయ లబ్ధి కోసమే ఇటువంటి అసత్య, అవమానకర, ద్వంద్వార్థ వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ పోలీసులు కేసు నమోదు చేశారు. సామాజిక మాధ్యమాల్లో సైతం ఈ వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమయ్యాయి. ముఖ్యంగా సినిమా, రాజకీయ రంగాల నుంచి ఉదయనిధి శైలిపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి.
నీళ్లు ఎక్కడికి చేరినా చేరకపోయినా.. అక్కడికి మాత్రం తప్పకుండా చేరాలంటూ వ్యాఖ్యానించారు. ఆ వెంటనే తాను మాట్లాడింది కావేరీ జలాల గురించేనని చెప్పినా, ఉదయనిథి స్టాలిన్ వ్యాఖ్యలు నటి త్రిషను ఉద్దేశించి చేసినవేనంటూ విమర్శలు వెల్లువెత్తాయి.
పీకే తన సమీప ప్రత్యర్థి, బీజేపీ అభ్యర్థి నీరజ్ కుమార్ సిన్హాపై 20 వేలకుపైగా ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఈ నియోజకవర్గం నుంచి 1995 నుంచీ వరుసగా బీజేపీయే విజయం సాధిస్తూ వస్తోంది. నవీన్ కిషోర్ ప్రసాద్ సిన్హా వరుసగా నాలుగు సార్లు విజయం సాధించగా, ఆ తరువాత ఇదే నియోజకవర్గం నుంచి ఆయన కుమారుడు, ప్రస్తుతం బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ వరుసగా విజయం సాధిస్తూ వచ్చారు.
పాలనాపరమైన కఠిన నిర్ణయాలే కాకుండా.. రాష్ట్ర ఆర్థిక, సాంకేతిక వృద్ధి కోసం విజయ్ ప్రభుత్వం వెట్రి తమిళగం విజన్ పేరుతో వియయ్ కార్యాచరణ ప్రకటించారు. ఈ విజన్ కింద 50 వేల కోట్ల రాష్ట్ర పెట్టుబడి నిధి ఏర్పాటుకు ప్రతిపాదించడమే కాకుండా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఎలక్ట్రిక్ వాహనాలు, సెమీకండక్టర్ల రంగాలలో ప్రభుత్వం నేరుగా కో ఇన్వెస్టర్ గా భాగస్వామ్యం వహించేలా నిర్ణయించారు.
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం క్రెడిట్ విషయంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేస్తున్నవన్నీ డ్రామాలేనని కేంద్ర మంత్రి పెమ్మసాని విమర్శించారు. 2015లోనే నాటి తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు, అప్పటి కేంద్ర మంత్రిఅశోక్ గజపతిరాజు చొరవతో భోగాపురం ఎయిర్పోర్టుకు రూపకల్పన చేసిందనీ, 2 వేల 200 ఎకరాల భూసేకరణ కూడా పూర్తి చేసిందని స్పష్టం చేశారు.
గత తప్పిదాల కారణంగా వైసీపీ నేతలు ఒకరి వెంట ఒకరు అన్నట్లుగా కేసుల ఉచ్చుల్లో చిక్కుతున్నారు. ఇక తెలుగుదేశం కూటమి ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం పరుగులు పెడుతుండటంతో వైసీపీ నేతలలో నిరాశ నిస్ఫృహలు అలుముకుంటున్నాయి.
భోగాపురం విషయంలో వైసీపీ అధినేత జగన్.. ఒకే సమయంలో క్రెడిట్ చోరీకీ, విమానాశ్రయం సాకారం కావడం పట్ల విమర్శలకు పాల్పడటం అపహాస్యం పాలౌతోంది.
దీంతో ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ డీఎంకే అధినేత, మాజీ ముఖ్యమంత్రి ఎం.కే. స్టాలిన్ ముఖ్యమంత్రి విజయ్ కావేరి వివాదంలో ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారని విమర్శించారు. కావేరి జలాలు తమిళనాడుకు అత్యంత కీలకమనీ, ఇతర రాష్ట్రాల వ్యూహాలను సమర్థవంతంగా ఎదుర్కోవాలంటే ఏకాభిప్రాయ సాధన అవసరమని అన్నారు.